Malkajgiri: మల్కాజిగిరి సెంటిమెంట్.. మూడు ఎన్నికల్లో సంచలనాలు
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైన మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం మూడు ఎన్నికల్లో సంచనాలు సృష్టించింది. ఇక్కడి నుంచి ఎన్నికైన లోక్సభ సభ్యులకు అదృష్టం కలిసివస్తుందన్న సెంటిమెంట్ రాజకీయ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.
సర్వే కేంద్ర మంత్రి, మల్లారెడ్డి రాష్ట్రమంత్రి, రేవంత్ సీఎం
లోక్సభ సభ్యులైన ముగ్గురినీ వరించిన అదృష్టం
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైన మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం మూడు ఎన్నికల్లో సంచనాలు సృష్టించింది. ఇక్కడి నుంచి ఎన్నికైన లోక్సభ సభ్యులకు అదృష్టం కలిసివస్తుందన్న సెంటిమెంట్ రాజకీయ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో 3 ఎన్నికలు జరిగింది మూడుసార్లయినా ఇక్కడి నుంచి గెలిచిన సర్వే సత్యనారాయణ, చామకూర మల్లారెడ్డి, రేవంత్రెడ్డిలు తమ రాజకీయ జీవితంలో కీలక మెట్టును అధిరోహించారు. మంత్రులు, ముఖ్యమంత్రి హోదాను పొందారు.
- 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన సర్వే సత్యనారాయణ ఆ లోక్సభ నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీచేసి 93వేల మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత 2012లో కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
- 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిన చామకూర మల్లారెడ్డి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా తొలిసారిగా మల్కాజిగిరి నుంచే లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. తెలంగాణలో తెదేపా నుంచి గెలిచిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి మాత్రమే. రాజకీయ సమీకరణాలతో ఆయన 2016లో భారాసలో చేరారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తరువాత రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన రాజకీయ ఉన్నతికి మల్కాజిగిరి లోక్సభ ఒక మెట్టులాంటిదని మల్లారెడ్డి చెబుతుంటారు.
- 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయిన రేవంత్రెడ్డి.. 2019 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఎంపీగా కొనసాగుతున్నప్పుడే రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. సీఎల్పీ నాయకుడిగా ఎంపికై ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర భారతంలో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని ఉక్కుమనిషి
ఉక్కు మనిషి అన్న పదం వినగానే ఆబాలగోపాలానికి గుర్తుకొచ్చే పేరు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో కేంద్ర హోం, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. -
ఆస్ట్రేలియాలో పండగలా పోలింగ్
ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. అక్కడి ప్రజలు ఓటు వేయడాన్ని శ్రమగా భావించరు. సంతోషంగా ఓటేస్తూ.. పోలింగ్ను పండగలా నిర్వహించుకుంటారు. -
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలవుతోంది. తొలిసారిగా 1912లో ఇక్కడ పురుషులకు ఓటింగ్ను తప్పనిసరి చేశారు. -
టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఆన్లైన్లో ఓటర్ స్లిప్... డౌన్లోడ్ చేసుకోండిలా!
Voter Slip Download Options: ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ కచ్చితంగా అవసరం. మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమౌతుందిలే అనుకునేవారు చరిత్ర గతిని మార్చిన ‘ఒక్క ఓటు’ ఉదంతాలు తెలుసుకోవాల్సిందే. -
ఎంపీగా ఎన్నికైతేే జీతం ఎంతో తెలుసా?
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
వారి ఓటును వారికి వేసుకోలేరు!
అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరికి ఇదే పునరావృతం కానుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉంది. దీంతో తమ పార్టీకి, కొన్నిచోట్ల ఇతర పార్టీలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఓటు.. సుదీర్ఘ ప్రయాణం
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. -
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా?
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం