icon icon icon
icon icon icon

Miryalaguda: నాకు ఎలాంటి కంపెనీలు లేవు.. ఐటీ సోదాలపై స్పందించిన భారాస ఎమ్మెల్యే

ఐటీ సోదాలపై మిర్యాలగూడ ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు స్పందించారు. ఎన్నికల్లో గెలవలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Updated : 16 Nov 2023 13:43 IST

మిర్యాలగూడ: ఐటీ సోదాలపై మిర్యాలగూడ ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు స్పందించారు. ఎన్నికల్లో గెలవలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వేములపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఐటీ అధికారుల సోదాలపై మీడియాతో మాట్లాడారు. 

‘‘ఐటీ అధికారులు ఎవరూ నన్ను కలవలేదు. రైస్‌ మిల్లుల పైనే దాడులు జరుగుతున్నాయి. రైస్‌ మిల్లర్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు నాపై ఆరోపణలు చేస్తున్నాయి. నాకు ఎలాంటి కంపెనీలు లేవు. నా దగ్గర డబ్బులు లేవు.. ఎక్కడైనా చూపిస్తే ఇచ్చేస్తా’’ అని నల్లమోతు భాస్కర్‌రావు వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img