Dubbaka: దుబ్బాక పోలీసుస్టేషన్ ఎదుట రఘునందన్రావు ఆందోళన
దుబ్బాక పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట బుధవారం అర్ధరాత్రి దాటాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు ఆందోళన చేపట్టారు.
దుబ్బాక: దుబ్బాక పట్టణ పోలీసు స్టేషన్ ఎదుట బుధవారం అర్ధరాత్రి దాటాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు ఆందోళన చేపట్టారు. భారాస నాయకులు డబ్బులు పంచుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని రఘునందన్రావు డిమాండ్ చేశారు. పట్టణంలోని 16వ వార్డులో భారాస నేతలు డబ్బులు పంచుతున్నారని తెలిసి భాజపా నాయకులు అక్కడికి వెళ్లారని, వారిపై భారాస సభ్యులు దురుసుగా ప్రవర్తించి చేయిచేసుకున్నారని రఘునందన్రావు ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న సిద్దిపేట సీపీ శ్వేత అక్కడికి చేరుకొని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. భాజపా నాయకులపై దాడి చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని ఆమె తెలిపారు. దుబ్బాకలో ఎన్నికలు పూర్తయ్యేవరకు తానే ఇక్కడ ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తానని సీపీ తెలిపారు. దుబ్బాక సీఐ, ఎస్సైలను విధులకు దూరంగా ఉంచాలని రఘునందన్రావు సీపీని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.