కోడ్ నీడలో కల్యాణాలు..!
కల్యాణాల నిర్వహణకు ఎన్నికల కోడ్ ఓ పరీక్ష పెడుతోంది. కట్నకానుకాల మాట దేవుడెరుగు కనీసం పెట్టుబడి చీరలు కూడా ఒకేసారి తీసుకెళ్లడానికి జంకుతున్నారు.
మధిర పట్టణం, న్యూస్టుడే
కల్యాణాల నిర్వహణకు ఎన్నికల కోడ్ ఓ పరీక్ష పెడుతోంది. కట్నకానుకాల మాట దేవుడెరుగు కనీసం పెట్టుబడి చీరలు కూడా ఒకేసారి తీసుకెళ్లడానికి జంకుతున్నారు. పెళ్లిళ్లకు నగలు, వస్త్రాలు భారీ ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వాసులు ప్రధాన పట్టణాలతోపాటు సమీపంలోని పెద్ద నగరాలకు వెళుతుంటారు. చెక్పోస్టుల వద్ద నిఘా పెట్టడంతో కొనుగోలు చేసిన వాటికి తగిన ఆధారాలు చూపేందుకు అవస్థలే పడాల్సి వస్తోందని ఆయా కుటుంబాలవారు వాపోతున్నారు.
- మధిర పురపాలకంలోని ఉపాధ్యాయ కాలనీకి చెందిన ఓ ఇంట్లో ఈనెల వివాహం ఉంది. పెళ్లి దుస్తులు, నగలు కొనేందుకు విజయవాడకు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వచ్చిందని ఆ కుటుంబీకులు వాపోయారు. పెద్దపెద్ద దుకాణాల్లో నగదునే చెల్లించాల్సి వస్తుంది. దీంతో విజయవాడలోని బంధువుల నుంచి నగదు తీసుకుని కొనుగోలు చేసినట్లు తెలిపారు.
- నేలకొండపల్లిలోని ఓ కుటుంబ సభ్యుడి వివాహం ఖమ్మం కల్యాణమండపంలో పది రోజుల్లో జరుగనుంది. తమ బంధువులకు బహూకరించేందుకు వంద చీరలు వరకు కొనుగోలు చేసి స్వగ్రామంలోని ఇంట్లో ఉంచారు. ఇక్కడ నుంచి ఖమ్మం కల్యాణ మండపానికి చీరలు తీసుకెళ్లడం ప్రహసనంగా మారింది. బంధుమిత్రుల ద్వారా ద్విచక్రవాహనాలపై రోజూ కొన్ని తరలిస్తున్నామని సదరు వ్యక్తి తెలిపారు.
- మధిర మండలం సిరిపురం గ్రామంలో ఈనెల 20న వివాహం జరుగనుండగా ఆ ఇంటి వారు నగలు, వస్త్రాలు కొనుగోలు చేసేందుకు అవస్థలు పడ్డారు. నేరుగా నగదుతో వెళ్లే అవకాశం లేక స్నేహితుల వద్ద నుంచి క్రెడిట్, ఏటీఎం కార్డులు తీసుకుని వెళ్లామని వారు తెలిపారు.
నవంబరులో భారీగా వివాహాలు
ఈ నెల 16 నుంచి శుభముహూర్తాలుండటంతో ఉమ్మడి జిల్లాలో వందలాది వివాహాలు జరుగనున్నాయి. పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం తెలుగు సంప్రదాయం. ఇందుకోసం రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేస్తుంటారు. ఒకరికంటే మరొకరు పోటీ పడుతూ హంగూఆర్భాటాలతో మూడు నుంచి ఐదు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ల సంస్కృతి బాగా పెరిగింది. బంధుమిత్రులు భారీగా హాజరవుతుంటారు. వీటన్నింటిపైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది.
నగలు, దుస్తుల రవాణాకు తిప్పలు
ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద ప్రధాన రహదారుల్లో పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి నగదు తరలింపు జరుగకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితి నెలకొంటోంది. సాధారణంగా పెళ్లి దుస్తులు, నగలను హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, కొత్తగూడెంలలో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వంటతయారు చేసేవారికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. వంట తయారీకి అవసరమైన సరకులు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు అవుతున్నాయి. కల్యాణమండపం, డెకరేషన్స్, ఈవెంట్ నిర్వాహకులకు డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. దూరప్రాంతాలకు వెళ్లి అవసరమైన వాటిని కొనేందుకు ఇక్కట్లు పడుతున్నారు. సరైన ఆధారాలు చూపకుంటే పట్టుబడిన నగదు వెంటనే చేతికి రావడంలేదు. శుభకార్యాలు చేసుకుంటున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది.
ఆధారాలు చూపితే ఇబ్బందిలేదు-వసంత్కుమార్, మధిర సీఐ
వివాహ వేడుకలకు సంబంధించి తగు ఆధారాలుంటే ఇబ్బందిలేదు. ఎక్కువ మొత్తం నగదు పట్టుబడితే వాటికి సరైన ఆధారాలు చూపి తిరిగి పొందవచ్చు. కొనుగోలు చేసిన వాటి రసీదులు చూపి, ఎందుకోసం కొన్నారనే అంశాలు వివరించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
‘సిరా’ చుక్క కథ... తెలుసునా ఓటరూ..!
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!