Glass Bridge: అబ్బురపరిచే గాజువంతెనలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే?
గాజు వంతెనలు (స్కైవాక్ బ్రిడ్జి) విదేశాల్లోనే కాదు మన దేశంలోనూ ఉన్నాయి. మరి ఇలాంటి అబ్బురపరిచే గాజువంతెనలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే?
ఎత్తైన ప్రదేశం నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరిగినట్టుగా అనిపిస్తుంటుంది. మరి అంత ఎత్తైన ప్రదేశంలో గాజుపై నడవమంటే.. ఓ సాహసమనే చెప్పుకోవాలి. అలాంటి గాజు వంతెనలు (స్కైవాక్ బ్రిడ్జి) విదేశాల్లోనే కాదు మన దేశంలోనూ ఉన్నాయి. మరి అబ్బురపరిచే గాజువంతెనలు ఎక్కడెక్కడ ఉన్నాయో? వాటి విశేషాలేంటో తెలుసుకుందామా..
పెల్లింగ్, సిక్కిం
సిక్కిం రాష్ట్రంలోని పెల్లింగ్ నగరంలో నిర్మించిన గ్లాస్ స్కైవాక్ దేశంలోనే మొదటిది. దీన్ని 2018లో ప్రారంభించారు. సముద్ర మట్టానికి 7200 అడుగుల ఎత్తులో.. 137 అడుగుల ఎత్తైన చెన్రెజిగ్ విగ్రహానికి కుడివైపున ఈ గాజువంతెన నిర్మాణాన్ని చేపట్టారు. అద్భుతమైన హిమాలయాల మధ్య గ్లాస్ స్కైవాక్పై నడిస్తే ఆ అనుభూతి వేరేలా ఉంటుందని సందర్శకులు చెబుతుంటారు. ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగానూ పరిఢవిల్లుతోంది.
రాజ్గిర్, బిహార్
దేశంలో రెండో స్కైవాక్ బిహార్లోని రాజ్గిర్లో ఉంది. భూమికి 250 అడుగుల ఎత్తులో 85 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో ఈ గాజువంతెనను నిర్మించారు. అయితే, ఈ బ్రిడ్జి ఇంకొక వైపు కనెక్ట్ ఉండదు. చివరన 360 డిగ్రీల వ్యూ చూసే విధంగా రూపొందించారు. బిహార్ సీఎం నితీశ్కుమార్ కూడా దీనిని సందర్శించారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైనా నేచర్ పార్క్, జూ సఫారీ వంటి వాటితో పాటు స్కైవాక్ బ్రిడ్జి కూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీనిని సందర్శించడానికి విదేశీ పర్యాటకులూ వస్తుంటారు.
ఒకటి కాదు చైనాలోనే రెండు..
ప్రపంచంలోనే గాజుతో తయారుచేసిన స్కైవాక్ బ్రిడ్జిలకు చైనా ఎంతో ప్రసిద్ధి. ఆదేశంలో ఇప్పుడు ఇవే ప్రధాన పర్యాటక ప్రదేశాలుగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి వంతెనలు చైనాలో రెండు ఉన్నాయి. అందులో ఒకటి జాన్జియాజీ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జి. చైనా రాజధాని బీజింగ్ లోని హునన్ ప్రావిన్స్ లో నిర్మించిన జాన్జియాజీ స్కైవాక్ బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ఎత్తయినది. ఇది భూమి నుంచి 300 మీటర్ల ఎత్తులో.. 430 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీనిపై ఒక కారు వెళ్లినా ఎలాంటి పగుళ్లు రాకుండా ఉండేత గట్టిగా దీన్ని నిర్మించారు. అలాగే.. చైనాకు నైరుతి దిశగా ఉన్న హుయాంగ్సు ప్రావిన్స్లో ‘బ్రేవ్ మెన్స్ బ్రిడ్జి’ పేరుతో మరొక స్కైవాక్ ఉంది. ఇది భూమికి 600 అడుగుల ఎత్తులో 900 అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. నేషనల్ జియోలాజికల్ పార్క్ సమీపంలో ఈ గాజువంతెన ఉండడం వల్ల పర్యాటకుల తాకిడి అధికంగానే ఉంటుంది. ఈ ప్రాంతం సుందరమైన జలపాతాలకు, సున్నపురాయి నిర్మాణాలకు ప్రసిద్ధి.
గ్లాసియర్ స్కైవాక్, కెనడా
కెనడాలోని జాస్పర్ నేషనల్ పార్క్ సమీపాన గ్లాసియర్ స్కైవాక్ ఉంది. అక్కడి లోతైన లోయ సన్వప్తకు 280 మీటర్ల ఎత్తులో దీని నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై నిల్చొని మంచుతో కప్పబడిన శిఖరాలు, హిమానీనదాలను వీక్షించవచ్చు.
డాచ్స్టెయిన్ గ్లాసియర్, ఆస్ట్రియా
ఆస్ట్రియా దేశంలో నిర్మితమైన డాచ్స్టెయిన్ గ్లాసియర్ కూడా ప్రముఖ గాజు వంతెనల్లో ఒకటి. ఇది పూర్తిగా మూసివేసినట్లు ఉండి అద్దాల గదిలా ఉంటుంది. కిందకి దిగడానికి 14 మెట్ల నిర్మాణం కూడా ఉంది. మెట్లపై నుంచి దిగుతుంటే లోయలోకి దిగుతున్నామేమో అన్న అనుభూతి కలుగుతోంది. ఇక్కడి నుంచి మంచుతో నిండిపోయిన పర్వతాలను వీక్షించడానికి సందర్శకులు పోటెత్తుతారు.
సపా గ్లాస్ బ్రిడ్జ్, వియత్నాం
వియత్నాంలోని సపా నగరానికి 17కిలోమీటర్లలో సపా గ్లాస్ బ్రిడ్జ్ను నిర్మించారు. దీనిపై నుంచి 360 డిగ్రీల కోణంతో ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తుంటారు.
గ్రాండ్ కేన్యన్, అమెరికా
ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో గాజుతో నిర్మించిన స్కైవాక్ నిర్మాణం ఉంది. ఇది 70 అడుగుల పొడవుతో.. గుర్రపుడెక్క ఆకారంలో ఉంటుంది. దీనిపై నిల్చుంటే భూమి చివరి అంచున ఉన్నామేమో అన్న భావన కలుగుతోంది.
టవర్ బ్రిడ్జి, లండన్
లండన్లో నగరంలోనూ గాజుతో స్కైవాక్ను నిర్మించారు. దీన్నే టవర్ బ్రిడ్జి అని పిలుస్తారు. వీకెండ్లో ఫ్యామిలీతో సరదాగా గడపడానికి నగరవాసులు ఇక్కడికి వస్తుంటారు. దీనిపై నుంచి కిందికి చూస్తే రహదారిపై వెళ్తున్న వాహనాలు, కిందనే నీటిలో ప్రయాణిస్తున్న పడవలను చూడవచ్చు.
చమోనిక్స్ స్కైవాక్, ఫ్రాన్స్
ఫ్రాన్స్ నగరంలో స్కైవాక్ బ్రిడ్జి లేదు కానీ, గాజుతో తయారు చేసిన స్కైరూమ్ లాంటి నిర్మాణం ఒకటి ఉంది. అద్దాల గదిలో నిల్చొని సుందరమైన పర్వత దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ గ్లాస్ రూమ్ని ‘స్టెప్ ఇన్ టూ ది వాయిడ్’అని పిలుస్తారు.
కాకినాడ, ఆంధ్రప్రదేశ్
వీటంతా పెద్దది కాకుండా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో 45 అడుగుల పొడవుతో చిన్నపాటి స్కైవాక్ బ్రిడ్జి ఉంది. దీన్ని చిన్న వాగును దాటడానికి ₹2కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు