Archeological Discoveries : అపారమైన గుప్త నిధులు.. పెంపుడు శునకాలు తవ్వితీశాయి!
మానవులు అనేక చోట్ల చేపట్టిన తవ్వకాల వల్ల పురాతన నాగరికత (Civilization) ఆధునిక ప్రపంచానికి తెలిసింది. అలాగే కొన్ని దేశాల్లో శునకాలు (Dogs) తవ్విన చోట గుహ (Cave), అస్తిపంజరం (Skeleton), సమాధులు (Tombs), నిధులు (Treasure) ఇలా ఎన్నో ప్రత్యక్షమయ్యాయి. ఆ విశేషాలు తెలుసుకోండి.
శునకాలు (Dogs) విశ్వాసానికి మారుపేరు. వందల ఏళ్లుగా మానవులతో వాటి చెలిమి కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో శునకాలు చేసిన పనుల వల్ల పురాతన కట్టడాలు బయల్పడ్డాయి. అపారమైన నిధులు (Treasure) వెలుగు చూశాయి. ఆ సంగతుల గురించి చదివేయండి.
లాస్కాక్స్ కేవ్
ఫ్రాన్స్లో 1940 ప్రాంతంలో మార్సెల్ రావిడట్ అనే యువకుడు తన పెంపుడు శునకం ‘రోబోట్’తో కలిసి సరదాగా వాకింగ్ చేస్తున్నాడు. ఆ షికారు కొంతసేపు గడిచిన తరువాత రోబోట్ కనిపించలేదు. దాంతో మార్సెల్ కేకలు వేశాడు. దూరంగా దాని మూలుగు వినిపించడంతో పరిగెత్తుకుంటూ అక్కడకు వెళ్లాడు. తీరా చూస్తే సన్నని, ఇరుకైన 50 అడుగుల లోతు గొయ్యిలో అది కనిపించింది. ఎలాగోలా అందులోకి ప్రవేశించాడు. అది ఓ రాతి గుహ. లోపలి గోడలపై ప్రాచీన మానవులు గీసిన బొమ్మలు కనిపించాయి. మార్సెల్, తన పెంపుడు శునకం రోబోట్ కారణంగానే లాస్కాక్స్ కేవ్ గురించి ప్రపంచానికి తెలిసింది.
ప్లీసియోసార్ అస్తిపంజరం
ఇంగ్లాండ్లోని డోర్సెట్కు చెందిన ట్రేసీ బార్కీ తన పెంపుడు శునకం రఫేల్తో కలిసి బీచ్కు వెళ్లింది. స్నేహితులతో కలిసి కొంతసేపు నడక సాగించిన ఆమె అలసిపోయి ఓ చోట కూర్చుంది. ఇంతలో శునకం ఓ చోట ఇసుకలో తవ్వసాగింది. ఏంటా అని ఆమె దగ్గరకు వెళ్లి చూడగా ఓ భారీ వెన్నెముక కనిపించింది. ఆమె కూడా మరింత తవ్వగా ప్లీసియోసార్ అస్తిపంజరం బయటపడింది. ప్లీసియోసార్ అనే సరీసృపం కూడా డైనోసార్లలాగే ఎప్పుడో అంతరించిపోయింది. ట్రేసీ భర్తకు ఇటువంటి అంశాలపై ఆసక్తి ఎక్కువ. ఆయనకు సమాచారం ఇవ్వడంతో అధికారులను తీసుకొచ్చి మిగిలిన ఎముకలను సేకరించారు. సుమారు 16 సంవత్సరాలు కష్టపడి 200 మిలియన్ ఏళ్ల నాటి అస్తిపంజరాన్ని అతికించారు. దాన్ని చార్మౌత్ హెరిటేజ్ కోస్ట్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచారు. ఆ అస్తి పంజరానికి రఫేల్ అని పేరు పెట్టారు.
పోలండ్లో కుండ నిధి
పోలండ్ దేశానికి చెందిన వాల్బ్రిజ్ తన పెంపుడు శునకం కజ్టస్ ఓ చోట తవ్వడం చూశాడు. కొంత సేపటి తర్వాత అక్కడ ఓ మట్టి కుండ కనిపించింది. తెరిచి చూడగా అందులో బంగారు నాణేలున్నాయి. అవన్నీ 13వ శతాబ్దానికి చెందినవి.
కాంస్య యుగం అవశేషాలు
చెక్ రిపబ్లిక్లోని కోస్టలెకా హర్కీలో ఫ్రాంకోటా అనే వ్యక్తి తన పెంపుడు శునకం మోంటీని తీసుకొని వాకింగ్కు వెళ్లాడు. అది ఓ చోట తవ్వగా కొన్ని లోహపు బ్లేడ్లు కనిపించాయి. వాటితో తన శునకానికి హాని జరుగుతుందని భావించి అతడు దాన్ని పక్కకు తీసుకొచ్చాడు. అయితే వాటి రూపం చాలా పురాతనంగా ఉండటంతో అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి మరింతగా తవ్వి కొడవలి, గొడ్డలి, కంకణాలు, బల్లేలు వెలికితీశారు. పురాతన వస్తువులను కనుగొన్నందుకు ఫ్రాంకోటాకు 360 డాలర్లు బహుమతి అందజేశారు.
యుద్ధ సమాధులు
కడావర్ జాగిలాలు.. ఇవి శవాలను గుర్తించడంలో అసాధారణ ప్రజ్ఞ కనబరుస్తాయి. పోలీసులు ఎక్కువగా వీటిని వాడుతుంటారు. జార్జియాలోని కెటిల్ క్రీక్ వద్ద అమెరికా, బ్రిటిష్ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. 250 ఏళ్లకు పూర్వం జరిగిన ఈ యుద్ధంలో అనేక మంది మరణించారు. వారిని పూడ్చిన సమాధులను కడావర్ డాగ్స్ కనిపెట్టాయట.
క్రొయేషియా సమాధులు
వెద్రానా గ్లావస్ క్రొయేషియాకు చెందిన పురావస్తుశాఖ ప్రొఫెసర్. ఆమె కొన్ని చోట్ల తవ్వకాలు జరిపి పురాతన సమాధులు కనుగొనింది. అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఆ విషయంలో తనకు సహాయం చేయాలని కడావర్ డాగ్స్కు శిక్షణనిచ్చే ఆండ్రియా పింటర్ను కోరింది. వారిద్దరూ సాట్ట్వే, మాలి అనే రెండు శునకాలను తవ్వకాలు జరిపే ప్రాంతానికి తీసుకెళ్లారు. అవి మరో 6 పురాతన సమాధులను కనుగొనడంలో సహాయం చేశాయి. ఆ సమాధులు 3వేల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు.
ద్రాక్ష పాత్ర
జెరూసలెంకు చెందిన శౌల్ యోనా తన పెంపుడు శునకం జాచ్తో కలిసి ఓ అడవిలో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా శునకం ఓ గొయ్యిలో పడిపోయింది. శౌల్ వెంటనే అప్రమత్తమై దానిని రక్షించాడు. తరువాత ఆ గొయ్యిలోకి తలపెట్టి చూడగా అది ఓ భారీ పాత్ర అని తెలిసింది. దాంతో పురాతత్వ శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అది క్రీస్తుపూర్వం 1200-586 మధ్య కాలంలో నిర్మించిన పాత్ర అని తేల్చారు. అందులో భారీగా ద్రాక్ష పండ్లను పోసి.. రసం తీసి వైన్ తయారు చేసేవారట.
బంగారు నాణేలు
ఇంగ్లాండ్లోని బ్లాక్పూల్కు చెందిన ఆడం క్లార్క్ తన కూతురు కోసం ఓ పప్పీని తీసుకొచ్చాడు. దానికి ఓల్లీ అని పేరు పెట్టాడు. పప్పీని ఇంటి దగ్గర అటూఇటూ తిప్పుతూ ఉండగా.. అది ఓ చోట తవ్వి 19వ శతాబ్దానికి చెందిన 15 బంగారు నాణేలను బయటకు తీసింది. ఆడం వాటిని ఓ డీలర్ వద్దకు తీసుకెళ్లగా 7380 డాలర్లు ఇస్తానని చెప్పాడట. ఇది కనిపెట్టేనాటికి ఆ పప్పీ వయసు కేవలం 10 వారాలు.
వెండి నాణేలు
చెక్ రిపబ్లిక్లో ఉస్తి అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలోని మాసా అనే శునకం కొన్ని సెంటీమీటర్లు తవ్వగానే ఓ మట్టి పాత్ర బయటపడింది. ఇది చూసిన దాని యజమాని ఆ పాత్ర చాలా పురాతనమైనదని గ్రహించి స్థానిక మ్యూజియానికి సమాచారం అందించాడు. పాత్రను తెరిచి చూడగా అందులో 14వ శతాబ్దానికి చెందిన 300 వెండి నాణేలున్నాయి. వాటి విలువ 90వేల డాలర్లట. దీంతో పురాతత్వ శాస్త్రవేత్తలు మరి కొన్ని చోట్ల తవ్వకాలు సాగించగా ఇంకేమీ దొరకలేదు.
డబ్బాల నిండా బంగారం
కాలిఫోర్నియాకు చెందిన జాన్, మేరీ ఓ రోజు పెంపుడు శునకాన్ని తీసుకొని వాకింగ్కు వెళ్లారు. ఆ శునకం ఓ చోట మట్టిలో కూరుకుపోయిన తుప్పు పట్టిన డబ్బాను తవ్వ సాగింది. జాన్ దాన్ని బయటకు తీసేందుకు యత్నించగా బాగా బరువుగా అనిపించింది. తెరిచి చూడగా దాని నిండా బంగారు నాణేలు కనిపించాయి. తరువాత మెటల్ డిటెక్టర్ తీసుకొచ్చి శోధించారు. మరో 8 డబ్బాలు వెలుగు చూశాయి. వాటి విలువ సుమారు 10లక్షల డాలర్లు ఉండొచ్చని అంచనా.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట