Archeological Discoveries : అపారమైన గుప్త నిధులు.. పెంపుడు శునకాలు తవ్వితీశాయి!
మానవులు అనేక చోట్ల చేపట్టిన తవ్వకాల వల్ల పురాతన నాగరికత (Civilization) ఆధునిక ప్రపంచానికి తెలిసింది. అలాగే కొన్ని దేశాల్లో శునకాలు (Dogs) తవ్విన చోట గుహ (Cave), అస్తిపంజరం (Skeleton), సమాధులు (Tombs), నిధులు (Treasure) ఇలా ఎన్నో ప్రత్యక్షమయ్యాయి. ఆ విశేషాలు తెలుసుకోండి.
శునకాలు (Dogs) విశ్వాసానికి మారుపేరు. వందల ఏళ్లుగా మానవులతో వాటి చెలిమి కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని దేశాల్లో శునకాలు చేసిన పనుల వల్ల పురాతన కట్టడాలు బయల్పడ్డాయి. అపారమైన నిధులు (Treasure) వెలుగు చూశాయి. ఆ సంగతుల గురించి చదివేయండి.
లాస్కాక్స్ కేవ్
ఫ్రాన్స్లో 1940 ప్రాంతంలో మార్సెల్ రావిడట్ అనే యువకుడు తన పెంపుడు శునకం ‘రోబోట్’తో కలిసి సరదాగా వాకింగ్ చేస్తున్నాడు. ఆ షికారు కొంతసేపు గడిచిన తరువాత రోబోట్ కనిపించలేదు. దాంతో మార్సెల్ కేకలు వేశాడు. దూరంగా దాని మూలుగు వినిపించడంతో పరిగెత్తుకుంటూ అక్కడకు వెళ్లాడు. తీరా చూస్తే సన్నని, ఇరుకైన 50 అడుగుల లోతు గొయ్యిలో అది కనిపించింది. ఎలాగోలా అందులోకి ప్రవేశించాడు. అది ఓ రాతి గుహ. లోపలి గోడలపై ప్రాచీన మానవులు గీసిన బొమ్మలు కనిపించాయి. మార్సెల్, తన పెంపుడు శునకం రోబోట్ కారణంగానే లాస్కాక్స్ కేవ్ గురించి ప్రపంచానికి తెలిసింది.
ప్లీసియోసార్ అస్తిపంజరం
ఇంగ్లాండ్లోని డోర్సెట్కు చెందిన ట్రేసీ బార్కీ తన పెంపుడు శునకం రఫేల్తో కలిసి బీచ్కు వెళ్లింది. స్నేహితులతో కలిసి కొంతసేపు నడక సాగించిన ఆమె అలసిపోయి ఓ చోట కూర్చుంది. ఇంతలో శునకం ఓ చోట ఇసుకలో తవ్వసాగింది. ఏంటా అని ఆమె దగ్గరకు వెళ్లి చూడగా ఓ భారీ వెన్నెముక కనిపించింది. ఆమె కూడా మరింత తవ్వగా ప్లీసియోసార్ అస్తిపంజరం బయటపడింది. ప్లీసియోసార్ అనే సరీసృపం కూడా డైనోసార్లలాగే ఎప్పుడో అంతరించిపోయింది. ట్రేసీ భర్తకు ఇటువంటి అంశాలపై ఆసక్తి ఎక్కువ. ఆయనకు సమాచారం ఇవ్వడంతో అధికారులను తీసుకొచ్చి మిగిలిన ఎముకలను సేకరించారు. సుమారు 16 సంవత్సరాలు కష్టపడి 200 మిలియన్ ఏళ్ల నాటి అస్తిపంజరాన్ని అతికించారు. దాన్ని చార్మౌత్ హెరిటేజ్ కోస్ట్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచారు. ఆ అస్తి పంజరానికి రఫేల్ అని పేరు పెట్టారు.
పోలండ్లో కుండ నిధి
పోలండ్ దేశానికి చెందిన వాల్బ్రిజ్ తన పెంపుడు శునకం కజ్టస్ ఓ చోట తవ్వడం చూశాడు. కొంత సేపటి తర్వాత అక్కడ ఓ మట్టి కుండ కనిపించింది. తెరిచి చూడగా అందులో బంగారు నాణేలున్నాయి. అవన్నీ 13వ శతాబ్దానికి చెందినవి.
కాంస్య యుగం అవశేషాలు
చెక్ రిపబ్లిక్లోని కోస్టలెకా హర్కీలో ఫ్రాంకోటా అనే వ్యక్తి తన పెంపుడు శునకం మోంటీని తీసుకొని వాకింగ్కు వెళ్లాడు. అది ఓ చోట తవ్వగా కొన్ని లోహపు బ్లేడ్లు కనిపించాయి. వాటితో తన శునకానికి హాని జరుగుతుందని భావించి అతడు దాన్ని పక్కకు తీసుకొచ్చాడు. అయితే వాటి రూపం చాలా పురాతనంగా ఉండటంతో అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి మరింతగా తవ్వి కొడవలి, గొడ్డలి, కంకణాలు, బల్లేలు వెలికితీశారు. పురాతన వస్తువులను కనుగొన్నందుకు ఫ్రాంకోటాకు 360 డాలర్లు బహుమతి అందజేశారు.
యుద్ధ సమాధులు
కడావర్ జాగిలాలు.. ఇవి శవాలను గుర్తించడంలో అసాధారణ ప్రజ్ఞ కనబరుస్తాయి. పోలీసులు ఎక్కువగా వీటిని వాడుతుంటారు. జార్జియాలోని కెటిల్ క్రీక్ వద్ద అమెరికా, బ్రిటిష్ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. 250 ఏళ్లకు పూర్వం జరిగిన ఈ యుద్ధంలో అనేక మంది మరణించారు. వారిని పూడ్చిన సమాధులను కడావర్ డాగ్స్ కనిపెట్టాయట.
క్రొయేషియా సమాధులు
వెద్రానా గ్లావస్ క్రొయేషియాకు చెందిన పురావస్తుశాఖ ప్రొఫెసర్. ఆమె కొన్ని చోట్ల తవ్వకాలు జరిపి పురాతన సమాధులు కనుగొనింది. అప్పుడే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది. ఆ విషయంలో తనకు సహాయం చేయాలని కడావర్ డాగ్స్కు శిక్షణనిచ్చే ఆండ్రియా పింటర్ను కోరింది. వారిద్దరూ సాట్ట్వే, మాలి అనే రెండు శునకాలను తవ్వకాలు జరిపే ప్రాంతానికి తీసుకెళ్లారు. అవి మరో 6 పురాతన సమాధులను కనుగొనడంలో సహాయం చేశాయి. ఆ సమాధులు 3వేల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు.
ద్రాక్ష పాత్ర
జెరూసలెంకు చెందిన శౌల్ యోనా తన పెంపుడు శునకం జాచ్తో కలిసి ఓ అడవిలో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా శునకం ఓ గొయ్యిలో పడిపోయింది. శౌల్ వెంటనే అప్రమత్తమై దానిని రక్షించాడు. తరువాత ఆ గొయ్యిలోకి తలపెట్టి చూడగా అది ఓ భారీ పాత్ర అని తెలిసింది. దాంతో పురాతత్వ శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అది క్రీస్తుపూర్వం 1200-586 మధ్య కాలంలో నిర్మించిన పాత్ర అని తేల్చారు. అందులో భారీగా ద్రాక్ష పండ్లను పోసి.. రసం తీసి వైన్ తయారు చేసేవారట.
బంగారు నాణేలు
ఇంగ్లాండ్లోని బ్లాక్పూల్కు చెందిన ఆడం క్లార్క్ తన కూతురు కోసం ఓ పప్పీని తీసుకొచ్చాడు. దానికి ఓల్లీ అని పేరు పెట్టాడు. పప్పీని ఇంటి దగ్గర అటూఇటూ తిప్పుతూ ఉండగా.. అది ఓ చోట తవ్వి 19వ శతాబ్దానికి చెందిన 15 బంగారు నాణేలను బయటకు తీసింది. ఆడం వాటిని ఓ డీలర్ వద్దకు తీసుకెళ్లగా 7380 డాలర్లు ఇస్తానని చెప్పాడట. ఇది కనిపెట్టేనాటికి ఆ పప్పీ వయసు కేవలం 10 వారాలు.
వెండి నాణేలు
చెక్ రిపబ్లిక్లో ఉస్తి అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలోని మాసా అనే శునకం కొన్ని సెంటీమీటర్లు తవ్వగానే ఓ మట్టి పాత్ర బయటపడింది. ఇది చూసిన దాని యజమాని ఆ పాత్ర చాలా పురాతనమైనదని గ్రహించి స్థానిక మ్యూజియానికి సమాచారం అందించాడు. పాత్రను తెరిచి చూడగా అందులో 14వ శతాబ్దానికి చెందిన 300 వెండి నాణేలున్నాయి. వాటి విలువ 90వేల డాలర్లట. దీంతో పురాతత్వ శాస్త్రవేత్తలు మరి కొన్ని చోట్ల తవ్వకాలు సాగించగా ఇంకేమీ దొరకలేదు.
డబ్బాల నిండా బంగారం
కాలిఫోర్నియాకు చెందిన జాన్, మేరీ ఓ రోజు పెంపుడు శునకాన్ని తీసుకొని వాకింగ్కు వెళ్లారు. ఆ శునకం ఓ చోట మట్టిలో కూరుకుపోయిన తుప్పు పట్టిన డబ్బాను తవ్వ సాగింది. జాన్ దాన్ని బయటకు తీసేందుకు యత్నించగా బాగా బరువుగా అనిపించింది. తెరిచి చూడగా దాని నిండా బంగారు నాణేలు కనిపించాయి. తరువాత మెటల్ డిటెక్టర్ తీసుకొచ్చి శోధించారు. మరో 8 డబ్బాలు వెలుగు చూశాయి. వాటి విలువ సుమారు 10లక్షల డాలర్లు ఉండొచ్చని అంచనా.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భార్య ఉండగా సహజీవనం చేసేందుకు ఇస్లాం అనుమతించదు
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్