Assam-Arunachal dispute : ఈశాన్య రాష్ట్రాల మధ్య అమిత్ షా సయోధ్య.. తగాదా ఏంటంటే..!
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం (Assam), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal) మధ్య గత 50 ఏళ్లుగా సరిహద్దు వివాదం (Border dispute) కొనసాగుతోంది. దానికి ముగింపు పలికేందుకు ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమిత్ షా (Amit shah) సమక్షంలో ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma), అరుణాచల్ సీఎం పెమా ఖండూ (Prema Khandu) గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తాజా ఒప్పందంతో కొన్ని వివాదాస్పద గ్రామాలపై రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ కూడా ఇకపై కొత్త వాదనలు వినిపించడానికి వీల్లేదు. సర్వే ఆఫ్ ఇండియా సమగ్ర నివేదిక ఆధారంగా వాటికి కచ్చితమైన సరిహద్దుల్ని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య వివాదం ఏంటి? ఎలా మొదలైంది? తదితర విషయాలు తెలుసుకోండి.
ఎప్పుడు బీజం పడింది?
అస్సాం నుంచి కొంత భూభాగం విడదీసి అరుణాచల్ ప్రదేశ్ను ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాలు 804 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ సరిహద్దు వివాదానికి బీజం బ్రిటిష్ హయాంలోనే ఏర్పడింది. 1873లో బ్రిటిష్ పాలకులు ‘ఇన్నర్ లైన్’ రెగ్యులేషన్ను ఏర్పాటు చేశారు. ఆ రెగ్యులేషన్ ద్వారా మైదానాలు, కొండ ప్రాంతాల మధ్య ఓ ఊహాత్మక సరిహద్దును నిర్ణయించారు. 1915 నాటికి ఆ రెగ్యులేషన్ను ‘ఈశాన్య సరిహద్దు ట్రాక్ట్స్’గా పేరు మార్చారు. సరిహద్దులో ఎక్కువగా కొండలున్న ప్రాంతం ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది.
ఆక్రమణలు.. పరస్పర ఆరోపణలు
భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ‘ఈశాన్య సరిహద్దు ట్రాక్ట్స్’ను తన నియంత్రణలోకి తీసుకుంది. 1954లో దాన్ని ‘ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ’గా పేరు మార్చింది. 1972లో అరుణాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. 1987లో ఆ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హోదా కల్పించింది. అప్పటి నుంచి కాస్త సాఫీగానే సాగిన ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రయాణం 1990ల నాటికి వివాదం వైపు మళ్లింది. ఒక రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రంలోకి చొరబడి భూములను ఆక్రమించుకుంటున్నారని పరస్పరం ఆరోపించుకున్నారు. కేవలం ఆరోపణలతోనే ఆగలేదు.. కొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ అంశంపై 1989 నుంచి ఓ వ్యాజ్యం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగాన్ని ఆక్రమించిందంటూ అస్సాం ఆ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
సీఎం నివేదిక
ఈ వివాదానికి మరో ప్రధాన కారణం 1951లో అస్సాం ముఖ్యమంత్రిగా పని చేసిన గోపీనాథ్ బార్డోలోయ్ నేతృత్వంలో తయారు చేసిన ఒక కమిటీ నివేదిక. బలిపుర, సాదియా ఫుట్ హిల్స్లోని 3648 చదరపు కిలోమీటర్ల మైదాన ప్రాంతాన్ని అస్సాంలోని లఖింపుర్, దర్రాంగ్ జిల్లాలకు బదిలీ చేయాలని ఆ నివేదికలో సూచించారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయం సేకరించకుండానే ఆ బదిలీ జరిగిందని అరుణాచల్ ప్రదేశ్ వాదిస్తోంది. ఇప్పటికీ ఆ భూములపై హక్కులు తమవేనని అరుణాచల్ప్రదేశ్ ఘంటాపథంగా చెబుతోంది. అయితే 1951 నాటి నోటిఫికేషన్ రాజ్యాంగపరంగా రూపొందించారని, దానికి చట్టబద్ధత ఉన్నందున అరుణాచల్ ప్రదేశ్ వాదనను అస్సాం తోసిపుచ్చుతోంది.
ప్రభుత్వాలు ఏం చేశాయి?
ఈ రెండు రాష్ట్రాల మధ్య తగాదాను పరిష్కరించేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతంగా అరుణాచల్ప్రదేశ్ ఏర్పాటైన తరువాత ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఇరు పక్షాలతో చర్చలు జరపాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
శాంతి స్థాపనకు అడుగులు
ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు వివాదం కొనసాగడం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇష్టం లేదు. అందుకే చర్చల ద్వారా రెండు రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు 2021లోనే సూచించినట్లు సమాచారం. ఆ మేరకు గతేడాది జులైలో రెండు రాష్ట్రాలు నామ్సాయ్ డిక్లరేషన్పై సంతకాలుచేశాయి. ఆ ఒప్పందం ప్రకారం వివాదాస్పద గ్రామాలను 123 నుంచి 86కు తగ్గించారు. సరిహద్దు సమస్య పరిష్కారం కోసం 12 కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీకి ఓ మంత్రి నేతృత్వం వహిస్తారు. ఆ కమిటీ వివాదాస్పద ప్రాంతాలను సందర్శిస్తుంది. అక్కడి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. అలా అస్సాంలోని 12 రీజినల్ కమిటీలు చేసిన సిఫార్సులను బుధవారం ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?