Assam-Arunachal dispute : ఈశాన్య రాష్ట్రాల మధ్య అమిత్ షా సయోధ్య.. తగాదా ఏంటంటే..!
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం (Assam), అరుణాచల్ ప్రదేశ్ (Arunachal) మధ్య గత 50 ఏళ్లుగా సరిహద్దు వివాదం (Border dispute) కొనసాగుతోంది. దానికి ముగింపు పలికేందుకు ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమిత్ షా (Amit shah) సమక్షంలో ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma), అరుణాచల్ సీఎం పెమా ఖండూ (Prema Khandu) గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తాజా ఒప్పందంతో కొన్ని వివాదాస్పద గ్రామాలపై రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ కూడా ఇకపై కొత్త వాదనలు వినిపించడానికి వీల్లేదు. సర్వే ఆఫ్ ఇండియా సమగ్ర నివేదిక ఆధారంగా వాటికి కచ్చితమైన సరిహద్దుల్ని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య వివాదం ఏంటి? ఎలా మొదలైంది? తదితర విషయాలు తెలుసుకోండి.
ఎప్పుడు బీజం పడింది?
అస్సాం నుంచి కొంత భూభాగం విడదీసి అరుణాచల్ ప్రదేశ్ను ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాలు 804 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ సరిహద్దు వివాదానికి బీజం బ్రిటిష్ హయాంలోనే ఏర్పడింది. 1873లో బ్రిటిష్ పాలకులు ‘ఇన్నర్ లైన్’ రెగ్యులేషన్ను ఏర్పాటు చేశారు. ఆ రెగ్యులేషన్ ద్వారా మైదానాలు, కొండ ప్రాంతాల మధ్య ఓ ఊహాత్మక సరిహద్దును నిర్ణయించారు. 1915 నాటికి ఆ రెగ్యులేషన్ను ‘ఈశాన్య సరిహద్దు ట్రాక్ట్స్’గా పేరు మార్చారు. సరిహద్దులో ఎక్కువగా కొండలున్న ప్రాంతం ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది.
ఆక్రమణలు.. పరస్పర ఆరోపణలు
భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ‘ఈశాన్య సరిహద్దు ట్రాక్ట్స్’ను తన నియంత్రణలోకి తీసుకుంది. 1954లో దాన్ని ‘ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ’గా పేరు మార్చింది. 1972లో అరుణాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. 1987లో ఆ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హోదా కల్పించింది. అప్పటి నుంచి కాస్త సాఫీగానే సాగిన ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రయాణం 1990ల నాటికి వివాదం వైపు మళ్లింది. ఒక రాష్ట్రానికి చెందిన వారు మరో రాష్ట్రంలోకి చొరబడి భూములను ఆక్రమించుకుంటున్నారని పరస్పరం ఆరోపించుకున్నారు. కేవలం ఆరోపణలతోనే ఆగలేదు.. కొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ అంశంపై 1989 నుంచి ఓ వ్యాజ్యం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగాన్ని ఆక్రమించిందంటూ అస్సాం ఆ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
సీఎం నివేదిక
ఈ వివాదానికి మరో ప్రధాన కారణం 1951లో అస్సాం ముఖ్యమంత్రిగా పని చేసిన గోపీనాథ్ బార్డోలోయ్ నేతృత్వంలో తయారు చేసిన ఒక కమిటీ నివేదిక. బలిపుర, సాదియా ఫుట్ హిల్స్లోని 3648 చదరపు కిలోమీటర్ల మైదాన ప్రాంతాన్ని అస్సాంలోని లఖింపుర్, దర్రాంగ్ జిల్లాలకు బదిలీ చేయాలని ఆ నివేదికలో సూచించారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయం సేకరించకుండానే ఆ బదిలీ జరిగిందని అరుణాచల్ ప్రదేశ్ వాదిస్తోంది. ఇప్పటికీ ఆ భూములపై హక్కులు తమవేనని అరుణాచల్ప్రదేశ్ ఘంటాపథంగా చెబుతోంది. అయితే 1951 నాటి నోటిఫికేషన్ రాజ్యాంగపరంగా రూపొందించారని, దానికి చట్టబద్ధత ఉన్నందున అరుణాచల్ ప్రదేశ్ వాదనను అస్సాం తోసిపుచ్చుతోంది.
ప్రభుత్వాలు ఏం చేశాయి?
ఈ రెండు రాష్ట్రాల మధ్య తగాదాను పరిష్కరించేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతంగా అరుణాచల్ప్రదేశ్ ఏర్పాటైన తరువాత ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఇరు పక్షాలతో చర్చలు జరపాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
శాంతి స్థాపనకు అడుగులు
ఈశాన్య రాష్ట్రాల్లో సరిహద్దు వివాదం కొనసాగడం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇష్టం లేదు. అందుకే చర్చల ద్వారా రెండు రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు 2021లోనే సూచించినట్లు సమాచారం. ఆ మేరకు గతేడాది జులైలో రెండు రాష్ట్రాలు నామ్సాయ్ డిక్లరేషన్పై సంతకాలుచేశాయి. ఆ ఒప్పందం ప్రకారం వివాదాస్పద గ్రామాలను 123 నుంచి 86కు తగ్గించారు. సరిహద్దు సమస్య పరిష్కారం కోసం 12 కమిటీలను నియమించారు. ఒక్కో కమిటీకి ఓ మంత్రి నేతృత్వం వహిస్తారు. ఆ కమిటీ వివాదాస్పద ప్రాంతాలను సందర్శిస్తుంది. అక్కడి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. అలా అస్సాంలోని 12 రీజినల్ కమిటీలు చేసిన సిఫార్సులను బుధవారం ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్