Vertical forest : నవలను స్ఫూర్తిగా తీసుకొని నిర్మించిన భవనాలివి.. ఎటు చూసినా పచ్చదనమే!
ఇటలీలోని (Italy) మిలాన్ నగరం ఓ కాంక్రీట్ జంగిల్లా ఉంటుంది. అలాంటి చోట అందమైన ‘వర్టికల్ ఫారెస్ట్’ను తీర్చిదిద్దారు. అదెలా సాధ్యమైందో చదివేయండి.
Image : Giuseppe Alletto Italian Artist
ఇటలీలోని (Italy) మిలాన్ నగరంలో ‘బాస్కో వర్టికల్’ నివాస సముదాయం ఉంది. ఇక్కడ 80, 112 మీటర్ల ఎత్తులో రెండు టవర్లున్నాయి. వాటిలోని ప్రతి అంతస్తులో చెట్లు, మొక్కలను ఏర్పాటు చేశారు. అందుకే దీనిని అంతా ‘వర్టికల్ ఫారెస్ట్’ (Vertical forest) అని పిలుస్తున్నారు. ఆ కృత్రిమ అడవి విశేషాలు తెలుసుకోండి.
జీవ వైవిధ్యం ఉట్టి పడేలా
‘బాస్కో వర్టికల్’ టవర్లను బోరి స్టూడియో అనే కంపెనీ డిజైన్ చేసింది. పోర్టా నువా ఐసోలా ప్రాంతంలోని ఈ నిర్మాణాలు కేవలం మనుషులకే కాదు పక్షులకు కూడా ఆవాసంగా ఉండాలనే ఉద్దేశంతో రూపొందించారు. అందుకోసం ఉద్యానవన నిపుణులు, వృక్ష శాస్త్రజ్ఞుల సాయం తీసుకున్నారు. అలా 2010లో ప్రారంభమైన ఈ టవర్ల నిర్మాణం 2014 కల్లా పూర్తయింది.
1957లో ఇటాలో కాల్వినో అనే రచయిత ‘ద బారన్ ఇన్ ద ట్రీస్’ అనే నవల రాశాడు. అందులో కథానాయకుడు నేలపై కాకుండా చెట్లపై నివాసం ఉండాలని నిశ్చయించుకుంటాడు. ఆ నవలను స్ఫూర్తిగా తీసుకొనే ఈ ప్రాజెక్టు చేపట్టామని ఆర్కిటెక్ట్ స్టెఫానో బోరి తెలిపారు.
ఎటు చూసినా మొక్కలు, చెట్లు
ఇక్కడి రెండు టవర్లలో కలిపి సుమారు 900 చెట్లున్నాయి. 550 దాకా ఒక భవనంలో, 350 దాకా మరో భవనంలో నాటారు. అవి మాత్రమే కాకుండా 15 వేల గ్రౌండ్ కవరింగ్, 5వేల పొద రకాల మొక్కలు వివిధ చోట్ల ఏర్పాటు చేశారు. అంటే దాదాపు 30వేల చదరపు మీటర్ల అటవీ ప్రాంతంలో ఉండాల్సిన వృక్ష సంపదను 3వేల చదరపు మీటర్ల పట్టణ ప్రాంతంలోనే తీర్చిదిద్దారు. ఫలితంగా ఒక ఏడాదిలోనే ఈ మొక్కలు, చెట్లన్నీ కలిసి 20 వేల కేజీల కార్బన్వాయువులను గ్రహిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
వేసవిలోనూ చల్లదనం
సాధారణంగా గాజు, రాతి, కాంక్రీటు నిర్మాణాలపై సూర్యరశ్మి ప్రభావం అధికంగా ఉంటుంది. కానీ, చుట్టూ మొక్కలు, పొదలతో ‘బాస్కో వర్టికల్’ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ ఇళ్ల లోపల నిత్యం చల్లగా ఉంటుందని బోరి స్టూడియో వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ భవనాల్లో చాలా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోందని.. దాంతో ఏసీల వాడకం కూడా తగ్గిందని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా మొక్కలు తేమను అదుపులో ఉంచుతున్నాయి. కార్బన్ డై ఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తున్నాయి.
Image : stefanoboeriarchitetti.net
ఆహ్లాదకర వాతావరణం
మిలాన్ నగరం నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ, ఈ టవర్లలో నివసించే స్థానికులకు మాత్రం ఆ గజిబిజి వాతావరణం తెలియదు. ఎందుకంటే చుట్టూ ఉన్న మొక్కలు రణగొణ శబ్దాలను తగ్గించడమే కాకుండా దుమ్ము, ధూళిని ఇళ్లలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఎటు చూసినా పచ్చదనమే కన్పించడం వల్ల ఆహ్లాదకరంగా అనిపిస్తోందని వారు చెబుతున్నారు.
అనేక అవార్డులు
‘బాస్కో వర్టికల్’ ప్రాజెక్టును ఇప్పటి దాకా అనేక అవార్డులు వరించాయి. 2014లో ‘ఇంటర్నేషనల్ హై రైజ్ అవార్డు’ దక్కింది. రెండేళ్లకొక సారి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 మీటర్ల ఎత్తులో ఉన్న నిర్మాణాలను గుర్తించి వాటిలోని ప్రత్యేకతల ఆధారంగా అవార్డుకు ఎంపిక చేస్తారు. 2015లో ‘కౌన్సిల్ ఆన్ టాల్ బిల్డింగ్ అండ్ అర్బన్ హాబిటట్’ అవార్డ్స్ జూరీ ‘బాస్కో వర్టికల్’ను ‘2015 బెస్ట్ టాల్ బిల్డింగ్ వరల్డ్ వైడ్’గా గుర్తించింది.
ఆ ప్రాజెక్టుల్లా కాదు
చుట్టూ గ్రీనరీ ఉండేలా నిర్మించిన భవనాలు చాలా చోట్ల ఉన్నాయి. కొలంబియా రాజధాని బొగొటాలోని ఎడిఫిసియో శాంటాలాయా, చైనా దేశం చెంగ్డూలోని క్యూయీ సిటీ ఫారెస్ట్ గార్డెన్ ఆ కోవకు చెందినవే. కానీ, అవేవీ అంత విజయవంతం కాలేదు. క్యూయీ సిటీ ఫారెస్ట్ గార్డెన్లో దోమల బాధ అధికంగా ఉందని ఇటీవల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో అది అంతర్జాతీయ స్థాయి వార్తగా మారింది. కానీ, ఇన్నేళ్లయినా ‘బాస్కో వర్టికల్’ గురించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు.
గ్రీన్ సైనికుల కృషి
‘బాస్కో వర్టికల్’ పచ్చదనం కొనసాగడం, దాని గురించి ఎలాంటి ఫిర్యాదులు రాకపోవడం వెనుక ‘ప్లయింగ్ గార్డెనర్స్’ కృషి దాగి ఉంది. పర్వతారోహకుల తరహాలో వీరు ఈ భవనం చుట్టూ వేలాడుతూ పని చేస్తారు. అడ్డంగా పెరిగిన మొక్కలను అందంగా కత్తిరిస్తారు. నీటి సదుపాయం కల్పిస్తారు. డిజిటల్, ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మరమ్మతులు చేయాలో అవన్నీ చకచకా చేసేస్తారు.
ప్రస్తుతం ‘బాస్కో వర్టికల్’ మనుషులతో పాటు అనేక పక్షులు, కీటకాలకు నిలయంగా మారింది. ఇక్కడ దాదాపు 1600 రకాల పక్షులు, సీతాకోక చిలుకలు తిరుగుతున్నట్లు సమాచారం.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్