Tigers : చీతాలొచ్చాయ్.. పులులు వెళ్తాయేమో!
కొన్ని దశాబ్దాల క్రితం భారత్లో చీతాలు అంతరించిపోయినట్లే ఇప్పుడు కంబోడియాలో పులులు కన్పించడం లేదు. వాటి సంతతి పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చదివేయండి.
మన దేశంలో చీతాలు(Cheetah) అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం(Government) ప్రకటించింది. వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా గతేడాది నమీబియా నుంచి 8 చీతాలను భారత్(India)కు రప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) వాటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు(Kuno national park)లోకి విడిచిపెట్టారు. రెండో విడతలో దక్షిణాఫ్రికా(South africa) నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చారు. అన్నీ అనుకూలిస్తే ఇదే తరహాలో మరికొన్ని రోజుల్లో భారత్(India) నుంచి కొన్ని పులులు కంబోడియా వెళ్లనున్నాయి. మన పులులను పరాయి దేశానికి ఎందుకు పంపించనున్నారో తెలుసుకోండి.
అన్నీ అనుకూలిస్తేనే పయనం!
కట్టుదిట్టమైన సంరక్షణ చర్యలు తీసుకోని ఫలితంగా కంబోడియాలో పులులు అంతరించిపోయాయి. చివరిగా 2007లో అక్కడి కెమెరాల్లో పులి కన్పించింది. 2016లో తమ దేశంలో పులులు పూర్తిగా అంతరించిపోయాయని ఆ దేశం ప్రకటించింది. దాంతో అక్కడి వన్యప్రాణి సంరక్షణ అధికారులు కొన్ని మగ, ఆడపులులను తమ దేశానికి పంపించాల్సిందిగా భారత్ సహా ఇతర దేశాలను కోరారు. దాంతో గతేడాదిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. భారత్లో ఒక చోట నుంచి మరోచోటకు పులులను తరలించిన దాఖలాలున్నాయి. కానీ వేరే దేశానికి ఎప్పుడూ వాటిని పంపించలేదు. కంబోడియాలో పులుల జీవనానికి కావాల్సిన అనుకూలతలను వివిధ దశల్లో అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ సభ్యుడు ఎస్పీ యాదవ్ ఇటీవల వెల్లడించారు.
ఎందుకు అంతరించిపోయాయి?
సాధారణంగా పులులు స్వేచ్ఛగా సంచరించడానికి ఎక్కువ భూమి అవసరమౌతుంది. ఆహారం నిమిత్తం వాటి వేటకు కావాల్సినన్ని జంతువులు కూడా ఉండాలి. కంబోడియాలో అడవులను నరికివేసి మనుషులు అక్కడ ఇళ్లను నిర్మించుకున్నారు. దాంతో మనుషుల వేటకు ఆస్కారం ఏర్పడింది. పులి శరీరంలోని ప్రతి భాగం విలువైంది. దాని మీసాలు మొదలుకొని, గోర్ల వరకు అన్నింటికీ డిమాండ్ ఉండటంతో వాటిని చంపడం పరిపాటిగా మారింది. చాలా దేశాల్లో పులి చర్మం ఇంట్లో ఉండటం ఒక గొప్ప గౌరవంగా భావిస్తారు. ఇలాంటి చర్యల ఫలితంగా కంబోడియాలో పులులు కన్పించకుండా పోయాయి.
వర్షారణ్యం ఎంపిక
ప్రకృతిలో ఒక జాతి అంతరిస్తే అనేక నష్టాలుంటాయి. ఆ లోటు కంబోడియా ప్రభుత్వానికి తెలిసింది. అందుకే తిరిగి పులులను ప్రవేశపెట్టేందుకు కార్డమామ్ వర్షారణ్యాన్ని ఎంపిక చేసింది. దీని వైశాల్యం బాగా విస్తృతంగా ఉంటుంది. గడ్డినేలలు, చిత్తడి భూముల కలయిక ఈ ప్రాంతంలో కన్పిస్తుంది. ఇక్కడే కార్డమామ్ నేషనల్ పార్క్, టాటాయ్ వన్యప్రాణుల అభయారణ్యం, ఎఫ్నమ్ సామ్కోస్ వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నాయి. దాంతో పులులకు కావాల్సినంత భద్రత ఇక్కడ లభించనుంది. స్థానికులు కూడా పులుల సంతతి పెంచే కార్యక్రమానికి సహకరించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పులుల పునఃప్రవేశం కార్యరూపం దాల్చితే కంబోడియా పర్యాటక ఆదాయం మెరుగుపడనుంది. ఇతర జాతుల సంతతి కూడా పెరగనుంది.
ఆసియాలోనే లక్ష పులులు!
ఒక శతాబ్దం క్రితం కేవలం ఆసియాలోనే లక్ష పులులుండేవట. విచ్చలవిడిగా కొనసాగిన వేట, అటవీ ప్రాంతాలను మనుషుల ఆవాసాలుగా మలుచుకోవడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కలిపి కూడా 4500 పులులు మాత్రమే ఉంటాయని ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ అనే సంస్థ చెబుతోంది. సాధారణంగా ఒక్కో పులి 8-10 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. వివిధ కారణాల వల్ల కాస్పియన్ టైగర్, బాలి టైగర్ వంటి జాతులు అంతరించిపోయాయి.
భారత్ చర్యలు భేష్
భారత్లో పులుల సంరక్షణ నిమిత్తం 1973లో ‘ప్రాజెక్ట్ టైగర్’ చేపట్టారు. పులుల సంచారానికి కావాల్సినంత భూభాగం కేటాయించడం, వాటిని మానవులు వేటాడకుండా చర్యలు తీసుకోవడం, పులుల సంతతి అభివృద్ధి అయ్యే పరిస్థితులు కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. తొలినాళ్లలో 9 టైగర్ రిజర్వ్లను ఏర్పాటు చేసి 18,278 చదరపు కిలోమీటర్లను పులుల సంచారానికి కేటాయించారు. ప్రస్తుతం దేశంలో 53 టైగర్ రిజర్వ్లున్నాయి. అవి 75,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కవర్ చేస్తున్నాయి. అంటే దేశం మొత్తంలో 2.4%శాతం భూమిని పులుల సంచారం కోసం కేటాయించినట్లయింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 70 శాతం భారత్లోనే ఉన్నాయి. ఏటా 6 శాతం పెరుగుదల మన వద్ద కన్పిస్తోంది. 2010లో పులుల సంతతి కలిగిన ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, నేపాల్, రష్యా, థాయిలాండ్, వియత్నాం దేశాలు 2022 కల్లా వాటిని రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాయి. అనూహ్యంగా భారత్ 2018 నాటికే ఆ ఘనత సాధించింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 3వేల పులులున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.