Tigers : చీతాలొచ్చాయ్.. పులులు వెళ్తాయేమో!
కొన్ని దశాబ్దాల క్రితం భారత్లో చీతాలు అంతరించిపోయినట్లే ఇప్పుడు కంబోడియాలో పులులు కన్పించడం లేదు. వాటి సంతతి పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చదివేయండి.
మన దేశంలో చీతాలు(Cheetah) అంతరించిపోయినట్లు 1952లో ప్రభుత్వం(Government) ప్రకటించింది. వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా గతేడాది నమీబియా నుంచి 8 చీతాలను భారత్(India)కు రప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) వాటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు(Kuno national park)లోకి విడిచిపెట్టారు. రెండో విడతలో దక్షిణాఫ్రికా(South africa) నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చారు. అన్నీ అనుకూలిస్తే ఇదే తరహాలో మరికొన్ని రోజుల్లో భారత్(India) నుంచి కొన్ని పులులు కంబోడియా వెళ్లనున్నాయి. మన పులులను పరాయి దేశానికి ఎందుకు పంపించనున్నారో తెలుసుకోండి.
అన్నీ అనుకూలిస్తేనే పయనం!
కట్టుదిట్టమైన సంరక్షణ చర్యలు తీసుకోని ఫలితంగా కంబోడియాలో పులులు అంతరించిపోయాయి. చివరిగా 2007లో అక్కడి కెమెరాల్లో పులి కన్పించింది. 2016లో తమ దేశంలో పులులు పూర్తిగా అంతరించిపోయాయని ఆ దేశం ప్రకటించింది. దాంతో అక్కడి వన్యప్రాణి సంరక్షణ అధికారులు కొన్ని మగ, ఆడపులులను తమ దేశానికి పంపించాల్సిందిగా భారత్ సహా ఇతర దేశాలను కోరారు. దాంతో గతేడాదిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. భారత్లో ఒక చోట నుంచి మరోచోటకు పులులను తరలించిన దాఖలాలున్నాయి. కానీ వేరే దేశానికి ఎప్పుడూ వాటిని పంపించలేదు. కంబోడియాలో పులుల జీవనానికి కావాల్సిన అనుకూలతలను వివిధ దశల్లో అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ సభ్యుడు ఎస్పీ యాదవ్ ఇటీవల వెల్లడించారు.
ఎందుకు అంతరించిపోయాయి?
సాధారణంగా పులులు స్వేచ్ఛగా సంచరించడానికి ఎక్కువ భూమి అవసరమౌతుంది. ఆహారం నిమిత్తం వాటి వేటకు కావాల్సినన్ని జంతువులు కూడా ఉండాలి. కంబోడియాలో అడవులను నరికివేసి మనుషులు అక్కడ ఇళ్లను నిర్మించుకున్నారు. దాంతో మనుషుల వేటకు ఆస్కారం ఏర్పడింది. పులి శరీరంలోని ప్రతి భాగం విలువైంది. దాని మీసాలు మొదలుకొని, గోర్ల వరకు అన్నింటికీ డిమాండ్ ఉండటంతో వాటిని చంపడం పరిపాటిగా మారింది. చాలా దేశాల్లో పులి చర్మం ఇంట్లో ఉండటం ఒక గొప్ప గౌరవంగా భావిస్తారు. ఇలాంటి చర్యల ఫలితంగా కంబోడియాలో పులులు కన్పించకుండా పోయాయి.
వర్షారణ్యం ఎంపిక
ప్రకృతిలో ఒక జాతి అంతరిస్తే అనేక నష్టాలుంటాయి. ఆ లోటు కంబోడియా ప్రభుత్వానికి తెలిసింది. అందుకే తిరిగి పులులను ప్రవేశపెట్టేందుకు కార్డమామ్ వర్షారణ్యాన్ని ఎంపిక చేసింది. దీని వైశాల్యం బాగా విస్తృతంగా ఉంటుంది. గడ్డినేలలు, చిత్తడి భూముల కలయిక ఈ ప్రాంతంలో కన్పిస్తుంది. ఇక్కడే కార్డమామ్ నేషనల్ పార్క్, టాటాయ్ వన్యప్రాణుల అభయారణ్యం, ఎఫ్నమ్ సామ్కోస్ వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నాయి. దాంతో పులులకు కావాల్సినంత భద్రత ఇక్కడ లభించనుంది. స్థానికులు కూడా పులుల సంతతి పెంచే కార్యక్రమానికి సహకరించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ పులుల పునఃప్రవేశం కార్యరూపం దాల్చితే కంబోడియా పర్యాటక ఆదాయం మెరుగుపడనుంది. ఇతర జాతుల సంతతి కూడా పెరగనుంది.
ఆసియాలోనే లక్ష పులులు!
ఒక శతాబ్దం క్రితం కేవలం ఆసియాలోనే లక్ష పులులుండేవట. విచ్చలవిడిగా కొనసాగిన వేట, అటవీ ప్రాంతాలను మనుషుల ఆవాసాలుగా మలుచుకోవడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కలిపి కూడా 4500 పులులు మాత్రమే ఉంటాయని ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ అనే సంస్థ చెబుతోంది. సాధారణంగా ఒక్కో పులి 8-10 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. వివిధ కారణాల వల్ల కాస్పియన్ టైగర్, బాలి టైగర్ వంటి జాతులు అంతరించిపోయాయి.
భారత్ చర్యలు భేష్
భారత్లో పులుల సంరక్షణ నిమిత్తం 1973లో ‘ప్రాజెక్ట్ టైగర్’ చేపట్టారు. పులుల సంచారానికి కావాల్సినంత భూభాగం కేటాయించడం, వాటిని మానవులు వేటాడకుండా చర్యలు తీసుకోవడం, పులుల సంతతి అభివృద్ధి అయ్యే పరిస్థితులు కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. తొలినాళ్లలో 9 టైగర్ రిజర్వ్లను ఏర్పాటు చేసి 18,278 చదరపు కిలోమీటర్లను పులుల సంచారానికి కేటాయించారు. ప్రస్తుతం దేశంలో 53 టైగర్ రిజర్వ్లున్నాయి. అవి 75,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కవర్ చేస్తున్నాయి. అంటే దేశం మొత్తంలో 2.4%శాతం భూమిని పులుల సంచారం కోసం కేటాయించినట్లయింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 70 శాతం భారత్లోనే ఉన్నాయి. ఏటా 6 శాతం పెరుగుదల మన వద్ద కన్పిస్తోంది. 2010లో పులుల సంతతి కలిగిన ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, నేపాల్, రష్యా, థాయిలాండ్, వియత్నాం దేశాలు 2022 కల్లా వాటిని రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాయి. అనూహ్యంగా భారత్ 2018 నాటికే ఆ ఘనత సాధించింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 3వేల పులులున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్