Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
ఎలాగైనా బరువు తగ్గిపోవాలి.. నెల రోజుల్లో కనీసం 4 కేజీలైనా తగ్గాలి. ఇలా చాలా మంది అనుకుంటారు. వెంటనే డైటింగ్ అంటూ తమకుతాము ఆహార నిబంధనలు విధించుకుంటారు. చాలీచాలని ఆహారం తింటారు. మరీ ముఖ్యంగా సాయంత్రం 5 తర్వాత తినే వాటిపైనే దృష్టి పెడతారు. బరువు తగ్గడం మాటపక్కన పెడితే కష్టాలు కోరి తెచ్చుకుంటారు. బరువు తగ్గాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ,
ఇంటర్నెట్డెస్క్: ఎలాగైనా బరువు తగ్గిపోవాలి.. నెల రోజుల్లో కనీసం 4 కేజీలైనా తగ్గాలి. ఇలా చాలా మంది అనుకుంటారు. వెంటనే డైటింగ్ అంటూ తమకుతాము ఆహార నిబంధనలు విధించుకుంటారు. చాలీచాలని ఆహారం తింటారు. మరీ ముఖ్యంగా సాయంత్రం 5 తర్వాత తినే వాటిపైనే దృష్టి పెడతారు. బరువు తగ్గడం మాటపక్కన పెడితే కష్టాలు కోరి తెచ్చుకుంటారు. బరువు తగ్గాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ, అది అంతసులభమేమీకాదు. నిరంతర శ్రమతోనే అది సాధ్యమవుతుంది. కానీ, ఆ క్రమంలో చాలా మంది తెలిసో? తెలియకో తప్పులు చేసేస్తుంటారు. అవేంటో చూద్దామా?
1. రాత్రిపూట తగినంత తినకపోవడం
అధిక బరువుకు రాత్రిపూట ఎక్కువగా తినడమే కారణమని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. దీంతో ఓవైపు ఆకలితో కడుపు మండిపోతున్నా.. సగంతోనే ముగిస్తారు. పోషకాహార నిపుణులు దీనిని ఏమాత్రం సమర్థించరు. రాత్రిపూట సరిపడినంత తిండి తినడం చాలా అవసరం. మరుసటి రోజు పని చేయడానికి కావాల్సిన శక్తి దీని ద్వారానే లభిస్తుంది. అయితే మనం తినే ఆహారంలో శరీరానికి అవసరమైన పిండిపదార్థాలతోపాటు ప్రోటీన్లు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.
2. రుచికరమైన భోజనం చేయకపోడం
నోటికి రుచిగా అనిపించినప్పుడు మనకు తెలియకుండానే కాస్తా ఎక్కువ తినేస్తాం. అందుకని బరువు తగ్గాలనుకునే వారు ఉప్పు, కారం వీలైనంత తక్కువగా ఉండేలా జాగ్రత్తపడతారు. అంతేకాకుండా స్పైసీ ఫుడ్స్కి దూరంగా ఉంటారు. బరువు తగ్గాలనుకునేవారు మరీ అంత కఠిన నియమాలు పాటించనక్కర్లేదు. రాత్రి మీకు నచ్చిన ఆహారాన్ని మనసారా తినండి. కానీ, తిన్న వెంటనే పడుకోకుండా భోజనానికి, నిద్రకి కనీసం గంట సమయం ఉండేలా చూసుకోండి. అయితే.. నచ్చింది కదా అని మరీ ఎక్కువగా తినకూడదు సుమా!
3. స్వీట్స్ తింటే బరువు పెరిగిపోతాం
సాధారణంగా రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా మంది ఐస్క్రీం, స్వీట్ లాంటివి తింటూ ఉంటారు. కానీ, బరువు తగ్గాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ చేసేది ముందుగా స్వీట్స్ మానేయడం. అలాగని గీతగీసుకొని మరీ తినడం మానక్కర్లేదు. అలవాటుకు తగ్గట్లుగా వేరే వాటిని చూసుకోవడం మంచిది. ఉదాహరణకు ఐస్క్రీం స్థానంలో స్వీట్పాన్ లాంటివి వాడుకోవచ్చు. రాత్రిపూట తినడం తగ్గించాలనుకుంటే.. సాయంత్రం ఏవైనా స్నాక్స్ తీసుకోవడం మంచిది.
4. సరిపడినంత నిద్రలేకపోవడం
పనులన్నీ ముగించుకున్నాక.. చాలా మంది కొద్దీ టీవీ చూస్తూనో, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూనో గంటల కొద్దీ సమయం గడిసేస్తారు. రాత్రి ఎప్పటికో నిద్రపోతారు. ఉదయం లేవడమూ ఆలస్యమే. దీంతో శరీరంలో హార్మోన్ల స్థాయి అదుపు తప్పుతుంది. ఫలితంగా అధికబరువుకు అవకాశాలు చాలా ఎక్కువ. అందువల్ల వీలైనంత వరకు నిర్ణీత సమయంలో నిద్రపోయేలా చూసుకోవాలి. మరికొందరు రోజంతా బాగా కష్టపడి అలిసిపోతారు. రాత్రి కాస్త తిన్న వెంటనే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. తిన్న వెంటనే నిద్రపోతారు. దీనివల్ల కూడా బరువుపెరిగే అవకాశముంది.
శరీరానికి అవసరమైన సమతులాహారాన్ని తీసుకుంటూ.. రోజుకు కనీసం గంటపాటు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఏవైనా ఆహార నియమాలు పాటించే ముందు డాక్టరును సంప్రదించి వాళ్ల సూచన మేరకు ఆచరించడమే ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన
-
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే