Cultured meat : ఆస్ట్రేలియా కంపెనీ అరుదైన ప్రయోగం.. కృత్రిమంగా మీట్ బాల్!
కృత్రిమంగా తయారు చేసిన మమ్మత్ (Mammoth) మీట్ బాల్ను గత వారం నెదర్లాండ్స్లోని ‘నెమో’ సైన్స్ మ్యూజియంలో (Science museum) ప్రదర్శించారు. దాన్ని ఇప్పటి వరకు ఎవరూ రుచి చూడలేదు. ఒక వేళ తింటే అది మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై ఇంకా పరిశోధిస్తున్నారు.
(Image : Facebook)
ఆస్ట్రేలియాకు (Australia) చెందిన ‘ల్యాబ్ గ్రోన్ మీట్’ కంపెనీ ‘వావ్’ సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. వందల ఏళ్ల క్రితం అంతరించి పోయిన వూలీ మమ్మత్ (Woolly mammoth) డీఎన్ఏతో కృత్రిమ మాంసం సృష్టించి వాటితో మీట్ బాల్ను తయారు చేసింది. చికెన్ (Chicken), బీఫ్, పోర్క్ వంటి కృత్రిమ మాంస ఉత్పత్తులకు భిన్నంగా ఈ మాంసాన్ని (Meat) తయారు చేసింది. భూమిపై మనుగడలో లేని, అంతరించిపోయే దశలో ఉన్న జంతువుల కృత్రిమ మాంసాన్ని పెంచడంపై ఈ కంపెనీ దృష్టి సారించింది. ఎప్పుడో అంతరించిపోయిన మమ్మత్ మాంసకృత్తులను సృష్టించేందుకు ఈ కంపెనీ దాని డీఎన్ఏ (DNA) క్రమాన్ని పరిగణనలోకి తీసుకుంది. మాంసానికి రుచిని అందించడంలో దాని కండరాల ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మాంసాన్ని రెట్టింపు చేయడం కోసం ఏనుగు డీఎన్ఏను కూడా వినియోగించారు. ఆ రెండింటిని గొర్రె నుంచి సేకరించిన కండర కణాలతో కలిపి బిలియన్ల కొద్దీ కణాలను అభివృద్ధి చేశారు. దాంతో అరుదైన కృత్రిమ మాంసం (Cultured meat) తయారైంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పట్టిందని ప్రొఫెసర్ ఎర్నెస్ట్ వోల్వెట్యాంగ్ తెలిపారు. తొలుత కృత్రిమ మాంసం తయారీలో డోడో పక్షి డీఎన్ఏను వినియోగించాలనుకున్నారు. చివరికి అంతరించిపోయిన అరుదైన జీవి మమ్మత్ను ఎంపిక చేశారు. మార్కెట్లో దొరికే వాటికి భవిష్యత్ ప్రత్యామ్నాయం కృత్రిమ మాంసమేనని ప్రచారం చేయడం కోసం కంపెనీ ఈ మార్గాన్ని ఎంచుకుంది. ‘వావ్’ కంపెనీ ఇప్పటికే దున్న, మొసలి, కంగారు, నెమలి మాంసాలను అభివృద్ధి చేసి కొత్త రుచులను కనుగొంది.
ఏంటీ ల్యాబ్ గ్రోన్ మీట్?
మనుషులు కొన్ని వేల ఏళ్ల కిందటి నుంచే మాంసం తింటున్నారు. కాలక్రమంలో రకరకాల పక్షులను, జంతువులను మాంసం కోసం పెంచడం అలవాటు చేసుకున్నారు. ఈ పద్ధతిని మార్చేందుకు శాస్త్రవేత్తలు ‘ల్యాబ్ గ్రోన్ మీట్’ను అభివృద్ధి చేశారు. దీన్నే ‘కల్చర్డ్ మీట్’ అని కూడా పిలుస్తారు. అంటే మొక్కలను పెంచినట్లు ల్యాబ్లో మాంసాన్ని వృద్ధి చేస్తారు. ఈ విధానంలో జంతువులను వధించరు. కేవలం వాటి నుంచి కొన్ని రకాల కణాలను సేకరిస్తారు. జీవధాతు పరీక్ష, గుడ్లు ఫలదీకరణం వంటి విధానాలను అనుసరించి కండరం, కొవ్వుకణాలను సేకరించి పరీక్షల్లో వినియోగిస్తారు. ఈ విధానంలో మాంసం తయారు చేయడం వల్ల వృక్ష, జంతు జాతులను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. యూఎస్కు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్ గ్రోన్ మీట్ను మనుషులు ఆహారంగా తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగపూర్లో అధికారికంగా ల్యాబ్ గ్రోన్ మీట్ను విక్రయిస్తున్నారు. మన దేశంలోనూ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(CCMB)లో పరిశోధనలు కొనసాగుతున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..