Currency: మన రూపాయి విలువ ఈ దేశాల్లో చాలా ఎక్కువ!
సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఏ దేశపు కరెన్సీనైనా అమెరికా డాలర్ విలువలో చెల్లిస్తుంటారు. చాలా దేశాల్లోని కరెన్సీ కంటే యూఎస్ డాలరు విలువ కాస్త ఎక్కువగానే ఉంటుంది. డాలర్తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ సుమారు రూ.74.
సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఏ దేశపు కరెన్సీనైనా అమెరికా డాలర్ విలువలో చెల్లిస్తుంటారు. చాలా దేశాల్లోని కరెన్సీ కంటే యూఎస్ డాలరు విలువ కాస్త ఎక్కువగానే ఉంటుంది. డాలర్తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ సుమారు రూ.74. అమెరికాతోపాటు మరికొన్ని దేశాల కరెన్సీ కూడా రూపాయి కంటే ఎక్కువే. అందుకే ఆయా దేశాల్లో పర్యటించాలన్నా.. అక్కడే స్థిరపడాలన్నా బోలెడంత డబ్బు ఖర్చవుతుంది. కానీ, కొన్ని దేశాల్లో అక్కడి కరెన్సీ కంటే మన రూపాయి విలువ అధికంగా ఉంది. మరి ఆ దేశాలేవీ?అక్కడి కరెన్సీ విలువ ఎంతో ఓ లుక్కేద్దామా..!
వియత్నాం
దక్షిణాసియాలో ఉండే వియత్నాం దేశానికి ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మంచి పేరుంది. ఇక్కడ అందమైన బీచ్లు, ఆకట్టుకునే సంస్కృతి, నోరూరించే వంటలు సందర్శకులను కట్టిపడేస్తాయి. కాగా మన ఒక్క రూపాయి ఇక్కడ 305.71 వియత్నాం డాంగ్ గా ఉంది. అంటే ₹100.. వియత్నాం కరెన్సీలో 30,570.95 డాంగ్లతో సమానం.
ఇండోనేషియా
ఇండోనేషియా కూడా ఆసియా ఖండంలో భాగమే. అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇదొకటి. పురాతన హిందూ, బౌద్ధ దేవాలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దేశపు కరెన్సీ ఇండోనేషియన్ రుపియా. మన ఒక్క రూపాయి విలువ ఇక్కడ 193.01 రూపియాలు. అంటే మన దగ్గర ₹100 ఉంటే, ఇండోనేషియాలో 19,301.24రుపియాలతో సమానం.
ఉజ్బెకిస్థాన్
మధ్య ఆసియాలో.. ఇస్లామిక్ దేశాల సరసన ఉన్న ఉజ్బెకిస్థాన్లో ఆధునిక భవనాలతోపాటు 17వ శతాబ్దం నాటి నిర్మాణాలు, సాంస్కృతిక అవశేషాలు కనిపిస్తుంటాయి. ఎటు చూసినా ఇస్లామిక్ శైలి కట్టడాలు, మసీదులు దర్శనమిస్తాయి. ఈ దేశపు కరెన్సీ ఉజ్బెకిస్థానీ సోమ్. మన రూపాయి విలువ అక్కడ 144.22సోమ్స్గా ఉంది. అంటే ₹100 ఉంటే, ఉజ్బెకిస్థాన్లో 14,422.17 సోమ్స్ ఉన్నట్లే.
లావోస్
థాయ్లాండ్, వియత్నాం, మయన్మార్ దేశాలకు పొరుగున ఉండే లావోస్లో చాలావరకు అంతర్జాతీయ సదస్సులు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఉన్న అత్యంత అందమైన గ్రామాలు, జలపాతాలను చూడటానికి సందర్శకులు వస్తుంటారు. లావోస్ కరెన్సీ లావోటియన్ కిప్. మన ఒక్క రూపాయి.. 140.72లావోటియన్ కిప్తో సమానం. అంటే భారతీయ కరెన్సీ ₹100కి లావోస్ కరెన్సీలో విలువ 14,071.72.
పరాగ్వే
పరాగ్వేను దక్షిణ అమెరికా హృదయంగా అభివర్ణిస్తుంటారు. ఈ దేశానికి ఓ ప్రత్యేకత ఉంది. సముద్రమార్గం లేకపోయినా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నావికాదళం ఉన్న దేశంగా పేరుగాంచింది. ఈ దేశపు కరెన్సీ పరాగ్వేనియన్ గ్వారాని. ఒక రూపాయితో పోలిస్తే గ్వారాని మారకం విలువ 92.86గా ఉంది. అంటే మన ₹100.. అక్కడి దేశ కరెన్సీలో 9,286.03 గ్వారానిలతో సమానం.
కాంబోడియా
చారిత్రక కట్టడాలను కాపాడుకుంటూ వస్తోన్న ఆసియా దేశం కాంబోడియా. అక్కడి చారిత్రక నిర్మాణాలు, మ్యూజియాలను చూసేందుకు ఏటా లక్షల మంది సందర్శకులు వెళ్తుంటారు. ఆ దేశ కరెన్సీ కాంబోడియన్ రియల్స్ కాగా.. మన రూపాయితో పోలిస్తే ఆ దేశ కరెన్సీ మారకం విలువ 54.89గా ఉంది. అంటే భారత కరెన్సీ ₹100 ఉంటే, కాంబోడియా కరెన్సీలో 5,488.51రియల్స్తో సమానం.
కొలంబియా
దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశం.. కరేబియన్, పసిఫిక్ సముద్రాల తీరంలో ఉంటుంది. పర్యాటకంగా ఈ దేశం అంతగా అనువైనది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ దేశంలో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయట. ముఖ్యంగా మనుషుల్ని అపహరిస్తుంటారు. అందుకే ఈ దేశంలో పర్యటించేవారిని సంబంధిత అధికారులు హెచ్చరిస్తుంటారు. కాగా.. ఈ దేశ కరెన్సీని కొలంబియన్ పెసోగా పిలుస్తారు. ఒక రూపాయి విలువ అక్కడ 52.20 పెసోలుగా ఉంది. అంటే ₹100 ఉంటే, అది 5,219.61 పెసోలతో సమానం.
మంగోలియా
చైనా, రష్యా దేశాలతో సరిహద్దును పంచుకుంటూ మధ్యలో ఉండే మంగోలియా దేశానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ దేశం ఒకప్పుడు మంగోలుల సామ్రాజ్యంగా ఉండేది. చెంఘీజ్ఖాన్ రాజ్యాన్ని స్థాపించి చైనా, రష్యాలో అనేక ప్రాంతాలను తన కైవసం చేసుకున్నాడు. కాలక్రమంలో తిరిగి చైనా, రష్యా తమ ప్రాంతాలను సొంతం చేసుకోగా.. ప్రస్తుతం మంగోలియా ఒక దేశంగా మిగిలింది. ఈ దేశపు కరెన్సీ మంగోలియన్ టగ్రిక్. మన భారత కరెన్సీ ఒక రూపాయితో పోలిస్తే.. మంగోలియన్ టగ్రి మారకం విలువ 38.49గా ఉంది. అంటే ₹100.. మంగోలియా కరెన్సీలో 3,849 టగ్రిలతో సమానం.
దక్షిణ కొరియా
తూర్పు ఆసియా దేశాల్లో ఒకటైన దక్షిణ కొరియా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ ప్రపంచంతో పోటీ పడుతోంది. ఈ దేశంలో సినిమాలు, కె-పాప్ సంగీతం, ఫ్యాషన్, టెక్నాలజీ రంగం, కాస్మోటిక్ సర్జరీలు చాలా పాపులర్. ఈ దేశపు కరెన్సీ సౌత్ కొరియన్ వాన్. ఇక్కడి ఒక్క సౌత్ కొరియన్ వాన్తో రూపాయి మారకం విలువ చూస్తే.. ఒక రూపాయి 15.93వాన్లతో సమానం. అంటే ₹100 ఉంటే దక్షిణ కొరియా కరెన్సీలో 1592.50 వాన్ ఉన్నట్లు. ఇవే కాకుండా.. భారత రూపాయి విలువ చిలీ కరెన్సీలో 10.94, శ్రీలంక కరెన్సీలో 2.72, పాకిస్థాన్ కరెన్సీలో 2.29, నేపాల్ కరెన్సీలో 1.60తో సమానంగా ఉంది.
గమనిక: కరెన్సీ విలువలు 07-11-2021 తేదీ ప్రకారం
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్