Covid Mortality: ఈ సంకేతాలతో ముప్పు గుర్తింపు
కొవిడ్ బాధితుల్లో కనిపించే కొన్ని రకాల సంకేతాలను బట్టి ప్రాణాపాయాన్ని ముందే పసిగట్టవచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు.
అమెరికా పరిశోధకుల అధ్యయనం
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి లక్షల మందిని పొట్టనబెట్టుకుంటోంది. అయితే, కొవిడ్ బాధితుల్లో కనిపించే కొన్ని రకాల సంకేతాలను బట్టి ప్రాణాపాయాన్ని ముందే పసిగట్టవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా శ్వాసక్రియ రేటు, ఆక్సిజన్ స్థాయిలను బట్టి ప్రాణాపాయాన్ని ముందుగానే అంచనా వేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా కొవిడ్ నిర్ధారణ అయిన బాధితులు ఇంటివద్దే వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకొని అప్రమత్తం కావచ్చని సూచిస్తున్నారు.
కొవిడ్ సోకిన చాలా మందిలో స్వల్ప లక్షణాలతోనే త్వరగా కోలుకుంటున్నారు. కానీ, కొందరిలో మాత్రం కొన్ని రోజుల వ్యవధిలోనే తీవ్ర అనారోగ్యానికి గురై పరిస్థితి విషమిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మరణాలు సంభవించడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఆసుపత్రితో పాటు రష్ యూనివర్సిటీ ఆసుపత్రిలో కొవిడ్తో చేరిన 1095 బాధితుల సమాచారాన్ని విశ్లేషించారు. గతేడాది (2020) మార్చి 1 నుంచి జూన్ 8 మధ్య కాలంలో చేపట్టిన ఈ అద్యయన సమయంలో.. ఆసుపత్రిలో చేరిన వారిలో 197 మంది మృత్యువాతపడినట్లు గుర్తించారు. ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగా ఉండి ఆసుపత్రిలో చేరిన వారితో పోలిస్తే హైపోక్సేమియా (రక్తంలో తగినంత ఆక్సిజన్ లేని స్థితి) బాధితుల్లో మరణాల ముప్పు 1.8 నుంచి 4రెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక శ్వాసక్రియ రేటు మామూలుగా ఉన్న బాధితులతో పోలిస్తే టాచీప్నియా (వేగంగా శ్వాస తీసుకునే స్థితి) బాధితుల్లో మరణం ముప్పు 1.9 నుంచి 3.2రెట్లు అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా, శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం, రక్తపోటు వంటి అంశాలతో కరోనా మరణాలకు సంబంధం లేదని వైద్య నిపుణులు గుర్తించారు. ఆక్సీమీటర్తో పాటు రక్తపోటును తెలుసుకునే పరికరాలను ఉంచుకోవాలని వారు సూచించారు.
ఇలా హైపోక్సేమియా, టాచీప్నియాతో బాధపడిన రోగులందరికీ అదనపు ఆక్సిజన్తో పాటు ఊపిరితిత్తుల్లో వాపును తగ్గించే గ్లూకో కార్టికాయిడ్స్ అవసరం అయినట్లు వైద్యులు గుర్తించారు. ఆక్సిజన్ స్థాయిలను 92%నుంచి 96% పొందినవారు మాత్రమే గ్లూకో కార్టికాయిడ్స్ ప్రయోజనాలను పొందుతారని వైద్య నిపుణులు గుర్తుచేశారు. ఇలా కొవిడ్తో అనారోగ్యం బారినపడిన వ్యక్తులు ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి, ఆరోగ్య పరిస్థితి ఏంటనే ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ రెండు సంకేతాలతో అప్రమత్తం కావచ్చని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ చెందిన డాక్టర్ నియల్ ఛటర్జీ పేర్కొన్నారు.
ఆక్సీమీటర్తో పర్యవేక్షణ..
కొవిడ్ నిర్ధారణ అయిన బాధితులు వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సీమీటర్తో పర్యవేక్షించుకోవడం మంచిదని అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ సొతూదేహ్నియా సూచించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడిగా అనిపించడం వంటి సంకేతాలు కనిపించినప్పుడు వైద్యున్ని సంప్రదించాలని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) సూచిస్తోంది. కానీ, ఒక్కోసారి శ్వాసక్రియ రేటు, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు కనిపించకపోవచ్చు. దాంతో పరిస్థితి విషమంగా మారుతోంది. అందుచేత ఆయా ప్రభుత్వాలు కొవిడ్ నిబంధనల్లో వీటిని కూడా చేర్చాలని డాక్టర్ నియల్ ఛటర్జీ సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం