Covid Mortality: ఈ సంకేతాలతో ముప్పు గుర్తింపు
కొవిడ్ బాధితుల్లో కనిపించే కొన్ని రకాల సంకేతాలను బట్టి ప్రాణాపాయాన్ని ముందే పసిగట్టవచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు.
అమెరికా పరిశోధకుల అధ్యయనం
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి లక్షల మందిని పొట్టనబెట్టుకుంటోంది. అయితే, కొవిడ్ బాధితుల్లో కనిపించే కొన్ని రకాల సంకేతాలను బట్టి ప్రాణాపాయాన్ని ముందే పసిగట్టవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా శ్వాసక్రియ రేటు, ఆక్సిజన్ స్థాయిలను బట్టి ప్రాణాపాయాన్ని ముందుగానే అంచనా వేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా కొవిడ్ నిర్ధారణ అయిన బాధితులు ఇంటివద్దే వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకొని అప్రమత్తం కావచ్చని సూచిస్తున్నారు.
కొవిడ్ సోకిన చాలా మందిలో స్వల్ప లక్షణాలతోనే త్వరగా కోలుకుంటున్నారు. కానీ, కొందరిలో మాత్రం కొన్ని రోజుల వ్యవధిలోనే తీవ్ర అనారోగ్యానికి గురై పరిస్థితి విషమిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మరణాలు సంభవించడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఆసుపత్రితో పాటు రష్ యూనివర్సిటీ ఆసుపత్రిలో కొవిడ్తో చేరిన 1095 బాధితుల సమాచారాన్ని విశ్లేషించారు. గతేడాది (2020) మార్చి 1 నుంచి జూన్ 8 మధ్య కాలంలో చేపట్టిన ఈ అద్యయన సమయంలో.. ఆసుపత్రిలో చేరిన వారిలో 197 మంది మృత్యువాతపడినట్లు గుర్తించారు. ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగా ఉండి ఆసుపత్రిలో చేరిన వారితో పోలిస్తే హైపోక్సేమియా (రక్తంలో తగినంత ఆక్సిజన్ లేని స్థితి) బాధితుల్లో మరణాల ముప్పు 1.8 నుంచి 4రెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇక శ్వాసక్రియ రేటు మామూలుగా ఉన్న బాధితులతో పోలిస్తే టాచీప్నియా (వేగంగా శ్వాస తీసుకునే స్థితి) బాధితుల్లో మరణం ముప్పు 1.9 నుంచి 3.2రెట్లు అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాకుండా, శరీర ఉష్ణోగ్రత, గుండె వేగం, రక్తపోటు వంటి అంశాలతో కరోనా మరణాలకు సంబంధం లేదని వైద్య నిపుణులు గుర్తించారు. ఆక్సీమీటర్తో పాటు రక్తపోటును తెలుసుకునే పరికరాలను ఉంచుకోవాలని వారు సూచించారు.
ఇలా హైపోక్సేమియా, టాచీప్నియాతో బాధపడిన రోగులందరికీ అదనపు ఆక్సిజన్తో పాటు ఊపిరితిత్తుల్లో వాపును తగ్గించే గ్లూకో కార్టికాయిడ్స్ అవసరం అయినట్లు వైద్యులు గుర్తించారు. ఆక్సిజన్ స్థాయిలను 92%నుంచి 96% పొందినవారు మాత్రమే గ్లూకో కార్టికాయిడ్స్ ప్రయోజనాలను పొందుతారని వైద్య నిపుణులు గుర్తుచేశారు. ఇలా కొవిడ్తో అనారోగ్యం బారినపడిన వ్యక్తులు ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి, ఆరోగ్య పరిస్థితి ఏంటనే ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ రెండు సంకేతాలతో అప్రమత్తం కావచ్చని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ చెందిన డాక్టర్ నియల్ ఛటర్జీ పేర్కొన్నారు.
ఆక్సీమీటర్తో పర్యవేక్షణ..
కొవిడ్ నిర్ధారణ అయిన బాధితులు వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సీమీటర్తో పర్యవేక్షించుకోవడం మంచిదని అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ సొతూదేహ్నియా సూచించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడిగా అనిపించడం వంటి సంకేతాలు కనిపించినప్పుడు వైద్యున్ని సంప్రదించాలని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) సూచిస్తోంది. కానీ, ఒక్కోసారి శ్వాసక్రియ రేటు, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు కనిపించకపోవచ్చు. దాంతో పరిస్థితి విషమంగా మారుతోంది. అందుచేత ఆయా ప్రభుత్వాలు కొవిడ్ నిబంధనల్లో వీటిని కూడా చేర్చాలని డాక్టర్ నియల్ ఛటర్జీ సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్