National Project : సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం ఏ ప్రాతిపదికన జాతీయ హోదా ఇస్తుందంటే..!
ఇటీవల కర్ణాటకలోని అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే ఏయే అంశాలను పరిశీలిస్తుందో తెలుసుకుందామా..
దేశంలో అనేక సాగునీటి ప్రాజెక్టులున్నాయి. వాటిలో కొన్ని నిర్మాణ దశలో.. మరికొన్ని ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఒక రాష్ట్రం లేదా ప్రాంతం పురోగమించడానికి నీటిపారుదల ప్రాజెక్టులు(Irrigation Project) ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే వాటికి కేటాయించాల్సిన నిధులు కూడా భారీ మొత్తంలో ఉంటాయి. ఏదైనా ప్రాజెక్టుకు జాతీయహోదా(National Project) లభించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ సాయం అందుతుంది. ప్రాజెక్టు జరుగుతున్న పనులను కేంద్ర జలసంఘం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది.
దేశంలోని అత్యధిక జాతీయ ప్రాజెక్టులన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా దక్కింది. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ డిమాండు చేస్తున్న వేళ.. కర్ణాటకలోని అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు(cost) కేటాయించినట్లు మోదీ ప్రభుత్వం వెల్లడించింది. జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం నాలుగు అంశాలను పరిశీలిస్తుంది. అందులో ఏదో ఒక అర్హత కలిగి ఉంటే పరిగణలోకి తీసుకుంటుంది. అవేంటంటే..
1. అంతర్జాతీయ స్థాయిలో.. అంటే పొరుగు దేశంతోనైనా సరే కలిసి నిర్మించేలా ఆ ప్రాజెక్టు స్వరూపం ఉండాలి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నీటి వాటాను దేశం వాడుకునే వెసులుబాటు ఇవ్వాలి. ఎక్కడ కడుతున్నారు? ఎప్పటిలోగా నిర్మాణం పూర్తవుతుంది అనే సమగ్ర సమాచారం ఉండాలి. దాంతో దేశీయ అవసరాలు తీరతాయి. ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలున్నాయని భావిస్తే కేంద్ర జలశక్తి శాఖ అందుకు తగ్గట్లుగా నిర్ణయం తీసుకుంటుంది.
2. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల నీటి(water) అవసరాలు తీర్చే అంతర్ రాష్ట్రాల ప్రాజెక్టులు. రాష్ట్రాల మధ్య తగాదాల కారణంగా ఖర్చుల విభజన, పునరావాసం(rehabilitation), విద్యుత్ ఉత్పత్తి(power) అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి కేంద్రం సమస్యను తీరుస్తుంది. పెరుగుతున్న నీటి అవసరాలు తీర్చడం, వృథాగా నీరు సముద్రంలోకి కలవకుండా నదుల(rivers) అనుసంధానం కోసం చేపట్టే ప్రాజెక్టులు కూడా ఈ కోవలోకి వస్తాయి.
3. ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే ఉండి.. ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే ప్రాజెక్టులు. రాష్ట్రంలోని ప్రజల సాగునీటి అవసరాలు తీర్చగలగాలి. ముఖ్యంగా రెండు లక్షల హెక్టార్లకు(hectare) మించి పొలాలకు సాగు నీరు అందించాల్సి ఉంటుంది. నీటి పంపకాల విషయంలో ఎలాంటి తగాదాలు ఉండకూడదు. ప్రాజెక్టులోని నీరు తిరిగి ప్రాజెక్టులో చేరే విధంగా ‘హైడ్రాలజీ’(hydrology) అనుకూలత కలిగి ఉండాలి.
4. విస్తరణ, పునర్నిర్మాణం, ఆధునికీకరణ(ఈఆర్ఎం) ప్రాజెక్టులు. అంటే అప్పటికే ఉన్న ఓ ప్రాజెక్టును పొడిగించడం లేదా పునరుద్ధరణ పనులు చేస్తే కనీసం 2 లక్షల హెక్టార్లకు నీరు అందించే స్థాయికి రావాలి.
అనుమతులు.. అనుకూలతలు
పైన పేర్కొన్న అర్హతలు ఉంటే జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే అర్హత ఉన్నంత మాత్రం కేంద్రం అన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వదు. ఇంకా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. అవేంటంటే..
- కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో ఆ ప్రాజెక్టు ఉన్నప్పుడు మాత్రమే జాతీయ హోదా సాధ్యమవుతుంది.
- సాగునీటి సలహా సంఘం ప్రాజెక్టు అనుకూలతల్ని పరిశీలిస్తుంది. దాని నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
- వరద ముంపు నివారణ, బహుళసార్థక ప్రాజెక్టుల నిర్వహణ చూసే జలవనరుల శాఖ(డీవో డబ్ల్యూఆర్) ఆమోదం తెలపాలి.
- నిర్దేశించిన ప్రమాణాలు ప్రాజెక్టులో ఉన్నాయని నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవనం(ఆర్డీ&జీఆర్) సంతృప్తి చెందాలి.
- పెట్టుబడులకు తగిన అనుమతులు ఉండాలి. ప్రాజెక్టు కట్టొచ్చా లేదా అనే విషయంపై హైపవర్డ్ స్టీరింగ్ కమిటీ సిఫారసులు రావాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి నిధుల లభ్యత గురించి అంచనా వేయాలి.
- ఇక జాతీయ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలోనూ కేంద్రానికి, రాష్ట్రాలకు వాటా ఉంటుంది. కేంద్రం వాటా అన్ని రాష్ట్రాలకు స్థిరంగా ఉండదు. ఆయా ప్రాంతాల వెనుకబాటు ఆధారంగా ఎంత వాటా ఇవ్వాలన్న విషయంపై ఇదివరకే కొన్ని ప్రమాణాలున్నాయి.
కేంద్రం 90: రాష్ట్రం 10..
8 ఈశాన్య రాష్ట్రాలు (అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం), 2 హిమాలయ రాష్ట్రాలు (హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్), కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్, లద్ధాఖ్లకు ఈ నిష్పత్తి ప్రకారం వాటా నిధులు విడుదవుతాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు నిధుల పంపిణీ నిష్పత్తిలో తేడా ఉంటుంది.
నీటిపారుదల కోసం కడుతున్న ప్రాజెక్టులే కాకుండా తాగునీటి అవసరాలు తీర్చడం కోసం కడుతున్న వాటికి కూడా జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అవకాశాలున్నాయి. తాగునీటి అవసరాలు తీరడం, నదులు, రిజర్వాయర్లు, కాలువల నుంచి వచ్చే నీరు భూమిలోపలి జలవనరుల శాతాన్ని పెంచుతూ చెరువులు నింపే ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాటికి కేంద్రం అంగీకరించడం చాలా కష్టం అని నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం