Bird drones : మరణించిన పక్షులతో డ్రోన్లు.. అమెరికాలో సరికొత్త ప్రయోగం!
అమెరికాలో (America) మరణించిన పక్షులను (Birds) వినియోగించి డ్రోన్లు (Drones) సృష్టించే ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు పూర్తి స్థాయిలో విజయవంతమైతే లోహ విహంగాల (Flights) ఇంధనం కూడా ఆదా చేసే మార్గం కనిపెట్టొచ్చట.
(Image : Mostafa Hassanalian face book)
అమెరికాలోని (America) న్యూ మెక్సికోలో కొందరు సరికొత్త పరిశోధనకు తెరతీశారు. చనిపోయిన (టాక్సిర్డెర్మీ) పక్షులను (Birds) డ్రోన్లుగా (Drones) మార్చే ప్రక్రియ గురించి విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు. సాధారణ డ్రోన్లకు హెలికాప్టర్ తరహాలో అమర్చిన చక్రాలు తిరుగుతూ ఉంటాయి. కానీ, వీరు రూపొందిస్తున్న డ్రోన్లకు పక్షిలాగ రెక్కలు మాత్రమే ఉంటాయి. అవి అల్లార్చుతూనే డ్రోన్ ఎగరాల్సి ఉంటుంది. జీవం ఉండే పక్షి తన రెక్కల సహాయంతో సులభంగా గాల్లో ప్రయాణిస్తుంది. అదే విధానంలో డ్రోన్ను ఎగరేయడం అసాధ్యం. సకొర్రోలోని ‘న్యూ మెక్సికో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ టెక్నాలజీ’లో కొందరు బృందంగా ఏర్పడి ఇందు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.
చనిపోయిన పక్షులను డ్రోన్లుగా రూపాంతరం చెందిస్తే అది విమానాల (Flights) అధ్యయనానికి కూడా ఉపకరిస్తుందని వారు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ముస్తఫా హసన్ అలియన్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన తొలుత కృత్రిమ, యాంత్రికంగా తయారు చేసిన పక్షులతో పరిశోధన చేశారు. అవి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో నిజమైన పక్షుల శరీరాలతో పరిశోధన ప్రారంభించారు. ఈ ఐడియా ఫలిస్తుందని ఆయన నమ్ముతున్నారు. ‘చనిపోయిన పక్షులను డ్రోన్లుగా మారుస్తున్నాం. పక్షుల్లో ఎప్పటి నుంచో ఎగిరే శక్తి ఉంది. అందుకే మేము రివర్స్ ఇంజినీరింగ్ చేస్తున్నామని’ ముస్తఫా వివరించారు.
టాక్సిర్డెర్మీ పక్షులను యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పంజరంలో ఉంచారు. రెక్కలు కొట్టుకునే తీరు, ఎగిరే ఎత్తు, వేగం అన్నింటినీ అక్కడ రికార్డు చేస్తున్నారు. తద్వారా గాల్లో ఎగురుతున్న విమానాల తీరులో ఎలాంటి మార్పులు చేయొచ్చో పరిశోధిస్తున్నారు. ఒక వేళ తమ ప్రయోగాలు ఫలిస్తే ఆ సాంకేతికతను విమానాలకూ వర్తింప జేసి ఎంతో శక్తిని, ఇంధనాన్ని ఆదా చేయొచ్చని ప్రొఫెసర్ ముస్తఫా అభిప్రాయపడుతున్నారు. న్యూ మెక్సికో టెక్లోని పీహెచ్డీ విద్యార్థి బ్రెండన్ హెర్కన్హాఫ్ పక్షి డ్రోన్ రంగులు, ఎగిరే సామర్థ్యంపై పరిశోధన సాగిస్తున్నారు. పక్షుల రంగులు వాటి సహచరులను ఆకర్షించడానికి, శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడతాయని చాలా మంది అభిప్రాయం. అయితే పక్షులు ఎగిరే సామర్థ్యంలో రంగుల పాత్ర ఎంత వరకు ఉంటుందనే విషయంపై బ్రెండన్ అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం టాక్సిర్డెర్మీ నమూనా పక్షులు 20 నిమిషాల వరకు ఎగురుతున్నాయి.
ఏంటీ టాక్సిర్డెర్మీ?
‘టాక్సిర్డెర్మీ’ అనేది గ్రీకు పదం. ఇందులో ‘టాక్సిర్’ అంటే ‘అమరిక’.. ‘డెర్మా’ అంటే చర్మం అని అర్థం. ‘టాక్సిర్డెర్మీ’ చనిపోయిన జంతువులు, పక్షులను భద్రపరిచే విధానం. అలా భద్రపరిచిన వాటిని పరిశోధనలు, ప్రదర్శనలకు వినియోగిస్తారు. ‘టాక్సిర్డెర్మీ’లో దాదాపు ఐదు రకాల పద్ధతులను అనుసరిస్తారు. అందులో ‘మౌంటింగ్’ ఒకటి. ఈ విధానంలో పక్షి లేదా జంతువు చర్మాన్ని మాత్రం తొలగించి దాన్ని ఒక కృత్రిమ శరీరానికి అతికిస్తారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్