ఈ దేశాలూ నోట్ల రద్దు చేశాయి.. కానీ!
నోట్ల రద్దుతో భారత్ తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరగలేదు. కానీ, గతంలో కొన్ని దేశాలు నోట్ల రద్దు చేసి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి.
దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఆరేళ్లు దాటింది. ఈ నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిస్తూ డిమానిటైజేషన్ను సమర్థించింది. నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది. కానీ, గతంలో కొన్ని దేశాలు ఇదే పని చేసి ఆర్థిక సంక్షోభాన్ని కొనితెచ్చుకున్నాయి. ఆ దేశాలేవో తెలుసుకుందామా..
నైజీరియా
ఆఫ్రికా ఖండంలోని నైజీరియాలో 1984లో నోట్లను రద్దు చేశారు. అప్పటి ప్రభుత్వం కొత్త నోట్లను ప్రవేశపెట్టి.. పాత నోట్లను రద్దు చేసింది. కానీ, ఈ మార్పును దేశం స్వీకరించలేకపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
ఘనా
దేశీయ మార్కెట్లో అదనపు ద్రవ్యాన్ని తొలగించడానికి, పన్ను ఎగవేతల్ని అరికట్టేందుకు ఘనా ప్రభుత్వం 1982లో స్థానిక కరెన్సీలో 50 సెడిస్ నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలు బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించారు. స్థిరచరాస్తులు కూడబెట్టుకున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది.
పాకిస్థాన్
పొరుగుదేశం పాకిస్థాన్లో పాత నోట్లను రద్దు చేసి కొత్త డిజైన్ నోట్లను 2016లో ప్రవేశపెట్టారు. పాత నోట్లు 2016 డిసెంబర్ 1 తర్వాత చెల్లవని ప్రకటించారు. కానీ, వాటి చలామణీని 2022 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఇకపై పాత నోట్లు పాక్లో చెల్లుబాటు కావు.
జింబాబ్వే
దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడానికి 2008లో 100 ట్రిలియన్ డాలర్ నోటును ప్రవేశపెట్టారు. కానీ, ఆ నిర్ణయం మంచి ఫలితానివ్వలేదు. మరుసటి ఏడాదే ఆ దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే వాటిని రద్దు చేశారు. దీంతో ఆ నోటు విలువ 0.5 డాలర్కి పడిపోయింది. ఆ నోట్లను కొందరు ఆన్లైన్లో అమ్మకానికి కూడా పెట్టారు.
ఉత్తర కొరియా
ఈ దేశ అప్పటి అధ్యక్షుడు కిమ్ జోంగ్ 2.. 2010లో ఆకస్మికంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. దేశంలో చలామణిలో ఉన్న నోట్ల విలువలో రెండు సున్నాలు తొలగించారు. అంటే వంద విలువ ఒకటికి పడిపోయింది. పాత నోట్లను మార్పిడి చేసుకోవాలని ప్రజలను ఆదేశించారు. అధ్యక్షుడి నిర్ణయంతో ప్రజలు మరింత పేదవాళ్లయ్యారు.
సోవియట్ యూనియన్
సోవియట్ అధ్యక్షుడు మిఖైల్ గోర్బచేవ్ నల్లధనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో 1991లో పెద్దనోట్ల(50, 100 రుబెల్స్)ను రద్దు చేశారు. కానీ, ఆ నిర్ణయం ప్రజలకు ప్రతికూలంగా మారింది.
ఆస్ట్రేలియా
ఆసీస్ ప్రభుత్వం నకిలీ నోట్లను తొలగించడానికి పేపర్ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చింది. నోట్లను రద్దు చేయలేదు కానీ.. క్రమంగా నోట్ల మార్పిడి జరిగిపోయింది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సమస్యలు రాకపోవడం విశేషం.
మయన్మార్
దేశంలో నల్లధనం, అవినీతిని నిర్మూలించాలని అక్కడి మిలటరీ.. చలామణిలో ఉన్న డబ్బు విలువలో 80శాతం కోత విధించింది. దీంతో ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనల్లో అనేకమంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి.
కాంగో
ఈ దేశంలో 1887-1967 వరకు అక్కడి కరెన్సీగా ఫ్రాంక్స్ చలామణిలో ఉండేవి. ఆ తర్వాత జెయిర్గా మార్చారు. తిరిగి 1997లో జెయిర్ స్థానంలో ఫ్రాంక్స్ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో అక్కడి కరెన్సీ విలువలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. లక్ష న్యూ జెయిర్స్ ఒక ఫ్రాంక్తో సమానమైంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్