ఈ దేశాలూ నోట్ల రద్దు చేశాయి.. కానీ!
నోట్ల రద్దుతో భారత్ తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరగలేదు. కానీ, గతంలో కొన్ని దేశాలు నోట్ల రద్దు చేసి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి.
దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఆరేళ్లు దాటింది. ఈ నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిస్తూ డిమానిటైజేషన్ను సమర్థించింది. నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది. కానీ, గతంలో కొన్ని దేశాలు ఇదే పని చేసి ఆర్థిక సంక్షోభాన్ని కొనితెచ్చుకున్నాయి. ఆ దేశాలేవో తెలుసుకుందామా..
నైజీరియా
ఆఫ్రికా ఖండంలోని నైజీరియాలో 1984లో నోట్లను రద్దు చేశారు. అప్పటి ప్రభుత్వం కొత్త నోట్లను ప్రవేశపెట్టి.. పాత నోట్లను రద్దు చేసింది. కానీ, ఈ మార్పును దేశం స్వీకరించలేకపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.
ఘనా
దేశీయ మార్కెట్లో అదనపు ద్రవ్యాన్ని తొలగించడానికి, పన్ను ఎగవేతల్ని అరికట్టేందుకు ఘనా ప్రభుత్వం 1982లో స్థానిక కరెన్సీలో 50 సెడిస్ నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలు బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించారు. స్థిరచరాస్తులు కూడబెట్టుకున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది.
పాకిస్థాన్
పొరుగుదేశం పాకిస్థాన్లో పాత నోట్లను రద్దు చేసి కొత్త డిజైన్ నోట్లను 2016లో ప్రవేశపెట్టారు. పాత నోట్లు 2016 డిసెంబర్ 1 తర్వాత చెల్లవని ప్రకటించారు. కానీ, వాటి చలామణీని 2022 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఇకపై పాత నోట్లు పాక్లో చెల్లుబాటు కావు.
జింబాబ్వే
దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడానికి 2008లో 100 ట్రిలియన్ డాలర్ నోటును ప్రవేశపెట్టారు. కానీ, ఆ నిర్ణయం మంచి ఫలితానివ్వలేదు. మరుసటి ఏడాదే ఆ దేశాధ్యక్షుడు రాబర్ట్ ముగాబే వాటిని రద్దు చేశారు. దీంతో ఆ నోటు విలువ 0.5 డాలర్కి పడిపోయింది. ఆ నోట్లను కొందరు ఆన్లైన్లో అమ్మకానికి కూడా పెట్టారు.
ఉత్తర కొరియా
ఈ దేశ అప్పటి అధ్యక్షుడు కిమ్ జోంగ్ 2.. 2010లో ఆకస్మికంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. దేశంలో చలామణిలో ఉన్న నోట్ల విలువలో రెండు సున్నాలు తొలగించారు. అంటే వంద విలువ ఒకటికి పడిపోయింది. పాత నోట్లను మార్పిడి చేసుకోవాలని ప్రజలను ఆదేశించారు. అధ్యక్షుడి నిర్ణయంతో ప్రజలు మరింత పేదవాళ్లయ్యారు.
సోవియట్ యూనియన్
సోవియట్ అధ్యక్షుడు మిఖైల్ గోర్బచేవ్ నల్లధనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో 1991లో పెద్దనోట్ల(50, 100 రుబెల్స్)ను రద్దు చేశారు. కానీ, ఆ నిర్ణయం ప్రజలకు ప్రతికూలంగా మారింది.
ఆస్ట్రేలియా
ఆసీస్ ప్రభుత్వం నకిలీ నోట్లను తొలగించడానికి పేపర్ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చింది. నోట్లను రద్దు చేయలేదు కానీ.. క్రమంగా నోట్ల మార్పిడి జరిగిపోయింది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సమస్యలు రాకపోవడం విశేషం.
మయన్మార్
దేశంలో నల్లధనం, అవినీతిని నిర్మూలించాలని అక్కడి మిలటరీ.. చలామణిలో ఉన్న డబ్బు విలువలో 80శాతం కోత విధించింది. దీంతో ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనల్లో అనేకమంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి.
కాంగో
ఈ దేశంలో 1887-1967 వరకు అక్కడి కరెన్సీగా ఫ్రాంక్స్ చలామణిలో ఉండేవి. ఆ తర్వాత జెయిర్గా మార్చారు. తిరిగి 1997లో జెయిర్ స్థానంలో ఫ్రాంక్స్ను తీసుకొచ్చారు. ఈ క్రమంలో అక్కడి కరెన్సీ విలువలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. లక్ష న్యూ జెయిర్స్ ఒక ఫ్రాంక్తో సమానమైంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..