Wi Fi: వైఫై సృష్టి వెనుక అందాల హాలీవుడ్ తార!
ప్రస్తుతం మన జీవితాలు ఆన్లైన్తో ముడిపడి ఉన్నాయి. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు అన్నీ.. ఆన్లైన్లో చకచకా చేసుకోగలుతున్నాం. జీపీఎస్ ద్వారా కావాల్సిన ప్రాంతాలను సులువుగా గుర్తించగలుగుతున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇంటర్నెట్.. వైఫై సదుపాయం ఉండాలి
ప్రస్తుతం మన జీవితాలు ఆన్లైన్తో ముడిపడి ఉన్నాయి. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు అన్నీ.. ఆన్లైన్లో చకచకా చేసుకోగలుతున్నాం. జీపీఎస్ ద్వారా కావాల్సిన ప్రాంతాలను సులువుగా గుర్తించగలుగుతున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇంటర్నెట్.. వైఫై సదుపాయం ఉండాలి. అందుకే ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకొని కుటుంబసభ్యులంతా వైఫైతో మొబైల్/ల్యాప్ట్యాప్ వంటి డివైజ్లు వినియోగిస్తుంటారు. కేఫ్, రైల్వేస్టేషన్ వంటి పలుచోట్ల కూడా తప్పనిసరిగా వైఫై సదుపాయం ఉంటుంది. ఇదే లేకపోతే చాలా పనులు ఆగిపోయే పరిస్థితి. మరి ఇలాంటి సాంకేతికతను కనిపెట్టిందెవరో తెలుసా?ఏ శాస్త్రవేత్తనో కనిపెట్టి ఉంటారనుకుంటే పొరపాటే. దీన్ని కనిపెట్టింది ఓ సినీతార. హాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే.. మరోవైపు ఈ వైఫై టెక్నాలజీని కనిపెట్టారామె. కానీ, వెండితెర వెలుగుల్లో ఆమె సృష్టిని ఎవరూ గుర్తించలేకపోయారు.
ఎవరా సినీతార?
హెడీ లామర్.. హాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. వెండితెరపై ఆమె అందం.. అభినయం ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకునేది. అందుకే ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించాయి. కానీ, ఆమె ధ్యాసంతా సాంకేతికత మీద.. కొత్త ఆవిష్కరణలు చేయడంపై ఉండేది. ఆస్ట్రియాలో 1914లో జన్మించిన హెడీ 16 ఏళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించడం ప్రారంభించారు. 1933లో చెక్ రిపబ్లిక్ సినిమా ‘ఎక్స్టసీ’ చిత్రంలో నటించి స్టార్డమ్ సంపాదించారు. 1938లో ‘అల్జీర్స్’ చిత్రంతో హాలీవుడ్లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. హాలీవుడ్తోపాటు ఆస్ట్రియన్, జర్మన్, చెక్ భాషల సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా మారిపోయారు. అయినా ఏదో ఒకటి కనిపెట్టాలన్న కోరిక ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.
ఆలోచన పుట్టిందలా..
వ్యక్తిగత జీవితంలో హెడీ ఆరుగురిని వివాహం చేసుకుంది. మొదటి భర్త మాండిల్ ఆయుధాల తయారీ కంపెనీ యజమాని. దీంతో యుద్ధం.. ఆయుధాలకు సంబంధించిన అంశాలపై ఆమెకు ఆసక్తి పెరిగింది. కాగా.. హెడీ హాలీవుడ్లో తొలి సినిమా విడుదలైన మరుసటి ఏడాదే రెండో ప్రపంచయుద్ధం మొదలైంది. జర్మనీ, జపాన్, ఇటలీ ఒక కూటమిగా.. సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, బ్రిటన్ సహా అనేక దేశాలు మరో కూటమిగా.. యుద్ధంలోకి దిగాయి. అమెరికా ఆలస్యంగా యుద్ధంలో పాల్గొంది. అయితే యుద్ధం మొదలైన సమయంలో ఆమెకు హాలీవుడ్లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయుధాల తనిఖీ అధికారి అయిన జార్జ్ అంథీల్తో పరిచయం ఏర్పడింది. వారి మధ్య యుద్ధానికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చకు వచ్చేవి. ఈ క్రమంలోనే యుద్ధంలో రేడియో కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమైందో గుర్తించిన హెడీ.. శత్రువులపై దాడుల్లో టర్పిడోలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా లక్ష్యాన్ని నిర్దేశించడం కోసం ‘ఫ్రీక్వెన్సీ హోపింగ్’ టెక్నాలజీని ఆవిష్కరించారు.
ఏ విధంగా పనిచేస్తుంది?
టర్పిడోలలో రేడియో తరంగాల మధ్య ఈ ‘ఫ్రీక్వెన్సీ హోపింగ్’ కమ్యూనికేషన్ను ఉపయోగిస్తే, ట్రాన్స్మీటర్, రిసీవర్కి చెందిన రేడియో తరంగాలు ఇతర తరంగాల నుంచి జోక్యం/అంతరాయం లేకుండా క్యారియర్ ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ గమ్యానికి చేరుతాయి. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థకు హెడీ.. అంథీల్తో కలిసి పేటెంట్ హక్కులను సైతం సంపాదించారు. అయితే ఈ టెక్నాలజీని యుద్ధంలో ఉపయోగించమని హెడీ.. అమెరికా నేవీకి అందజేశారు. కానీ దీన్ని నేవీ ఉపయోగించలేదు. అయితే 1950లో సైన్యం సబ్మెరైన్లను గుర్తించడం కోసం ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించింది. 1962 నుంచి నౌకల్లోనూ దీన్ని వినియోగించడం మొదలుపెట్టింది.
ఇప్పుడెలా ఉపయోగపడుతుంది?
కంప్యూటర్.. ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో వైర్లెస్ ఇంటర్నెట్ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. అదే వైఫై. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక నెట్వర్క్ నుంచి వివిధ డివైజ్లకు వైఫై రూపంలో అనుసంధానం అవుతుంది. ఈ క్రమంలో రేడియో తరంగాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఫ్రీక్వెన్సీ హోపింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థే ఉపయోగపడుతోంది. ఈ టెక్నాలజీతోనే కాలక్రమంలో లోకల్ ఏరియా నెట్వర్క్(లాన్), వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వ్యవస్థలు ఆవిష్కృతమయ్యాయి. 1998లో తొలిసారి వైఫైను ఉపయోగించగా.. 2005 నుంచి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హెడీ 85 ఏళ్ల వయసులో 2000 జనవరి 19న కన్ను మూశారు. ‘ఫ్రీక్వెన్సీ హోపింగ్’ కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించినందుకుగానూ 2014లో హెడీ-అంథీల్ పేర్లను నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఫేమ్లో ఉంచారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్