Wi Fi: వైఫై సృష్టి వెనుక అందాల హాలీవుడ్ తార!
ప్రస్తుతం మన జీవితాలు ఆన్లైన్తో ముడిపడి ఉన్నాయి. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు అన్నీ.. ఆన్లైన్లో చకచకా చేసుకోగలుతున్నాం. జీపీఎస్ ద్వారా కావాల్సిన ప్రాంతాలను సులువుగా గుర్తించగలుగుతున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇంటర్నెట్.. వైఫై సదుపాయం ఉండాలి
ప్రస్తుతం మన జీవితాలు ఆన్లైన్తో ముడిపడి ఉన్నాయి. షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు అన్నీ.. ఆన్లైన్లో చకచకా చేసుకోగలుతున్నాం. జీపీఎస్ ద్వారా కావాల్సిన ప్రాంతాలను సులువుగా గుర్తించగలుగుతున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇంటర్నెట్.. వైఫై సదుపాయం ఉండాలి. అందుకే ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకొని కుటుంబసభ్యులంతా వైఫైతో మొబైల్/ల్యాప్ట్యాప్ వంటి డివైజ్లు వినియోగిస్తుంటారు. కేఫ్, రైల్వేస్టేషన్ వంటి పలుచోట్ల కూడా తప్పనిసరిగా వైఫై సదుపాయం ఉంటుంది. ఇదే లేకపోతే చాలా పనులు ఆగిపోయే పరిస్థితి. మరి ఇలాంటి సాంకేతికతను కనిపెట్టిందెవరో తెలుసా?ఏ శాస్త్రవేత్తనో కనిపెట్టి ఉంటారనుకుంటే పొరపాటే. దీన్ని కనిపెట్టింది ఓ సినీతార. హాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే.. మరోవైపు ఈ వైఫై టెక్నాలజీని కనిపెట్టారామె. కానీ, వెండితెర వెలుగుల్లో ఆమె సృష్టిని ఎవరూ గుర్తించలేకపోయారు.
ఎవరా సినీతార?
హెడీ లామర్.. హాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. వెండితెరపై ఆమె అందం.. అభినయం ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకునేది. అందుకే ఆమె నటించిన ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించాయి. కానీ, ఆమె ధ్యాసంతా సాంకేతికత మీద.. కొత్త ఆవిష్కరణలు చేయడంపై ఉండేది. ఆస్ట్రియాలో 1914లో జన్మించిన హెడీ 16 ఏళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించడం ప్రారంభించారు. 1933లో చెక్ రిపబ్లిక్ సినిమా ‘ఎక్స్టసీ’ చిత్రంలో నటించి స్టార్డమ్ సంపాదించారు. 1938లో ‘అల్జీర్స్’ చిత్రంతో హాలీవుడ్లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. హాలీవుడ్తోపాటు ఆస్ట్రియన్, జర్మన్, చెక్ భాషల సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా మారిపోయారు. అయినా ఏదో ఒకటి కనిపెట్టాలన్న కోరిక ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.
ఆలోచన పుట్టిందలా..
వ్యక్తిగత జీవితంలో హెడీ ఆరుగురిని వివాహం చేసుకుంది. మొదటి భర్త మాండిల్ ఆయుధాల తయారీ కంపెనీ యజమాని. దీంతో యుద్ధం.. ఆయుధాలకు సంబంధించిన అంశాలపై ఆమెకు ఆసక్తి పెరిగింది. కాగా.. హెడీ హాలీవుడ్లో తొలి సినిమా విడుదలైన మరుసటి ఏడాదే రెండో ప్రపంచయుద్ధం మొదలైంది. జర్మనీ, జపాన్, ఇటలీ ఒక కూటమిగా.. సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, బ్రిటన్ సహా అనేక దేశాలు మరో కూటమిగా.. యుద్ధంలోకి దిగాయి. అమెరికా ఆలస్యంగా యుద్ధంలో పాల్గొంది. అయితే యుద్ధం మొదలైన సమయంలో ఆమెకు హాలీవుడ్లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయుధాల తనిఖీ అధికారి అయిన జార్జ్ అంథీల్తో పరిచయం ఏర్పడింది. వారి మధ్య యుద్ధానికి సంబంధించిన ఎన్నో విషయాలు చర్చకు వచ్చేవి. ఈ క్రమంలోనే యుద్ధంలో రేడియో కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమైందో గుర్తించిన హెడీ.. శత్రువులపై దాడుల్లో టర్పిడోలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా లక్ష్యాన్ని నిర్దేశించడం కోసం ‘ఫ్రీక్వెన్సీ హోపింగ్’ టెక్నాలజీని ఆవిష్కరించారు.
ఏ విధంగా పనిచేస్తుంది?
టర్పిడోలలో రేడియో తరంగాల మధ్య ఈ ‘ఫ్రీక్వెన్సీ హోపింగ్’ కమ్యూనికేషన్ను ఉపయోగిస్తే, ట్రాన్స్మీటర్, రిసీవర్కి చెందిన రేడియో తరంగాలు ఇతర తరంగాల నుంచి జోక్యం/అంతరాయం లేకుండా క్యారియర్ ఫ్రీక్వెన్సీని మార్చుకుంటూ గమ్యానికి చేరుతాయి. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థకు హెడీ.. అంథీల్తో కలిసి పేటెంట్ హక్కులను సైతం సంపాదించారు. అయితే ఈ టెక్నాలజీని యుద్ధంలో ఉపయోగించమని హెడీ.. అమెరికా నేవీకి అందజేశారు. కానీ దీన్ని నేవీ ఉపయోగించలేదు. అయితే 1950లో సైన్యం సబ్మెరైన్లను గుర్తించడం కోసం ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించింది. 1962 నుంచి నౌకల్లోనూ దీన్ని వినియోగించడం మొదలుపెట్టింది.
ఇప్పుడెలా ఉపయోగపడుతుంది?
కంప్యూటర్.. ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో వైర్లెస్ ఇంటర్నెట్ సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. అదే వైఫై. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక నెట్వర్క్ నుంచి వివిధ డివైజ్లకు వైఫై రూపంలో అనుసంధానం అవుతుంది. ఈ క్రమంలో రేడియో తరంగాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఫ్రీక్వెన్సీ హోపింగ్ కమ్యూనికేషన్ వ్యవస్థే ఉపయోగపడుతోంది. ఈ టెక్నాలజీతోనే కాలక్రమంలో లోకల్ ఏరియా నెట్వర్క్(లాన్), వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వ్యవస్థలు ఆవిష్కృతమయ్యాయి. 1998లో తొలిసారి వైఫైను ఉపయోగించగా.. 2005 నుంచి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హెడీ 85 ఏళ్ల వయసులో 2000 జనవరి 19న కన్ను మూశారు. ‘ఫ్రీక్వెన్సీ హోపింగ్’ కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందించినందుకుగానూ 2014లో హెడీ-అంథీల్ పేర్లను నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఫేమ్లో ఉంచారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?