Nato : విస్తరిస్తోంది చూడు.. నాటో.. నాటో..
రష్యాతో (Russia) ఎటువంటి ప్రాదేశిక తగాదాలు లేని ఫిన్లాండ్ (Finland) తాజాగా 31వ సభ్య దేశంగా నాటోలో (Nato) చేరింది. ఈ నేపథ్యంలో నాటో అంటే ఏంటీ? దాని ఉనికి ఏ విధంగా మొదలైందో తెలుసుకోండి.
ఉక్రెయిన్ (Russia-ukraine)పై రష్యా దండయాత్ర కారణంగా ఈ మధ్య కాలంలో నాటో (Nato) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉక్రెయిన్ (Ukraine) నాటోలో చేరడానికి ఆసక్తి చూపడమే యుద్ధానికి అసలు కారణం. ఈ యుద్ధం కొనసాగుతుండగానే రష్యా (Russia) సరిహద్దు దేశం ఫిన్లాండ్ (Finland) నాటోలో (Nato) సభ్యత్వం పొందింది. సభ్యత్వం కోసం మరో దేశం స్వీడన్ (Sweden) ఎదురు చూస్తోంది. ఐరోపా సమాఖ్యలోని (European union) కీలక దేశం ఫిన్లాండ్ నాటో సైనిక కూటమిలో చేరడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి రష్యాతో ఫిన్లాండ్కు 1,340 కి.మీ. సరిహద్దు కలిగి ఉండటమే కారణం. ఈ సరిహద్దు ఇప్పుడు నాటోకు అందుబాటులోకి రావడం రష్యా భద్రతకు పెనుసవాలుగా మారనుంది.
నాటో ఎలా ఏర్పాటైంది?
రెండో ప్రపంచ యుద్ధం (1939-45) అనంతరం తూర్పు యూరప్లోని చాలా ప్రాంతాల నుంచి సోవియట్ సేనలు వైదొలగేందుకు నిరాకరించాయి. 1948లో బెర్లిన్ను పూర్తిగా చుట్టుముట్టాయి. దీంతో సోవియట్ను కట్టడి చేయడానికి కూటమిగా ఏర్పడాలని 12 దేశాలు భావించాయి. ఇదిలా ఉంటే.. యుద్ధంతో చితికిపోయిన చాలా ఐరోపా దేశాలు ఆర్థికంగా, భద్రతాపరంగా నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడుతున్నాయి. పరిశ్రమలు స్థాపించడానికి, ఆహారోత్పత్తి పెంపొందించడానికి వాటికి భారీగా నిధుల అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఐరోపాను బలోపేతం చేసి కమ్యూనిస్టు పాలన విస్తరించకుండా చేయాలని అమెరికా పావులు కదిపింది. 1948లో అమెరికా మార్షల్ ప్లాన్ను రూపొందించింది. సెక్రటరీ జార్జ్ మార్షల్ ప్రతిపాదించిన మేరకు భారీ ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ చర్య అమెరికా, ఐరోపాలోని కొన్ని దేశాల మధ్య బంధాన్ని బలపరచింది. మరో వైపు సోవియట్ యూనియన్ ఈ సహాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తూర్పు ఐరోపాలో తన ఆధీనంలో ఉన్న దేశాలను ఈ సహాయం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య తూర్పు, పశ్చమ ఐరోపా విభజనకు కారణమైంది. సోవియట్ యూనియన్ నుంచి పశ్చిమ ఐరోపా దేశాలకు సామూహిక భద్రత అందించడానికి యునైటెడ్ స్టేట్స్ చొరవతో 1949లో ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’ నాటో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంటుంది. అప్పటి నుంచి ఇది రాజకీయ, సైనిక మార్గాల ద్వారా తమ సభ్య దేశాల స్వేచ్ఛ, భద్రతను కాపాడుతోంది.
సభ్య దేశాలివీ..
నాటోలో తొలుత బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యూకే, యూఎస్ సభ్య దేశాలుగా చేరాయి. తరువాత దశల వారీగా గ్రీస్, టర్కీ, వెస్ట్ జర్మనీ(1990 తరువాత నుంచి జర్మనీ), బల్గేరియా, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, రొమేనియా, స్లొవేకియా, స్లొవేనియా, అల్బేనియా, క్రొయేషియా, మాంటెనిగ్రో, నార్త్ మాసిడోనియా, చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలండ్, స్పెయిన్, చేతులు కలిపాయి. ఫ్రాన్స్ సభ్యదేశంగా ఉంటూనే సమీకృత మిలటరీ కమాండ్ నుంచి 1966లో వైదొలిగింది. 2009లో మళ్లీ పూర్తి స్థాయిలో భాగమైంది. తాజాగా నాటో జాబితాలోకి ఫిన్లాండ్ చేరింది. ఈ దేశాలు మొత్తం సమష్టిగా భద్రతా బాధ్యతలను పంచుకొంటాయి. ఒక నాటో సభ్యదేశంపై దాడి జరిగితే అన్ని సభ్యదేశాలపై దాడిగా పరిగణిస్తారు. అంతా కలిసి ఆ దురాక్రమణదారుపై విరుచుకుపడతారు.
పరిపాలన-మిలటరీ
నాటో ఏర్పాటైన తరువాత పరిపాలన వ్యవహారాలు, మిలటరీ వ్యవహారాలు చూడటానికి వేర్వేరు విభాగాలు ఏర్పడ్డాయి. నాటో ప్రతినిధులతో నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్, న్యూక్లియర్ ప్లానింగ్ గ్రూప్ ఏర్పాటైంది. కౌన్సిల్ సూచన మేరకు ‘సుప్రీం అలైడ్ కమాండర్ యూరప్’ ఏర్పాటైంది. ఇది నాటోలో రెండవ అత్యున్నత సైనిక స్థానం. దీనికి అమెరికన్ నేతృత్వం వహిస్తారు. సెక్రటరీ జనరల్గా యూరోపియన్ కొనసాగుతారు. నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్లో సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు మంత్రివర్గ సభ్యులుగా ఉంటారు. వీరంతా ఏడాదికి రెండు సార్లు తప్పకుండా సమావేశమవుతారు. ఇతర సమాయాల్లో నాటో సెక్రటరీ జనరల్ అధ్యక్షత వహిస్తూ రాయబారుల స్థాయిలో శాశ్వత సమావేశాలు నిర్వహిస్తుంటారు.
మిలటరీ వ్యవహారాల కమిటీలో సభ్యదేశాల మిలటరీ ఉన్నతాధికారులు ఉంటారు. ఇందులోనూ రెండు విభాగాలున్నాయి. ఒకటి అలైడ్ కమాండ్ ఆపరేషన్స్(ఏసీవో), రెండోది అలైడ్ కమాండ్ ట్రాన్స్ఫార్మేషన్(ఏసీటీ). ‘ఏసీవో’కు ‘సుప్రీం అలైడ్ కమాండర్ యూరప్’ అధ్యక్షుడిగా ఉంటారు. ఇది బెల్జియంలోని ‘సుప్రీం హెడ్ క్వార్టర్స్ అలెడ్ పవర్స్ యూరప్(షేప్)లో ఉంటుంది.
అపారమైన సైనిక శక్తి
నాటోకు అపారమైన సైనికశక్తి ఉంది. మొత్తం సైనికుల సంఖ్య 33 లక్షలు. వీరిలో 8లక్షల మంది యాక్టివ్ దళాలు. ఇందులో అమెరికా సైనికులు 13 లక్షల దాకా ఉన్నారు. నాటోలోని 30 సభ్యదేశాలు 2021లో 1,174 బిలియన్ డాలర్లను సైన్యంపై ఖర్చుపెట్టాయి. 2020లో ఈ బడ్జెట్ 1,106 బిలియన్ డాలర్లుగా ఉంది. దాదాపు 40 వేల నాటో సైనికులు ఎల్లవేళలా పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు.
రష్యా ‘వార్సా ఒప్పందం’
1950లో జరిగిన పారిస్ ఒప్పందం ద్వారా పశ్చిమ జర్మనీకి సభ్యత్వం ఇచ్చేందుకు నాటో అంగీకరించింది. ఈ చర్య సోవియట్ యూనియన్కు మింగుడుపడలేదు. దాంతో మధ్య, తూర్పు ఐరోపా దేశాలతో కలిసి ‘వార్సా ఒప్పందం’ కూటమిని తయారు చేసింది. దీన్ని అధికారికంగా ‘వార్సా ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్’ అని పిలుస్తుంటారు. ఇందులో అల్బేనియా, బల్గేరియా, చెకోస్లోవేకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలండ్, రొమేనియా సభ్య దేశాలుగా చేరాయి. 1968లో అల్బేనియా, 1990లో తూర్పు జర్మనీ ఇందులో నుంచి బయటకు వచ్చాయి. 1989 నాటికి తూర్పు ఐరోపాలో ప్రజాస్వామ్య విప్లవాలు ఊపందుకున్నాయి. దాంతో 1991 జులై 1 నాటికి వార్సా ప్రస్థానం ముగిసిపోయింది. అదే ఏడాది డిసెంబర్ 26న సోవియట్ పతనమైంది. మొత్తం 15 కొత్త దేశాలు ఆవిర్భవించాయి. అందులో ఉక్రెయిన్ కూడా ఒకటి. కొన్ని దేశాలు స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. మరికొన్ని అమెరికా ప్రోద్బలంతో నాటోలో చేరాయి. అప్పటి నుంచి రష్యా ఒంటరైపోయింది.
నాటో-రష్యా కస్సుబుస్సులు
నాటో చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా రష్యాకు కంటగింపుగా ఉంటుంది. ముఖ్యంగా నాటో తూర్పు దిశగా విస్తరించడాన్ని రష్యా అంగీకరించడం లేదు. తమ సరిహద్దు దేశాలను నాటోలో చేర్చుకోవడం కూడా రష్యా, నాటోకు మధ్య శత్రుత్వం పెంచుతోంది. నాటో-రష్యాకు మధ్య జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలివి..
- 1994లో రష్యా, నాటోతో శాంతి స్థాపన కార్యక్రమంలో చేతులు కలిపింది.
- 2002లో రష్యా-నాటో కౌన్సిల్ ఏర్పాటైంది. భద్రతాపరమైన సవాళ్లు, ఇతర ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
- 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకోవడంతో నాటో.. రష్యాకు ఇతర సహకారాలను నిరాకరించింది. కానీ, రష్యా-నాటో కౌన్సిల్ మాత్రం రద్దు కాలేదు.
- 2021లో బ్రసెల్స్ నుంచి 8 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించారు.
- 2022లో ఉక్రెయిన్ను నాటోలో చేరే ప్రయత్నాలు ముమ్మరం చేయడం రష్యాకు ఆగ్రహం తెప్పించింది. దాంతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు