Cell phone : సెల్ఫోన్ కనిపెట్టాడు.. టిక్టాక్ గురించి తెలియదన్నాడు!
నిత్యం మనం వాడుతున్న సెల్ఫోన్ సృష్టికర్త దాని గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్(telephone) కనిపెట్టాడని చాలా మందికి తెలుసుంటుంది. ఇప్పుడు టెలిఫోన్ వాడకం బాగా తగ్గింది. పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరి చేతుల్లోనూ సెల్ఫోనే(cell phone) ఉంది. మరి ఆ సెల్ఫోన్ ఎవరు కనిపెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనే మార్టిన్ కూపర్. ‘ఫాదర్ ఆఫ్ ద సెల్ఫోన్’గా ఖ్యాతి గడించారు.
ఎవరీ మార్టిన్ కూపర్?
మార్టిన్ కూపర్ 1928లో చికాగో(chicago)లో జన్మించారు. ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. అనంతరం యూఎస్ నేవీలో చేరారు. కొరియా యుద్ధం(Korean War)లో పాల్గొని దేశానికి సేవ చేశారు. ఆ యుద్ధం ముగిసిన తరువాత ఆయన టెలిటైప్ కార్పొరేషన్లో చేరారు. అటు నుంచి 1954లో మోటరోలా(motorola)లో చేరి తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాతి కాలంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మాస్టర్స్ పట్టా పొందారు. మోటరోలాలో పని చేసే కాలంలో కూపర్ ఎన్నో ఆవిష్కరణలు చేశారు. వైర్లైస్ కమ్యూనికేషన్ల(wireless communication) అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. అందులో రేడియో కంట్రోల్ ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఒకటి. 1960లో ఆ ఆవిష్కరణకు సంబంధించిన పేటెంట్ హక్కును మార్టిన్ పొందారు. 1967 నాటికి పోలీసులు(police) చేతితో పట్టుకుని ఉపయోగించేందుకు అనువైన రేడియో కనిపెట్టారు. మెరుగైన పనితీరు కనబర్చడంతో ఆయనకు అనతి కాలంలోనే కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టరు, ఉపాధ్యక్షుడి హోదా దక్కింది.
ముందే కారు ఫోన్లు..
నిజానికి 1946లోనే అమెరికా టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్(ఏటీటీ) కంపెనీ కారు ఫోన్లను(car phones) ప్రవేశపెట్టింది. అంటే కార్లకు ఫోన్ను అనుసంధానం చేసేవారు. దగ్గర్లోని రేడియో సిగ్నల్ సహాయంతో అవి పనిచేసేవి. కానీ, అందులో 11 నుంచి 12 ఛానళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. దాంతో వాటిని ఉపయోగించాలంటే యూజర్లు ఎక్కువ సేపు వేచి చూడాల్సి వచ్చేది. పైగా ఆ ఫోన్లకు ఎక్కువగా విద్యుత్తు అవసరం. వాటిని కారు బ్యాటరీలకు అనుసంధానం చేసేవారు. అందువల్ల వాటిని పోర్టబుల్ ఫోన్గా కాకుండా.. కార్ ఫోన్గానే పరిగణించేవారు. కార్ ఫోన్ కనిపెట్టడంతో టెలికాం(telecom) రంగంలో చాలా ఏళ్లు ఏటీటీ ఆధిపత్యమే నడిచింది. ఆ కంపెనీకి అడ్డుకట్ట వేయాలని భావించిన మోటరోలా సెల్ఫోన్ల అభివృద్ధికి ఓ కొత్త ప్రాజెక్టును చేపట్టింది. దానికి మార్టిన్ కూపర్ను ఇన్ఛార్జిగా నియమించింది.
ఫోన్ మన వెంట రావాలి!
కొత్త ప్రాజెక్టు చేపట్టిన మార్టిన్ తాను తయారు చేయబోయే ఫోన్.. డెస్క్, ఇల్లు, ప్రదేశం ఇలా ఒక చోట మాత్రమే ఉండకూడదని భావించారు. ఎక్కడికెళ్లినా ఫోన్ మన వెంట వచ్చే విధంగా దాన్ని మార్చాలని సంకల్పించారు. ఆ ఆలోచన ఫలితమే ‘డైనమిక్ అడాప్టివ్ టోటల్ ఏరియా కవరేజి’ ఫోన్. 23 సెంటీమీటర్ల పొడవైన ఆ ఫోన్ 1.1 కేజీ బరువుండేది. 35 నిమిషాలపాటు మాట్లాడేలా దాని బ్యాటరీని రూపొందించారు. ఆ ఫోన్ను మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న మీడియా ముందు ప్రవేశపెట్టారు. దాంతో తమకు పోటీ కంపెనీ ఏటీటీ హెడ్, ఇంజినీర్ జోయల్ ఏంజెల్కు ఫోన్ చేశారు. ‘జోయల్ నేను మార్టీ.. ఒక పోర్టబుల్ సెల్యులార్ ఫోన్ నుంచి నీతో మాట్లాడుతున్నానని’ సంతోషంగా అవతలి వ్యక్తికి చెప్పి సంచలనం సృష్టించారు. నిజానికి మార్టిన్కు పోర్టబుల్ ఫోన్ను తయారు చేయాలనే ఆలోచన పత్రికల్లో వచ్చిన ‘డిక్ ట్రాసీ’ చేతి గడియారం చూసిన తరువాత వచ్చిందట. 1983 నాటికి పోర్టబుల్ ఫోన్ను మోటరోలా మరింత అభివృద్ధి చేసి దానికి DynaTAC 8000xగా పేరు పెట్టి మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటికి దాని ఖరీదు 3,995 డాలర్లు. మన భారతీయ కరెన్సీలో రూ.3 లక్షలకు పైగానే ఉంటుంది. అయినా కూడా ఆ ఫోన్కు వినియోగదారుల్లో ఆదరణ లభించింది. మార్టిన్ కూపర్ కృషితో మోటరోలా అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. ఆ మరుసటి ఏడాదే కూపర్ మోటరోలాను వీడి సొంతంగా కొన్ని కంపెనీలను స్థాపిస్తూ తన వ్యాపార ప్రయాణం సాగించారు. వైర్లైస్ రంగం అభివృద్ధిలో మార్టిన్ కూపర్ సేవలకుగానూ అనేక అవార్డులు వరించాయి. 2013లో ఆయనకు ఛార్లెస్ స్టార్క్ డ్రాపర్ ప్రైజ్ దక్కింది.
వద్దు.. మితిమీరొద్దు
‘ఫాదర్ ఆఫ్ సెల్ఫోన్’గా ఖ్యాతిగాంచిన మార్టిన్ కూపర్ ప్రస్తుతం ప్రపంచం సెల్ఫోన్ వాడుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల స్పెయిన్లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సాంకేతికత కారణంగా యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని మార్టిన్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలకు ఎక్కువ మంది బానిసలు కావడం కూడా ఆందోళన కలిగించే అంశమేనని చెప్పారు. యూజర్లు సెల్ఫోన్ల వాడకంపై సమయాన్ని తగ్గించి సాధారణ జీవనంపై దృష్టి సారించాలన్నారు. పిల్లలను సెల్ఫోన్లకు బానిసలను చేయడం మంచి పద్ధతి కాదన్నారు. గడిచిన దశాబ్దాల్లో మొబైల్ రంగం అభివృద్ధిపై పెట్టినంత దృష్టిని.. పరిశోధకులు విద్య, ఆరోగ్యరంగంపై కేటాయిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సెల్ఫోన్ కనిపెట్టిన తనకు ఇప్పటికీ చాలా విషయాలు తెలియవని అందులో ‘టిక్టాక్’ ఒకటని ఆయన చమత్కరించారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం