Cell phone : సెల్ఫోన్ కనిపెట్టాడు.. టిక్టాక్ గురించి తెలియదన్నాడు!
నిత్యం మనం వాడుతున్న సెల్ఫోన్ సృష్టికర్త దాని గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్(telephone) కనిపెట్టాడని చాలా మందికి తెలుసుంటుంది. ఇప్పుడు టెలిఫోన్ వాడకం బాగా తగ్గింది. పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరి చేతుల్లోనూ సెల్ఫోనే(cell phone) ఉంది. మరి ఆ సెల్ఫోన్ ఎవరు కనిపెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనే మార్టిన్ కూపర్. ‘ఫాదర్ ఆఫ్ ద సెల్ఫోన్’గా ఖ్యాతి గడించారు.
ఎవరీ మార్టిన్ కూపర్?
మార్టిన్ కూపర్ 1928లో చికాగో(chicago)లో జన్మించారు. ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. అనంతరం యూఎస్ నేవీలో చేరారు. కొరియా యుద్ధం(Korean War)లో పాల్గొని దేశానికి సేవ చేశారు. ఆ యుద్ధం ముగిసిన తరువాత ఆయన టెలిటైప్ కార్పొరేషన్లో చేరారు. అటు నుంచి 1954లో మోటరోలా(motorola)లో చేరి తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాతి కాలంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మాస్టర్స్ పట్టా పొందారు. మోటరోలాలో పని చేసే కాలంలో కూపర్ ఎన్నో ఆవిష్కరణలు చేశారు. వైర్లైస్ కమ్యూనికేషన్ల(wireless communication) అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. అందులో రేడియో కంట్రోల్ ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఒకటి. 1960లో ఆ ఆవిష్కరణకు సంబంధించిన పేటెంట్ హక్కును మార్టిన్ పొందారు. 1967 నాటికి పోలీసులు(police) చేతితో పట్టుకుని ఉపయోగించేందుకు అనువైన రేడియో కనిపెట్టారు. మెరుగైన పనితీరు కనబర్చడంతో ఆయనకు అనతి కాలంలోనే కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టరు, ఉపాధ్యక్షుడి హోదా దక్కింది.
ముందే కారు ఫోన్లు..
నిజానికి 1946లోనే అమెరికా టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్(ఏటీటీ) కంపెనీ కారు ఫోన్లను(car phones) ప్రవేశపెట్టింది. అంటే కార్లకు ఫోన్ను అనుసంధానం చేసేవారు. దగ్గర్లోని రేడియో సిగ్నల్ సహాయంతో అవి పనిచేసేవి. కానీ, అందులో 11 నుంచి 12 ఛానళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. దాంతో వాటిని ఉపయోగించాలంటే యూజర్లు ఎక్కువ సేపు వేచి చూడాల్సి వచ్చేది. పైగా ఆ ఫోన్లకు ఎక్కువగా విద్యుత్తు అవసరం. వాటిని కారు బ్యాటరీలకు అనుసంధానం చేసేవారు. అందువల్ల వాటిని పోర్టబుల్ ఫోన్గా కాకుండా.. కార్ ఫోన్గానే పరిగణించేవారు. కార్ ఫోన్ కనిపెట్టడంతో టెలికాం(telecom) రంగంలో చాలా ఏళ్లు ఏటీటీ ఆధిపత్యమే నడిచింది. ఆ కంపెనీకి అడ్డుకట్ట వేయాలని భావించిన మోటరోలా సెల్ఫోన్ల అభివృద్ధికి ఓ కొత్త ప్రాజెక్టును చేపట్టింది. దానికి మార్టిన్ కూపర్ను ఇన్ఛార్జిగా నియమించింది.
ఫోన్ మన వెంట రావాలి!
కొత్త ప్రాజెక్టు చేపట్టిన మార్టిన్ తాను తయారు చేయబోయే ఫోన్.. డెస్క్, ఇల్లు, ప్రదేశం ఇలా ఒక చోట మాత్రమే ఉండకూడదని భావించారు. ఎక్కడికెళ్లినా ఫోన్ మన వెంట వచ్చే విధంగా దాన్ని మార్చాలని సంకల్పించారు. ఆ ఆలోచన ఫలితమే ‘డైనమిక్ అడాప్టివ్ టోటల్ ఏరియా కవరేజి’ ఫోన్. 23 సెంటీమీటర్ల పొడవైన ఆ ఫోన్ 1.1 కేజీ బరువుండేది. 35 నిమిషాలపాటు మాట్లాడేలా దాని బ్యాటరీని రూపొందించారు. ఆ ఫోన్ను మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న మీడియా ముందు ప్రవేశపెట్టారు. దాంతో తమకు పోటీ కంపెనీ ఏటీటీ హెడ్, ఇంజినీర్ జోయల్ ఏంజెల్కు ఫోన్ చేశారు. ‘జోయల్ నేను మార్టీ.. ఒక పోర్టబుల్ సెల్యులార్ ఫోన్ నుంచి నీతో మాట్లాడుతున్నానని’ సంతోషంగా అవతలి వ్యక్తికి చెప్పి సంచలనం సృష్టించారు. నిజానికి మార్టిన్కు పోర్టబుల్ ఫోన్ను తయారు చేయాలనే ఆలోచన పత్రికల్లో వచ్చిన ‘డిక్ ట్రాసీ’ చేతి గడియారం చూసిన తరువాత వచ్చిందట. 1983 నాటికి పోర్టబుల్ ఫోన్ను మోటరోలా మరింత అభివృద్ధి చేసి దానికి DynaTAC 8000xగా పేరు పెట్టి మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటికి దాని ఖరీదు 3,995 డాలర్లు. మన భారతీయ కరెన్సీలో రూ.3 లక్షలకు పైగానే ఉంటుంది. అయినా కూడా ఆ ఫోన్కు వినియోగదారుల్లో ఆదరణ లభించింది. మార్టిన్ కూపర్ కృషితో మోటరోలా అభివృద్ధి పథంలో దూసుకెళ్లింది. ఆ మరుసటి ఏడాదే కూపర్ మోటరోలాను వీడి సొంతంగా కొన్ని కంపెనీలను స్థాపిస్తూ తన వ్యాపార ప్రయాణం సాగించారు. వైర్లైస్ రంగం అభివృద్ధిలో మార్టిన్ కూపర్ సేవలకుగానూ అనేక అవార్డులు వరించాయి. 2013లో ఆయనకు ఛార్లెస్ స్టార్క్ డ్రాపర్ ప్రైజ్ దక్కింది.
వద్దు.. మితిమీరొద్దు
‘ఫాదర్ ఆఫ్ సెల్ఫోన్’గా ఖ్యాతిగాంచిన మార్టిన్ కూపర్ ప్రస్తుతం ప్రపంచం సెల్ఫోన్ వాడుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల స్పెయిన్లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సాంకేతికత కారణంగా యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని మార్టిన్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలకు ఎక్కువ మంది బానిసలు కావడం కూడా ఆందోళన కలిగించే అంశమేనని చెప్పారు. యూజర్లు సెల్ఫోన్ల వాడకంపై సమయాన్ని తగ్గించి సాధారణ జీవనంపై దృష్టి సారించాలన్నారు. పిల్లలను సెల్ఫోన్లకు బానిసలను చేయడం మంచి పద్ధతి కాదన్నారు. గడిచిన దశాబ్దాల్లో మొబైల్ రంగం అభివృద్ధిపై పెట్టినంత దృష్టిని.. పరిశోధకులు విద్య, ఆరోగ్యరంగంపై కేటాయిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సెల్ఫోన్ కనిపెట్టిన తనకు ఇప్పటికీ చాలా విషయాలు తెలియవని అందులో ‘టిక్టాక్’ ఒకటని ఆయన చమత్కరించారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి