Xi Jinping: గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి.. ఏడేళ్లు గుహలోనే నివసించి.. ఇదీ జిన్పింగ్ ప్రస్థానం!
చైనా (China) అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన షి జిన్పింగ్ (Xi Jinping).. పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. పార్టీలో కీలక స్థానంలో పనిచేసిన తన తండ్రి జైలు పాలైనప్పటికీ పార్టీపట్ల నిబద్ధత కొనసాగించారు. 2012లో చైనా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టి.. శక్తిమంతమైన నేతగా ఎదిగారు.
బీజింగ్: చైనా (China) అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన షీ జిన్పింగ్ (Xi Jinping) సరికొత్త చరిత్ర సృష్టించారు. 2012లో చైనా పాలనా పగ్గాలు చేపట్టిన జిన్పింగ్.. మరో ఐదేళ్లు దేశాధ్యక్షుడి బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఓ ప్రముఖ గాయకురాలి భర్తగా బాహ్యప్రపంచానికి పరిచయమైన జిన్పింగ్.. శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా ఎదిగారు. ఒకప్పుడు పార్టీ సభ్యత్వానికే చుక్కెదురైన పరిస్థితుల నుంచి.. చైనాను సుదీర్ఘ కాలం పాలించే స్థితికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఆయనకు ఎదురైన సవాళ్లు.. సంస్కరణల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో జిన్పింగ్ గడిపిన విషయాలను ఓసారి పరిశీలిస్తే..
జిన్పింగ్ 1953లో బీజింగ్లో జన్మించారు. ఆయన తండ్రి షి ఝేంగ్షన్ చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలక స్థానంలో పనిచేశారు. అయితే, పార్టీ ప్రక్షాళనలో భాగంగా అప్పటి అధ్యక్షుడు మావో తీసుకున్న నిర్ణయాలతో 1968లో ఝోంగ్షన్ పదవిని కోల్పోయారు. తిరుగుబాటుకు కారణమవుతారని ఊహించి అటువంటి నేతలందర్నీ మావో జెడాంగ్ జైల్లో పెట్టించారు. దీంతో పార్టీలో వైస్ ప్రీమియర్ స్థానంలో ఉన్న ఝెంగ్షన్ జైలుకు వెళ్లడంతో.. జిన్పింగ్ కుటుంబం కష్టాలపాలయ్యింది. ఆ సమయంలో వారు ఎన్నో అవమానాలు భరించారు. స్నేహితులు కూడా జిన్పింగ్ను దూరం పెట్టడంతో ఎంతో వేదనకు గురయ్యారు. అప్పటికి జిన్పింగ్ వయసు 15 ఏళ్లు.
గుహలో నివసించి..
1960ల్లో సాంస్కృతిక విప్లవం పేరుతో (రీ-ఎడ్యుకేషన్) ప్రముఖుల పిల్లల్ని నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు పంపించారు. దీంతో వేల మంది చైనా నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే జిన్పింగ్ కూడా తన కుటుంబంతో కలిసి షాన్షీ ప్రావిన్సులోని కొండప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామం లియాంగ్జియాహెకు వెళ్లారు. అక్కడున్న ఓ గుహలో ఇల్లు మాదిరిగా ఉన్న ప్రాంతంలోనే ఏడేళ్లు నివసించారు. గ్రామీణ ప్రజలు, పేదలతో కలిసి పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయం తన జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని జిన్పింగ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ప్రస్తుతం ఆ గ్రామం పర్యాటక ప్రదేశంగా మారింది.
ప్రముఖ సింగర్తో రెండో వివాహం..
1970ల్లో మావో మరణం తర్వాత జైలు నుంచి విడుదలైన ఝేంగ్షన్.. పార్టీలో జిన్పింగ్కు సముచిత స్థానం కల్పించేందుకు దోహదం చేశారని చెబుతుంటారు. జిన్పింగ్ తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. అనంతరం గాయనిగా పేరొందిన పెంగ్ లియువాన్ను 1987లో వివాహం చేసుకున్నారు. అప్పట్లో జిన్పింగ్ కంటే ఆయన భార్యకే సెలెబ్రిటీగా ఎక్కువ పేరుంది.
అంచెలంచెలుగా ఎదిగి..
తన కుటుంబం సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. సీసీపీ(చైనా కమ్యూనిస్ట్ పార్టీ) పట్ల జిన్పింగ్ తన నిబద్ధతను కొనసాగించారు. పార్టీలో సభ్యత్వం కోసం ప్రయత్నించినప్పటికీ కుటుంబ నేపథ్యం (తండ్రి జైలుకు వెళ్లడం) కారణంగా పలుసార్లు తిరస్కరణకు గురయ్యింది. చివరకు 1974లో ఓ గ్రామానికి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై.. పార్టీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 1999లో ఫుజియన్ ప్రావిన్సు గవర్నర్గా, 2002లో జెజియాంగ్ ప్రావిన్సు చీఫ్గా, 2007లో షాంఘై బాధ్యతల్లో కొనసాగారు. చివరకు పార్టీ నిర్ణయాల్లో కీలకమైన పొలిట్బ్యూరోలో 2007లో నియమితులయ్యారు. ఐదేళ్ల తర్వాత (2012లో) హు జింటావో స్థానంలో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా రెండు పర్యాయాల్లో ఎంతో శక్తిమంతమైన నేతగా ఎదిగిన జిన్పింగ్.. జీవితకాల అధినాయకుడిగా ఉండేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు