James wilson-Budget : బ్రిటిష్ ఖజానాకు గండి .. బడ్జెట్ రూపకల్పనకు జేమ్స్ విల్సన్ నాంది
భారత్లో తొలిసారి బ్రిటిష్ వలస పాలకులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సిపాయిల తిరుగుబాటు అందుకు కారణమైంది. బడ్జెట్ రూపకల్పన చేసేందుకు అప్పటి ఆర్థిక నిపుణుడు జేమ్స్ విల్సన్ ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో తెలుసుకోండి.
స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి భారత్లో బడ్జెట్(Budget) ప్రవేశపెడుతున్నారు. అయితే బ్రిటిష్ హయాంలో(british rule) దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని రూపకర్త ఎవరు? ఆయన ఎలాంటి విధానాలతో భారత తొలి బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారో చదివేయండి మరి.
1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉలికిపాటుకు గురి చేసింది. సాఫీగా సాగిపోతున్న బ్రిటిష్ పాలనకు అదో కంటగింపు చర్యగా మారింది. ఆ తర్వాత నుంచి తిరుగుబాటుదారులను అణచివేయడానికి బ్రిటిష్ ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయానికి బాగా గండి పడింది. ఈ నేపథ్యంలో భారత(india) ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి 1859వ సంవత్సరంలో క్వీన్ విక్టోరియా(queen victoria).. జేమ్స్ విల్సన్(james wilson) అనే ఆర్థిక నిపుణుడిని నియమించింది. అప్పటికే ఆయన ఎకనామిస్ట్ పత్రికను నడిపేవాడు. ఆర్థిక సిద్ధాంతాలు, పాలసీలపై ఆయనకు బాగా పట్టు ఉండేది. వాణిజ్య వ్యవహారాలపై విల్సన్కు అపార జ్ఞానం ఉందని ఇంగ్లాండ్(england) విశ్వసించేది. కారల్ మార్క్స్ తాను రచించిన ‘క్యాపిటల్’ గ్రంథంలో విల్సన్ను ‘యాన్ ఎకనామిక్ మాండరిన్ ఆఫ్ హై స్టాండింగ్’గా అభివర్ణించాడు.
ఎవరీ జేమ్స్ విల్సన్?
జేమ్స్ విల్సన్ స్కాట్లాండ్లోని హావిక్ పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. కుటుంబం మొత్తం టోపీలు తయారు చేసి విక్రయించేవారు. జేమ్స్కు న్యాయశాస్త్రం చదవాలని ఆసక్తి ఉండేది. కానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా టోపీల వ్యాపారానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూస్తూనే జేమ్స్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పుస్తకాలు చదివేవాడు. వ్యాపార నిమిత్తం 1824లో లండన్కు మకాం మార్చాడు. అక్కడ వ్యాపారులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ.. కార్న్ చట్టాలను తొలగించాలని కరపత్రాల ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించేవాడు. స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అడ్డంకులు ఉండకూడదని అనేక వ్యాసాలను రచించాడు. ఆ క్రమంలోనే ఎకనామిస్ట్ పత్రికను స్థాపించాడు. వ్యాపారాన్ని వీడి పూర్తి సమయం పత్రికను నడిపేందుకు కేటాయించాడు. తరువాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు. హౌస్ ఆఫ్ కామన్స్కు ఎంపికయ్యాడు. జేమ్స్ పనితీరు నచ్చడంతో బ్రిటిష్ ప్రధాని జాన్ రస్సెల్ ఆయన్ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సెక్రటరీగా నియమించారు. ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగాడు.
భారత్లో ఆర్థిక పరిస్థితులు గతి తప్పిన నేపథ్యంలో జేమ్స్ విల్సన్ను వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆర్థిక సభ్యుడిగా నియమించారు. దాంతో అయిష్టంగానే విల్సన్ భారత్లోకి అడుగుపెట్టాడు. కోల్కతా నుంచి లాహోర్ వరకు ప్రయాణించి రెవెన్యూ అధికారులతో సమీక్ష చేసి భారత పరిస్థితులను అవగతం చేసుకున్నాడు. ఆర్థిక రంగం పురోగతి సాధించి.. పరిపాలన సాఫీగా సాగాలంటే ఐదు సంస్కరణలు చేయాలని భావించాడు.
అవేంటంటే.. 1. వ్యాపార వర్గాలపై పన్ను(tax) వేయడం 2. పేపర్ కరెన్సీ తీసుకురావడం 3. బడ్జెట్, అంచనాలను సిద్ధం చేయడం 4. సివిల్ పోలీసుల నియామకం 5. ప్రజా పనులు, రోడ్లు వేయడం. ఇవే కాకుండా మిలిటరీ ఫైనాన్స్ కమిషన్, సివిల్ ఫైనాన్స్ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని.. దాంతో నిధుల కేటాయింపు, ఖర్చులపై ఓ స్పష్టత వస్తుందని ఆశించాడు.
అప్పుడే తొలి బడ్జెట్
భారత దేశ వైవిధ్యం, ప్రజలు, ప్రాంతాల అవసరాలపై పట్టు సాధించిన జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ 7న తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో వివిధ డ్యూటీలను హేతుబద్ధీకరణ చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్, లైసెన్స్ ట్యాక్స్, టొబాకొ డ్యూటీ ఉంటాయని చెప్పాడు. ఐదేళ్లపాటు ట్యాక్సుల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాడు. అయితే జేమ్స్ ప్రతిపాదనలను అప్పటి మద్రాస్ గవర్నర్ ఛార్లెస్ ట్రెవెలియన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దాంతో లైసెన్స్ ట్యాక్స్, టొబాకొ డ్యూటీలపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
అలా భారత్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విల్సన్ 1860 ఆగస్టు 11వ తేదీన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 55 సంవత్సరాలు. కోల్కతాలోని ముల్లిక్ బజార్లోనే ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. భారత్లో ఆయన ఉన్నది ఎనిమిది నెలలే అయినప్పటికీ అంత్యక్రియలకు జనం భారీగా హాజరయ్యారు. విల్సన్ సేవలను కీర్తిస్తూ కోల్కతాలోని వ్యాపార వర్గాలు డల్హౌసీ ఇన్స్టిట్యూట్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాయి.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత తొలి ఆర్థిక మంత్రి షణ్ముఖం శెట్టి బడ్జెట్ను రూపొందించారు. 1947 నవంబర్ 26న ఆయన బడ్జెట్ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. రూ.197 కోట్లతో బడ్జెట్ తయారు చేయగా.. దాదాపు రూ.92.74 కోట్లను రక్షణ రంగానికి కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు