Floating post office : నీటిపై తేలియాడే పోస్టాఫీసు గురించి ఎప్పుడైనా విన్నారా?
నీటిపై తేలియాడే పోస్టాఫీసు! వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! కశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఈ పోస్టాఫీసు ఎప్పుడు ప్రారంభించారు? అందులో ఎలాంటి సేవలు అందుతున్నాయో తెలిస్తే తప్పకుండా అవాక్కవుతారు.
ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. వాటిని చూసినప్పుడు, వాటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యపోతుంటాం. అలాంటి కోవకు చెందినదే ఈ తేలియాడే పోస్టాఫీసు(post office). ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉంది. అది కూడా మన దేశంలోని శ్రీనగర్(srinagar)లో ఉంది. నిత్యం పోస్ట్మ్యాన్ ఇక్కడ ఉత్తరాలు సేకరించి షిఖారాలపై తిరుగుతూ దాల్ సరస్సు(dal lake)లోనే నివాసం ఉంటున్న వారికి వాటిని అందజేస్తూ ఉంటాడు. ఆ పోస్టాఫీసు విశేషాలేంటో తెలుసుకుందామా..!
ఎప్పుడు ప్రారంభమైంది?
ఈ పోస్టాఫీసు బ్రిటిష్(british era) కాలంలోనే ప్రారంభమైంది. దీనికి దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. చివరి మహారాజు హరి సింగ్ పాలనలో కూడా ఇక్కడ నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. 2011లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేసిన ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఈ తేలియాడే పోస్టాఫీసును మరిన్ని సౌకర్యాలతో పునః ప్రారంభించారు. ఈ పోస్టాఫీసు ప్రాంగణంలోనే అరుదైన స్టాంపుల మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో ఎన్నో రకాల తపాల బిళ్లలు ఉంటాయి. ఆ పక్కనే ఉన్న దుకాణంలో పోస్టుకార్డులు, స్టాంపులు, స్థానికంగా దొరికే వస్తువులు, గ్రీటింగ్ కార్డులు విక్రయిస్తారు. దీనికి సమీపంలోనే తేలియాడే మసీదు, మార్కెట్ కూడా ఉన్నాయి.
షికారాపైనే నిర్మాణం
కశ్మీర్లోని శ్రీనగర్లో.. చుట్టూ సహజత్వం ఉట్టిపడే కొండల మధ్య ఉండే దాల్ సరస్సు అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుంది. ఆ సరస్సులోనే ఈ తేలియాడే పోస్టాఫీసును ఏర్పాటు చేశారు. దీని నిర్మాణ శైలి చాలా వైవిధ్యంగా ఉంటుంది. తొలిసారి చూసిన వారు దీనిని పోస్టాఫీసు అని గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే అక్కడ ఎన్నో షికారాలు(పడవలు) తిరుగుతూ ఉంటాయి. ఈ పోస్టాఫీసు కూడా ఇంచుమించు వాటిలాగే ఉంటుంది. కాబట్టి పర్యాటకులు(tourist) ఎవరైనా సరే దీనిని ప్రత్యేకంగా చూసి గుర్తు పట్టాల్సి ఉంటుంది. అక్కడ షికారాలు నడిపే వాళ్లు కూడా దీని విశేషాల గురించి కొత్తవారికి చెబుతుంటారు. భారతీయ పోస్టాఫీసుల ఎదుట ఉండే లోగోలానే ‘ఫ్లోటింగ్ పోస్టాఫీస్-దాల్ లేక్’ అనే అక్షరాలు దానిపై రాసి ఉంటాయి.
ఇంటర్నెట్.. అంతర్జాతీయ ఫోన్ కాల్స్
స్థానికులు ఈ పోస్టాఫీసు సేవల(services)ను నిత్యం వినియోగించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న సమాచార యుగంలో ఈ పోస్టాఫీసు గురించి తెలుసుకున్న యాత్రికులు తప్పకుండా దీనిని సందర్శిస్తూ ఉంటారు. తమకు ఇష్టమైన వారికి ప్రేమతో ఓ లేఖ పంపి ఇక్కడి ప్రత్యేకతను తెలియజేస్తుంటారు. ఈ పోస్టాఫీసులో ‘దాల్ లేక్’ ప్రత్యేకతను చాటుతూ ముద్రితమైన స్టాంపులు(stamps) కూడా లభిస్తాయి. ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంటుంది. మొబైళ్లలో సిగ్నల్ సరిగా రాని సందర్భంలో పలువురు ఇక్కడకు వచ్చి ఆ సేవలను వినియోగిస్తుంటారు. అంతే కాదండోయ్.. అంతర్జాతీయ ఫోన్ కాల్స్ చేసుకునే సదుపాయం ఇక్కడి మరో ప్రత్యేకత.
ఈ సారి ఎప్పుడైనా మీరు శ్రీనగర్ను సందర్శిస్తే.. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ పోస్టాఫీసు నుంచి మీకు ప్రియమైన వారికి ఓ లేఖ పంపించడానికి ప్రయత్నించండి. ఆ అనుభూతిని జ్ఞాపకంగా మలుచుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ అత్యల్ప ఓటింగ్.. మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?