Food Innovations : యుద్ధాలు వచ్చాయి.. కాఫీ, క్యాండీ తెచ్చాయి!
ప్రస్తుతం మనం తింటున్న క్యాండీలు (candy), కుర్కురేలు, తాగుతున్న ఇన్స్టంట్ కాఫీ (Instant Coffee).. ఇళ్లలో వాడుతున్న ఎయిర్ ఫ్రయర్స్ (Air Fryers), మైక్రోవేవ్ అవెన్ (Microwave Ovens)అన్నీ యుద్ధాలతో సంబంధం కలిగి ఉన్నాయి. అదెలాగో తెలుసుకోండి.
‘అవసరమే ఆవిష్కరణకు మూలం’. ప్రతి అవసరం ఓ ఆవిష్కరణ దిశగా అడుగులు వేయిస్తుంది. ముఖ్యంగా ప్రపంచ యుద్ధ సమయాల్లో (World wars) సైనికులకు రోజూ తాజా ఆహారం దొరికేది కాదు. దాంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషించారు. ఆ క్రమంలో ఎన్నో ఆహార ఉత్పత్తులు (Food Innovations) కనిపెట్టారు. అవేంటో తెలుసుకోండి.
నిల్వ మాంసం
అమెరికన్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ‘హార్మెల్ ఫుడ్ కార్పొరేషన్’ 1937లో పంది మాంసాన్ని నిల్వ చేసే విధానాన్ని కనుగొనింది. దానికి ‘స్పామ్’ అనే పేరు పెట్టింది. ఇందులో పంది మాంసంతో పాటు ఉప్పు, నీరు, బంగాళదుంప పొడి, చక్కెర, సోడియం నైట్రైట్ ఉండేవి. ఇవి తిన్న సైనికులకు మంచి శక్తి లభిస్తుందనే ఉద్దేశంతో అమెరికా సైన్యం సుమారు 150 మిలియన్ పౌండ్ల ఆహారాన్ని కొనుగోలు చేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ ఆహారం ఎంతగానో ఉపయోగపడింది. అప్పటి నుంచి అమెరికా సైనికులు ఏ దేశంలో శిబిరం ఏర్పాటు చేసినా ఈ తరహా ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకెళ్తున్నారట. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది.
తక్షణ శక్తినిచ్చే క్యాండీలు
స్పానిష్ సివిల్ వార్ సమయంలో ఫారెస్ట్ మార్స్ ఎస్ఆర్. అనే వ్యాపారవేత్త పలు రకాల క్యాండీలను తయారు చేశాడు. మిల్కీ వే, మార్స్ చాక్లెట్ బార్స్, ఎం అండ్ ఎం చాక్లెట్ పేరుతో వాటిని మార్కెట్లో విక్రయించేవారు. అధిక చక్కెర శాతంతో తయారైన వీటిని తిన్న వారికి తక్షణశక్తి లభించేది. అందుకే ఆయన వీటిపై అప్పట్లోనే పేటెంట్ తీసుకున్నాడు. ‘నోటిలోనే కరిగిపోతాయి.. మీ చేతిలో కాదు’ అంటూ మార్స్ క్యాండీ కంపెనీ ‘ఎం అండ్ ఎం’ ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ అమెరికా సైన్యానికి విక్రయించింది.
ఎయిర్ ఫ్రయర్
విలియం మ్యాక్సన్ అనే యూఎస్ నేవీ అధికారి ఎయిర్ ఫ్రయర్ను కనుగొన్నారు. తొలి ఎయిర్ ఫ్రయర్ దాదాపు 35 పౌండ్ల బరువుండేదట. దాని పేరు మ్యాక్సన్ వర్ల్విండ్ ఒవెన్. దానిని అల్యూమినియం, స్టీల్తో తయారు చేశారు. 120 వోల్ట్ల డీసీ మోటార్ను వినియోగించుకొని అందులో ఆహారాన్ని వేడి చేయొచ్చు. ఆరు రకాల పదార్థాలను ఒకేసారి ఇందులో వేడి చేసుకోవచ్చనే విషయం కనుక్కున్నారు. 1947లో ఆయన చనిపోయారు. 2008లో ఫిలిప్స్ కంపెనీ మళ్లీ ఎయిర్ ఫ్రయర్లను విస్తృతంగా ప్రవేశపెట్టింది. దాంతో ప్రతి కిచెన్లోనూ వీటి వాడకం పెరిగింది.
మైక్రోవేవ్ ఒవెన్
మైక్రోవేవ్ను ఓ ఇంజినీర్ కాకతాళీయంగా కనిపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రేథియాన్ ఇంజినీర్ పర్సీ లా బారెన్ స్పెన్సర్ మ్యాగ్నెట్రాన్స్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. ఆ ప్రక్రియలో భాగంగా ఓ క్రియాశీల రాడార్ ఎదుట అతను నిల్చొని ఉండగా.. తన జేబులోని క్యాండీ బార్ కరిగిపోయింది. దాంతో ఆయన పాప్కార్న్లు తయారు చేసేందుకు యత్నించి సఫలీకృతుడయ్యాడు. తర్వాత అనేక ప్రయోగాలు చేసి ఎట్టకేలకు అన్ని రకాల ఆహారాలు వండే మైక్రోవేవ్ ఒవెన్ అభివృద్ధి చేయగలిగారు. ఫలితంగా 1945లో ఒవెన్కు పేటెంట్ పొందారు. దానికి రాడార్ రేంజ్ అనే పేరు పెట్టారు. మొదట్లో ఆ మైక్రోవేవ్ ఆరు అడుగులు ఉండేదట.
ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ
1906లో ఫ్రాన్స్లో జాక్ ఆర్సన్ డాసన్వల్ ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీని కనుగొన్నాడు. యుద్ధ సమయంలో రక్తంలోనీ సీరంను నిల్వ చేసేందుకు మొదట్లో ఈ సాంకేతికతను వినియోగించేవారు. తరువాత నాటిక్ ల్యాబ్స్ దాన్ని నాసా వ్యోమగాముల కోసం మరింత అభివృద్ధి చేసింది. దాంతో తేలికైన, అధిక కేలరీలతో కూడిన ఆహారం తయారైంది.
చీజ్ ఉత్పత్తులు
ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కుర్కురే సహా అన్ని రకాల ప్రాసెస్డ్ చీజ్ ఉత్పత్తులన్నీ ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అమెరికా మిలటరీ కృషి మూలంగానే వచ్చాయి. 1943లో డీహైడ్రేటెడ్ చీజ్ పౌడర్ను అభివృద్ధి చేశారు. దాంతో అమెరికా సైన్యం అనేక ఉత్పత్తులను సేకరించి పెట్టింది. ఎంతలా అంటే యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆ ఉత్పత్తులు నిల్వ ఉండే స్థాయిలో ఆ సేకరణ సాగింది. 1948లో వాటిని ఫ్రిటో-లే అనే కంపెనీకి విక్రయించారు.
ఇన్స్టంట్ కాఫీ
1901లో సటోరి కటో అనే జపనీస్-అమెరికన్ శాస్త్రవేత్త నీటిలో కరిగే కాఫీ పౌడర్ను తయారు చేశాడు. కానీ ఆ ఉత్పత్తికి గిరాకీ రాలేదు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలు కాగానే అమెరికా మిలటరీ రోజుకు 37వేల పౌండ్ల ఇన్స్టంట్ కాఫీని కొనుగోలు చేసిందట. ప్రస్తుతం ఇళ్లు, మాల్స్, కార్యాలయాల్లో ఇన్స్టంట్ కాఫీకి ఉన్న డిమాండ్ ఎలాంటిదో చెప్పనవసరం లేదు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు