లాక్డౌన్ ఎత్తివేశాక.. జీవనం ఎలా ఉంటుంది?
మూడు నెలల కిందట ఎవరైనా ఊహించారా.. మనమంతా గడపదాటకుండా ఇంట్లోనే ఉండిపోతామని.. సంపాదన కోల్పోతామని, సినిమాలు.. షికార్లు బంద్ అవుతాయని? కలలో కూడా ఎవరూ అనుకొని ఉండరు. కానీ కరోనా మహమ్మారి.. అందరి జీవితాలను తలకిందులు
మూడు నెలల కిందట ఎవరైనా ఊహించారా.. గడప దాటకుండా ఇంట్లోనే ఉండిపోతామని.. సినిమాలు.. షికార్లు బంద్ అవుతాయని? కలలో కూడా ఎవరూ అనుకొని ఉండరు. కానీ కరోనా మహమ్మారి.. అందరి జీవితాలను తలకిందులు చేసింది. ఈ వైరస్కు విరుగుడు మందు వచ్చే వరకూ మనల్ని వదిలిపోదు.. అందుకే కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్డౌన్ ఎత్తివేసినా.. సాధారణ జీవితాన్ని గడపలేం. ఒక కొత్త విధానంలో జీవించడానికి అలవాటుపడాల్సి రావడం ఖాయం. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇంటా బయట, ఆఫీసుల్లో కొన్ని విషయాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
బయటకు వెళ్లాలంటే మాస్కులు
ఇదివరకు బయటకు వెళ్లాలనుకోవడమే లేటు.. ఉన్నఫళంగా వెళ్లేపోయేవాళ్లు. ఇప్పుడు.. ఇకపై కొన్ని ఆయుధాలు సిద్ధం చేసుకొని వెళ్లాల్సిందే. ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజులు, జేబులో శానిటైజర్ పెట్టుకోక తప్పదు. భౌతిక దూరం పాటిస్తూనే బయట పనుల్ని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇంటికి తిరిగొచ్చిన కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరైపోతుంది. వీలైతే వేడి నీళ్లతో స్నానం చేస్తే మరీ మంచిది.
పలకరింపులో భారీ మార్పు..
ఓ వ్యక్తి ఎదురైనప్పుడు పలకరించే విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా షేక్ హ్యాండ్స్ ఇస్తారు. ఇప్పుడు అది పూర్తిగా కనుమరుగువుతుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కావడంతో షేక్ హ్యాండ్స్ ఇచ్చే ధైర్యం ఎవరు చేయకపోవచ్చు. మన దేశంలో ప్రాచీనకాలం నుంచి పలకరింపులో భాగంగా రెండు చేతుల్ని జోడించి నమస్కారం పెట్టే అలవాటుంది. ఇప్పుడు అదే ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి. ఇకపై అలాగే పాటిస్తాయి. లేకపోతే కరోనా కాటేసే అవకాశముందిగా..
షాపింగ్.. అంత సులువు కాదు
ఇదివరకు షాపింగ్కి వెళ్లాలంటే డబ్బులు ఉంటే సరిపోయేది. ఇప్పుడు అలా కుదరదు. మార్కెట్కు మాస్కులు ధరించే వెళ్లాల్సి ఉంటుంది. సొంత సంచి తీసుకెళ్లాలి. అక్కడ ఏది కొనుగోలు చేసిన, దేన్ని పట్టుకున్నా.. తర్వాత శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాల్సిందే. మార్కెట్కు అనేక మంది వస్తుంటారు. దీంతో వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సరుకులు తెచ్చుకోవాలన్నా మనం జీవితాన్ని పణంగా పెట్టినట్టుగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో అపాయింట్మెంట్ తీసుకొని షాపింగ్ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో వర్చువల్ షాపింగ్కే ఎక్కువమంది ప్రాధాన్యమివ్వొచ్చు.
ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే
ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉండాలని ఆన్లైన్ పేమెంట్స్లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయినా చాలా మంది నగదుతోనే లావాదేవీలు జరుపుతున్నారు. అయితే కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ సోకుతుందని ప్రచారముంది. దీంతో నోట్లతో కొనుగోళ్లు చాలా వరకు తగ్గిపోయింది. దీనికి బదులు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఇకపై కూడా అదే కొనసాగనుంది.
స్ట్రీట్ఫుడ్.. రిస్క్ ఫుల్
రోజులో ఒక్కసారైన వీధుల్లో చిరుతిళ్లు, రెస్టారెంట్ ఫుడ్ తినని వారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ లాక్డౌన్లో అవీ మూతపడ్డాయి. లాక్డౌన్ తర్వాత తెరుచుకున్నా.. ఎప్పటిలాగా కొనసాగుతాయన్న నమ్మకం లేదు. స్నేహితులతో కలిసి వెళ్లే ఇలాంటి ప్రాంతాలకు కరోనా సోకిన వాళ్లూ వస్తే.. అనేకమంది వైరస్ బారిన పడే అవకాశాలుంటాయి. అందుకే రెస్టారెంట్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోవచ్చు. లేదా.. చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా రిజర్వేషన్లు పెట్టి పరిమిత సంఖ్యలో కస్టమర్లకు సేవలు అందించే అవకాశముంది.
స్నేహితులతో జల్సాలు కష్టమే
స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం.. ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకోవడం సాధారణం. కరోనా వల్ల ఇప్పుడు అది సాహసంతో కూడుకున్న పని. స్నేహితులంతా వేర్వేరు చోట్లలో ఉంటారు. ఎవరి ప్రాంతంలో అయినా కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఉండి.. స్నేహితుడికి తద్వారా స్నేహ బృందానికి అక్కడి నుంచి వారి కుటుంబసభ్యులకు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ లాక్డౌన్ సమయంలో ఫోన్.. వీడియో కాల్స్ ద్వారా మాట్లాడినట్లే లాక్డౌన్ తర్వాత కూడా ఇలాగే కొనసాగొచ్చు.
ఎలివేటర్.. యమ డేంజర్
ఆఫీసుల్లో అయినా.. షాపింగ్ మాల్స్లో అయినా ఎలివేటర్లో ఒకేసారి ఎక్కువ మంది ఎక్కుతుంటారు. దీంతో భౌతికదూరం ఉండదు.. దీంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే అవకాశం అధికంగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఎలివేటర్లో భౌతికదూరం పాటిస్తూ ఒక్కసారి ముగ్గురు, నలుగురికి మించి ఎక్కకుండా నిబంధనలు పెట్టారు. ఇకముందు అది కొసాగబోతుంది.
కార్యాలయాల్లో మార్పులు
కరోనా దెబ్బకు అనేక సంస్థలు మూతపడ్డాయి. ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేశాక కార్యాలయాలు తెరుచుకుంటాయి. అయినా వర్క్ ఫ్రమ్ హోం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కార్యాలయాలకు వచ్చినా ఉద్యోగులు కూర్చొనే విధానంలో మార్పులు వస్తాయి. కూర్చొనే సీట్ల మధ్య వీలైనంత దూరం పెంచుతారు. కెఫెటేరియా, క్యాంటీన్లలో సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. మీటింగ్స్ను ఎక్కువ మంది ఉద్యోగులతో కాకుండా వీలైనంత తక్కువ మందితో ఉండేలా చర్యలు తీసుకుంటారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. పాఠశాలలు దాదాపు ఇదే పద్ధతిని పాటించే అవకాశాలున్నాయి.
ప్రతి ఇంట్లో టెలీ మెడిసిన్
పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా వినియోగించే టెలీ మెడిసిన్.. కరోనా వల్ల మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రుల్లో కరోనా వ్యక్తులు ఉండే అవకాశం ఉండటంతో అక్కడి వెళ్లాలంటే సాధారణ ప్రజలు భయపడుతున్నారు. చిన్న జబ్బు కోసం వెళ్తే కరోనా అంటుకుంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టెలీ మెడిసిన్ ప్రజలకు చేరువవుతోంది. ఎలాంటి సమస్యలున్నా.. టెలీ మెడిసిన్ ద్వారా ఇంటి నుంచే చికిత్స తీసుకునే వీలు కలుగుతుంది. భవిష్యత్తులోనూ ఇది విస్తృతంగా వినియోగంలోకి రానుంది.
అప్పుడప్పుడు కరోనా టెస్టులు
కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగువుతుందని ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా.. అప్పుడప్పుడు హెల్త్ చెకప్లాగే కరోనా టెస్టులు చేసుకోవాల్సి రావొచ్చు. లక్షణాలు కనపడకున్నా ఈ వ్యాధి సోకుతోంది. ఆరోగ్యంగా ఉన్నామనుకొని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదముంది.
స్టేడియంలో కాదు.. టీవీల్లోనే
కరోనా వల్ల ఎక్కువ మంది ఒకేచోట గుమ్మిగూడే పరిస్థితి లేదు. ఈ ప్రభావం క్రీడలపై ఎక్కువగా పడుతుంది. దీంతో క్రికెట్, తదితర ఆటలు చూడటానికి ప్రేక్షకులు స్టేడియం వద్దకు రావడం అనుమానమే. ఆటగాళ్లు ఖాళీ స్టేడియాల్లోనే ఆడాల్సి రావొచ్చు. ప్రజలు టీవీల్లోనే ఆ ఆటలు చూసేందుకు ఇష్టపడొచ్చు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్