లాక్డౌన్ ఎత్తివేశాక.. జీవనం ఎలా ఉంటుంది?
మూడు నెలల కిందట ఎవరైనా ఊహించారా.. మనమంతా గడపదాటకుండా ఇంట్లోనే ఉండిపోతామని.. సంపాదన కోల్పోతామని, సినిమాలు.. షికార్లు బంద్ అవుతాయని? కలలో కూడా ఎవరూ అనుకొని ఉండరు. కానీ కరోనా మహమ్మారి.. అందరి జీవితాలను తలకిందులు
మూడు నెలల కిందట ఎవరైనా ఊహించారా.. గడప దాటకుండా ఇంట్లోనే ఉండిపోతామని.. సినిమాలు.. షికార్లు బంద్ అవుతాయని? కలలో కూడా ఎవరూ అనుకొని ఉండరు. కానీ కరోనా మహమ్మారి.. అందరి జీవితాలను తలకిందులు చేసింది. ఈ వైరస్కు విరుగుడు మందు వచ్చే వరకూ మనల్ని వదిలిపోదు.. అందుకే కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లాక్డౌన్ ఎత్తివేసినా.. సాధారణ జీవితాన్ని గడపలేం. ఒక కొత్త విధానంలో జీవించడానికి అలవాటుపడాల్సి రావడం ఖాయం. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇంటా బయట, ఆఫీసుల్లో కొన్ని విషయాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
బయటకు వెళ్లాలంటే మాస్కులు
ఇదివరకు బయటకు వెళ్లాలనుకోవడమే లేటు.. ఉన్నఫళంగా వెళ్లేపోయేవాళ్లు. ఇప్పుడు.. ఇకపై కొన్ని ఆయుధాలు సిద్ధం చేసుకొని వెళ్లాల్సిందే. ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజులు, జేబులో శానిటైజర్ పెట్టుకోక తప్పదు. భౌతిక దూరం పాటిస్తూనే బయట పనుల్ని చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇంటికి తిరిగొచ్చిన కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరైపోతుంది. వీలైతే వేడి నీళ్లతో స్నానం చేస్తే మరీ మంచిది.
పలకరింపులో భారీ మార్పు..
ఓ వ్యక్తి ఎదురైనప్పుడు పలకరించే విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా షేక్ హ్యాండ్స్ ఇస్తారు. ఇప్పుడు అది పూర్తిగా కనుమరుగువుతుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కావడంతో షేక్ హ్యాండ్స్ ఇచ్చే ధైర్యం ఎవరు చేయకపోవచ్చు. మన దేశంలో ప్రాచీనకాలం నుంచి పలకరింపులో భాగంగా రెండు చేతుల్ని జోడించి నమస్కారం పెట్టే అలవాటుంది. ఇప్పుడు అదే ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి. ఇకపై అలాగే పాటిస్తాయి. లేకపోతే కరోనా కాటేసే అవకాశముందిగా..
షాపింగ్.. అంత సులువు కాదు
ఇదివరకు షాపింగ్కి వెళ్లాలంటే డబ్బులు ఉంటే సరిపోయేది. ఇప్పుడు అలా కుదరదు. మార్కెట్కు మాస్కులు ధరించే వెళ్లాల్సి ఉంటుంది. సొంత సంచి తీసుకెళ్లాలి. అక్కడ ఏది కొనుగోలు చేసిన, దేన్ని పట్టుకున్నా.. తర్వాత శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాల్సిందే. మార్కెట్కు అనేక మంది వస్తుంటారు. దీంతో వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సరుకులు తెచ్చుకోవాలన్నా మనం జీవితాన్ని పణంగా పెట్టినట్టుగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో అపాయింట్మెంట్ తీసుకొని షాపింగ్ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో వర్చువల్ షాపింగ్కే ఎక్కువమంది ప్రాధాన్యమివ్వొచ్చు.
ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే
ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉండాలని ఆన్లైన్ పేమెంట్స్లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అయినా చాలా మంది నగదుతోనే లావాదేవీలు జరుపుతున్నారు. అయితే కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ సోకుతుందని ప్రచారముంది. దీంతో నోట్లతో కొనుగోళ్లు చాలా వరకు తగ్గిపోయింది. దీనికి బదులు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఇకపై కూడా అదే కొనసాగనుంది.
స్ట్రీట్ఫుడ్.. రిస్క్ ఫుల్
రోజులో ఒక్కసారైన వీధుల్లో చిరుతిళ్లు, రెస్టారెంట్ ఫుడ్ తినని వారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ లాక్డౌన్లో అవీ మూతపడ్డాయి. లాక్డౌన్ తర్వాత తెరుచుకున్నా.. ఎప్పటిలాగా కొనసాగుతాయన్న నమ్మకం లేదు. స్నేహితులతో కలిసి వెళ్లే ఇలాంటి ప్రాంతాలకు కరోనా సోకిన వాళ్లూ వస్తే.. అనేకమంది వైరస్ బారిన పడే అవకాశాలుంటాయి. అందుకే రెస్టారెంట్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోవచ్చు. లేదా.. చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా రిజర్వేషన్లు పెట్టి పరిమిత సంఖ్యలో కస్టమర్లకు సేవలు అందించే అవకాశముంది.
స్నేహితులతో జల్సాలు కష్టమే
స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం.. ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకోవడం సాధారణం. కరోనా వల్ల ఇప్పుడు అది సాహసంతో కూడుకున్న పని. స్నేహితులంతా వేర్వేరు చోట్లలో ఉంటారు. ఎవరి ప్రాంతంలో అయినా కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఉండి.. స్నేహితుడికి తద్వారా స్నేహ బృందానికి అక్కడి నుంచి వారి కుటుంబసభ్యులకు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ లాక్డౌన్ సమయంలో ఫోన్.. వీడియో కాల్స్ ద్వారా మాట్లాడినట్లే లాక్డౌన్ తర్వాత కూడా ఇలాగే కొనసాగొచ్చు.
ఎలివేటర్.. యమ డేంజర్
ఆఫీసుల్లో అయినా.. షాపింగ్ మాల్స్లో అయినా ఎలివేటర్లో ఒకేసారి ఎక్కువ మంది ఎక్కుతుంటారు. దీంతో భౌతికదూరం ఉండదు.. దీంతో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే అవకాశం అధికంగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఎలివేటర్లో భౌతికదూరం పాటిస్తూ ఒక్కసారి ముగ్గురు, నలుగురికి మించి ఎక్కకుండా నిబంధనలు పెట్టారు. ఇకముందు అది కొసాగబోతుంది.
కార్యాలయాల్లో మార్పులు
కరోనా దెబ్బకు అనేక సంస్థలు మూతపడ్డాయి. ఐటీ వంటి కొన్ని రంగాల్లో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేశాక కార్యాలయాలు తెరుచుకుంటాయి. అయినా వర్క్ ఫ్రమ్ హోం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కార్యాలయాలకు వచ్చినా ఉద్యోగులు కూర్చొనే విధానంలో మార్పులు వస్తాయి. కూర్చొనే సీట్ల మధ్య వీలైనంత దూరం పెంచుతారు. కెఫెటేరియా, క్యాంటీన్లలో సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. మీటింగ్స్ను ఎక్కువ మంది ఉద్యోగులతో కాకుండా వీలైనంత తక్కువ మందితో ఉండేలా చర్యలు తీసుకుంటారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. పాఠశాలలు దాదాపు ఇదే పద్ధతిని పాటించే అవకాశాలున్నాయి.
ప్రతి ఇంట్లో టెలీ మెడిసిన్
పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా వినియోగించే టెలీ మెడిసిన్.. కరోనా వల్ల మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రుల్లో కరోనా వ్యక్తులు ఉండే అవకాశం ఉండటంతో అక్కడి వెళ్లాలంటే సాధారణ ప్రజలు భయపడుతున్నారు. చిన్న జబ్బు కోసం వెళ్తే కరోనా అంటుకుంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో టెలీ మెడిసిన్ ప్రజలకు చేరువవుతోంది. ఎలాంటి సమస్యలున్నా.. టెలీ మెడిసిన్ ద్వారా ఇంటి నుంచే చికిత్స తీసుకునే వీలు కలుగుతుంది. భవిష్యత్తులోనూ ఇది విస్తృతంగా వినియోగంలోకి రానుంది.
అప్పుడప్పుడు కరోనా టెస్టులు
కరోనా వైరస్ పూర్తిగా కనుమరుగువుతుందని ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా.. అప్పుడప్పుడు హెల్త్ చెకప్లాగే కరోనా టెస్టులు చేసుకోవాల్సి రావొచ్చు. లక్షణాలు కనపడకున్నా ఈ వ్యాధి సోకుతోంది. ఆరోగ్యంగా ఉన్నామనుకొని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలమీదకు వచ్చే ప్రమాదముంది.
స్టేడియంలో కాదు.. టీవీల్లోనే
కరోనా వల్ల ఎక్కువ మంది ఒకేచోట గుమ్మిగూడే పరిస్థితి లేదు. ఈ ప్రభావం క్రీడలపై ఎక్కువగా పడుతుంది. దీంతో క్రికెట్, తదితర ఆటలు చూడటానికి ప్రేక్షకులు స్టేడియం వద్దకు రావడం అనుమానమే. ఆటగాళ్లు ఖాళీ స్టేడియాల్లోనే ఆడాల్సి రావొచ్చు. ప్రజలు టీవీల్లోనే ఆ ఆటలు చూసేందుకు ఇష్టపడొచ్చు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!