బగ్ బౌంటీ అసలు దాని సంగతేంటి?
ఆరోగ్యసేతు.. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యాప్. కరోనా రోగులను ట్రాక్ చేయడానికి, కరోనాకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఈ ఆరోగ్యసేతు యాప్ ఉపయోగపడుతుంది. విమాన, రైలు ప్రయాణికులు.. సామాన్య ప్రజలు
కరోనా వైరస్ బాధితులను ట్రాక్ చేయడానికి, కరోనాకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ ఈ యాప్ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ యాప్లో యూజర్ వివరాలు గోప్యంగా ఉంటాయని కేంద్రం స్పష్టం చేసినా.. భద్రతపై పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆరోగ్యసేతు యాప్పై ‘బగ్ బౌంటీ’ కార్యక్రమం చేపట్టింది.
ఆరోగ్యసేతు యాప్లో భద్రతపరమైన లోపాలు (బగ్) కనిపెట్టి చెబితే రూ.లక్ష నుంచి రూ.3లక్షలు వరకు బహుమతి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే ఆరోగ్య సేతు యాప్ను మెరుగుపర్చడానికి మంచి సలహాలు.. సూచనలు ఇచ్చిన వారికి రూ.లక్ష వరకు రివార్డు అందజేస్తామని వెల్లడించింది. ప్రభుత్వమే స్వయంగా ‘బగ్ బౌంటీ’ కార్యక్రమం నిర్వహించడం అరుదైన విషయం. ఇంతకీ అసలు ఈ బగ్ బౌంటీ అంటే ఏమిటి? ఎవరెవరు ఈ కార్యక్రమం చేపడతారు? ఎంత నగదు బహుమతి ప్రకటిస్తారు? ఓ సారి చూద్దాం..
యూజర్లకు అందుబాటులో ఉన్న వెబ్సైట్లు, యాప్లు, సాఫ్ట్వేర్స్లో ఎవరూ గుర్తించలేని భద్రతపరమైన లేదా సైబర్ దాడికి అవకాశముండేలా కొన్ని లోపాలు (బగ్స్) ఉండొచ్చు. అలాంటి బగ్స్ను ఐటీ ఎక్స్పర్ట్ నుంచి విద్యార్థుల వరకు ఎవరైనా సరే కనిపెట్టి చెప్పగలిగితే వారికి నగదు బహుమతి ఇస్తుంటారు. ఈ కార్యక్రమాన్నే బగ్ బౌంటీ అంటారు. ప్రముఖ సెర్చింజన్లు గూగుల్.. యాహూ, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ సహా అనేక ఐటీ సంస్థలు, ఇతర కంపెనీలు తమ వెబ్సైట్లలో లోపాలు గుర్తించి చెప్పమంటూ తరచూ బగ్ బౌంటీ కార్యక్రమం నిర్వహిస్తుంటాయి. కనిపెట్టి చెప్పిన వారికి నగదు బహుమతి ప్రకటిస్తాయి. తద్వారా సంస్థలు తమ సేవలను మరింత మెరుగుపర్చుకుంటాయి.
1983లో తొలిసారి
ఈ బగ్ బౌంటీ కార్యక్రమాన్ని తొలిసారి హంటర్ అండ్ రెడీ అనే సంస్థ నిర్వహించింది. తమ సంస్థ రూపొందించిన ‘వెర్సటైల్ రియల్-టైం ఎగ్జిక్యూటివ్ ఆపరేటింగ్ సిస్టమ్’లో ఎవైనా లోపాలు ఉంటే వాటిని కనిపెట్టి చెప్పిన వారికి ఫోక్స్వ్యాగన్ బీటల్ కారును బహుమతిగా ఇస్తామని హంటర్ అండ్ రెడీ ప్రకటించింది. నిజానికి ఈ కార్యక్రమానికి బగ్ బౌంటీ అనే పేరును 1995లో నెట్స్కేప్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ సంస్థలో పనిచేసే ఇంజినీర్ జారెట్ రిడ్లింగ్ హెఫర్ పెట్టారు. తన సంస్థ ఉన్నతాధికారులను ఒప్పించి అప్పట్లోనే 50 వేల డాలర్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
గూగుల్ బగ్ బౌంటీ
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఏటా ఈ బగ్ బౌంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొదట్లో గూగుల్ కేవలం తన ఉత్పత్తులకు మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించేది.. ఆ తర్వాత గూగుల్ ప్లేస్టోర్లో ఉండే థర్డ్ పార్టీ యాప్స్ల్లోనూ బగ్స్ గుర్తింపునకు రివార్డ్ ప్రకటిస్తోంది. 2010 నుంచి ఇప్పటి వరకు గూగుల్ బగ్ బౌంటీ కార్యక్రమం కోసం 21 మిలియన్ డాలర్ల మేర వెచ్చించింది. 461 మంది పరిశోధకులు ఈ నగదును అందుకున్నారు. గతేడాది బగ్ బౌంటీ కోసం గూగుల్ అత్యధికంగా 6.5 మిలియన్ డాలర్లు కేటాయించింది. బగ్ కనిపెట్టివారిలో ఒకరు అత్యధికంగా 1,61,337 డాలర్లు గెలుపొందారు.
2013 తర్వాత పెరిగిన బగ్ బౌంటీలు
ఇంటర్నెట్ సంబంధిత సాఫ్ట్వేర్స్లో లోపాలు కనిపెట్టడం కోసం 2013 నవంబర్లో మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ సంయుక్తంగా ఇంటర్నెట్ బగ్ బౌంటీ నిర్వహించాయి. 2015 నుంచి సోనీ సహా ప్రముఖ కంపెనీలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 2016లో యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ‘హ్యాక్ ది పెంటగాన్’ పేరుతో బగ్ బౌంటీ నిర్వహించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్లో లోపాలను గుర్తించమని కోరింది. ఇందుకోసం 1.5 లక్షల డాలర్లను బహుమతిగా ప్రకటించింది. సాధారణంగా బగ్ బౌంటీల నగదు బహుమతి 500 డాలర్ల నుంచి 30వేల డాలర్లకు ఉంటుంది. లోపం తీవ్రతను బట్టి రివార్డు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అత్యధికంగా నగదు గెలుచుకున్న కుర్రాడు
2019 మార్చిలో హ్యాకర్వన్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకటన ప్రకారం.. మిలియన్ డాలర్ల బగ్ బౌంటీ రివార్డు పొందిన తొలి వ్యక్తిగా అర్జెంటీనాకు చెందిన 19 ఏళ్ల కుర్రాడు శాంటియాగొ లోపెజ్ నిలిచాడు. ఆ తర్వాత పలువురు ఈ మిలియన్ డాలర్ క్లబ్లో చేరారు.
ఈ ఏడాదిలోనూ అనేకం
సంస్థలు తమ ప్రొడక్ట్లో లోపాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చినా, అనుమానాలు కలిగినా బగ్ బౌంటీని నిర్వహిస్తుంటాయి. ఈ ఏడాది కూడా గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్, యాహూ, స్నాప్చాట్, సిస్కో, యాపిల్, మైక్రోసాఫ్ట్, ట్విటర్ సహా 30కిపైగా సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా గూగుల్ క్లౌడ్లో లోపాన్ని గుర్తించినందుకు ఓ పరిశోధకుడు 31,337 డాలర్లు గెలుచుకున్నాడు. తమ ప్రొడక్ట్స్ అయిన అజుర్ స్పేర్లో లోపాలు గుర్తిస్తే లక్ష డాలర్లు, ఎక్స్ బాక్స్లో లోపాలు కనిపెడితే 20వేల డాలర్లు రివార్డుగా ఇస్తామని ఇటీవల మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే