బగ్ బౌంటీ అసలు దాని సంగతేంటి?
ఆరోగ్యసేతు.. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యాప్. కరోనా రోగులను ట్రాక్ చేయడానికి, కరోనాకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఈ ఆరోగ్యసేతు యాప్ ఉపయోగపడుతుంది. విమాన, రైలు ప్రయాణికులు.. సామాన్య ప్రజలు
కరోనా వైరస్ బాధితులను ట్రాక్ చేయడానికి, కరోనాకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ ఈ యాప్ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ యాప్లో యూజర్ వివరాలు గోప్యంగా ఉంటాయని కేంద్రం స్పష్టం చేసినా.. భద్రతపై పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆరోగ్యసేతు యాప్పై ‘బగ్ బౌంటీ’ కార్యక్రమం చేపట్టింది.
ఆరోగ్యసేతు యాప్లో భద్రతపరమైన లోపాలు (బగ్) కనిపెట్టి చెబితే రూ.లక్ష నుంచి రూ.3లక్షలు వరకు బహుమతి ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే ఆరోగ్య సేతు యాప్ను మెరుగుపర్చడానికి మంచి సలహాలు.. సూచనలు ఇచ్చిన వారికి రూ.లక్ష వరకు రివార్డు అందజేస్తామని వెల్లడించింది. ప్రభుత్వమే స్వయంగా ‘బగ్ బౌంటీ’ కార్యక్రమం నిర్వహించడం అరుదైన విషయం. ఇంతకీ అసలు ఈ బగ్ బౌంటీ అంటే ఏమిటి? ఎవరెవరు ఈ కార్యక్రమం చేపడతారు? ఎంత నగదు బహుమతి ప్రకటిస్తారు? ఓ సారి చూద్దాం..
యూజర్లకు అందుబాటులో ఉన్న వెబ్సైట్లు, యాప్లు, సాఫ్ట్వేర్స్లో ఎవరూ గుర్తించలేని భద్రతపరమైన లేదా సైబర్ దాడికి అవకాశముండేలా కొన్ని లోపాలు (బగ్స్) ఉండొచ్చు. అలాంటి బగ్స్ను ఐటీ ఎక్స్పర్ట్ నుంచి విద్యార్థుల వరకు ఎవరైనా సరే కనిపెట్టి చెప్పగలిగితే వారికి నగదు బహుమతి ఇస్తుంటారు. ఈ కార్యక్రమాన్నే బగ్ బౌంటీ అంటారు. ప్రముఖ సెర్చింజన్లు గూగుల్.. యాహూ, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ సహా అనేక ఐటీ సంస్థలు, ఇతర కంపెనీలు తమ వెబ్సైట్లలో లోపాలు గుర్తించి చెప్పమంటూ తరచూ బగ్ బౌంటీ కార్యక్రమం నిర్వహిస్తుంటాయి. కనిపెట్టి చెప్పిన వారికి నగదు బహుమతి ప్రకటిస్తాయి. తద్వారా సంస్థలు తమ సేవలను మరింత మెరుగుపర్చుకుంటాయి.
1983లో తొలిసారి
ఈ బగ్ బౌంటీ కార్యక్రమాన్ని తొలిసారి హంటర్ అండ్ రెడీ అనే సంస్థ నిర్వహించింది. తమ సంస్థ రూపొందించిన ‘వెర్సటైల్ రియల్-టైం ఎగ్జిక్యూటివ్ ఆపరేటింగ్ సిస్టమ్’లో ఎవైనా లోపాలు ఉంటే వాటిని కనిపెట్టి చెప్పిన వారికి ఫోక్స్వ్యాగన్ బీటల్ కారును బహుమతిగా ఇస్తామని హంటర్ అండ్ రెడీ ప్రకటించింది. నిజానికి ఈ కార్యక్రమానికి బగ్ బౌంటీ అనే పేరును 1995లో నెట్స్కేప్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ సంస్థలో పనిచేసే ఇంజినీర్ జారెట్ రిడ్లింగ్ హెఫర్ పెట్టారు. తన సంస్థ ఉన్నతాధికారులను ఒప్పించి అప్పట్లోనే 50 వేల డాలర్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
గూగుల్ బగ్ బౌంటీ
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఏటా ఈ బగ్ బౌంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొదట్లో గూగుల్ కేవలం తన ఉత్పత్తులకు మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించేది.. ఆ తర్వాత గూగుల్ ప్లేస్టోర్లో ఉండే థర్డ్ పార్టీ యాప్స్ల్లోనూ బగ్స్ గుర్తింపునకు రివార్డ్ ప్రకటిస్తోంది. 2010 నుంచి ఇప్పటి వరకు గూగుల్ బగ్ బౌంటీ కార్యక్రమం కోసం 21 మిలియన్ డాలర్ల మేర వెచ్చించింది. 461 మంది పరిశోధకులు ఈ నగదును అందుకున్నారు. గతేడాది బగ్ బౌంటీ కోసం గూగుల్ అత్యధికంగా 6.5 మిలియన్ డాలర్లు కేటాయించింది. బగ్ కనిపెట్టివారిలో ఒకరు అత్యధికంగా 1,61,337 డాలర్లు గెలుపొందారు.
2013 తర్వాత పెరిగిన బగ్ బౌంటీలు
ఇంటర్నెట్ సంబంధిత సాఫ్ట్వేర్స్లో లోపాలు కనిపెట్టడం కోసం 2013 నవంబర్లో మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ సంయుక్తంగా ఇంటర్నెట్ బగ్ బౌంటీ నిర్వహించాయి. 2015 నుంచి సోనీ సహా ప్రముఖ కంపెనీలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 2016లో యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ‘హ్యాక్ ది పెంటగాన్’ పేరుతో బగ్ బౌంటీ నిర్వహించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్లో లోపాలను గుర్తించమని కోరింది. ఇందుకోసం 1.5 లక్షల డాలర్లను బహుమతిగా ప్రకటించింది. సాధారణంగా బగ్ బౌంటీల నగదు బహుమతి 500 డాలర్ల నుంచి 30వేల డాలర్లకు ఉంటుంది. లోపం తీవ్రతను బట్టి రివార్డు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అత్యధికంగా నగదు గెలుచుకున్న కుర్రాడు
2019 మార్చిలో హ్యాకర్వన్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకటన ప్రకారం.. మిలియన్ డాలర్ల బగ్ బౌంటీ రివార్డు పొందిన తొలి వ్యక్తిగా అర్జెంటీనాకు చెందిన 19 ఏళ్ల కుర్రాడు శాంటియాగొ లోపెజ్ నిలిచాడు. ఆ తర్వాత పలువురు ఈ మిలియన్ డాలర్ క్లబ్లో చేరారు.
ఈ ఏడాదిలోనూ అనేకం
సంస్థలు తమ ప్రొడక్ట్లో లోపాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చినా, అనుమానాలు కలిగినా బగ్ బౌంటీని నిర్వహిస్తుంటాయి. ఈ ఏడాది కూడా గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్, యాహూ, స్నాప్చాట్, సిస్కో, యాపిల్, మైక్రోసాఫ్ట్, ట్విటర్ సహా 30కిపైగా సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా గూగుల్ క్లౌడ్లో లోపాన్ని గుర్తించినందుకు ఓ పరిశోధకుడు 31,337 డాలర్లు గెలుచుకున్నాడు. తమ ప్రొడక్ట్స్ అయిన అజుర్ స్పేర్లో లోపాలు గుర్తిస్తే లక్ష డాలర్లు, ఎక్స్ బాక్స్లో లోపాలు కనిపెడితే 20వేల డాలర్లు రివార్డుగా ఇస్తామని ఇటీవల మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్