బగ్స్ కనిపెట్టారు.. రూ.లక్షలు సంపాదించారు!
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యసేతు యాప్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యాప్లో భద్రతపరంగా ఏమైనా లోపాలు ఉంటే కనిపెట్టి చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం ‘బగ్ బౌంటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. లోపాలను కనిపెట్టినవారికి
కరోనా వైరస్ వ్యాప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యాప్లో భద్రతపరంగా లోపాలు ఉంటే కనిపెట్టి చెప్పాలంటూ ‘బగ్ బౌంటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. లోపాలను కనిపెట్టినవారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రివార్డు ప్రకటించింది. దీంతో ఔత్సాహికులు ఈ యాప్లో లోపాలు కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది.. అనేక సంస్థలకు చెందిన సాఫ్ట్వేర్స్లో లోపాలను గుర్తించి.. రూ.లక్షల్లో నగదు బహుమతులు గెలుపొందారు. వారిలో మన భారతీయులూ ఉన్నారు. వారెవరు? ఎంత నగదు బహుమతి గెలుచుకున్నారు? తెలుసుకుందాం పదండి..
యాపిల్లో లోపం.. ₹56లక్షల రివార్డు
ఓ పరిశోధకుడు యాపిల్ సంస్థ నుంచి ఏకంగా 75 వేల అమెరికన్ డాలర్లు (రూ.56.50లక్షలు) రివార్డు గెలిచాడు. యాపిల్ సంస్థకు చెందిన సఫారీ బ్రౌజర్లో ర్యాన్ పికెన్ అనే వ్యక్తి ఏడు బగ్స్ కనుగొన్నాడు. వీటిలో ఒక బగ్ సైబర్ నేరగాళ్లు వెబ్క్యామ్ను యాక్సెస్ చేసే విధంగా హానికరమైన వన్ క్లిక్ జావా స్క్రిప్ట్ను అనుమతిస్తుందని తేలింది. వీటిని యాపిల్ సరిచేసింది.
సీడీఎంలో బగ్.. రూ. 23.66లక్షల నగదు
గూగుల్ నిర్వహించిన బగ్ బౌంటీ కార్యక్రమంలో ఉరుగ్వేకి చెందిన విద్యార్థి 31 వేల డాలర్లు గెలుచుకున్నారు. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఎజిక్వియల్ పెరీరా గూగుల్కు చెందిన క్లౌడ్ డెవలప్మెంట్ మేనేజర్లో భద్రతపరమైన లోపాన్ని గుర్తించారు. సైబర్ నేరగాళ్లు వేరో చోట నుంచే ఆపరేట్ చేసే అవకాశం కల్పించే బగ్ను కనిపెట్టడంతో గూగుల్.. పెరీరాకి 31,337 డాలర్లు (రూ.23.61లక్షలు) రివార్డుగా ఇచ్చింది.
మెయిల్లో బగ్.. ₹7.5లక్షలు విన్
రష్యాకి చెందిన ఈమెయిల్ ప్లాట్ఫాం mail.ruలో భద్రతపరమైన ఓ లోపాన్ని ఓ పరిశోధకుడు గుర్తించాడు. ఇందుకుగాను mail.ru అతడికి 10వేల డాలర్లు (రూ.7.5లక్షలు) నగదు బహుమతి ఇచ్చింది.
బగ్స్ను గుర్తించిన భారత కుర్రాళ్లు
ఇన్స్టాతో రూ. 22.65 లక్షలు
ఫేస్బుక్కు చెందిన ఇన్స్టాగ్రామ్లో ఓ బగ్ను చెన్నైకి చెందిన లక్ష్మణ్ ముతియా కనిపెట్టాడు. ఆ బగ్ వల్ల ఎవరి ఇన్స్టా అకౌంట్నైనా హ్యాక్ చేయొచ్చని నిరూపిస్తూ ఫేస్బుక్కు రిపోర్టు చేశాడు. ఈ బగ్ను పరిశీలించిన ఫేస్బుక్ బృందం సమస్యను పరిష్కరించడంతోపాటు లక్ష్మణ్కు 30 వేల డాలర్లు (రూ. 22.65లక్షలు) నగదు బహుమతి అందజేసింది.
ఫేస్బుక్తో రూ. 15 లక్షలు
ఏప్రిల్లో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఫేస్బుక్లో ఓ లోపాన్ని గుర్తించి భారత్కు చెందిన వినోత్ కుమార్ భారీ మొత్తంలో రివార్డు పొందాడు. లాగిన్ విత్ ఫేస్బుక్ బటన్లో ‘XSS’ బగ్ను వినోత్ కనిపెట్టాడు. ఈ బగ్ వల్ల ఫేస్బుక్ నుంచి థర్డ్ పార్టీ వెబ్సైట్లోకి వెళ్లే క్రమంలో సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నాడు. ఇందుకుగానూ వినోత్ 20వేల డాలర్లు (రూ.15.10లక్షలు) నగదు బహుమతి అందుకున్నాడు.
గూగుల్తో రూ. 7.6లక్షలు
కేరళకు చెందిన ప్రతీశ్ నారాయణన్ ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి. ఇటీవల గూగుల్ ప్రకటించిన బగ్ బౌంటీ కార్యక్రమంలో పాల్గొని ఓ బగ్ను గుర్తించాడు. సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ డివైజ్ల్లో శాశ్వతంగా దాడి చేసేందుకు వీలుగా ఏర్పడ్డ బగ్ను ప్రతీశ్ కనిపెట్టి గూగుల్కు నివేదిక పంపించాడు. దీంతో ప్రతీశ్కు గూగుల్ 10వేల డాలర్లు (రూ. 7.5లక్షలు) నగదు బహుమతి ఇచ్చింది. ఇది తొలిసారి కాదు.. ప్రతీశ్ గత రెండు మూడేళ్లలో 13 బగ్లు కనిపెట్టి రూ.లక్షలు సంపాదించాడు. ఇప్పటి వరకు ప్రతీశ్.. వాట్సాప్లో 9, గూగుల్లో 3, మైక్రోసాఫ్ట్కు చెందిన గిట్ హబ్లో ఒక బగ్ను కనిపెట్టాడు.
ఏడాదిలో రూ. 93 లక్షలు
23 ఏళ్ల శివమ్ విశిష్ఠ్ ఓ ప్రొఫెనల్ హ్యాకర్. ఏడాదిలో కాలంలో స్టార్బక్స్, ఇన్స్టాగ్రామ్, గోల్డ్మన్ సాచ్, ట్విటర్, జొమాటో, వన్ ప్లస్ తదితర కంపెనీ చెందిన ప్రొడక్ట్స్లో లోపాలు కనిపెట్టి 1,25,000 డాలర్లు (రూ.93 లక్షలు) గెలుచుకున్నాడు.
వాట్సాప్తో రూ. 3.5 లక్షలు
కోట్ల మంది యూజర్స్ ఉన్న వాట్సాప్లో భద్రతకు సంబంధించిన ఓ లోపాన్ని మన కుర్రాడు కనిపెట్టాడు. మణిపూర్కి చెందిన సివిల్ ఇంజినీర్ జోనెల్ సౌగైజామ్ కనిపెట్టిన లోపం ఏంటంటే.. వాట్సాప్ వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి తెలియకుండానే వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్కు మారేలా వీలు కలుగుతుందట. వ్యక్తిగత భద్రత విషయంలో కీలకమైన లోపాన్ని గుర్తించిన జోనెల్కు వాట్సాప్ యాజమాని అయిన ఫేస్బుక్ 5వేల డాలర్లు (రూ. 3.7లక్షలు) రివార్డు ఇవ్వడంతోపాటు ఫేస్బుక్ హాల్ ఆఫ్ ఫేమ్లో అతడికి చోటు కల్పించింది.
చిన్న మొత్తమే.. కానీ కీలక లోపం
కేరళకు చెందిన 19 ఏళ్ల అనంతకృష్ణన్ వాట్సాప్లో ఒక కీలక లోపాన్ని గుర్తించి ఫేస్బుక్ను హెచ్చరించాడు. వాట్సాప్లో ఓ బగ్ యూజర్ వాట్సాప్లో ఫైల్స్ అన్నింటిని యూజర్కి తెలియకుండానే హ్యాకర్ చోరీ చేసుకొనేందుకు అనుమతించేలా ఉందని గుర్తించాడు. వీలైనంత తర్వగా ఈ లోపాన్ని సరిచేయాలని కోరాడు. దీనిపై రెండు నెలలపాటు పరిశోధన చేసిన ఫేస్బుక్ సమస్యలను పరిష్కరించడంతోపాటు అనంతకృష్ణన్కు 500 డాలర్లు (సుమారు రూ. 37వేలు) రివార్డు ఇచ్చింది.
ఎంత మొత్తమో తెలియదు.. గానీ పెద్ద లోపం
40 కోట్ల మంది మైక్రోసాఫ్ట్ యూజర్ల డేటా హ్యాకింగ్ గురయ్యే ప్రమాదాన్ని కేరళకు చెందిన ఎన్కే సాహద్ ముందుగానే గుర్తించాడు. సెక్యూరిటీ రీసెర్చర్గా పనిచేస్తున్న సాహద్ తన సహచరులతో కలిసి మైక్రోసాఫ్ట్లోని పలు లోపాలను గుర్తించి సంస్థకు తెలిపాడు. సమస్యను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్కు ఐదు నెలలు పట్టింది. అనంతరం సాహద్కు రివార్డు ప్రకటించింది. అయితే ఎంత నగదు ఇచ్చిందో తెలపలేదు.
మే నెలకు సంబంధించి బగ్ బౌంటీ విశేషాల కోసం క్లిక్ చేయండి
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట