కరోనా కాలం: సురక్షిత ఆహారానికి 5 సూత్రాలు
చైనాలో పుట్టి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు పోతుందా అని ప్రపంచం ఎదురుచూస్తోంది. ఎక్కడికి వెళ్తాదమన్నా భయం...
కలుషిత ఆహారంతో ఏటా 4,20,000 మంది మృతి
జూన్ 7న ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం
డబ్ల్యూహెచ్వో పంచ సూత్రాలు
చైనాలో పుట్టి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు పోతుందా అని ప్రపంచం ఎదురుచూస్తోంది. ఎక్కడికి వెళ్తాదమన్నా భయం. ఏది ముట్టుకుందామన్నా ఆందోళన. కడుపారా ఏదైనా ఆరగిద్దామన్నా చింతే. ఎందుకంటే కొవిడ్-19కు ముందు లేదు. కసరత్తులు చేయడం. సరిపడా విశ్రాంతి తీసుకోవడం. సానుకూలంగా ఆలోచించడం. సురక్షితమైన ఆహారం తీసుకోవడంతోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మొదటి మూడూ మన చేతుల్లోనే ఉన్నా సురక్షిత ఆహారం మాత్రం కష్టం. ఎందుకంటే క్రిమి సంహారకాలు లేకుండా పంటలు పండించే పరిస్థితి లేదు. కలుషితం అయ్యాయో లేదో చాలాసార్లు గుర్తించలేం. అందులోని పోషకాల విలువలను లెక్కగట్టలేం. ఈ ఆదివారం (జూన్ 7) ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం. అందుకే కలుషిత ఆహారంతో నష్టాలు ఏంటి? సురక్షిత ఆహారం కోసం ఏం చేయాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. అవేంటో తెలుసుకుందామా!!
200 రోగాల భయం
మీకో విషయం తెలుసా? కలుషిత ఆహారం తినడం వల్ల ఏటా ప్రతి పది మందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు. ఫలితంగా 4,20,000 మంది చనిపోతున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఈ ముప్పు మరీ ఎక్కువ. ఏటా కలుషిత ఆహారంతో సంక్రమించే రోగాలతో 1,25,000 మంది చిన్నారులు మృతి చెందుతున్నారు. సరైన పద్ధతుల్లో ఆహారం వండితే 200 రోగాలను అడ్డుకోవచ్చు.
రోగాలు మెయిన్టెన్ చేయాలి
కలుషిత ఆహారం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయి. ప్రమాదకర లోహాలు కలవడం వల్ల ఆహారం విషతుల్యం అవుతుంది. దీంతో క్యాన్సర్, నరాల సంబంధమైన దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. అంటే జీవితాంతం వాటిని మెయిన్టెన్ చేయాల్సిందే. తరుచూ జబ్బుపడే వారు, వృద్ధులు, గర్భిణులు, శిశువులకు కలుషిత ఆహారంతో మరిన్ని సమస్యలు వస్తాయి. ఇవి ఊహించని విధంగా ఉంటాయి.
కలుషిత మార్గాలెన్నో?
ఈ రోజుల్లో ఆహారం కలుషితం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆహారం ఎన్నో దశలు దాటి మన చేతికి వస్తుంది. విత్తు నాటడం, పంట కోయడం, ప్రాసెస్ చేయడం, నిల్వ, రవాణా, పంపిణీ వంటి దశలు ఉంటాయి. మాంసాహారానికీ ఇలాగే ఉంటాయి. ఇవన్నీ కలుషితానికి దారితీస్తున్నాయి. పెరుగుతున్న ప్రపంచీకరణ సైతం కలుషిత ఆహార ఉత్పన్న రోగాలకు కారణం అవుతోంది.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఆహారం మరింత సురక్షితంగా ఉంచేందుకు బహుళ వ్యవస్థలు కలిసి పనిచేయాలి. శాస్త్ర, సాంకేతిక పద్ధతులు అవలంభించాలి. ప్రభుత్వంలోని వేర్వేరు శాఖలైన వ్యవసాయం, విద్య, వాణిజ్యం, ప్రజారోగ్యం, పౌర సరఫరాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. ఆహారం కలుషితం అవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థకు సైతం నష్టమే. ఎగుమతులు, దిగుమతులు, పర్యాటకం, ఆర్థిక అభివృద్ధిపై ప్రభావం పడుతుంది.
బ్యాక్టీరియా, వైరస్లకు నిరోధకశక్తి
కొన్ని ఔషధాలకు బ్యాక్టీరియా, వైరస్లు లొంగకపోవడం నేడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. వ్యవసాయం, పశు సంవర్థకం (మాంసాహారం)లో అతిగా యాంటీ మైక్రోబయల్స్ను ఉపయోగించడం, వైద్యం కోసం మనుషులు వాడటంతో బ్యాక్టీరియా, వైరస్కు వాటిని నిరోధించే శక్తి పెరుగుతోంది. ఇది మాంసాహారం ద్వారా మనుషులకు కలుగుతోంది. ఫలితంగా ఔషధాలు పనిచేయడం లేదు. ప్రభుత్వాలు సురక్షిత ఆహారంపై అవగాహన కల్పించాలి.
ఐదు సూత్రాలతో ఆహారం సురక్షితం
వేర్వేరుగా నిల్వ: వండిన, వండని ఆహార పదార్థాలను వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. అప్పుడు కలుషితమయ్యే అవకాశాలు తగ్గుతాయి.
పూర్తిగా ఉడికించండి: ఆహారాన్ని చక్కగా ఉడికించి వండిన తర్వాతే వడ్డించాలి. అప్పుడే క్రిములు పూర్తిగా నశిస్తాయి. పోషకాల స్థాయి పెరుగుతుంది.
ఉష్ణోగ్రత: వేర్వేరు ఆహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేసుకోవడం ఎంత ముఖ్యమో సరైన ఉష్ణోగ్రతల వద్ద వాటిని ఉంచడం అంత శ్రేయస్కరం.
శుభ్రమైన నీరు: కూరగాయాలు, వండని ఆహార పదార్థాలను కడిగేందుకు పరిశుభ్రమైన నీటిని ఉపయోగించాలి. నిర్దేశిత సమయం వరకు కడగాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు