కరోనా కాలం: సురక్షిత ఆహారానికి 5 సూత్రాలు
చైనాలో పుట్టి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు పోతుందా అని ప్రపంచం ఎదురుచూస్తోంది. ఎక్కడికి వెళ్తాదమన్నా భయం...
కలుషిత ఆహారంతో ఏటా 4,20,000 మంది మృతి
జూన్ 7న ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం
డబ్ల్యూహెచ్వో పంచ సూత్రాలు
చైనాలో పుట్టి అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు పోతుందా అని ప్రపంచం ఎదురుచూస్తోంది. ఎక్కడికి వెళ్తాదమన్నా భయం. ఏది ముట్టుకుందామన్నా ఆందోళన. కడుపారా ఏదైనా ఆరగిద్దామన్నా చింతే. ఎందుకంటే కొవిడ్-19కు ముందు లేదు. కసరత్తులు చేయడం. సరిపడా విశ్రాంతి తీసుకోవడం. సానుకూలంగా ఆలోచించడం. సురక్షితమైన ఆహారం తీసుకోవడంతోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మొదటి మూడూ మన చేతుల్లోనే ఉన్నా సురక్షిత ఆహారం మాత్రం కష్టం. ఎందుకంటే క్రిమి సంహారకాలు లేకుండా పంటలు పండించే పరిస్థితి లేదు. కలుషితం అయ్యాయో లేదో చాలాసార్లు గుర్తించలేం. అందులోని పోషకాల విలువలను లెక్కగట్టలేం. ఈ ఆదివారం (జూన్ 7) ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం. అందుకే కలుషిత ఆహారంతో నష్టాలు ఏంటి? సురక్షిత ఆహారం కోసం ఏం చేయాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. అవేంటో తెలుసుకుందామా!!
200 రోగాల భయం
మీకో విషయం తెలుసా? కలుషిత ఆహారం తినడం వల్ల ఏటా ప్రతి పది మందిలో ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు. ఫలితంగా 4,20,000 మంది చనిపోతున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఈ ముప్పు మరీ ఎక్కువ. ఏటా కలుషిత ఆహారంతో సంక్రమించే రోగాలతో 1,25,000 మంది చిన్నారులు మృతి చెందుతున్నారు. సరైన పద్ధతుల్లో ఆహారం వండితే 200 రోగాలను అడ్డుకోవచ్చు.
రోగాలు మెయిన్టెన్ చేయాలి
కలుషిత ఆహారం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయి. ప్రమాదకర లోహాలు కలవడం వల్ల ఆహారం విషతుల్యం అవుతుంది. దీంతో క్యాన్సర్, నరాల సంబంధమైన దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. అంటే జీవితాంతం వాటిని మెయిన్టెన్ చేయాల్సిందే. తరుచూ జబ్బుపడే వారు, వృద్ధులు, గర్భిణులు, శిశువులకు కలుషిత ఆహారంతో మరిన్ని సమస్యలు వస్తాయి. ఇవి ఊహించని విధంగా ఉంటాయి.
కలుషిత మార్గాలెన్నో?
ఈ రోజుల్లో ఆహారం కలుషితం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆహారం ఎన్నో దశలు దాటి మన చేతికి వస్తుంది. విత్తు నాటడం, పంట కోయడం, ప్రాసెస్ చేయడం, నిల్వ, రవాణా, పంపిణీ వంటి దశలు ఉంటాయి. మాంసాహారానికీ ఇలాగే ఉంటాయి. ఇవన్నీ కలుషితానికి దారితీస్తున్నాయి. పెరుగుతున్న ప్రపంచీకరణ సైతం కలుషిత ఆహార ఉత్పన్న రోగాలకు కారణం అవుతోంది.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఆహారం మరింత సురక్షితంగా ఉంచేందుకు బహుళ వ్యవస్థలు కలిసి పనిచేయాలి. శాస్త్ర, సాంకేతిక పద్ధతులు అవలంభించాలి. ప్రభుత్వంలోని వేర్వేరు శాఖలైన వ్యవసాయం, విద్య, వాణిజ్యం, ప్రజారోగ్యం, పౌర సరఫరాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. ఆహారం కలుషితం అవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థకు సైతం నష్టమే. ఎగుమతులు, దిగుమతులు, పర్యాటకం, ఆర్థిక అభివృద్ధిపై ప్రభావం పడుతుంది.
బ్యాక్టీరియా, వైరస్లకు నిరోధకశక్తి
కొన్ని ఔషధాలకు బ్యాక్టీరియా, వైరస్లు లొంగకపోవడం నేడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. వ్యవసాయం, పశు సంవర్థకం (మాంసాహారం)లో అతిగా యాంటీ మైక్రోబయల్స్ను ఉపయోగించడం, వైద్యం కోసం మనుషులు వాడటంతో బ్యాక్టీరియా, వైరస్కు వాటిని నిరోధించే శక్తి పెరుగుతోంది. ఇది మాంసాహారం ద్వారా మనుషులకు కలుగుతోంది. ఫలితంగా ఔషధాలు పనిచేయడం లేదు. ప్రభుత్వాలు సురక్షిత ఆహారంపై అవగాహన కల్పించాలి.
ఐదు సూత్రాలతో ఆహారం సురక్షితం
వేర్వేరుగా నిల్వ: వండిన, వండని ఆహార పదార్థాలను వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. అప్పుడు కలుషితమయ్యే అవకాశాలు తగ్గుతాయి.
పూర్తిగా ఉడికించండి: ఆహారాన్ని చక్కగా ఉడికించి వండిన తర్వాతే వడ్డించాలి. అప్పుడే క్రిములు పూర్తిగా నశిస్తాయి. పోషకాల స్థాయి పెరుగుతుంది.
ఉష్ణోగ్రత: వేర్వేరు ఆహార పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేసుకోవడం ఎంత ముఖ్యమో సరైన ఉష్ణోగ్రతల వద్ద వాటిని ఉంచడం అంత శ్రేయస్కరం.
శుభ్రమైన నీరు: కూరగాయాలు, వండని ఆహార పదార్థాలను కడిగేందుకు పరిశుభ్రమైన నీటిని ఉపయోగించాలి. నిర్దేశిత సమయం వరకు కడగాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్