Kerala : అక్కడ దెయ్యాలు సంచరిస్తున్నాయనేవారు.. ఇప్పుడదే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం!
కేరళలోని మట్టాన్చెర్రీ ఇప్పుడు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది. అక్కడి యూదుల పురాతన నివాసాలు క్రమంగా ఆతిథ్యం పలికే హోటళ్లుగా మారుతున్నాయి.
(Image : A.B.Salem House facebook)
కేరళ(kerala) రాష్ట్రం కొచ్చిన్లో టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో అక్కడి మట్టాన్చెర్రీలోని(Mattancherry) జూ స్ట్రీట్లో 350 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ ఇంటిని హోటల్గా మార్చారు. అది ‘యూదుల గాంధీ’గా(Jewish Gandhi) పేరొందిన అబ్రహం బెన్ బరాక్ అలియాస్ ఏబీ సేలం(AB Salem) నివసించిన ఇల్లు కావడం విశేషం. ఆయన లాయర్గా పనిచేసేవారు. భారత స్వాతంత్య్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఇంటికి ఇప్పుడు కొన్ని హంగులు అద్ది అందమైన హోటల్గా రూపొందించారు.
ఇదే తరహాలో 17వ శతాబ్దానికి చెందిన వ్యాపారి(businessman) రబ్బీ రెహాబీ ఎహెజ్కేల్ ఇంటిని కూడా బోటిక్ హోటల్గా మార్చే పనులు జరుగుతున్నాయి. లైలా మంజిల్గా దీన్ని పిలుస్తుంటారు. ఈ ఏడాదిలోనే ఆ పనులు పూర్తి కానున్నాయి. రబ్బీ రెహాబీ ఇల్లు ఉండే వీధి చివర్లోనే ప్రసిద్ధ యూదుల ప్రార్థనాలయం ఉంది. ఎలియాస్ కోడర్ అనే ప్రముఖ వ్యాపారి నివసించిన మరో ఇంటిని కూడా 8 గదులతో ఓ హోటల్గా సిద్ధం చేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి కంటే ముందు నుంచే ఈ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది కల్లా పూర్తి కానున్నాయి. ఏబీ సేలం, ఎహెజ్కేల్ రెండింటినీ జోస్ డొమినిక్ కొనుగోలు చేశాడు. 2017, 18 సంవత్సరాల్లో అవి అమ్మకానికి వచ్చాయి. ఈ ప్రాంతానికి మళ్లీ యూదుల కాలం నాటి కళ తీసుకురావాలని డొమినిక్ సంకల్పించాడు. అందుకే రెండు ఇళ్లను ఆతిథ్యానికి చిరునామాగా మార్చేందుకు యత్నిస్తున్నాడు.
(Image : A.B.Salem House facebook)
యూదుల వారసత్వానికి ప్రతీకలు..
మట్టాన్చెర్రీలోని జూ స్ట్రీట్లో ఇళ్లన్నీ సెఫార్డిక్ యూదులు నివసించినవి. స్పెయిన్ నుంచి వారు 15, 16వ శతాబ్దాల కాలంలో భారత్కు వచ్చారు. కేరళ రాష్ట్రం కొచ్చిన్లోని సినాగోగ్ లేన్ ప్రాంతాన్ని నివాస ప్రాంతంగా ఎంచుకొని మనుగడ సాగించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1958లో వీరిలో చాలా మంది ఇజ్రాయెల్కు వలస వెళ్లారు. అప్పటి నుంచి ఈ యూదుల నివాసాలు వారి వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇళ్ల కట్టడాలు, పై కప్పులు, విద్యుద్దీపాలు, కుర్చీలు ఇతర వస్తువుల్లో యూదుల సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది. దాదాపు 90వ దశకం వరకు ఇక్కడ ఎలాంటి మార్పులూ రాలేదనే చెప్పొచ్చు. ఆ తరువాత క్రమంగా స్థానిక వ్యాపారులు ఇళ్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరం నాటికి దాదాపు ప్రతి ఇంటి యాజమాన్య హక్కులు వేరొకరి బదిలీ అయ్యాయి. కొన్ని మాత్రమే అలాగే ఉండిపోయాయి.
మారుతున్న రూపురేఖలు
కొచ్చిన్లో పర్యాటకం ఊపందుకోవడంతో కొనుగోలు చేసిన ఇళ్లను చాలా మంది అద్దెకిచ్చారు. కశ్మీర్కు చెందిన వ్యాపారులు సైతం ఇక్కడకు వచ్చి అద్దెగదుల్లో ఉంటూ తమ చేతివృత్తులను విక్రయించారు. కొచ్చిన్ మార్కెట్లో సుగంధ ద్రవ్యాలు, పురాతన వస్తువుల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. దాంతో ఈ యూదుల పట్టణం కాస్తా పురాతన వస్తువులు, సుగంధ ద్రవ్యాల మార్కెట్గా మారిపోయింది. అయితే సాయంత్రం దుకాణాలు మూసిన తరువాత ఈ వీధుల్లో దెయ్యాలు సంచరిస్తున్నాయనే వదంతులు వచ్చాయి. మరణించిన యూదుల్లో కొందరు దెయ్యాలుగా మారారని.. రాత్రిపూట వారి ఏడుపులు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్పేవారు. కానీ, క్రమంగా ఆ వదంతులు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడి యూదుల ప్రార్థనాలయం కూడా పర్యాటకుల రాకపోకలకు కారణమైంది. రోజుకు దాదాపు వెయ్యిమంది దీనిని సందర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం పర్యాటకులను ఆకర్షించేందుకు ‘కొచ్చిన్ స్మార్ట్ మిషన్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూరోపియన్ సంస్కృతి ప్రతిబింబించేలా కాలువలు, పాదబాటలు, వీధి దీపాలు, కుర్చీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ మార్పులను చూసి స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కారణంగా ఈ ప్రాంతంలో భూమి ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో అక్కడి వ్యాపార సముదాయాల అద్దెలు కూడా భారీగా పెరిగాయి. రోజురోజుకీ సుగంధ ద్రవ్యాల వ్యాపారం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆతిథ్యరంగం ఇక్కడ మరింత ఊపందుకుంటుందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?