Kerala : అక్కడ దెయ్యాలు సంచరిస్తున్నాయనేవారు.. ఇప్పుడదే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం!
కేరళలోని మట్టాన్చెర్రీ ఇప్పుడు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతోంది. అక్కడి యూదుల పురాతన నివాసాలు క్రమంగా ఆతిథ్యం పలికే హోటళ్లుగా మారుతున్నాయి.
(Image : A.B.Salem House facebook)
కేరళ(kerala) రాష్ట్రం కొచ్చిన్లో టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో అక్కడి మట్టాన్చెర్రీలోని(Mattancherry) జూ స్ట్రీట్లో 350 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ ఇంటిని హోటల్గా మార్చారు. అది ‘యూదుల గాంధీ’గా(Jewish Gandhi) పేరొందిన అబ్రహం బెన్ బరాక్ అలియాస్ ఏబీ సేలం(AB Salem) నివసించిన ఇల్లు కావడం విశేషం. ఆయన లాయర్గా పనిచేసేవారు. భారత స్వాతంత్య్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఇంటికి ఇప్పుడు కొన్ని హంగులు అద్ది అందమైన హోటల్గా రూపొందించారు.
ఇదే తరహాలో 17వ శతాబ్దానికి చెందిన వ్యాపారి(businessman) రబ్బీ రెహాబీ ఎహెజ్కేల్ ఇంటిని కూడా బోటిక్ హోటల్గా మార్చే పనులు జరుగుతున్నాయి. లైలా మంజిల్గా దీన్ని పిలుస్తుంటారు. ఈ ఏడాదిలోనే ఆ పనులు పూర్తి కానున్నాయి. రబ్బీ రెహాబీ ఇల్లు ఉండే వీధి చివర్లోనే ప్రసిద్ధ యూదుల ప్రార్థనాలయం ఉంది. ఎలియాస్ కోడర్ అనే ప్రముఖ వ్యాపారి నివసించిన మరో ఇంటిని కూడా 8 గదులతో ఓ హోటల్గా సిద్ధం చేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి కంటే ముందు నుంచే ఈ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది కల్లా పూర్తి కానున్నాయి. ఏబీ సేలం, ఎహెజ్కేల్ రెండింటినీ జోస్ డొమినిక్ కొనుగోలు చేశాడు. 2017, 18 సంవత్సరాల్లో అవి అమ్మకానికి వచ్చాయి. ఈ ప్రాంతానికి మళ్లీ యూదుల కాలం నాటి కళ తీసుకురావాలని డొమినిక్ సంకల్పించాడు. అందుకే రెండు ఇళ్లను ఆతిథ్యానికి చిరునామాగా మార్చేందుకు యత్నిస్తున్నాడు.
(Image : A.B.Salem House facebook)
యూదుల వారసత్వానికి ప్రతీకలు..
మట్టాన్చెర్రీలోని జూ స్ట్రీట్లో ఇళ్లన్నీ సెఫార్డిక్ యూదులు నివసించినవి. స్పెయిన్ నుంచి వారు 15, 16వ శతాబ్దాల కాలంలో భారత్కు వచ్చారు. కేరళ రాష్ట్రం కొచ్చిన్లోని సినాగోగ్ లేన్ ప్రాంతాన్ని నివాస ప్రాంతంగా ఎంచుకొని మనుగడ సాగించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1958లో వీరిలో చాలా మంది ఇజ్రాయెల్కు వలస వెళ్లారు. అప్పటి నుంచి ఈ యూదుల నివాసాలు వారి వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇళ్ల కట్టడాలు, పై కప్పులు, విద్యుద్దీపాలు, కుర్చీలు ఇతర వస్తువుల్లో యూదుల సంస్కృతి ప్రతిబింబిస్తూ ఉంటుంది. దాదాపు 90వ దశకం వరకు ఇక్కడ ఎలాంటి మార్పులూ రాలేదనే చెప్పొచ్చు. ఆ తరువాత క్రమంగా స్థానిక వ్యాపారులు ఇళ్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. 2000 సంవత్సరం నాటికి దాదాపు ప్రతి ఇంటి యాజమాన్య హక్కులు వేరొకరి బదిలీ అయ్యాయి. కొన్ని మాత్రమే అలాగే ఉండిపోయాయి.
మారుతున్న రూపురేఖలు
కొచ్చిన్లో పర్యాటకం ఊపందుకోవడంతో కొనుగోలు చేసిన ఇళ్లను చాలా మంది అద్దెకిచ్చారు. కశ్మీర్కు చెందిన వ్యాపారులు సైతం ఇక్కడకు వచ్చి అద్దెగదుల్లో ఉంటూ తమ చేతివృత్తులను విక్రయించారు. కొచ్చిన్ మార్కెట్లో సుగంధ ద్రవ్యాలు, పురాతన వస్తువుల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. దాంతో ఈ యూదుల పట్టణం కాస్తా పురాతన వస్తువులు, సుగంధ ద్రవ్యాల మార్కెట్గా మారిపోయింది. అయితే సాయంత్రం దుకాణాలు మూసిన తరువాత ఈ వీధుల్లో దెయ్యాలు సంచరిస్తున్నాయనే వదంతులు వచ్చాయి. మరణించిన యూదుల్లో కొందరు దెయ్యాలుగా మారారని.. రాత్రిపూట వారి ఏడుపులు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్పేవారు. కానీ, క్రమంగా ఆ వదంతులు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడి యూదుల ప్రార్థనాలయం కూడా పర్యాటకుల రాకపోకలకు కారణమైంది. రోజుకు దాదాపు వెయ్యిమంది దీనిని సందర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం పర్యాటకులను ఆకర్షించేందుకు ‘కొచ్చిన్ స్మార్ట్ మిషన్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూరోపియన్ సంస్కృతి ప్రతిబింబించేలా కాలువలు, పాదబాటలు, వీధి దీపాలు, కుర్చీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ మార్పులను చూసి స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కారణంగా ఈ ప్రాంతంలో భూమి ధర కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో అక్కడి వ్యాపార సముదాయాల అద్దెలు కూడా భారీగా పెరిగాయి. రోజురోజుకీ సుగంధ ద్రవ్యాల వ్యాపారం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆతిథ్యరంగం ఇక్కడ మరింత ఊపందుకుంటుందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు