Spy pigeon : పావురాలు వర్తమానం మోసుకెళ్లలేదు .. గూఢచర్యంతో యుద్ధాల్ని నడిపాయి!
ఇటీవలి కాలంలో కొన్ని అనుమానాస్పద పావురాల(Pigeon)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి కెమెరాలు, ట్యాగ్లు ఉండటంతో కలకలం రేగుతోంది.
కెమెరా, మైక్రోచిప్లు అమర్చిన ఓ పావురాన్ని ఒడిశా(Odisha) జగత్సింగ్పుర్ జిల్లాలోని పారాదీప్ సముద్ర(Sea)తీరంలో తాజాగా గుర్తించారు. ఈ పక్షిని గూఢచర్యం(Spy) కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు పావురాలకు గూఢచర్యం చేసే తెలివితేటలున్నాయా? ఇప్పటి వరకు వివిధ దేశాలు పావురాలను ఏ విధంగా వినియోగించాయో తెలుసుకోండి.
క్రీస్తు పూర్వం నుంచే..
పావురాలను గూఢచర్యం కోసం ఉపయోగించడం పూర్వం రోజుల నుంచే జరుగుతోంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే పర్షియా రాజు సైరస్ తన రాజ్యంలోని వివిధ ప్రదేశాలకు పావురాలను పంపేవాడు. జూలియస్ సీజర్ కూడా తన భూభాగమైన గౌల్కు పావురాల ద్వారా వర్తమానం పంపించినట్లు కొందరు చరిత్రకారులు తమ రచనల్లో పేర్కొన్నారు. ఆ తరువాత 19వ శతాబ్దంలో జరిగిన ఫ్రాన్సో-(ప్రష్యన్)జర్మనీ యుద్ధంలోనూ పావురాలు వాడారు. ఫ్రాన్స్ సైనికులు గూఢచర్యం కోసం పావురాలను వినియోగించగా.. వాటిని కట్టడి చేసేందుకు జర్మనీ గద్దలను ఉసిగొల్పింది.
మొదటి ప్రపంచ యుద్ధంలో..
హోమింగ్ జాతి పావురాలను మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఎక్కువగా వినియోగించారు. ఫ్రాన్స్ 72 పావురాల గూళ్లను తమ ఆర్మీ బలగాలతో పంపించింది. యూఎస్ (America)ఆర్మీ సిగ్నల్ క్రాప్స్ 600 పావురాలను గూఢచర్యం కోసం వినియోగించింది. అందులో ఒక పావురమైన ‘ఛెర్ అమి’ సేవలను గుర్తిస్తూ దానికి ‘క్రోయిక్స్ దె గ్యూరె అవార్డు’ ఇచ్చారు. ‘బ్యాటిల్ ఆఫ్ వెర్డన్’లో ఈ పావురం 12 ముఖ్యమైన సందేశాలను తీసుకెళ్లింది. చివరిసారిగా ఓ ముఖ్యమైన సందేశం చేరవేస్తున్న సమయంలో అది గాయపడింది. అయినప్పటికీ విజయవంతంగా ఆ సందేశాన్ని చేరవేయడంతో 194 మంది అమెరికా సైనికులు తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు. యుద్ధ సమయంలో విమానం గాల్లో ఉండగా పావురాలను బయటకు పంపించి తమ ముఖ్య స్థావరాలకు సందేశాలను పంపించేవారు.
రెండో ప్రపంచ యుద్ధంలో..
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యూకే అత్యధికంగా 2.50లక్షల పావురాలను వినియోగించింది. వాటి సేవలను గుర్తిస్తూ 32 పావురాలకు అవార్డులు కూడా ప్రదానం చేసింది. అందులో అమెరికాకు చెందిన జీఐ జో, ఐరిష్ పావురం ప్యాడీ కూడా ఉన్నాయి. వాయుసేనలో పావురాలకు ప్రత్యేక విభాగాన్ని కూడా యూకే ఏర్పాటు చేసింది. పావురాల్లో కొన్నింటికి చిన్నపాటి పేలుడు పదార్థాలు, జీవాయుధాలు మోసుకెళ్లే విధంగానూ శిక్షణనిచ్చారనే వదంతులు అప్పట్లో వచ్చాయి. యుద్ధ సమయంలో వినియోగించుకున్న పావురాలకు ప్రత్యేకంగా మొక్కజొన్న, ఇతర గింజలు పెట్టేవారట.
ఇప్పుడూ కపట కపోతాలు!
రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసిన తరువాత నుంచి పావురాల గూఢచర్యం గురించి అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తున్నాయి. 2010లో ఓ పావురం పాకిస్థాన్ నుంచి భారత్కు వచ్చినట్లుగా అనుమానించి దానిని బంధించారు. 2015లో దొరికిన మరో పావురాన్ని ‘అనుమానాస్పద గూఢచారి’గా రికార్డులో నమోదు చేశారు. 2020 మేలో జమ్మూకశ్మీర్లో మరో కపోతాన్ని కనుగొన్నారు. అయితే దాని వద్ద అనుమానాస్పద వస్తువులేవీ దొరకకపోవడంతో వెనక్కి వదిలారు. గతేడాది ప్రకాశం జిల్లాలోనూ ఓ పావురం కనిపించింది.
‘హోమింగ్’ రయ్రయ్
పావురాలు సుదూర ప్రయాణం చేయగలవు. వాటిలో కొన్ని ఎంత దూరం వెళ్లినా తాము బయలుదేరిన ప్రదేశానికి తిరిగి చేరుకోగలవు. అటువంటి పావురాలను ‘హోమింగ్’ పావురాలుగా పిలుస్తారు. ఇవి గంటకు 97 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అలా రోజుకు దాదాపు వెయ్యికిలోమీటర్లు సునాయాసంగా వెళతాయి. అందుకే వాటి కాళ్లకు చిన్నపాటి డబ్బాలను కట్టి అందులో మందుగుండ్లు, సందేశాలు పంపించేవారు. ఇటీవలి కాలంలో కెమెరాలు, ట్యాగ్లు అమర్చిన పావురాలు దొరుకుతున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు