Lemon melon : ‘లెమన్ మెలన్’ రుచి చూస్తారా.. పేరుకు తగ్గ పండు!
పులుపు, తీపి కలబోతగా ఉండే సరికొత్త పండు ‘లెమన్ మెలన్’ (lemon melon) జపనీస్ మార్కెట్లలోకి వచ్చింది. ఈ సరికొత్త ఫలాన్ని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకోండి.
Image : suntory
నిమ్మకాయ పుల్లగా.. పుచ్చకాయ తియ్యగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఈ రెండూ కలిపి తింటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు ‘లెమన్ మెలన్’ను (lemon melon) రుచి చూడాల్సిందే. జపాన్ (Japan) దేశంలో ఈ సరికొత్త రుచిగల పండును కనుగొన్నారు. ఇప్పుడిప్పుడే అక్కడి మార్కెట్లోకి వస్తున్న ఆ పండును కొనుగోలు చేయడానికి చాలామంది ఉత్సాహం కనబరుస్తున్నారు. దాని విశేషాలేంటో తెలుసుకోండి.
ఐదేళ్లు కొనసాగిన పరిశోధన
జపనీస్ హార్టికల్చర్ కంపెనీ సన్టోరీ ఫ్లవర్స్ ఈ పండును అభివృద్ధి చేసింది. ఉద్యానవన నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతులు కలిసి సుమారు ఐదేళ్లు అనేక పరిశోధనలు చేసిన తర్వాత ‘లెమన్ మెలన్’ సృష్టి జరిగింది. ఈ పండును అభివృద్ధి చేసేందుకు వినియోగించిన పుచ్చకాయలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తొలి రోజుల్లో అనేక రకాల ప్రయోగాలు చేసి విఫలమయ్యారు. కానీ, మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ సుమారు ఐదేళ్లు శ్రమించిన తర్వాత ఎట్టకేలకు ‘లెమన్ మెలన్’ను ప్రపంచానికి పరిచయం చేయగలిగారు. ఈ పరిశోధనా కాలంలో ఉద్యానవన నిపుణులు ఆ పండులోని పోషకాల రుచిని అనేక రకాలుగా పరిశీలించి చూశారు. ఈ పంటను పండించే పద్ధతులు. కాపు రావడానికి పట్టే సమయం తదితర ముఖ్యమైన వివరాలను నమోదు చేశారు. అలా ఈ కొత్త రకం పండ్ల సాగు చివరికి విజయవంతమైంది.
ఆహా ఏమి రుచి!
ఇక పండు రుచి విషయానికి వస్తే ఒక నిమ్మకాయ ఎలాంటి పుల్లదనం ఇస్తుందో ఈ పండులోనూ అలాంటి పులుపు లభిస్తుంది. అలాగే వేసవికాలంలో మనం ఇష్టంగా తినే పుచ్చకాయ రుచి ఎంత తీయగా నోటికి తగులుతుందో ఇది కూడా అలాంటి అనుభూతినిస్తుంది. అందుకే ఇది వేసవికాలంలో అందరూ ఇష్టంగా తినదగిన పండని దాని తయారీదారులు చెబుతున్నారు. ఇక ఆకారం విషయానికి వస్తే ఇది చూడటానికి గుండ్రంగా కనిపిస్తోంది. మామూలు పుచ్చకాయలాగా దీనిపై చారలు లేవు. లోపల గుజ్జు మాత్రం తెల్లగా ఉంటుంది. ఇది ఇంచుమించు పియర్ పండులాగే కనిపిస్తుందని చాలామంది చెబుతున్నారు. లెమన్ మెలన్ పండితే చాలా మెత్తగా మారుతుందట.
ఖరీదైన పండ్ల జాబితాలోకి..
ప్రస్తుతం హొక్కాయ్డో ప్రాంతానికి చెందిన ఐదుగురు రైతులు మాత్రమే ‘లెమన్ మెలన్’ పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ముగిసేలోగా 3,800 పండ్లను వారు పండించనున్నారు. జపాన్లోని చాలా సూపర్ మార్కెట్లలో ఇప్పటికే లెమన్ మెలన్లు కన్పిస్తున్నాయి. ఒక్కో పండును 22 డాలర్లకు విక్రయిస్తున్నారు. అయినా సరే అవి దొరికితే చాలని చాలా మంది ఎగబడి మరీ కొంటున్నారు. ఈ అద్భుతమైన పండును ఒక్కసారైనా తిని చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ‘ఇది నిమ్మకాయ లాంటి పుల్లదనం పుచ్చకాయ వంటి తీయదనం కలిగి ఉంది. తినడానికి చాలా రుచిగా ఉందని’ ఓ కొనుగోలుదారుడు పేర్కొన్నాడు. ‘ఈ పండులో తీయదనం, పుల్లదనం సమపాళ్లలో ఉంది. వేసవిలో తినడానికి ఇది చాలా మంచి పండు’ అని మరొకరు చెప్పారు. జపాన్ లగ్జరీ ఫ్రూట్ మార్కెట్లలో ఇప్పటికే చాలా ఖరీదైన పండ్లు లభిస్తున్నాయి. వాటి జాబితాలోకి తాజాగా లెమన్ మెలన్ వచ్చి చేరింది. జపాన్ మార్కెట్లలో ప్రపంచంలోనే ఖరీదైన చదరపు ఆకృతి పుచ్చకాయలు, ద్రాక్ష, తెల్లని స్ట్రాబెరీలు విరివిగా దొరుకుతాయి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్