Raccoon dog : జపాన్లో రాకూన్ జాతి కుక్కల ‘ఎపిసోడ్’.. అలా మొదలైంది!
రాకూన్ జాతి కుక్కలు (Raccoon dog) జపాన్కు (Japan) చెందినవి కాదు. అయినా వాటి సంతతి అక్కడ గణనీయంగా అభివృద్ధి చెందింది. అందుకు కారణం ఓ యానిమేటెడ్ సిరీస్ (Anime series).
ఇటీవల చైనా(China)లోని వుహాన్(wuhan)లో హువానాన్ టోకు చేపల మార్కెట్ నుంచి డేటా సేకరించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం రాకూన్ జాతి కుక్కల (Raccoon dog) జన్యుపదార్థంలో కొవిడ్(Covid) కారక సార్స్కోవ్-2 వైరస్ ఆనవాళ్లు కనిపించాయని తేల్చింది. అయితే, కరోనా వ్యాప్తికి ఈ కుక్కలే కారణమని ఆ పరిశోధన పూర్తిస్థాయిలో నిరూపించలేకపోయింది. ఈ కుక్కలు చైనాలో మాత్రమే కాకుండా కొరియా, అమెరికా, జపాన్లోనూ (Japan) ఉన్నాయి. జపాన్లో ఈ జాతి కుక్కలు విస్తరించడానికి వెనకున్న ఆసక్తికర విషయం తెలుసుకోండి.
వెర్రెత్తించిన ఎపిసోడ్లు!
అమెరికాకు చెందిన రచయిత స్టెర్లింగ్ నార్త్ 1963లో ‘రాస్కెల్ : ఎ మెమోయిర్ ఆఫ్ బెటర్ ఎరా’ అనే పుస్తకాన్ని విడుదల చేశాడు. అది ఓ బాలుడు ‘రాస్కెల్’ పేరుతో ఉన్న రాకూన్తో కలిసి చేసిన సాహసాలను చెబుతుంది. ఆ పుస్తకానికి మంచి ఆదరణ రావడంతో డిస్నీ దాన్ని యాక్షన్ చిత్రంగా రూపొందించాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో ఆ పుస్తకం ఆధారంగా జపాన్లో 52 ఎపిసోడ్లతో యానిమేటెడ్ సిరీస్ను రూపొందించారు. దాని పేరు ‘రాస్కెల్ ది రాకూన్’. జపనీస్లో ‘అరైగుమ రసకరు’. 1977లో ఒక సంవత్సరంపాటు ఈ ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. దాంతో రాకూన్లను పెంపుడు జంతువులుగా చేసుకోవాలని జపాన్ చిన్నారులు ఉబలాటపడ్డారు. కానీ, అప్పటికి జపాన్లో ఆ జీవులు లేవు. అందువల్ల అమెరికా నుంచి వేల సంఖ్యలో రాకూన్ కూనలను దిగుమతి చేసుకున్నారు.
వదిలితే బీభత్సం
వాస్తవానికి రాకూన్ కథ చివరిలో దాన్ని ఒక వైల్డ్ యానిమల్ అని స్పష్టంగా పేర్కొన్నారు. అవి మనుషులు పెంచుకోవడానికి పనికి రావని తెలిసి కథలోని బాలుడు దాన్ని అడవిలో వదిలి పెట్టేస్తాడు. కానీ, జపాన్లో మాత్రం వాటిని పెంచుకోవడానికి ఆసక్తి చూపించడంతో సమస్య మొదలైంది. కొందరు ఎపిసోడ్లలో చూపించిన విధంగానే పెరిగి పెద్దవైన వాటిని అడవిలో వదిలిపెట్టారు. ఒక్కసారిగా బయటకు వెళ్లిన రాకూన్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. తొందరగా తమ సంతతిని వృద్ధి చేయడం వాటి సహజ లక్షణం. అందువల్ల రాకూన్ల మంద విపరీతంగా పెరిగిపోయింది. అవి పంటలను నాశనం చేశాయి. పవిత్రమైన దేవాలయాలు, ఇళ్లలోకి చొరబడి గందరగోళం సృష్టించాయి. అప్పట్లోనే లక్షల డాలర్ల నష్టం వాటిల్లింది. అమెరికాలో రాకూన్లు ఉన్నప్పటికీ వాటిని తోడేళ్లు, ఇతర జంతువులు వేటాడి తినేసేవి. దాంతో ఆ జంతువుల సంఖ్య రెట్టింపు కాలేదు.
కొనసాగుతున్న ఆదరణ
జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు జపాన్ ప్రభుత్వం రాకూన్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఉన్న వాటిని అధికారులు కట్టడి చేయాలని ప్రయత్నించినా అప్పటికే అవి వేల సంఖ్యలో ఉన్నాయి. పైగా కొన్ని రాకూన్లు ఊర్లలోకి ప్రవేశించి ఆహారం కోసం చెత్తకుండీలను వెతకడం ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని మనుషులపైనా దాడికి దిగాయి. దాంతో స్థానిక ప్రభుత్వాలు వాటిని నిర్మూలించాలని నిర్ణయానికి వచ్చాయి. ఆ దిశగా చర్యలు చేపట్టడంతో జంతుహక్కుల కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. అందువల్ల వాటి సంఖ్యను మాత్రమే తగ్గించగలిగారు. ప్రస్తుతం జపాన్లో రాకూన్ జాతి కుక్కల బీభత్సం అడపాదడపా కొనసాగుతున్నప్పటికీ ఆ యానిమేటెడ్ సిరీస్ను మాత్రం ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు