Raccoon dog : జపాన్లో రాకూన్ జాతి కుక్కల ‘ఎపిసోడ్’.. అలా మొదలైంది!
రాకూన్ జాతి కుక్కలు (Raccoon dog) జపాన్కు (Japan) చెందినవి కాదు. అయినా వాటి సంతతి అక్కడ గణనీయంగా అభివృద్ధి చెందింది. అందుకు కారణం ఓ యానిమేటెడ్ సిరీస్ (Anime series).
ఇటీవల చైనా(China)లోని వుహాన్(wuhan)లో హువానాన్ టోకు చేపల మార్కెట్ నుంచి డేటా సేకరించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం రాకూన్ జాతి కుక్కల (Raccoon dog) జన్యుపదార్థంలో కొవిడ్(Covid) కారక సార్స్కోవ్-2 వైరస్ ఆనవాళ్లు కనిపించాయని తేల్చింది. అయితే, కరోనా వ్యాప్తికి ఈ కుక్కలే కారణమని ఆ పరిశోధన పూర్తిస్థాయిలో నిరూపించలేకపోయింది. ఈ కుక్కలు చైనాలో మాత్రమే కాకుండా కొరియా, అమెరికా, జపాన్లోనూ (Japan) ఉన్నాయి. జపాన్లో ఈ జాతి కుక్కలు విస్తరించడానికి వెనకున్న ఆసక్తికర విషయం తెలుసుకోండి.
వెర్రెత్తించిన ఎపిసోడ్లు!
అమెరికాకు చెందిన రచయిత స్టెర్లింగ్ నార్త్ 1963లో ‘రాస్కెల్ : ఎ మెమోయిర్ ఆఫ్ బెటర్ ఎరా’ అనే పుస్తకాన్ని విడుదల చేశాడు. అది ఓ బాలుడు ‘రాస్కెల్’ పేరుతో ఉన్న రాకూన్తో కలిసి చేసిన సాహసాలను చెబుతుంది. ఆ పుస్తకానికి మంచి ఆదరణ రావడంతో డిస్నీ దాన్ని యాక్షన్ చిత్రంగా రూపొందించాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో ఆ పుస్తకం ఆధారంగా జపాన్లో 52 ఎపిసోడ్లతో యానిమేటెడ్ సిరీస్ను రూపొందించారు. దాని పేరు ‘రాస్కెల్ ది రాకూన్’. జపనీస్లో ‘అరైగుమ రసకరు’. 1977లో ఒక సంవత్సరంపాటు ఈ ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. దాంతో రాకూన్లను పెంపుడు జంతువులుగా చేసుకోవాలని జపాన్ చిన్నారులు ఉబలాటపడ్డారు. కానీ, అప్పటికి జపాన్లో ఆ జీవులు లేవు. అందువల్ల అమెరికా నుంచి వేల సంఖ్యలో రాకూన్ కూనలను దిగుమతి చేసుకున్నారు.
వదిలితే బీభత్సం
వాస్తవానికి రాకూన్ కథ చివరిలో దాన్ని ఒక వైల్డ్ యానిమల్ అని స్పష్టంగా పేర్కొన్నారు. అవి మనుషులు పెంచుకోవడానికి పనికి రావని తెలిసి కథలోని బాలుడు దాన్ని అడవిలో వదిలి పెట్టేస్తాడు. కానీ, జపాన్లో మాత్రం వాటిని పెంచుకోవడానికి ఆసక్తి చూపించడంతో సమస్య మొదలైంది. కొందరు ఎపిసోడ్లలో చూపించిన విధంగానే పెరిగి పెద్దవైన వాటిని అడవిలో వదిలిపెట్టారు. ఒక్కసారిగా బయటకు వెళ్లిన రాకూన్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. తొందరగా తమ సంతతిని వృద్ధి చేయడం వాటి సహజ లక్షణం. అందువల్ల రాకూన్ల మంద విపరీతంగా పెరిగిపోయింది. అవి పంటలను నాశనం చేశాయి. పవిత్రమైన దేవాలయాలు, ఇళ్లలోకి చొరబడి గందరగోళం సృష్టించాయి. అప్పట్లోనే లక్షల డాలర్ల నష్టం వాటిల్లింది. అమెరికాలో రాకూన్లు ఉన్నప్పటికీ వాటిని తోడేళ్లు, ఇతర జంతువులు వేటాడి తినేసేవి. దాంతో ఆ జంతువుల సంఖ్య రెట్టింపు కాలేదు.
కొనసాగుతున్న ఆదరణ
జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు జపాన్ ప్రభుత్వం రాకూన్ల దిగుమతిపై నిషేధం విధించింది. ఉన్న వాటిని అధికారులు కట్టడి చేయాలని ప్రయత్నించినా అప్పటికే అవి వేల సంఖ్యలో ఉన్నాయి. పైగా కొన్ని రాకూన్లు ఊర్లలోకి ప్రవేశించి ఆహారం కోసం చెత్తకుండీలను వెతకడం ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని మనుషులపైనా దాడికి దిగాయి. దాంతో స్థానిక ప్రభుత్వాలు వాటిని నిర్మూలించాలని నిర్ణయానికి వచ్చాయి. ఆ దిశగా చర్యలు చేపట్టడంతో జంతుహక్కుల కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. అందువల్ల వాటి సంఖ్యను మాత్రమే తగ్గించగలిగారు. ప్రస్తుతం జపాన్లో రాకూన్ జాతి కుక్కల బీభత్సం అడపాదడపా కొనసాగుతున్నప్పటికీ ఆ యానిమేటెడ్ సిరీస్ను మాత్రం ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్