South Korea: ఆహార వృథాను అరికట్టడంలో మార్గదర్శి దక్షిణ కొరియా.. వ్యర్థానికి సరికొత్త ‘అర్థం’ చెప్పింది!
అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే దక్షిణ కొరియా (South Korea) సుమారు 20 ఏళ్ల క్రితమే ఆహార (Food) వ్యర్థాలను ఇష్టారీతిన పారేయడంపై నిషేధం విధించింది. ఇళ్లు, హోటళ్ల నుంచి తడి చెత్తను సేకరించి.. దాన్ని పశుగ్రాసం, ఎరువులు, వంటగ్యాస్గా మార్చి ప్రపంచానికే ఓ మార్గదర్శిలా నిలిచింది. అదెలాగో చదివేయండి.
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.4 బిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలను (Food scraps) బయట పడేస్తున్నారు. అవి కుళ్లిపోవడం కారణంగా నీరు, నేల, గాలి కలుషితమవుతోంది. పైగా వంటగ్యాస్లో వినియోగించే మీథేన్ వాయువు వృథాగా పోతోంది. దాన్ని అరికట్టడానికి దక్షిణ కొరియా (South Korea) ఎలా కృషి చేస్తోందో తెలుసుకోండి.
ప్రపంచ దేశాల అధ్యయనం
ఆహార వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల కేవలం మీథేన్ మాత్రమే గాలిలో కలిసి పోతుందనుకుంటే పొరపడినట్లే. ఆ ఆహారాన్ని తయారు చేయడానికి అయ్యే ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు కూడా గాలిలో కలిసినట్లేనని దక్షిణ కొరియా భావించింది. అందుకే దాదాపు 90 శాతం ఆహార పదార్థాల వ్యర్థాలను పారేయడం, దహనం చేయకుండా చర్యలు తీసుకుంది. ఈ దేశం అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు అధ్యయనం చేసి తమ దేశాల్లో అమలు పరిచాయి. అమెరికా, చైనా, డెన్మార్క్ అధికారులు సైతం దక్షిణ కొరియాలో పర్యటించి ఇక్కడ వృథాను అరికట్టే సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.
ఏటా 600 మిలియన్ డాలర్ల ఖర్చు
ఆహార వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం కోసం దక్షిణ కొరియా ఏడాదికి సుమారు 600 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో కొంత మొత్తాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు చెల్లిస్తున్నాయి. 1995లోనే ఈ దేశ ప్రభుత్వం ప్లాస్టిక్, కాగితం రీసైక్లింగ్ విధానాలను ప్రవేశపెట్టింది. అప్పటికి వృథా ఆహార పదార్థాలను రోజువారీ చెత్తతో కలిపి పల్లపు ప్రాంతాల్లో పడేసేవారు. కొరియా వంటకాల తయారీలో నీరు అధికంగా వినియోగిస్తారు. కాబట్టి అవి కుళ్లి తీవ్ర దుర్వాసన వచ్చేవి. దాంతో స్థానికులు ఈ పారబోతకు అడ్డుకట్ట వేయాలని కొన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దానికి రాజకీయ నాయకుల మద్దతు తోడు కావడంతో ప్రభుత్వం సమస్యకు చెక్ పెట్టే పరిష్కార మార్గాలను అన్వేషించింది.
చెత్త బుట్టకు స్టిక్కర్లు
అలా 2005 నాటికి పల్లపు ప్రదేశాల్లో ఆహార వ్యర్థాలు పడేయడం నేరంగా పరిగణించేలా చట్టాలు చేసింది. స్థానిక ప్రభుత్వాలు వాటిని ప్రాసెస్ చేసేలా సౌకర్యాలు కల్పించింది. వ్యక్తులు, హోటళ్ల నిర్వాహకులు, ట్రక్ డైవర్లు సహా ప్రతి ఒక్కరూ ఆ సౌకర్యాలను వినియోగించేలా చర్యలు తీసుకుంది. ఏదైనా రెస్టారెంట్లోని చెత్త రికవరీ వ్యాన్లో పడేయాలంటే దాని యజమాని ముందే నిర్ణీత రుసుం చెల్లించి కొన్ని స్టిక్కర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిని చెత్త బుట్టకు అతికిస్తేనే రోజూ పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తీసుకెళ్తారు. ఆదివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
కట్టుదిట్టంగా ప్రాసెసింగ్
గ్రామాల్లో, పట్టణాల్లో సేకరించిన ఆహార వ్యర్థాలను కార్మికులు ఉదయం 11 గంటలకల్లా ప్రాసెసింగ్ యూనిట్కు చేరుస్తారు. అక్కడ చెత్తలోని ఎముకలు, విత్తనాలు, పెంకులను చేత్తో ఏరివేస్తారు. ఆ తరువాత వ్యర్థాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా గ్రైండర్లోకి పంపిస్తారు. అది పెద్ద పెద్ద పదార్థాలను చిన్న ముక్కలుగా చేస్తుంది. ఆ ముక్కలను యంత్రాల్లో వేడి చేసి నిర్జలీకరణం చేస్తారు. ఫలితంగా వెలువడిన తేమ నీటి శుద్ధి కర్మాగార పైపుల్లోకి వెళుతుంది. అందులో కొంత తేమ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ప్రాసెసింగ్లో వచ్చిన వ్యర్థాల పొడిని నాలుగు గంటలపాటు ఎండబెడతారు. అందులో ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉన్న భాగాన్ని కోళ్లు, బాతులకు ఆహారంగా పంపిస్తారు. మిగిలిన పొడికి కొన్ని మిశ్రమాలు కలిపి ఎరువుగా మారుస్తారు. ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే క్రమంలో దుర్వాసన వెలువడుతుంది. దాన్ని అడ్డుకునే వ్యవస్థ కూడా ప్రాసెసింగ్ యూనిట్లో ఉంటుంది.
ఇన్ని చర్యలు తీసుకున్నా దక్షిణ కొరియా ఆహార వృథాను అరికట్టడంలో విఫలమైందనే విమర్శలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం డబ్బాలో చెత్త వేయాలంటే కార్డులను స్కాన్ చేసే వ్యవస్థను ప్రవేశపెట్టింది. స్కాన్ చేసి ఎంత ఎక్కువ చెత్త వేస్తే వారికి నెలాఖరులో అంత బిల్ వేయడం దీని ముఖ్య ఉద్దేశం. అధికంగా బిల్లు చెల్సించాల్సి వస్తుందనే భయంతో చాలా మంది ఆహార వృథాను తగ్గించారు. ఎంత తినగలమో.. అంతే వండుకోవడం క్రమంగా అలవాటు చేసుకున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!