South Korea: ఆహార వృథాను అరికట్టడంలో మార్గదర్శి దక్షిణ కొరియా.. వ్యర్థానికి సరికొత్త ‘అర్థం’ చెప్పింది!
అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే దక్షిణ కొరియా (South Korea) సుమారు 20 ఏళ్ల క్రితమే ఆహార (Food) వ్యర్థాలను ఇష్టారీతిన పారేయడంపై నిషేధం విధించింది. ఇళ్లు, హోటళ్ల నుంచి తడి చెత్తను సేకరించి.. దాన్ని పశుగ్రాసం, ఎరువులు, వంటగ్యాస్గా మార్చి ప్రపంచానికే ఓ మార్గదర్శిలా నిలిచింది. అదెలాగో చదివేయండి.
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.4 బిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలను (Food scraps) బయట పడేస్తున్నారు. అవి కుళ్లిపోవడం కారణంగా నీరు, నేల, గాలి కలుషితమవుతోంది. పైగా వంటగ్యాస్లో వినియోగించే మీథేన్ వాయువు వృథాగా పోతోంది. దాన్ని అరికట్టడానికి దక్షిణ కొరియా (South Korea) ఎలా కృషి చేస్తోందో తెలుసుకోండి.
ప్రపంచ దేశాల అధ్యయనం
ఆహార వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల కేవలం మీథేన్ మాత్రమే గాలిలో కలిసి పోతుందనుకుంటే పొరపడినట్లే. ఆ ఆహారాన్ని తయారు చేయడానికి అయ్యే ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు కూడా గాలిలో కలిసినట్లేనని దక్షిణ కొరియా భావించింది. అందుకే దాదాపు 90 శాతం ఆహార పదార్థాల వ్యర్థాలను పారేయడం, దహనం చేయకుండా చర్యలు తీసుకుంది. ఈ దేశం అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచంలోని చాలా దేశాలు అధ్యయనం చేసి తమ దేశాల్లో అమలు పరిచాయి. అమెరికా, చైనా, డెన్మార్క్ అధికారులు సైతం దక్షిణ కొరియాలో పర్యటించి ఇక్కడ వృథాను అరికట్టే సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.
ఏటా 600 మిలియన్ డాలర్ల ఖర్చు
ఆహార వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం కోసం దక్షిణ కొరియా ఏడాదికి సుమారు 600 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో కొంత మొత్తాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు చెల్లిస్తున్నాయి. 1995లోనే ఈ దేశ ప్రభుత్వం ప్లాస్టిక్, కాగితం రీసైక్లింగ్ విధానాలను ప్రవేశపెట్టింది. అప్పటికి వృథా ఆహార పదార్థాలను రోజువారీ చెత్తతో కలిపి పల్లపు ప్రాంతాల్లో పడేసేవారు. కొరియా వంటకాల తయారీలో నీరు అధికంగా వినియోగిస్తారు. కాబట్టి అవి కుళ్లి తీవ్ర దుర్వాసన వచ్చేవి. దాంతో స్థానికులు ఈ పారబోతకు అడ్డుకట్ట వేయాలని కొన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దానికి రాజకీయ నాయకుల మద్దతు తోడు కావడంతో ప్రభుత్వం సమస్యకు చెక్ పెట్టే పరిష్కార మార్గాలను అన్వేషించింది.
చెత్త బుట్టకు స్టిక్కర్లు
అలా 2005 నాటికి పల్లపు ప్రదేశాల్లో ఆహార వ్యర్థాలు పడేయడం నేరంగా పరిగణించేలా చట్టాలు చేసింది. స్థానిక ప్రభుత్వాలు వాటిని ప్రాసెస్ చేసేలా సౌకర్యాలు కల్పించింది. వ్యక్తులు, హోటళ్ల నిర్వాహకులు, ట్రక్ డైవర్లు సహా ప్రతి ఒక్కరూ ఆ సౌకర్యాలను వినియోగించేలా చర్యలు తీసుకుంది. ఏదైనా రెస్టారెంట్లోని చెత్త రికవరీ వ్యాన్లో పడేయాలంటే దాని యజమాని ముందే నిర్ణీత రుసుం చెల్లించి కొన్ని స్టిక్కర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిని చెత్త బుట్టకు అతికిస్తేనే రోజూ పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తీసుకెళ్తారు. ఆదివారం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
కట్టుదిట్టంగా ప్రాసెసింగ్
గ్రామాల్లో, పట్టణాల్లో సేకరించిన ఆహార వ్యర్థాలను కార్మికులు ఉదయం 11 గంటలకల్లా ప్రాసెసింగ్ యూనిట్కు చేరుస్తారు. అక్కడ చెత్తలోని ఎముకలు, విత్తనాలు, పెంకులను చేత్తో ఏరివేస్తారు. ఆ తరువాత వ్యర్థాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా గ్రైండర్లోకి పంపిస్తారు. అది పెద్ద పెద్ద పదార్థాలను చిన్న ముక్కలుగా చేస్తుంది. ఆ ముక్కలను యంత్రాల్లో వేడి చేసి నిర్జలీకరణం చేస్తారు. ఫలితంగా వెలువడిన తేమ నీటి శుద్ధి కర్మాగార పైపుల్లోకి వెళుతుంది. అందులో కొంత తేమ ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ప్రాసెసింగ్లో వచ్చిన వ్యర్థాల పొడిని నాలుగు గంటలపాటు ఎండబెడతారు. అందులో ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉన్న భాగాన్ని కోళ్లు, బాతులకు ఆహారంగా పంపిస్తారు. మిగిలిన పొడికి కొన్ని మిశ్రమాలు కలిపి ఎరువుగా మారుస్తారు. ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే క్రమంలో దుర్వాసన వెలువడుతుంది. దాన్ని అడ్డుకునే వ్యవస్థ కూడా ప్రాసెసింగ్ యూనిట్లో ఉంటుంది.
ఇన్ని చర్యలు తీసుకున్నా దక్షిణ కొరియా ఆహార వృథాను అరికట్టడంలో విఫలమైందనే విమర్శలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం డబ్బాలో చెత్త వేయాలంటే కార్డులను స్కాన్ చేసే వ్యవస్థను ప్రవేశపెట్టింది. స్కాన్ చేసి ఎంత ఎక్కువ చెత్త వేస్తే వారికి నెలాఖరులో అంత బిల్ వేయడం దీని ముఖ్య ఉద్దేశం. అధికంగా బిల్లు చెల్సించాల్సి వస్తుందనే భయంతో చాలా మంది ఆహార వృథాను తగ్గించారు. ఎంత తినగలమో.. అంతే వండుకోవడం క్రమంగా అలవాటు చేసుకున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్