Iaf heritage centre : వాయుసేన శౌర్య పరాక్రమాలకు ప్రతీక ‘ఐఏఎఫ్ వారసత్వ కేంద్రం’
భారత వైమానిక దళం (Indian Air Force) పుట్టుక మొదలుకొని మొన్నటి బాలాకోట్ వైమానిక దాడుల వరకు జరిగిన పరిణామాల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది చండీగఢ్లోని ‘ఐఏఎఫ్ వారసత్వ కేంద్రం’.(Iaf heritage centre) ఆ కేంద్రం విశేషాలు మీ కోసం..
(Image : V P Singh Badnore)
గత వారంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath singh) చేతుల మీదుగా చండీగఢ్లో (Chandigarh) భారత వైమానిక దళ వారసత్వ కేంద్రం (Iaf heritage centre) ప్రారంభమైంది. భారత వైమానిక దళంలో సేవలందించిన వారి ధైర్యం, అంకితభావానికి నిదర్శనం ఈ కేంద్రమని ఆయన అన్నారు. అందుకు తగ్గట్లుగా ఈ కేంద్రంలోని విగ్రహాలు, చిత్రాలు తదితర ఏర్పాట్లున్నాయి.
చండీగఢ్ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఈ మ్యూజియానికి భారత వైమానిక దళం అనేక కళాఖండాలు, సిమ్యులేటర్లు, విమానాలు, విమానాల మోడళ్లను అందజేసింది. ఈ మ్యాజియంలో చూడచక్కని చిత్రాలను వేసే పనిని 2022 సెప్టెంబరులో మొదలుపెట్టారు. ఆ పని పూర్తయ్యేందుకు దాదాపు ఎనిమిది నెలలు పట్టింది. ఈ భారత వైమానిక దళ వారసత్వ కేంద్రానికి వచ్చే పర్యాటకులకు అవగాహన కల్పించే గైడ్లకు నాలుగు నెలలపాటు శిక్షణనిచ్చారు. అందుకు రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చరిత్ర విభాగం తోడ్పడింది. ఈ కేంద్రానికి గ్రూప్ కెప్టెన్ పీఎస్ లాంబా ప్రాజెక్టు డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.
మాటల్లో వర్ణించలేని అనుభూతి
భారత వైమానిక దళ వారసత్వ కేంద్రాన్ని రూ.2.75కోట్లతో నిర్మించారు. ఇది పాలం(దిల్లీ), తిరువనంతపురం మ్యూజియాల కంటే చాలా విశాలమైంది. లోపల రెండు కాక్పిట్స్, ఐదు విమానాలు, నాలుగు సిమ్యులేటర్లు ఏర్పాటు చేశారు. బాంబులు, రాకెట్లు సంధించడానికి ఏఏ బటన్లను యుద్ధ విమానాల్లో వినియోగిస్తారనే విషయం కూడా సందర్శకులు తెలుసుకోవచ్చు.
పైలట్లు వేగాన్ని ఎలా నియంత్రిస్తారు, రేడియో ఫ్రీక్వెన్సీ ఎలా మారుస్తారు వంటి విషయాలను అవగతం చేసుకోవచ్చు. దిశలు మార్చే ప్రక్రియ, ఏ సమయంలో ఎంత ఎత్తులో విమానం ఎగురుతుంది లాంటి సమాచారం దొరుకుతుంది. భారత వాయుసేనలో సేవలందిస్తున్న రకరకాల సిబ్బంది యూనిఫాంలను సైతం ప్రదర్శనకు ఉంచారు.
(Image : Air Marshal P K Roy)
యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు
వారసత్వ కేంద్రంలోకి ప్రవేశించగానే రెండు విమానాలు స్వాగతం పలుకుతాయి. అందులో ఒకటి ఫోలండ్ నాట్. రెండోది మిగ్-21 టైప్ 96. సందర్శకులు మిగ్-21లో కూర్చునే వెసులుబాటు కల్పించారు. ఈ విమానం సుమారు 45 ఏళ్ల పాటు భారత వాయుసేనకు సేవలందించింది. 2019లో దాని సేవలను నిలిపివేశారు. ప్రచండ్ కాంబాట్ హెలికాప్టర్ నమూనా, మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ సహా అనేక పాత తరం యుద్ధ విమాన నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. ఇక భవనం లోపల ప్రతి గోడపై యుద్ధ నేపథ్యాలను వివరించే చిత్రాలను వేశారు. సైన్యంలో విశిష్ట సేవలందించిన కార్పోరల్ జ్యోతి ప్రకాశ్ నిరాల(అశోక చక్ర, మరణానంతరం), కార్పోరల్ గురుసేవక్ సింగ్ (శౌర్యచక్ర, మరణానంతరం) వంటి అధికారుల చిత్రాలను ఏర్పాటు చేశారు. గ్యాలరీలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, మిస్సైల్స్, బాంబులు నమూనాలు ఉంచారు. సందర్శకులకు మరింత అనుభూతి పంచేందుకు సిమ్యులేటర్లు, భారత వైమానిక దళానికి చెందిన అన్ని రకాల విమానాల హోలోగ్రాఫిక్ డిస్ప్లేలు, సినిమాలు, వర్చువల్ రియాలిటీ ప్రదర్శనలు సైతం ఆకట్టుకుంటాయి.
ఆ హీరోలకు సముచిత గౌరవం
భారత వాయుసేన చరిత్రలో ఎంతో మంది హీరోలున్నారు. వారిలో సుప్రసిద్ధులైన ఎయిర్ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ శిల్పాన్ని ఒక ప్రదేశంలో నెలకొల్పారు. ఈయన 1965 యుద్ధంలో దళానికి నాయకత్వం వహించారు. మరో కమడోర్ మెహర్సింగ్ (మహావీర చక్ర) విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఈయన 1947-48లో జరిగిన భారత్-పాక్ యుద్ధ సమయంలో పూంఛ్, లేహ్ మధ్య మొదటిసారి అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించారు. గ్యాలెంట్రీ అవార్డ్స్ వాల్ మొదట్లో ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ పేరును ముద్రించారు. ఈయనకు మరణానంతరం పరమవీర చక్ర అవార్డు ప్రకటించారు. ఆయన వాడిన బ్లేజర్ను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇక లోపలున్న గోడలన్నింటిపై ఇప్పటి వరకు భారత్ పాల్గొన్న యుద్ధాల గురించి వర్ణిస్తూ చిత్రాలను మలిచారు. బాలాకోట్ దాడుల చిత్రాలు కూడా ఈ గోడలపై దర్శనమిస్తాయి. మరో గోడను పాటియాలలో జన్మించిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మకు అంకితమిచ్చారు. 1984లో రష్యన్ సోయుజ్ టీ-11 ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆసక్తికరంగా ఇదే ప్రయోగానికి ఎంపికైన ఎయిర్ కమడోర్ రవీశ్ మల్హోత్ర చిత్రాన్ని కూడా గోడపై చిత్రించారు.
యువత స్ఫూర్తి పొందేలా..
ప్రళయ్ మిస్సైల్, స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్, బ్రహ్మోస్ (ఏరియల్ వెర్షన్), హామర్ ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్, లేజర్ గైడెడ్ బాంబ్, అస్త్ర మిస్సైల్ నమూనాలు ఒక వరసలో పొందుపరిచారు. ప్రస్తుతం ఈ వారసత్వ కేంద్రం 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మరిన్ని నమూనాలు ఇక్కడ ప్రదర్శించడానికి కావాల్సిన స్థలం అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి సైన్యంలో చేరాలనుకునే యువకులు స్ఫూర్తి పొందేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
మరింత సమాచారం..
- భారత వైమానిక దళ వారసత్వ కేంద్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
- ప్రతి సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటుంది.
- ప్రవేశ టికెట్ ధర రూ.50
- సిమ్యులేటర్లు, ఆడియో-వీడియో పరికరాలు, వర్చువల్ రియాలిటీ తదితర అనుభూతులను సొంతం చేసుకోవాలంటే రూ.295తో ప్రత్యేక టికెట్ కొనుగోలు చేయాలి.
- ఇక్కడ ఉన్న దుకాణంలో విమానం నమూనాలు, కీ చైన్లు విక్రయిస్తారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం