Iaf heritage centre : వాయుసేన శౌర్య పరాక్రమాలకు ప్రతీక ‘ఐఏఎఫ్ వారసత్వ కేంద్రం’
భారత వైమానిక దళం (Indian Air Force) పుట్టుక మొదలుకొని మొన్నటి బాలాకోట్ వైమానిక దాడుల వరకు జరిగిన పరిణామాల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది చండీగఢ్లోని ‘ఐఏఎఫ్ వారసత్వ కేంద్రం’.(Iaf heritage centre) ఆ కేంద్రం విశేషాలు మీ కోసం..
(Image : V P Singh Badnore)
గత వారంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath singh) చేతుల మీదుగా చండీగఢ్లో (Chandigarh) భారత వైమానిక దళ వారసత్వ కేంద్రం (Iaf heritage centre) ప్రారంభమైంది. భారత వైమానిక దళంలో సేవలందించిన వారి ధైర్యం, అంకితభావానికి నిదర్శనం ఈ కేంద్రమని ఆయన అన్నారు. అందుకు తగ్గట్లుగా ఈ కేంద్రంలోని విగ్రహాలు, చిత్రాలు తదితర ఏర్పాట్లున్నాయి.
చండీగఢ్ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఈ మ్యూజియానికి భారత వైమానిక దళం అనేక కళాఖండాలు, సిమ్యులేటర్లు, విమానాలు, విమానాల మోడళ్లను అందజేసింది. ఈ మ్యాజియంలో చూడచక్కని చిత్రాలను వేసే పనిని 2022 సెప్టెంబరులో మొదలుపెట్టారు. ఆ పని పూర్తయ్యేందుకు దాదాపు ఎనిమిది నెలలు పట్టింది. ఈ భారత వైమానిక దళ వారసత్వ కేంద్రానికి వచ్చే పర్యాటకులకు అవగాహన కల్పించే గైడ్లకు నాలుగు నెలలపాటు శిక్షణనిచ్చారు. అందుకు రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చరిత్ర విభాగం తోడ్పడింది. ఈ కేంద్రానికి గ్రూప్ కెప్టెన్ పీఎస్ లాంబా ప్రాజెక్టు డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.
మాటల్లో వర్ణించలేని అనుభూతి
భారత వైమానిక దళ వారసత్వ కేంద్రాన్ని రూ.2.75కోట్లతో నిర్మించారు. ఇది పాలం(దిల్లీ), తిరువనంతపురం మ్యూజియాల కంటే చాలా విశాలమైంది. లోపల రెండు కాక్పిట్స్, ఐదు విమానాలు, నాలుగు సిమ్యులేటర్లు ఏర్పాటు చేశారు. బాంబులు, రాకెట్లు సంధించడానికి ఏఏ బటన్లను యుద్ధ విమానాల్లో వినియోగిస్తారనే విషయం కూడా సందర్శకులు తెలుసుకోవచ్చు.
పైలట్లు వేగాన్ని ఎలా నియంత్రిస్తారు, రేడియో ఫ్రీక్వెన్సీ ఎలా మారుస్తారు వంటి విషయాలను అవగతం చేసుకోవచ్చు. దిశలు మార్చే ప్రక్రియ, ఏ సమయంలో ఎంత ఎత్తులో విమానం ఎగురుతుంది లాంటి సమాచారం దొరుకుతుంది. భారత వాయుసేనలో సేవలందిస్తున్న రకరకాల సిబ్బంది యూనిఫాంలను సైతం ప్రదర్శనకు ఉంచారు.
(Image : Air Marshal P K Roy)
యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు
వారసత్వ కేంద్రంలోకి ప్రవేశించగానే రెండు విమానాలు స్వాగతం పలుకుతాయి. అందులో ఒకటి ఫోలండ్ నాట్. రెండోది మిగ్-21 టైప్ 96. సందర్శకులు మిగ్-21లో కూర్చునే వెసులుబాటు కల్పించారు. ఈ విమానం సుమారు 45 ఏళ్ల పాటు భారత వాయుసేనకు సేవలందించింది. 2019లో దాని సేవలను నిలిపివేశారు. ప్రచండ్ కాంబాట్ హెలికాప్టర్ నమూనా, మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ సహా అనేక పాత తరం యుద్ధ విమాన నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. ఇక భవనం లోపల ప్రతి గోడపై యుద్ధ నేపథ్యాలను వివరించే చిత్రాలను వేశారు. సైన్యంలో విశిష్ట సేవలందించిన కార్పోరల్ జ్యోతి ప్రకాశ్ నిరాల(అశోక చక్ర, మరణానంతరం), కార్పోరల్ గురుసేవక్ సింగ్ (శౌర్యచక్ర, మరణానంతరం) వంటి అధికారుల చిత్రాలను ఏర్పాటు చేశారు. గ్యాలరీలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, మిస్సైల్స్, బాంబులు నమూనాలు ఉంచారు. సందర్శకులకు మరింత అనుభూతి పంచేందుకు సిమ్యులేటర్లు, భారత వైమానిక దళానికి చెందిన అన్ని రకాల విమానాల హోలోగ్రాఫిక్ డిస్ప్లేలు, సినిమాలు, వర్చువల్ రియాలిటీ ప్రదర్శనలు సైతం ఆకట్టుకుంటాయి.
ఆ హీరోలకు సముచిత గౌరవం
భారత వాయుసేన చరిత్రలో ఎంతో మంది హీరోలున్నారు. వారిలో సుప్రసిద్ధులైన ఎయిర్ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ శిల్పాన్ని ఒక ప్రదేశంలో నెలకొల్పారు. ఈయన 1965 యుద్ధంలో దళానికి నాయకత్వం వహించారు. మరో కమడోర్ మెహర్సింగ్ (మహావీర చక్ర) విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఈయన 1947-48లో జరిగిన భారత్-పాక్ యుద్ధ సమయంలో పూంఛ్, లేహ్ మధ్య మొదటిసారి అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించారు. గ్యాలెంట్రీ అవార్డ్స్ వాల్ మొదట్లో ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ పేరును ముద్రించారు. ఈయనకు మరణానంతరం పరమవీర చక్ర అవార్డు ప్రకటించారు. ఆయన వాడిన బ్లేజర్ను కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇక లోపలున్న గోడలన్నింటిపై ఇప్పటి వరకు భారత్ పాల్గొన్న యుద్ధాల గురించి వర్ణిస్తూ చిత్రాలను మలిచారు. బాలాకోట్ దాడుల చిత్రాలు కూడా ఈ గోడలపై దర్శనమిస్తాయి. మరో గోడను పాటియాలలో జన్మించిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మకు అంకితమిచ్చారు. 1984లో రష్యన్ సోయుజ్ టీ-11 ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆసక్తికరంగా ఇదే ప్రయోగానికి ఎంపికైన ఎయిర్ కమడోర్ రవీశ్ మల్హోత్ర చిత్రాన్ని కూడా గోడపై చిత్రించారు.
యువత స్ఫూర్తి పొందేలా..
ప్రళయ్ మిస్సైల్, స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్, బ్రహ్మోస్ (ఏరియల్ వెర్షన్), హామర్ ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్, లేజర్ గైడెడ్ బాంబ్, అస్త్ర మిస్సైల్ నమూనాలు ఒక వరసలో పొందుపరిచారు. ప్రస్తుతం ఈ వారసత్వ కేంద్రం 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మరిన్ని నమూనాలు ఇక్కడ ప్రదర్శించడానికి కావాల్సిన స్థలం అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి సైన్యంలో చేరాలనుకునే యువకులు స్ఫూర్తి పొందేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
మరింత సమాచారం..
- భారత వైమానిక దళ వారసత్వ కేంద్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
- ప్రతి సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మూసి ఉంటుంది.
- ప్రవేశ టికెట్ ధర రూ.50
- సిమ్యులేటర్లు, ఆడియో-వీడియో పరికరాలు, వర్చువల్ రియాలిటీ తదితర అనుభూతులను సొంతం చేసుకోవాలంటే రూ.295తో ప్రత్యేక టికెట్ కొనుగోలు చేయాలి.
- ఇక్కడ ఉన్న దుకాణంలో విమానం నమూనాలు, కీ చైన్లు విక్రయిస్తారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె