India Vaccination 2021: ఆశలతో మొదలై.. లక్ష్యానికి చేరువై..!
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 90శాతానికి పైగా అర్హులకు తొలిడోసు అందించగా.. 64శాతం మంది అర్హులకు రెండు డోసులు అందుకున్నారు.
మరిన్ని లక్ష్యాలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న భారత్
దిల్లీ: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్ మహమ్మారి కొమ్ములు విరిచే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. దీంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాలు.. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కొవిడ్ను ఎదుర్కొనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆశలతో మొదలుపెట్టిన భారత్.. ఇప్పటికే 145 కోట్ల డోసులను పంపిణీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటివరకు దాదాపు 90శాతానికి పైగా అర్హులకు తొలిడోసు అందించగా.. 64 శాతం మంది అర్హులకు రెండు డోసుల్లో అందించింది. ఇలా ఏడాది చివరికి నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువైన భారత్.. కొత్త ఏడాది ప్రారంభంలో బూస్టర్ డోసు పంపిణీతో పాటు చిన్నారులకు వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.
మైలురాయి దాటుకుంటూ..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. జనవరి 16, 2021న భారత్ వ్యాక్సినేషన్ను ప్రారంభించింది. మొదట్లో కాస్త మందకొడిగా సాగినప్పటికీ.. రెండో డోసు పంపిణీ నుంచి ఈ ప్రక్రియ ఊపందుకుంది. ముఖ్యంగా సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ వంటి వ్యాక్సిన్ సంస్థలు తమ ఉత్పత్తులను భారీగా పెంచడంతో దేశంలో వ్యాక్సిన్ లభ్యత భారీగా పెరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ ఒక్కటే ప్రతినెలా 12 నుంచి 15 కోట్ల కొవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. భారత్ బయోటెక్ కూడా 5 నుంచి 6 కోట్ల డోసులను తయారు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా నిత్యం 50 లక్షలకుపైగా డోసులను అందించే వీలు కలిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఒక్కరోజే 2 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ రికార్డు సృష్టించింది. నవంబర్ 3వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో అక్టోబర్ 21న 100 కోట్ల డోసుల పంపిణీ మైలురాయిని దాటింది. ఇలా ఇప్పటివరకు 145 కోట్ల డోసులను పంపిణీ చేసిన ప్రభుత్వం.. మూడో డోసు ఇచ్చేందుకూ సన్నద్ధమవుతోంది.
100 శాతం అసాధ్యమేనా..?
ఈ ఏడాది చివరినాటికి దేశంలో అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తామని కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జూన్లో వెల్లడించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారు దాదాపు 94 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. వీరందరికీ రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందించాలంటే దాదాపు 190 కోట్ల డోసులు అవసరం. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 నాటికి 145 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. 84.51 కోట్ల (90శాతం) లబ్ధిదారులు మొదటి డోసు తీసుకోగా.. 60.15 కోట్ల మంది (64శాతం) రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాలకు 150 కోట్ల డోసులు పంపిణీ చేయగా.. మరో 15కోట్ల డోసులు రాష్ట్రాల వద్ద నిల్వ ఉన్నాయన్నారు.
10 కోట్ల మంది రెండోడోసుకు దూరం..
ఇలా కేంద్ర ప్రభుత్వం 100శాతం పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యే పనికాదని ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ అది తీసుకోవడానికి చాలా మంది పౌరులు ముందుకు రాకపోవడమే కారణంగా చెబుతున్నారు. మొదటిడోసు తీసుకున్న తర్వాత గడువు ముగిసినప్పటికీ ఇంకా 10 కోట్ల మంది రెండో డోసు తీసుకోలేదని ప్రభుత్వ లెక్కలు చూస్తేనే అర్థమవుతోంది. దీంతో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినప్పటికీ కొందరు పౌరుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ దాదాపు మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతున్నారు.
రాహుల్ గాంధీ విమర్శ..
ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరుకోలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘2021 చివరి నాటికి దేశంలో ప్రతిఒక్కరికీ రెండుడోసుల్లో వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఈ రోజు ఏడాది ముగింపు. అయినప్పటికీ దేశంలో చాలా మంది వ్యాక్సిన్ అందలేదు. మరో వాగ్దానం విఫలమయ్యింది’ అంటూ ట్విటర్లో విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం