India Vaccination 2021: ఆశలతో మొదలై.. లక్ష్యానికి చేరువై..!
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 90శాతానికి పైగా అర్హులకు తొలిడోసు అందించగా.. 64శాతం మంది అర్హులకు రెండు డోసులు అందుకున్నారు.
మరిన్ని లక్ష్యాలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న భారత్
దిల్లీ: యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్ మహమ్మారి కొమ్ములు విరిచే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. దీంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాలు.. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కొవిడ్ను ఎదుర్కొనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆశలతో మొదలుపెట్టిన భారత్.. ఇప్పటికే 145 కోట్ల డోసులను పంపిణీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటివరకు దాదాపు 90శాతానికి పైగా అర్హులకు తొలిడోసు అందించగా.. 64 శాతం మంది అర్హులకు రెండు డోసుల్లో అందించింది. ఇలా ఏడాది చివరికి నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువైన భారత్.. కొత్త ఏడాది ప్రారంభంలో బూస్టర్ డోసు పంపిణీతో పాటు చిన్నారులకు వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.
మైలురాయి దాటుకుంటూ..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. జనవరి 16, 2021న భారత్ వ్యాక్సినేషన్ను ప్రారంభించింది. మొదట్లో కాస్త మందకొడిగా సాగినప్పటికీ.. రెండో డోసు పంపిణీ నుంచి ఈ ప్రక్రియ ఊపందుకుంది. ముఖ్యంగా సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ వంటి వ్యాక్సిన్ సంస్థలు తమ ఉత్పత్తులను భారీగా పెంచడంతో దేశంలో వ్యాక్సిన్ లభ్యత భారీగా పెరిగింది. సీరం ఇన్స్టిట్యూట్ ఒక్కటే ప్రతినెలా 12 నుంచి 15 కోట్ల కొవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. భారత్ బయోటెక్ కూడా 5 నుంచి 6 కోట్ల డోసులను తయారు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా నిత్యం 50 లక్షలకుపైగా డోసులను అందించే వీలు కలిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఒక్కరోజే 2 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ రికార్డు సృష్టించింది. నవంబర్ 3వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ క్రమంలో అక్టోబర్ 21న 100 కోట్ల డోసుల పంపిణీ మైలురాయిని దాటింది. ఇలా ఇప్పటివరకు 145 కోట్ల డోసులను పంపిణీ చేసిన ప్రభుత్వం.. మూడో డోసు ఇచ్చేందుకూ సన్నద్ధమవుతోంది.
100 శాతం అసాధ్యమేనా..?
ఈ ఏడాది చివరినాటికి దేశంలో అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తామని కేంద్రప్రభుత్వం ఈ ఏడాది జూన్లో వెల్లడించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారు దాదాపు 94 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. వీరందరికీ రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందించాలంటే దాదాపు 190 కోట్ల డోసులు అవసరం. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 నాటికి 145 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. 84.51 కోట్ల (90శాతం) లబ్ధిదారులు మొదటి డోసు తీసుకోగా.. 60.15 కోట్ల మంది (64శాతం) రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాలకు 150 కోట్ల డోసులు పంపిణీ చేయగా.. మరో 15కోట్ల డోసులు రాష్ట్రాల వద్ద నిల్వ ఉన్నాయన్నారు.
10 కోట్ల మంది రెండోడోసుకు దూరం..
ఇలా కేంద్ర ప్రభుత్వం 100శాతం పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యే పనికాదని ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ అది తీసుకోవడానికి చాలా మంది పౌరులు ముందుకు రాకపోవడమే కారణంగా చెబుతున్నారు. మొదటిడోసు తీసుకున్న తర్వాత గడువు ముగిసినప్పటికీ ఇంకా 10 కోట్ల మంది రెండో డోసు తీసుకోలేదని ప్రభుత్వ లెక్కలు చూస్తేనే అర్థమవుతోంది. దీంతో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినప్పటికీ కొందరు పౌరుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ దాదాపు మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతున్నారు.
రాహుల్ గాంధీ విమర్శ..
ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరుకోలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘2021 చివరి నాటికి దేశంలో ప్రతిఒక్కరికీ రెండుడోసుల్లో వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఈ రోజు ఏడాది ముగింపు. అయినప్పటికీ దేశంలో చాలా మంది వ్యాక్సిన్ అందలేదు. మరో వాగ్దానం విఫలమయ్యింది’ అంటూ ట్విటర్లో విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల