Indian Operations: సంక్షోభం ఏదైనా సై.. విదేశీ గడ్డపై భారత్ ‘ఆపరేషన్’లు..!
వివిధ దేశాల్లో సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్లను చేపడుతోంది. అఫ్గాన్, ఉక్రెయిన్ మొదలు సూడాన్ వరకు ఇలా ఎన్నో సంక్షోభ సమయాల్లో భారత పౌరులను సొంత గడ్డకు తీసుకువచ్చే పనిని భారత ప్రభుత్వం విజయవంతంగా చేపట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లోని భారతీయులకు ఆపద వచ్చిందంటే చాలు.. భారత సైన్యం రంగంలోకి దిగాల్సిందే. ఆయా దేశాల్లో కల్లోల పరిస్థితులు మొదలు కరోనా మహమ్మారి వంటి ప్రకృతి వైపరీత్యాల వరకు విదేశీ గడ్డపై సంక్షోభం ఏర్పడిందంటే చాలు హుటాహుటిన వారిని స్వదేశానికి తీసుకుచ్చే బాధ్యతను దేశ సైన్యం తన భుజాలమీద ఎత్తుకుంటోంది. తాజాగా సూడాన్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ కావేరీ’ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న మన పౌరులను సురక్షితంగా తరలించేందుకుగాను భారత ప్రభుత్వం చేపట్టిన కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లను పరిశీలిస్తే..
ఆపరేషన్ గంగ: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన దండయాత్ర ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ క్రమంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు గతేడాది ఫిబ్రవరి 22న ‘ఆపరేషన్ గంగ’ పేరుతో మొదలుపెట్టిన ప్రత్యేక ఆపరేషన్.. మార్చి 10వరకు కొనసాగింది. దాదాపు 80కిపైగా విమానాలతో సుమారు 18వేల మంది భారతీయులను స్వదేశానికి సురక్షితంగా చేర్చింది. రొమేనియా, పొలాండ్, హంగేరీ, స్లొవేకియా, మాల్డోవా వంటి దేశాల నుంచి ఈ ఆపరేషన్ చేపట్టి భారతీయ పౌరులను స్వదేశానికి విజయవంతంగా తీసుకువచ్చింది.
ఆపరేషన్ దేవీశక్తి: అమెరికా సైన్యం ఉపసంహరించుకున్న కొన్ని రోజుల్లోనే తాలిబన్ల చేతుల్లోకి అఫ్గానిస్థాన్ వెళ్లిపోయింది. దీంతో ఆగస్టు 2021లో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వేల మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అటువంటి సమయంలో ‘ఆపరేషన్ దేవీశక్తి’ కార్యక్రమాన్ని చేపట్టిన భారత ప్రభుత్వం.. అక్కడున్న 669 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది.
ఆపరేషన్ సంకట్ మోచన్: దక్షిణ సూడాన్లో 2016లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు అత్యవసర సేవలూ నిలిచిపోయాయి. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు ‘ఆపరేషన్ సంకట్ మోచన్’ను చేపట్టింది. రంగంలోకి దిగిన భారత వాయుసేన 153 మంది భారతీయులతోపాటు ఇద్దరు నేపాల్ పౌరులను సురక్షితంగా తరలించింది.
ఆపరేషన్ బ్రసెల్స్ 2016: బెల్జియంలో మార్చి నెలలో ఉగ్రవాద దాడులు జరిగాయి. బ్రసెల్స్ విమానాశ్రయంతోపాటు మాల్బీక్ మెట్రో స్టేషన్పైనా దాడుల్లో 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. 28 మంది సిబ్బందితోసహా మొత్తం 242 మంది భారతీయులతో కూడిన జెట్ఎయిర్వేస్ విమానం భారత్కు చేరుకుంది.
లిబియా ఆపరేషన్ 2015: లిబియాలో 2015లో అంతర్యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడున్న 3600 మంది భారత పౌరులను తరలించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ముఖ్యంగా లిబియా సరిహద్దు దేశాల సహకారంతో రోడ్డు మార్గంతోపాటు జల, వైమానిక మార్గాల్లో భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చారు.
ఆపరేషన్ రాహత్, యెమన్: మార్చి- ఏప్రిల్ 2015లో యెమన్ అంతర్యుద్ధం సమయంలో అక్కడ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆపరేషన్ రాహత్ను ప్రారంభించిన భారత ప్రభుత్వం.. సుమారు 6700 మందిని సురక్షితంగా అక్కడ నుంచి తరలించింది. వీరిలో 4748 మంది భారతీయులు కాగా మరో 1962 మంది విదేశీయులు ఉన్నారు.
ఆపరేషన్ సేఫ్ హోమ్కమింగ్: 2011లో లిబియన్ అంతర్యుద్ధంతో.. వేల మంది భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సేఫ్ హోమ్కమింగ్ చేపట్టింది. ఫిబ్రవరి 26 2011న చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 15,400 మందిని స్వదేశానికి తీసుకువచ్చింది. భారత వాయుసేనతోపాటు ఎయిర్ ఇండియా విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.
ఆపరేషన్ సుకూన్: 2006లో లెబనాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో అక్కడున్న 2300 మంది భారతీయులతోపాటు శ్రీలంక, నేపాల్ వాసులను సురక్షితంగా తరలించేందుకు ఎయిర్ ఇండియా సాయంతో భారత నౌకాదళం ఈ ఆపరేషన్ చేపట్టింది. తొలుత వారిని సిరియా తరలించి అక్కడ నుంచి సైప్రస్కు, అనంతరం భారత్కు తరలించారు. అత్యంత శ్రమతో ఈ ఆపరేషన్ చేపట్టారు.
కువైట్ ఆపరేషన్: 1990లో దాదాపు లక్షమంది ఇరాకీ సైనికులు కువైట్పై దాడి చేశారు. దీంతో రాజులు మొదలు వీఐపీలు కూడా సౌదీ అరేబియాకు తరలిపోయారు. సామాన్య పౌరులు అక్కడే చిక్కుకుపోయారు. ఇలా కువైట్లో చిక్కుకుపోయిన వారిలో 1.70 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారందర్నీ సుమారు 500 ఎయిరిండియా విమానాల్లో తరలించే కార్యక్రమం చేపట్టారు. రెండు నెలలపాటు సాగిన ఈ ఆపరేషన్.. ఎయిరిండియా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన మిషన్గా నిలిచింది. అంతేకాకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించింది.
వందే భారత్ మిషన్: కరోనా వైరస్ విలయతాండవం చేసిన వేళ.. ప్రపంచ దేశాలు లాక్డౌన్ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఏప్రిల్ 30, 2021 నాటికి 60 లక్షల మంది భారతీయులు వివిధ దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. వివిధ దశల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో 18లక్షల మంది ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాల్లో రాగా.. మరో 36 లక్షల మంది ఛార్టెడ్ విమానాల్లో తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. సుమారు 4వేల మంది నౌకాయానం ద్వారా భారత్ చేరుకున్నారు.
ఆపరేషన్ సముద్ర సేతు: కొవిడ్ మహమ్మారి విజృంభణ వేళ విదేశాల్లో ఉన్న భారతీయులను రప్పించేందుకు ఆపరేషన్ సముద్ర సేతును చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి 3992 మంది భారత పౌరులను జలమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్