National Highway : కశ్మీర్-కన్యాకుమారి.. పొడవైన జాతీయ రహదారి ‘ఎన్హెచ్-44’!
‘ఎన్హెచ్-44’ (National Highway 44).. 4112 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారిగా గుర్తింపు దక్కించుకుంది. కశ్మీర్ (Kashmir) నుంచి కన్యాకుమారి (Kanyakumari) వరకు సాగే ఈ మార్గం విశేషాలు తెలుసుకోండి.
ఎన్హెచ్-44 (National Highway 44).. దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి (Indias longest highway) ఇది. ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపే రహదారిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో (Jammu kashmir) మొదలై.. పంజాబ్ (Punjab), హరియాణా (Haryana), దేశ రాజధాని దిల్లీ (Delhi), ఉత్తరప్రదేశ్ (Uttar pradesh), రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya pradesh), మహారాష్ట్ర (Maharashtra), తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh), కర్ణాటక (Karnataka) మీదుగా ప్రయాణిస్తూ తమిళనాడు (Tamil nadu) రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ముగుస్తుంది.
ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 492 కి.మీ, ఏపీలో 260 కి.మీ మేర ఎన్హెచ్-44 ఉంది. తొలుత ఇది ఒకే జాతీయ రహదారి కాదు. ఏడు జాతీయ రహదారులను (ఎన్హెచ్-1ఎ, ఎన్హెచ్-1, ఎన్హెచ్-2, ఎన్హెచ్-3, ఎన్హెచ్-75, ఎన్హెచ్-26, ఎన్హెచ్-7) విలీనం చేసి ‘ఎన్హెచ్-44’ను ఏర్పాటు చేశారు. భారత మ్యాప్పై ఒక నిలువు గీత గీసిన తరహాలో ఈ జాతీయ రహదారి కన్పిస్తుంది. ఈ దారిలో ప్రయాణించే సమయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వైవిధ్యం ప్రతిబింబిస్తుంటుంది. ఈ మార్గం వ్యాపారాభివృద్ధికి, ప్రయాణాలను మెరుగుపరచేందుకు ఎంతో తోడ్పాటునందిస్తోంది.
(Image : Google map)
దేశంలోనే అతి పొడవైన ఎన్హెచ్-44 గుండా ప్రయాణిస్తే ఈ ప్రదేశాలను వీక్షించొచ్చు.. అవేంటో తెలుసుకోండి.
భూతల స్వర్గం
ఉత్తర భారతం నుంచి ప్రయాణం మొదలు పెడితే మీ ప్రయాణం భూతల స్వర్గంగా పేరొందిన జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ నుంచి ప్రారంభమవుతుంది. దారి పొడవునా మంచు దుప్పటి కప్పేసిన పర్వతాలు, ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్లు, సుందరమైన నదులు కన్పిస్తాయి. ఉత్కంఠభరితంగా సాగే ఈ ప్రయాణంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు దర్శనమిస్తాయి. కశ్మీర్ అందాలు మొత్తం కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. కేవలం ఆ అందాలతోనే కడుపు నిండిపోదు కదా! అందుకే నోరూరించే కశ్మీరీ వంటకాలను రుచి చూడొచ్చు. ఇక్కడ యఖ్నీ పులావ్, రోగన్ జోష్ వంటకాలు చాలా ఫేమస్. వాటిని తప్పకుండా రుచి చూడాల్సిందే.
పచ్చని రాష్ట్రం పంజాబ్
హరిత విప్లవ ఆరంభ స్థానం పంజాబ్ ఎల్లప్పుడూ పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ మార్గంలోనే జలంధర్, లూధియానా వంటి చారిత్రక ప్రాముఖ్యం కలిగిన నగరాలు కన్పిస్తాయి. వాటిని చూసిన తరువాత ఏదైనా పంజాబీ డాబాలో ఆగితే స్వచ్ఛమైన నెయ్యి తగిలించిన పరోటాలను బటర్ చికెన్తో కలిపి లాగించేయొచ్చు.
కురుక్షేత్ర సంగ్రామంలో..
మనమంతా మహాభారతం గురించి వినే ఉంటాం. అందులో కురుక్షేత్ర సంగ్రామానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హరియాణాలోకి ప్రవేశించగానే కురుక్షేత్ర పట్టణం కన్పిస్తుంది. పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. చారిత్రక కళాఖండాలపై ఆసక్తి ఉంటే ఇక్కడి శ్రీ కృష్ణ మ్యూజియాన్ని సందర్శించొచ్చు. హిందువులు పరమ పవిత్రంగా భావించే బ్రహ్మ సరోవరం కూడా ఇక్కడే దర్శనమిస్తుంటుంది.
దేశ రాజధాని నగరం దిల్లీ
పార్లమెంటు, రాష్ట్రపతి భవనం, ఇండియాగేట్, కర్తవ్యపథ్ వంటి ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలతో విరాజిల్లుతోంది దిల్లీ నగరం. జంతర్మంతర్, కుతుబ్మినార్, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాలను చూడొచ్చు.
శ్రీకృష్ణ ఆలయం.. తాజ్ మహల్
దిల్లీ దాటగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నది ఒడ్డున ఉన్న మథురను చూడొచ్చు. ఇక్కడి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అనంతరం ఆగ్రాలోకి ప్రవేశిస్తే ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ ఉంది. ఆ పాలరాతి కట్టడం అందాలను చూస్తే ఎవరైనా తప్పకుండా మంత్ర ముగ్ధులు కావాల్సిందే.
గ్వాలియర్ కోట
ఉత్తరప్రదేశ్ దాటగానే రాజస్థాన్లోకి అడుగు పెట్టొచ్చు. అయితే ఇక్కడ 28 కిలోమీటర్ల మార్గం మాత్రమే ఉంది. దగ్గరలో చూడటానికి అనువైన ప్రదేశాలు లేవు. దాంతో నేరుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. గ్వాలియర్ పట్టణంలోని పురాతన కోట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. వందల ఏళ్ల క్రితమే నిర్మించినప్పటికీ దాని సౌందర్యం ఇప్పటికీ చెక్కు చెదర్లేదు.
దక్షిణ దిశకు ప్రవేశ ద్వారం నాగ్పూర్
మహారాష్ట్రలోని నాగ్పూర్లోకి అడుగుపెట్టగానే ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతంలోకి ప్రవేశిస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. ఇక్కడ దొరికే నారింజ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. కొన్ని రకాల స్థానిక వంటకాలు మైమరచిపోయేలా చేస్తాయి. తర్రి పోహాను తప్పకుండా రుచి చూడాల్సిందే.
తెలంగాణ పల్లెలు.. హైదరాబాద్
నిర్మల్ జిల్లాలోకి అడుగుపెట్టగానే గిరిజన పల్లెల అందాలు పలకరిస్తాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల మీదుగా చారిత్రక నగరం హైదరాబాద్లోకి ప్రవేశించవచ్చు. చార్మినార్, ట్యాంక్బండ్, బిర్లామందిర్, రామోజీ ఫిల్మ్సిటీ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలను చుట్టేసి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణం షురూ చేయొచ్చు.
రాయలసీమ అందాలు
ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టగానే రాయలసీమ ముఖద్వారం కర్నూలు నగరం స్వాగతం పలుకుతుంది. ఈ నగరంలోని కొండారెడ్డి బురుజును సందర్శించొచ్చు. నాన్వెజ్ ప్రియులు స్థానిక హోటళ్లలో రాగిసంగటి, నాటుకోడి పులుసును ఇష్టంగా లాగించవచ్చు. అటునుంచి అనంతపురం వెళ్లి అక్కడ టవర్క్లాక్ చూసి పెనుకొండ మీదుగా కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు చేరుకోవచ్చు.
సిలికాన్ సిటీ బెంగళూరు
సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు నగరంలో బెంగళూరు ప్యాలెస్, టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఇలా ఎన్నో సుందరమైన కట్టడాలను, పార్కులను చూడొచ్చు.
కన్యాకుమారి.. ముగింపు దారి
ఎన్హెచ్-44 ప్రయాణంలో చివరి రాష్ట్రం తమిళనాడు. ఈ మార్గంలోనే మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది. అటు నుంచి బయలుదేరి గమ్య స్థానం కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక్కడ సూర్యాస్తమయం ఎందో అందంగా కనపడుతుంది. అక్కడితో ‘ఎన్హెచ్-44’కు బైబై చెప్పేయొచ్చు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్