National Highway : కశ్మీర్-కన్యాకుమారి.. పొడవైన జాతీయ రహదారి ‘ఎన్హెచ్-44’!
‘ఎన్హెచ్-44’ (National Highway 44).. 4112 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారిగా గుర్తింపు దక్కించుకుంది. కశ్మీర్ (Kashmir) నుంచి కన్యాకుమారి (Kanyakumari) వరకు సాగే ఈ మార్గం విశేషాలు తెలుసుకోండి.
ఎన్హెచ్-44 (National Highway 44).. దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి (Indias longest highway) ఇది. ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపే రహదారిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో (Jammu kashmir) మొదలై.. పంజాబ్ (Punjab), హరియాణా (Haryana), దేశ రాజధాని దిల్లీ (Delhi), ఉత్తరప్రదేశ్ (Uttar pradesh), రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya pradesh), మహారాష్ట్ర (Maharashtra), తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh), కర్ణాటక (Karnataka) మీదుగా ప్రయాణిస్తూ తమిళనాడు (Tamil nadu) రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ముగుస్తుంది.
ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 492 కి.మీ, ఏపీలో 260 కి.మీ మేర ఎన్హెచ్-44 ఉంది. తొలుత ఇది ఒకే జాతీయ రహదారి కాదు. ఏడు జాతీయ రహదారులను (ఎన్హెచ్-1ఎ, ఎన్హెచ్-1, ఎన్హెచ్-2, ఎన్హెచ్-3, ఎన్హెచ్-75, ఎన్హెచ్-26, ఎన్హెచ్-7) విలీనం చేసి ‘ఎన్హెచ్-44’ను ఏర్పాటు చేశారు. భారత మ్యాప్పై ఒక నిలువు గీత గీసిన తరహాలో ఈ జాతీయ రహదారి కన్పిస్తుంది. ఈ దారిలో ప్రయాణించే సమయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వైవిధ్యం ప్రతిబింబిస్తుంటుంది. ఈ మార్గం వ్యాపారాభివృద్ధికి, ప్రయాణాలను మెరుగుపరచేందుకు ఎంతో తోడ్పాటునందిస్తోంది.
(Image : Google map)
దేశంలోనే అతి పొడవైన ఎన్హెచ్-44 గుండా ప్రయాణిస్తే ఈ ప్రదేశాలను వీక్షించొచ్చు.. అవేంటో తెలుసుకోండి.
భూతల స్వర్గం
ఉత్తర భారతం నుంచి ప్రయాణం మొదలు పెడితే మీ ప్రయాణం భూతల స్వర్గంగా పేరొందిన జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ నుంచి ప్రారంభమవుతుంది. దారి పొడవునా మంచు దుప్పటి కప్పేసిన పర్వతాలు, ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్లు, సుందరమైన నదులు కన్పిస్తాయి. ఉత్కంఠభరితంగా సాగే ఈ ప్రయాణంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు దర్శనమిస్తాయి. కశ్మీర్ అందాలు మొత్తం కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. కేవలం ఆ అందాలతోనే కడుపు నిండిపోదు కదా! అందుకే నోరూరించే కశ్మీరీ వంటకాలను రుచి చూడొచ్చు. ఇక్కడ యఖ్నీ పులావ్, రోగన్ జోష్ వంటకాలు చాలా ఫేమస్. వాటిని తప్పకుండా రుచి చూడాల్సిందే.
పచ్చని రాష్ట్రం పంజాబ్
హరిత విప్లవ ఆరంభ స్థానం పంజాబ్ ఎల్లప్పుడూ పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ మార్గంలోనే జలంధర్, లూధియానా వంటి చారిత్రక ప్రాముఖ్యం కలిగిన నగరాలు కన్పిస్తాయి. వాటిని చూసిన తరువాత ఏదైనా పంజాబీ డాబాలో ఆగితే స్వచ్ఛమైన నెయ్యి తగిలించిన పరోటాలను బటర్ చికెన్తో కలిపి లాగించేయొచ్చు.
కురుక్షేత్ర సంగ్రామంలో..
మనమంతా మహాభారతం గురించి వినే ఉంటాం. అందులో కురుక్షేత్ర సంగ్రామానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హరియాణాలోకి ప్రవేశించగానే కురుక్షేత్ర పట్టణం కన్పిస్తుంది. పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. చారిత్రక కళాఖండాలపై ఆసక్తి ఉంటే ఇక్కడి శ్రీ కృష్ణ మ్యూజియాన్ని సందర్శించొచ్చు. హిందువులు పరమ పవిత్రంగా భావించే బ్రహ్మ సరోవరం కూడా ఇక్కడే దర్శనమిస్తుంటుంది.
దేశ రాజధాని నగరం దిల్లీ
పార్లమెంటు, రాష్ట్రపతి భవనం, ఇండియాగేట్, కర్తవ్యపథ్ వంటి ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలతో విరాజిల్లుతోంది దిల్లీ నగరం. జంతర్మంతర్, కుతుబ్మినార్, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాలను చూడొచ్చు.
శ్రీకృష్ణ ఆలయం.. తాజ్ మహల్
దిల్లీ దాటగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యమునా నది ఒడ్డున ఉన్న మథురను చూడొచ్చు. ఇక్కడి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అనంతరం ఆగ్రాలోకి ప్రవేశిస్తే ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ ఉంది. ఆ పాలరాతి కట్టడం అందాలను చూస్తే ఎవరైనా తప్పకుండా మంత్ర ముగ్ధులు కావాల్సిందే.
గ్వాలియర్ కోట
ఉత్తరప్రదేశ్ దాటగానే రాజస్థాన్లోకి అడుగు పెట్టొచ్చు. అయితే ఇక్కడ 28 కిలోమీటర్ల మార్గం మాత్రమే ఉంది. దగ్గరలో చూడటానికి అనువైన ప్రదేశాలు లేవు. దాంతో నేరుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. గ్వాలియర్ పట్టణంలోని పురాతన కోట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. వందల ఏళ్ల క్రితమే నిర్మించినప్పటికీ దాని సౌందర్యం ఇప్పటికీ చెక్కు చెదర్లేదు.
దక్షిణ దిశకు ప్రవేశ ద్వారం నాగ్పూర్
మహారాష్ట్రలోని నాగ్పూర్లోకి అడుగుపెట్టగానే ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతంలోకి ప్రవేశిస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. ఇక్కడ దొరికే నారింజ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. కొన్ని రకాల స్థానిక వంటకాలు మైమరచిపోయేలా చేస్తాయి. తర్రి పోహాను తప్పకుండా రుచి చూడాల్సిందే.
తెలంగాణ పల్లెలు.. హైదరాబాద్
నిర్మల్ జిల్లాలోకి అడుగుపెట్టగానే గిరిజన పల్లెల అందాలు పలకరిస్తాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల మీదుగా చారిత్రక నగరం హైదరాబాద్లోకి ప్రవేశించవచ్చు. చార్మినార్, ట్యాంక్బండ్, బిర్లామందిర్, రామోజీ ఫిల్మ్సిటీ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలను చుట్టేసి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణం షురూ చేయొచ్చు.
రాయలసీమ అందాలు
ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టగానే రాయలసీమ ముఖద్వారం కర్నూలు నగరం స్వాగతం పలుకుతుంది. ఈ నగరంలోని కొండారెడ్డి బురుజును సందర్శించొచ్చు. నాన్వెజ్ ప్రియులు స్థానిక హోటళ్లలో రాగిసంగటి, నాటుకోడి పులుసును ఇష్టంగా లాగించవచ్చు. అటునుంచి అనంతపురం వెళ్లి అక్కడ టవర్క్లాక్ చూసి పెనుకొండ మీదుగా కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు చేరుకోవచ్చు.
సిలికాన్ సిటీ బెంగళూరు
సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు నగరంలో బెంగళూరు ప్యాలెస్, టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఇలా ఎన్నో సుందరమైన కట్టడాలను, పార్కులను చూడొచ్చు.
కన్యాకుమారి.. ముగింపు దారి
ఎన్హెచ్-44 ప్రయాణంలో చివరి రాష్ట్రం తమిళనాడు. ఈ మార్గంలోనే మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది. అటు నుంచి బయలుదేరి గమ్య స్థానం కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక్కడ సూర్యాస్తమయం ఎందో అందంగా కనపడుతుంది. అక్కడితో ‘ఎన్హెచ్-44’కు బైబై చెప్పేయొచ్చు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..