BBC: బీబీసీపై భారత్ నిషేధం విధించిన వేళ.. అప్పుడు కూడా ఇలానే జరిగింది!
బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీపై (BBC Documentary) దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోన్న నేపథ్యంలో.. గతంలో ఇందిరా గాంధీ (Indira Gandhi) హయాంలో బీబీసీని భారత్ నిషేధించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బీబీసీ (BBC) వ్యవహారం భారత్లో ఇటీవల మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గుజరాత్ అల్లర్లు, ఆ సమయంలో మోదీ తీరును వివరిస్తూ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ (BBC Documentary) తీవ్ర వివాదానికి కారణమయ్యింది. ఈ వివాదం కొనసాగుతోన్న సమయంలోనే స్థానికంగా బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ సర్వే (IT Survey) నిర్వహించడం మరింత కలకలం రేపింది. డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం నిరోధించడాన్ని తీవ్రంగా తప్పుపడుతోన్న కాంగ్రెస్.. ఇది మీడియాపై అణచివేతేనని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో గతంలో బీబీసీని భారత్ నిషేధించిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. 1970ల్లో ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రధానమంత్రిగా ఉన్న సయమంలో బీబీసీపై నిషేధం విధించడంతోపాటు ఎమర్జెన్సీ ఆ తర్వాత సందర్భాల్లో బీబీసీ డాక్యుమెంటరీలను ప్రసారం కాకుండా ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ఓసారి పరిశీలిస్తే..
కలకత్తా వివాదం..
‘కలకత్తా’ (Calcutta) పేరుతో ఫ్రెంచ్ డైరెక్టర్ లూయీస్ మల్లే నిర్మించిన ఓ డాక్యుమెంటరీని జూన్ 10, 1970న బీబీసీ ప్రసారం చేసింది. ‘ది బెవిల్డెర్డ్ జెయింట్’ (The Bewildered Giant) పేరుతో జూన్ 23న మరో డాక్యుమెంటరీని టెలికాస్ట్ చేసింది. 1968- 69ల మధ్య కాలంలో కలకత్తా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఆ చిత్రంలో.. అక్కడి సంపద, పేదరికం, మురికివాడలు, ప్యాలెస్ల వంటి విషయాలను ప్రస్తావించింది. అయితే, భారతదేశ సంస్కృతి, జీవన విధానాన్ని ఆ లఘు చిత్రాల్లో వక్రీకరించారని ఆరోపణలతో వివాదం మొదలయ్యింది. దేశ వ్యాప్తంగా దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో స్పందించిన భారత ప్రభుత్వం.. ఈ విషయాన్ని బీబీసీ సంస్థతోపాటు బ్రిటిష్ హై కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. దీని తర్వాత కూడా మొత్తం ఏడు విభాగాలను ప్రసారం చేయడంతో బీబీసీ కార్యకలాపాలను దేశంలో నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.
పార్లమెంటులో చర్చ..
భారత్లో బీబీసీ కార్యకలాపాలు నిలిపివేయాలంటూ నోటీసులు ఇచ్చిన రెండు వారాల తర్వాత.. ఇదే అంశంపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఆగస్టు 14, 1970న బీబీసీ కార్యకలాపాలు నిలిపివేయాలని ఆ సంస్థకు నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. అనంతరం జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీలు అందుకు మద్దతు పలికారు. వారిలో కొందరు విపక్షాల వారు కూడా మద్దతు పలకగా.. మరికొందరు మాత్రం ఇందిరా గాంధీ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. అయినా బీబీసీ నుంచి సంతృప్తికరమైన వివరణ రాకపోవడంతో ఆగస్టు 29, 1970 నుంచి బీబీసీ కార్యకలాపాలు నిలిపివేసే ఆదేశాలు ఇచ్చినట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు రెండేళ్ల పాటు ఆ నిషేధం కొనసాగింది.
ఎమర్జెన్సీ సమయంలోనూ..
దీంతోపాటు 1975లో ఎమర్జెన్సీ సమయంలోనూ అప్పటి ప్రభుత్వ ఆగ్రహానికి బీబీసీ గురయ్యింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారని మండిపడింది. దీంతో తమ ప్రతినిధిని రిపోర్టు చేయకుండా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన ముకేశ్ సింగ్పై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ కూడా 2015లో నిషేధానికి గురయ్యింది. తాజాగా ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ రూపొందించిన లఘు చిత్రం ప్రసారం కాకుండా ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల