BBC: బీబీసీపై భారత్ నిషేధం విధించిన వేళ.. అప్పుడు కూడా ఇలానే జరిగింది!
బీబీసీ (BBC) రూపొందించిన డాక్యుమెంటరీపై (BBC Documentary) దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోన్న నేపథ్యంలో.. గతంలో ఇందిరా గాంధీ (Indira Gandhi) హయాంలో బీబీసీని భారత్ నిషేధించిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బీబీసీ (BBC) వ్యవహారం భారత్లో ఇటీవల మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గుజరాత్ అల్లర్లు, ఆ సమయంలో మోదీ తీరును వివరిస్తూ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ (BBC Documentary) తీవ్ర వివాదానికి కారణమయ్యింది. ఈ వివాదం కొనసాగుతోన్న సమయంలోనే స్థానికంగా బీబీసీ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ సర్వే (IT Survey) నిర్వహించడం మరింత కలకలం రేపింది. డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం నిరోధించడాన్ని తీవ్రంగా తప్పుపడుతోన్న కాంగ్రెస్.. ఇది మీడియాపై అణచివేతేనని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో గతంలో బీబీసీని భారత్ నిషేధించిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. 1970ల్లో ఇందిరా గాంధీ (Indira Gandhi) ప్రధానమంత్రిగా ఉన్న సయమంలో బీబీసీపై నిషేధం విధించడంతోపాటు ఎమర్జెన్సీ ఆ తర్వాత సందర్భాల్లో బీబీసీ డాక్యుమెంటరీలను ప్రసారం కాకుండా ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ఓసారి పరిశీలిస్తే..
కలకత్తా వివాదం..
‘కలకత్తా’ (Calcutta) పేరుతో ఫ్రెంచ్ డైరెక్టర్ లూయీస్ మల్లే నిర్మించిన ఓ డాక్యుమెంటరీని జూన్ 10, 1970న బీబీసీ ప్రసారం చేసింది. ‘ది బెవిల్డెర్డ్ జెయింట్’ (The Bewildered Giant) పేరుతో జూన్ 23న మరో డాక్యుమెంటరీని టెలికాస్ట్ చేసింది. 1968- 69ల మధ్య కాలంలో కలకత్తా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఆ చిత్రంలో.. అక్కడి సంపద, పేదరికం, మురికివాడలు, ప్యాలెస్ల వంటి విషయాలను ప్రస్తావించింది. అయితే, భారతదేశ సంస్కృతి, జీవన విధానాన్ని ఆ లఘు చిత్రాల్లో వక్రీకరించారని ఆరోపణలతో వివాదం మొదలయ్యింది. దేశ వ్యాప్తంగా దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో స్పందించిన భారత ప్రభుత్వం.. ఈ విషయాన్ని బీబీసీ సంస్థతోపాటు బ్రిటిష్ హై కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. దీని తర్వాత కూడా మొత్తం ఏడు విభాగాలను ప్రసారం చేయడంతో బీబీసీ కార్యకలాపాలను దేశంలో నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.
పార్లమెంటులో చర్చ..
భారత్లో బీబీసీ కార్యకలాపాలు నిలిపివేయాలంటూ నోటీసులు ఇచ్చిన రెండు వారాల తర్వాత.. ఇదే అంశంపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఆగస్టు 14, 1970న బీబీసీ కార్యకలాపాలు నిలిపివేయాలని ఆ సంస్థకు నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. అనంతరం జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీలు అందుకు మద్దతు పలికారు. వారిలో కొందరు విపక్షాల వారు కూడా మద్దతు పలకగా.. మరికొందరు మాత్రం ఇందిరా గాంధీ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. అయినా బీబీసీ నుంచి సంతృప్తికరమైన వివరణ రాకపోవడంతో ఆగస్టు 29, 1970 నుంచి బీబీసీ కార్యకలాపాలు నిలిపివేసే ఆదేశాలు ఇచ్చినట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు రెండేళ్ల పాటు ఆ నిషేధం కొనసాగింది.
ఎమర్జెన్సీ సమయంలోనూ..
దీంతోపాటు 1975లో ఎమర్జెన్సీ సమయంలోనూ అప్పటి ప్రభుత్వ ఆగ్రహానికి బీబీసీ గురయ్యింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారని మండిపడింది. దీంతో తమ ప్రతినిధిని రిపోర్టు చేయకుండా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలిన ముకేశ్ సింగ్పై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ కూడా 2015లో నిషేధానికి గురయ్యింది. తాజాగా ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ రూపొందించిన లఘు చిత్రం ప్రసారం కాకుండా ప్రభుత్వం అడ్డుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!