Food : ఈ రోజు చాలా ‘హాట్ అండ్ స్పైసీ’ గురూ
హాట్.. హాట్ వంటకాలను ఇష్టంగా ఆరగించే వారికోసమే వచ్చిందే ‘ఇంటర్నేషనల్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ డే’. మరి ఈ డే విశేషాలేంటో తెలుసుకోండి.
వేడుక ఏదైనా భారతీయ వంటకాల్లో స్వీట్(sweet) అండ్ హాట్ (hot)ఉండాల్సిందే. మధుమేహం(diabetes), ఊబకాయం(obesity) తదితర కారణాలతో స్వీట్స్ను చాలామంది దూరం పెట్టినా హాట్ను మాత్రం ఆస్వాదిస్తూ తింటారు. అలా హాట్గా ఆరగించే వారికోసం వచ్చిందే ‘ఇంటర్నేషనల్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ డే’(international hot and spicy food day) జనవరి 16న దీనిని నిర్వహిస్తారు. ఈ డే సందర్భంగా సుగంధ ద్రవ్యాలు(spices).. అందులోని మసాలాల విశేషాలేంటో తెలుసుకోండి మరి.
ప్రపంచవ్యాప్తంగా ఏదైనా వంటకం(food)లో కొన్ని రకాల సుగంధ్ర ద్రవ్యాలు(spices) దట్టిస్తే దాన్ని ‘హాట్ అండ్ స్పైసీ ఫుడ్’గా పేర్కొంటారు. అయితే ఇక్కడ ఆహారం విషయంలో హాట్ అంటే అసలైన అర్థం వేడి అని కాదు. వంటకంలో ఎంతమేర మిరియాలు వాడారు... అది ఏ స్థాయిలో నషాళానికి అంటుతోంది అనేది ప్రధానం. ఇక మన దేశం విషయానికి వస్తే మిరియాల(pepper)తో కాకుండా మిరపకాయలతో చేసిన వంటకాలను హాట్ అండ్ స్పైసీగా పిలుస్తారు. అటువంటి మిరపను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్(andhra pradesh) కావడం గమనార్హం. కేరళ(kerala) రాష్ట్రాన్ని ‘స్పైస్ ట్రేడ్ హబ్’గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని సుగంధ ద్రవ్యాలు ఇక్కడ లభిస్తాయి. ఐరోపా, ఇతర దేశాల నుంచి భారతదేశానికి విదేశీయుల రాకపోకలు ప్రారంభమైందే వీటి వర్తకం కోసం.
చరిత్ర పొరల్లో సుగంధాలు
సుమారు 6 వేల ఏళ్ల క్రితం నుంచి సుగంధ ద్రవ్యాలు వంటల్లో వినియోగిస్తున్నారని కొన్ని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వాటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒంట్లోని తాపాన్ని తగ్గించి రోగాలను నయం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే పూర్వీకులు సైతం ఎక్కువగా వాడేవారు. గ్రీకులు(greek) సుగంధ ద్రవ్యాల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబర్చారట. మిరియాలు, దాల్చిన చెక్క తదితర ఉత్పత్తులను విరివిగా వాడారని సమాచారం. కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క, పసుపు, ధనియాలు, పుదీన, మరువం అప్పట్లోనే వినియోగించినట్లు గ్రీకు వైద్యుడు హిప్పోక్రేట్స్ తన గ్రంథాల్లో రాశారు. ‘ఫాదర్ ఆఫ్ బోటనీ’గా పిలిచే తత్వవేత్త థియోఫ్రాస్టస్ తాను రచించిన రెండు పుస్తకాల్లో 600 రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాల గురించి ప్రస్తావించారు.
ఇక రోమన్లది(roman) మరో వైవిధ్యమైన శైలి. వైన్, బామ్, ఆయిల్ తయారీలో వీరు మసాలాల్ని ఉపయోగించేవారు. కొన్ని రకాల వ్యాధుల నిర్మూలనలో మసాలా దినుసుల్ని ఎక్కువగా వినియోగించారు. ప్రస్తుతం మనం వంటల్లో వాడుతున్న పసుపును ఆయుర్వేద పద్ధతుల్లో వాడి కీళ్ల వాపులు, వికారం, తలనొప్పి తగ్గించడం.. రోగ నిరోధక శక్తి పెంపొందించడం ఆ కాలంలోనే ప్రారంభించారు.
ఏవి.. ఎప్పుడు మొదలు పెట్టారంటే..!
- క్రీస్తుపూర్వం 400 సంవత్సరంలో వ్యవసాయ పంటల్లో మిరప భాగమైంది.
- 1-2వ శతాబ్దాల్లో సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను ఉపయోగించి రోగాలను నయం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
- 8వ శతాబ్దంలో బాబిలోన్లోని తోటల్లో యాలకలు, పసుపు పండించడం ప్రారంభమైంది.
- 17వ శతాబ్దం నాటికి మతపరమైన కార్యక్రమాలు, అంత్యక్రియలు, వైద్యం, వ్యాపారం, వంటలు.. ఇలా అన్ని రకాలుగా మసాల దినుసులను వినియోగించారు. అవి మానవుల జీవన విధానంలో ఒక భాగంగా మారాయి.
ఆరోగ్యం.. దీర్ఘాయుష్షు
సుగంధ ద్రవ్యాలు, వాటిలోని మసాలాలు వంటలకు రుచి మాత్రమే కాదు. అవి తీసుకునే వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. 2015లో యూఎస్, చైనా చేసిన పరిశోధనల్లో వారం మొత్తం స్పైసీ ఫుడ్ తీసుకున్న జనాభాలో మరణాల సంఖ్య 14 శాతం తగ్గిందని తేలింది. మిరపలో అధికంగా ఉండే క్యాప్సియాన్ ఔషధం శరీరంలో చేరే క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తున్నట్లు వెల్లడైంది. ఇక ఆరోగ్యానికి స్పైసీ వంటకాలు చాలా మంచివి. బరువు తగ్గడంలో ఇవి తోడ్పడతాయి. కాబట్టి స్పైసీ ఫుడ్ నచ్చని వారంతా దానిని మెచ్చుకుంటూ తినే రోజు ఇదేనని గుర్తుంచుకోండి. హాట్ అండ్ స్పైసీగా ఆహారాన్ని టేస్ట్ చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు