Jayalalithaa: ‘శశి.. నాకు తలతిరుగుతోంది..’
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అక్రమాస్తుల కేసులో నేరారోపణలు రుజువైన తర్వాత జయలలిత తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని కమిషన్ ముందు లిఖితపూర్వకంగా ఇచ్చిన నివేదికలో శశికళ పేర్కొన్నారు.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి (Jayalalithaa Death) దారితీసిన కారణాలపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ (Arumughaswamy Report) ఇచ్చిన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టింది. ‘అమ్మ’ మరణంపై ఇప్పటికే అనేక అనుమానాలు నెలకొన్న తరుణంలో 480 పేజీల ఈ నివేదిక.. ఆమె నెచ్చెలి శశికళతో సహా మొత్తం 8 మందిపై కమిషన్ అభియోగాలు మోపడం సంచలనం రేపుతోంది. జయలలితకు అందిన చికిత్స తీరుపై విచారణ కమిషన్ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. మరోవైపు.. విచారణ క్రమంలో కమిషన్ ముందు జయలలిత సన్నిహితురాలు శశికళ (Sasikala) లిఖిత పూర్వకంగా ఇచ్చిన వివరాలు ఆసక్తిగా మారాయి. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో జయలలిత నేరారోపణలు రుజువైన తర్వాత ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు శశికళ అందులో పేర్కొన్నారు. ఇలా ఆస్పత్రిలో చేరక ముందు.. చికిత్స సమయంలో జయలలితకు అందించిన సపర్యలు.. చివరకు ఆమె తుది ఘడియలను ఓసారి పరిశీలిస్తే..
‘శశి.. నాకు తలతిరుగుతోంది..’
‘2016 నుంచి అక్క(జయలలిత) శరీరంపై బొబ్బలు, దురదతోపాటు చాలాచోట్ల సోరియాసిస్ మొదలయ్యింది. ఇబ్బందితోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కొంతకాలం పాటు స్వల్ప మోతాదులో స్టెరాయిడ్లు ఇవ్వాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో చర్మ సమస్యలు తగ్గాయి. వైద్యులు కూడా స్టెరాయిడ్లను క్రమంగా తగ్గించారు. అదే ఏడాది సెప్టెంబర్ 21న జరిగిన ఓ అధికారిక కార్యక్రమం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర జ్వరం వచ్చింది. చాలా అలసటగా ఉండటాన్ని గమనించి.. ఆస్పత్రికి వెళ్దామని చెప్పా. కానీ, అక్క నిరాకరించింది. నీరసంగా ఉండడంతో ఆ రోజు రాత్రి అక్కతోనే ఉన్నా. బ్రష్ చేసుకునేందుకు వెళ్లిన అక్క.. శశి, నాకు తలతిరుగుతోంది.. ఇక్కడికి రా అని పిలిచింది. బాత్రూంలోకి వెళ్లి ఆమెను తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నా. కొద్దిసేపటికే మూర్ఛపోయినట్లు అకస్మాత్తుగా నా భుజం మీద ఒరిగిపోయింది’ అని శశికళ అందులో పేర్కొన్నారు.
భక్తిగీతాలు.. గదిలో దేవుళ్ల ఫొటోలు..
75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన జయలలిత.. పరిస్థితి విషమించే ముందు వరకు తనకు ఇష్టమైన భక్తి గీతాలు వినేవారు. ఆమెకు ఇష్టమైన దేవుళ్ల ఫొటోలను గది గోడలపై అంటించాం. ఆమె కళ్లకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు వీలుగా గది సమీపంలో పచ్చని మొక్కలు ఏర్పాటు చేశాం.
డాక్టర్ గారు.. ‘మావో’ గురించి తెలుసుకోండి..
చైనా మాజీ అధ్యక్షుడు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ గురించి జయలలిత ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి ‘ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఛైర్మన్ మావో’ పుస్తకాన్ని చదవాలని.. నాయకత్వ లక్షణాలు తెలుస్తాయని తనకు చికిత్స చేసిన వైద్యుడికి సూచించారు. అయితే, కొన్నిరోజులకు జయలలిత ఆరోగ్యం మరింత క్షీణిస్తున్న సమయంలో ఆమెకు ట్రాకియోస్టోమీ చికిత్స చేశారు. ఓ పది రోజుల తర్వాత సర్జరీ సమయంలో ఏర్పాటు చేసిన ఆహార పైపును తొలగించాలని కోరారు. అక్క కోరిక మేరకు, వైద్యుల సూచనతో ఇడ్లీ, పొంగల్, వడను స్వల్ప మొత్తంలో అందించాం’ అని శశికళ పేర్కొన్నారు.
చివరి ఘడియల్లో..
రెండు నెలలకు పైగా చికిత్స కొనసాగుతోన్న సమయంలో.. డిసెంబర్ 4న ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ సాయంత్రం 4.20 గంటలకు ‘జయ వీర హనుమాన్’ సీరియల్ చూస్తున్నారు. అది పూర్తయిన కొద్ది సేపటికే హఠాత్తుగా అక్క శరీరం ఒక్కసారి వణికిపోయింది. అప్పటికే ఓ వైద్యురాలు, నర్సు అక్కడే ఉన్నారు. నాలుక బయటకు పెట్టి, పళ్లు కరుస్తూ ఏదో అరిచింది. ఆమె రెండు చేతులను నాపై వేయబోగా.. ఆమెను పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టాం. వెంటనే వైద్యులు వచ్చి అత్యవసర చికిత్స అందించారు’ అని శశికళ తన నివేదికలో చెప్పింది.
కొద్ది సేపటి తర్వాత ఆమె చెవి వద్ద ‘అక్కా..’ అని గట్టిగా అరవమని వైద్యులు చెప్పారు. నేను అలాగే అరవడం మొదలు పెట్టాను. ఆ సమయంలో రెండుసార్లు నావైపు చూసింది. అనంతరం కళ్లు మూసింది. ఆమెకు గుండెపోటు వచ్చిందని చెప్పిన వైద్యులు.. వెంటనే నన్ను బయటకు వెళ్లమన్నారు. భరించలేని దుఃఖంతో నేనూ కుప్పకూలిపోయా. లేచి చూసేసరికి అక్కకు ECMO పరికరం అమర్చి ఉంచారు. చాలా మంది వైద్యులు వచ్చి చికిత్స కొనసాగించారు. ఏదో అద్భుతం జరుగుతుంది.. అక్క ప్రాణాలు నిలుస్తాయని భావించా. మరుసటి రోజు రాత్రి వరకు వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రయోజనం లేకపోయింది’ అని నాటి ఘటనను విచారణ కమిషన్ ముందు శశికళ వివరించింది. కాగా.. డిసెంబర్ 5న రాత్రి 11.30కు జయలలిత కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.