Railway museum : బుల్లి ట్రైన్లు నడిచే బుజ్జి మ్యూజియం.. ఇక్కడ వందేభారత్ నడుస్తోంది!
జేబులో పట్టే స్టీమ్ ఇంజిన్లు (Steam engine), ఫ్లై ఓవర్లు, స్విమ్మింగ్ ఫూల్, దీప స్తంభాలు, సర్కస్ నమూనా ఇవన్నీ పుణెలోని (Pune) కోత్రుడ్లో ఉన్న జోషి మ్యూజియంలో కన్పిస్తాయి. దేశంలోని ఏకైక మినియేచర్ రైల్వే మ్యూజియంగా (Railway museum) ఇది 2004లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో (Limca book of records) చోటు సంపాదించింది.
(Image : Social media)
చుక్ చుక్ అంటూ పట్టాలపై పరుగులు తీసే రైలు బండిని (Rail) తొలి సారి చూసిన వారికి ఆశ్చర్యం కలుగక మానదు. అన్ని బోగీలను అదెలా లాగుతోంది? మొత్తం రైల్వే వ్యవస్థ (Railway system) ఎలా పని చేస్తోంది? వంటి సందేహాలు మెదళ్లను తొలుస్తుంటాయి. పుణెలోని ‘జోషి మ్యూజియం ఆఫ్ మినియేచర్ రైల్వేస్’ను (Joshi museum of miniature railways) ఒక సారి సందర్శిస్తే ఆ ప్రశ్నలన్నింటికీ బదులు దొరకుతుంది. ఇక్కడ భారతీయ రైళ్లు (Indian railways) మాత్రమే కాదు.. విదేశీ రైళ్లు ఎలా పరుగులు తీస్తాయో కూడా క్షుణ్నంగా తెలుసుకోవచ్చు.
బీఎస్ జోషి కృషి
పుణెకు చెందిన బీఎస్ జోషికి చిన్నప్పటి నుంచి రైళ్లంటే మహా ఆసక్తి. వివిధ రకాల రైళ్లను గమనిస్తూ వాటిని కార్డ్బోర్డ్తో తయారు చేసేవారు. అవి నిజమైన రైళ్లే అనుకునే విధంగా జోషి పనితనం ఉండేది. అందరూ అభినందిస్తుండటంతో ఆయన కోటలు, కొండలు వంటి కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కదిలే కారు, ఫైరింజన్ లాంటివి రూపొందించారు. తీగల సాయంతో వాటిని నడిపిస్తుంటే అందరూ ఔరా అని మెచ్చుకునేవారు. అలా జోషి 1982 ఓ మాస్టర్ పీస్ లే ఔట్ను తయారు చేసి గోఖలే హాల్లో ప్రదర్శించారు. ఆ బొమ్మల ఆకృతి నిర్మాణం చూసి జోషిని పలువురు అభినందించారు. తరువాత దాన్ని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లడం ఆయన ఓ పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో వాటిని తరచూ విడదీయడం, అతికించడం కష్టంగా మారింది. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. అదే మినియేచర్ మ్యూజియం. దేశంలో అప్పటి వరకు ఎవరూ అలాంటి ప్రయత్నం చేయలేదు.
దేశంలో తొలి మినియేచర్ మ్యూజియం నిర్మించాలనే సంకల్పంతో జోషి 1991లో తొలిసారి సౌదామిని ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీలో ఒక హాల్ను నిర్మించారు. గతంలో రూపొందించిన వాటికి భిన్నంగా కొత్త లే అవుట్ నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దేశీయ, విదేశీ రైలు మోడళ్లు, స్టేషన్లు, ట్రాక్లు, కార్లు, ప్రయాణికులు ఇలా ఒక్కో మినియేచర్ రూపొందించడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆయన ఏడేళ్ల కష్టానికి ఫలితం 1998 ఏప్రిల్ 1న దక్కింది. ఆ రోజు ‘జోషి మ్యూజియం ఆఫ్ మినియేచర్ రైల్వేస్’ ప్రారంభమైంది. దురదృష్టవశాత్తూ అదే ఏడాది జోషి కన్నుమూశారు.
(Image : Social media)
మినీ అద్భుతం.. రైల్వే నగరం
జోషి ఒక అద్భుతమైన రైల్వే నగరాన్ని తీర్చిదిద్దారు. అందులో అన్ని దేశాల రైల్వే వ్యవస్థలు నడుస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. స్టీమ్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, హై స్పీడ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, అండర్ గ్రౌండ్ మెట్రో, రోప్ రైల్వే, ఫునిక్యులర్ రైల్వే, వుపర్టర్ హ్యాంగింగ్ రకాల రైళ్లు ఈ మోడల్ నగరంలోని ట్రాక్లపై పరుగులు తీస్తుంటాయి. మినియేచర్ నిర్మాణంలో వెలిగే ప్రతి లైటు, మైకుల నుంచి వచ్చే శబ్దం డిజిటల్ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. స్టేషన్ పరిధిలో ‘ప్రయాణికులకు విజ్ఞప్తి’ అంటూ అలెర్ట్ చేసే వ్యవస్థ కూడా ఉంది. డిజైన్ మొత్తంలో 65 సిగ్నల్స్, 26 పాయింట్స్, 6 ప్లాట్ఫామ్స్, కంచెలు, దీప స్తంభాలు, ఫ్లై ఓవర్లు, రెండు లైన్ల హైవే, అందులో నడిచే కార్లు ఉన్నాయి. ఇందులోనే రివర్సింగ్ స్టేషన్తో ఒక ఘాట్ సెక్షన్ నమూనా కూడా కన్పిస్తుంది.
ఈ రైల్వే నగరంలో ఎత్తయిన భవంతులు మరో ప్రధాన ఆకర్షణ. వాటిలో దీపాలు వెలుగుతుంటాయి. చిన్న పక్కా ఇళ్లు కూడా ఉన్నాయి. వాటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. భారీ హోర్డింగ్లతో ఒక రద్దీ కూడలి దర్శనమిస్తుంది. ఇవి మాత్రమే కాదు.. రోలర్ కోస్టర్, ఫెర్రిస్ వీల్ వంటి సౌకర్యాలతో సర్కస్ నమూనాను ఏర్పాటు చేశారు. నగరం మొత్తంలో వివిధ చోట్ల దాదాపు 2వేల బొమ్మలున్నాయి. అవన్నీ రకరకాల పోజుల్లో ఉంటాయి. రాత్రి వాతావరణాన్ని ప్రతిబింబించే ఏర్పాటు కూడా ఈ మినియేచర్ మ్యూజియంలో ఉంది. 1853 ఏప్రిల్ 16న రాత్రి ఆకాశం ఎలా కనిపించిందో అలాంటి నమూనాను ఇక్కడ తీర్చిదిద్దారు. ఎందుకంటే ఆ రోజే మన దేశంలో తొలి రైలు కదిలింది.
వందే భారత్ వచ్చింది!
ప్రస్తుతం ఇదే తరహాలో మరో మ్యూజియాన్ని సతారా జిల్లాలోని వాయ్లో నిర్మించారు. జోషి తనయుడు రవి జోషి మరో రెండింటినీ నడిపిస్తున్నారు. కంట్రోల్ ప్యానల్ దాదాపు వెయ్యి తీగలను అనుసంధానం చేసి అందులోని మినియేచర్లను నడిపిస్తున్నారు. అంతే కాదు ఈ మ్యూజియం ఫ్లైష్మన్, రోకో, హాన్బీ వంటి అంతర్జాతీయ కంపెనీల మోడల్ రైళ్లను కూడా రూపొందిస్తోంది. అవసరాన్ని బట్టి వాటిని ఆయా కంపెనీలకు సరఫరా చేస్తోంది. 2007లో ఈ మ్యూజియం స్విట్జర్లాండ్లోని ప్రసిద్ధ జంగ్ ఫ్రా రైల్వే మోడల్ను అభివృద్ధి చేసింది. దాంతో 2వేల నకళ్లను పంపాలని అక్కడి నుంచి ఈ కంపెనీకి ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం ఏడాదికి 30 వేల మంది ఈ మ్యూజియాన్ని సందర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవలే ఈ మ్యూజియం సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా అందులో వందేభారత్ మినియేచర్ ట్రైన్ను ప్రవేశపెట్టారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?