Stunt rider : ఈ అమ్మాయి స్టంట్స్ చూస్తే ఔరా అనాల్సిందే!
కేరళకు చెందిన ఓ అమ్మాయి బైక్ రైడర్గా రాణిస్తూ అద్భుత విన్యాసాలు ప్రదర్శిస్తోంది. ఆమె టాలెంట్ చూసి పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.
(Image : Instagram)
సాధారణంగా అమ్మాయిల సామాజిక మాధ్యమాల(Social media) ఖాతాలను పరిశీలిస్తే ఎక్కువగా అందానికి(Beauty), ఫ్యాషన్(Fashion)కు ప్రాధాన్యమిచ్చే అంశాలు కన్పిస్తుంటాయి. కానీ కేరళ(Kerala)కు చెందిన తానా లూసియా జోజి ఇన్స్టా(Instagram) ఖాతాలో మాత్రం ఆమె బైక్(Bike)పై చేసే విన్యాసాల చిత్రాలు(Photos), వీడియోలు(Vedio) దర్శనమిస్తాయి. ఫ్రాన్స్(France)కు చెందిన ప్రముఖ లేడీ స్టంట్ రైడర్(Stunt rider) సారా లెజిటోను స్ఫూర్తిగా తీసుకొని సాహసం శ్వాసగా సాగిపోతున్న జోజి స్టంట్స్ ప్రయాణంపై ఓ లుక్కేయండి.
చిన్నప్పటి నుంచే ఆసక్తి
కేరళ(Kerala)లోని కొట్టాయంకు చెందిన తానా లూసియా జోజికి చిన్నప్పటి నుంచే బైక్(Bike)లపై విపరీతమైన ఆసక్తి చూపేది. హోండా యాక్టివా నడుపుతూ తానూ ఓ రేసర్(Racer)లా ఫీలయ్యేది. తరువాత ఇంజినీరింగ్ చదివేందుకు కక్కనాడ్లోని రాజగిరి కళాశాలలో చేరింది. ఆ సమయంలో ఓ బైక్పై చిన్నపాటి స్టంట్(Stunt) చేయడంతో ఆమెకేదో తెలియని ఆనందం కలిగింది. ఆ వీడియోను తన తల్లిదండ్రులు డాక్టర్ జోజి అబ్రహం, డాక్టర్ దీపాకు చూపించింది. అది చూసిన తరువాత వారు తమ కూతురు యాక్టివా నడిపే స్థాయి దాటేసిందనే నమ్మకానికి వచ్చారు. ఆమె కోరిక మేరకు బైక్ కొనివ్వడానికి సమ్మతించారు. అలా తానా తొలిసారి బజాజ్ అవెంజర్ కొనుగోలు చేసింది. అప్పట్లో హైట్ గురించి ఆలోచించి ఆ బైక్ కొనుగోలు చేసినట్లు తానా ఓ సందర్భంలో వెల్లడించింది.
స్టంట్ రైడింగ్ వైపు అడుగులు
కొత్త బైక్ కొన్న ఆ తర్వాత నుంచి తానా ప్రొఫెషనల్ స్టంట్ రైడింగ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే అభ్యంతరం తెలిపారు. తొలుత చదువు పూర్తి చేసి కెరీర్పై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. కానీ ఆమె మనసంతా స్టంట్ రైడింగ్పైనే ఉండేది. అందుకే సెమిస్టర్ బ్రేక్ మధ్యలో స్టంట్ రైడింగ్ నేర్చుకుంటానని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించింది. స్టంట్ రైడింగ్లో శిక్షణ తీసుకోవడానికి ఆమె గౌతమ్ సురేశ్ను సంప్రదించింది. అతడో టాప్ బైక్ రైడర్. ఓ ప్రమాదానికి గురి కావడంతో చాలాకాలం స్టంట్లకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత నుంచి అప్పుడప్పుడు స్టంట్స్ చేస్తున్నాడు. మొదట్లో తానాకు స్టంట్స్ నేర్పించడానికి సురేశ్ ఒప్పుకోలేదు. కానీ తానా పట్టుదల చూసి చివరికి ఓకే చెప్పాడు.
(Image : Instagram)
విన్యాసాల్లో రాటుదేలి..
తొలి నుంచి తానాకు స్టంట్ రైడింగ్పై ఆసక్తి ఉండటంతో కొద్దిరోజుల్లోనే ఆ విద్యపై పట్టు సాధించింది. స్టాపీ, వీలీ ఇలా రకరకాలైన స్టంట్లు చేయడంతో రాటుదేలింది. ఇవన్నీ చేస్తూనే ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. దాంతో తానా సామర్థ్యంపై ఆమె తల్లిదండ్రులకు పూర్తిగా నమ్మకం కలిగింది. సరైన జాగ్రత్తలు తీసుకొంటూ ముందుకు సాగితే ఈ క్రీడ సైతం అమ్మాయిలకు మంచిదేనని ఆమె తల్లిదండ్రులు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఆడపిల్లలకు ఇవన్నీ ఎందుకని బంధువులు విమర్శిస్తే ‘మా అమ్మాయి ఆనందానికి మేమొందుకు అడ్డుకట్ట వేయాలని’ తానా తల్లి దీప దీటుగా సమాధానమిస్తోంది.
సాహస చిత్రాలతో పోస్టులు
తానా కేరళలో ఓ ఫ్రొఫెషనల్ మహిళా బైక్ రైడర్గా పేరు తెచ్చుకుంది. మన దేశంలో ఈ క్రీడకు తగిన ఆదరణ లేదు. పైగా దీన్ని పోకిరీలు వీధుల్లో ప్రదర్శించే విద్యగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ ముద్ర పడకుండా తానా పూర్తి జాగ్రత్తలు తీసుకొంటోంది. రద్దీ రోడ్లపై ఎప్పుడూ అలాంటి సాహసాలు చేయలేదు. ప్రస్తుతం తానాకు ఇన్స్టాలో 28వేల మంది ఫాలోవర్లున్నారు. అందులో తన స్టంట్స్, ఇతర విషయాలను పోస్టు చేస్తుంటుంది. తానా ‘స్ట్రీట్ లార్డ్స్’ అనే బైక్ స్టంట్ బృందంలో సభ్యురాలిగా కొనసాగుతోంది. కొన్ని షోలు, ప్రకటనలు చేయడం ద్వారా ఈ బృందానికి ఆదాయం లభిస్తోంది. బైక్ కంపెనీలు, ఇతర ఉత్పత్తుల తయారీదారులు మార్కెటింగ్లో భాగంగా ఈ స్టంట్ రైడర్లను సంప్రదిస్తుంటారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ