Indian Railway: 170 ఏళ్ల భారతీయ రైల్వే.. ఆసక్తికర విషయాలెన్నో..!
1853, ఏప్రిల్ 16 భారత్లో తొలి పాసింజర్ రైలును (First Passenger Train) ప్రవేశపెట్టారు. ప్రతియేటా ఏప్రిల్ 16న ‘రైలు రవాణా దినోత్సవం’గా జరుపుతున్నారు. ఈ సందర్భంగా 170 వసంతాలు పూర్తి చేసుకున్న ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికర విషయాలు.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో రైలు ప్రయాణాలకు (Indian Railway Transportation) ప్రత్యేక స్థానముంది. కేవలం సరకు రవాణా మాత్రమే కాకుండా.. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకున్న ప్రయాణికులు ఎక్కువగా రైలుకే మొగ్గు చూపుతారు. సుఖంగా ప్రయాణించడంతోపాటు దాదాపుగా అనుకున్న సమాయానికి గమ్యం చేర్చడం కూడా దీనికి ఒక కారణమే. తొలిసారిగా 1853, ఏప్రిల్ 16న తొలి పాసింజర్ రైలును భారతదేశంలో ప్రవేశపెట్టారు. బోరీబందర్ (Bori bandar ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్) నుంచి థానే (Thane) వరకు 34 కిలోమీటర్ల మేర ఇది తొలి ప్రయాణం చేసింది. అప్పటి నుంచి ఏప్రిల్ 16ను ‘రైలు రవాణా దినోత్సవం’గా జరుపుతున్నారు. రేపటితో భారతీయ రైల్వే (Indian Railway) 170 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన వ్యవస్థగా భారతీయ రైల్వేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏడాదికి దాదాపు 8.086 బిలియన్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుండగా.. సుమారు 1.208 బిలియన్ టన్నుల సరకు రైళ్ల ద్వారా రవాణా అవుతోంది.
- 170 ఏళ్లకు ముందే భారత్లో రైల్వేమార్గాలకు పథకాలు రూపొందించారు. జెమ్సెట్జీ జీజీభోయ్, జగ్నాథ్ సుంకర్సేత్ తొలి రైల్వే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.
- 1853లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ పాలనలో మొదటి రైలు ప్రయాణం ప్రారంభించింది.
- ప్రపంచంలోని అతి పొడవైన రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే మూడో స్థానంలో ఉంది. భారత్లో 1,27,760 కి.మీ మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా దేశాలున్నాయి.
- భారత్లో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్. గంటలకు 180కి.మీ వేగంతో ప్రయాణించగలదు. అయితే, ట్రాక్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 160కి.మీ వేగం వరకు మాత్రమే నడుపుతున్నారు. అత్యంత నెమ్మదిగా నడిచే రైలు మెట్టుపాళెం-ఊటీ మధ్య నడిచే నీలగిరి పాసింజర్.. గంటలకు 10 కి.మీ వేగంతో ఇది ప్రయాణిస్తుంది.
- భారత్లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4,286కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి దాదాపు 82 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.
- భారత్లో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారమ్ కర్ణాటకలోని హుబ్బళ్లి రైల్వే స్టేషన్లో ఉంది. 1507 మీటర్ల పొడవుతో.. ఇది భారత్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫ్లాట్ఫాంగా రికార్డు సృష్టించింది. ఇటీవలే కర్ణాటక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఈ ప్లాట్ఫాంను జాతికి అంకితం చేశారు.
- భారత్లో మొట్టమొదటి విద్యుత్ రైలు 1925 ఫిబ్రవరి 3న పట్టాలపై పరుగులు తీసింది. ముంబయి విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్లా హార్బర్ వరకు ఈ రైలును నడిపించారు. ఆ తర్వాత విద్యుత్ లైన్లను నాశిక్లోని ఇగాత్పురి జిల్లాకు, అక్కడి నుంచి పుణెకు విస్తరించారు.
- నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) ఛైర్మన్, ఎండీ సతీశ్ అగ్నిహోత్రి వెల్లడించిన వివరాల ప్రకారం..భారత్లో మొట్టమొదటి బుల్లెట్ రైలును 2027లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 2026లోనే ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టనున్నారు. ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య ఈ రైలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్