Indian Railway: 170 ఏళ్ల భారతీయ రైల్వే.. ఆసక్తికర విషయాలెన్నో..!
1853, ఏప్రిల్ 16 భారత్లో తొలి పాసింజర్ రైలును (First Passenger Train) ప్రవేశపెట్టారు. ప్రతియేటా ఏప్రిల్ 16న ‘రైలు రవాణా దినోత్సవం’గా జరుపుతున్నారు. ఈ సందర్భంగా 170 వసంతాలు పూర్తి చేసుకున్న ఇండియన్ రైల్వే గురించి ఆసక్తికర విషయాలు.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో రైలు ప్రయాణాలకు (Indian Railway Transportation) ప్రత్యేక స్థానముంది. కేవలం సరకు రవాణా మాత్రమే కాకుండా.. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకున్న ప్రయాణికులు ఎక్కువగా రైలుకే మొగ్గు చూపుతారు. సుఖంగా ప్రయాణించడంతోపాటు దాదాపుగా అనుకున్న సమాయానికి గమ్యం చేర్చడం కూడా దీనికి ఒక కారణమే. తొలిసారిగా 1853, ఏప్రిల్ 16న తొలి పాసింజర్ రైలును భారతదేశంలో ప్రవేశపెట్టారు. బోరీబందర్ (Bori bandar ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్) నుంచి థానే (Thane) వరకు 34 కిలోమీటర్ల మేర ఇది తొలి ప్రయాణం చేసింది. అప్పటి నుంచి ఏప్రిల్ 16ను ‘రైలు రవాణా దినోత్సవం’గా జరుపుతున్నారు. రేపటితో భారతీయ రైల్వే (Indian Railway) 170 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన వ్యవస్థగా భారతీయ రైల్వేకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏడాదికి దాదాపు 8.086 బిలియన్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుండగా.. సుమారు 1.208 బిలియన్ టన్నుల సరకు రైళ్ల ద్వారా రవాణా అవుతోంది.
- 170 ఏళ్లకు ముందే భారత్లో రైల్వేమార్గాలకు పథకాలు రూపొందించారు. జెమ్సెట్జీ జీజీభోయ్, జగ్నాథ్ సుంకర్సేత్ తొలి రైల్వే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.
- 1853లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ పాలనలో మొదటి రైలు ప్రయాణం ప్రారంభించింది.
- ప్రపంచంలోని అతి పొడవైన రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే మూడో స్థానంలో ఉంది. భారత్లో 1,27,760 కి.మీ మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా దేశాలున్నాయి.
- భారత్లో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్. గంటలకు 180కి.మీ వేగంతో ప్రయాణించగలదు. అయితే, ట్రాక్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 160కి.మీ వేగం వరకు మాత్రమే నడుపుతున్నారు. అత్యంత నెమ్మదిగా నడిచే రైలు మెట్టుపాళెం-ఊటీ మధ్య నడిచే నీలగిరి పాసింజర్.. గంటలకు 10 కి.మీ వేగంతో ఇది ప్రయాణిస్తుంది.
- భారత్లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4,286కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి దాదాపు 82 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.
- భారత్లో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారమ్ కర్ణాటకలోని హుబ్బళ్లి రైల్వే స్టేషన్లో ఉంది. 1507 మీటర్ల పొడవుతో.. ఇది భారత్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫ్లాట్ఫాంగా రికార్డు సృష్టించింది. ఇటీవలే కర్ణాటక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఈ ప్లాట్ఫాంను జాతికి అంకితం చేశారు.
- భారత్లో మొట్టమొదటి విద్యుత్ రైలు 1925 ఫిబ్రవరి 3న పట్టాలపై పరుగులు తీసింది. ముంబయి విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్లా హార్బర్ వరకు ఈ రైలును నడిపించారు. ఆ తర్వాత విద్యుత్ లైన్లను నాశిక్లోని ఇగాత్పురి జిల్లాకు, అక్కడి నుంచి పుణెకు విస్తరించారు.
- నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) ఛైర్మన్, ఎండీ సతీశ్ అగ్నిహోత్రి వెల్లడించిన వివరాల ప్రకారం..భారత్లో మొట్టమొదటి బుల్లెట్ రైలును 2027లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 2026లోనే ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టనున్నారు. ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య ఈ రైలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్