Longest neck : పొడవైన మెడలు ఈ మహిళల ప్రత్యేకత.. ఎందుకు రింగులు ధరిస్తున్నారంటే!
మయన్మార్ (Myanmar), థాయ్లాండ్లో కయాన్ తెగ స్త్రీలు మెడకు పొడవైన రింగులు ధరించడం ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. అలా వారు రింగులు ధరించడం వెనకున్న కథేంటో చదివేయండి.
మయన్మార్ (Myanmar), థాయ్లాండ్ (Thailand)లోని కయాన్ తెగకు చెందిన స్త్రీలు మెడ చుట్టూ ఇత్తడి రింగులు ధరిస్తారు. వాటిని కాయిల్స్ అని కూడా పిలుస్తారు. తమ మెడ సుందరంగా, ప్రత్యేకంగా కనిపించడానికి గత కొన్ని శతాబ్దాలుగా ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు కొన్నిసార్లు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఎప్పుడు మొదలైందీ ఆచారం!
ప్రపంచంలోనే అతి పొడవైన మెడలు కలిగిన మహిళలుగా కయాన్ జాతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ మాత్రమే కాకుండా వివిధ సంస్కృతుల్లోనూ ఈ తరహా రింగులను ధరిస్తారు. ఆసియాలో 11వ శతాబ్దం నుంచే మెడను పొడిగించే పద్ధతి అమల్లో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకు ముందు కూడా ఈ ఆచారం ఉండొచ్చని వారు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాలకు చెందిన సెల్టిక్ జాతి ప్రజలు కూడా మెడకు రింగులు ధరించేవారు. అయితే వారి పద్ధతి కొంచెం భిన్నంగా ఉండేది. ఈ జాతి పురుషులు తమ సంపద, అధికారం, దర్పానికి ప్రతీకగా ‘టార్క్స్’ అనే రింగులను ధరించారు. వాటిని మెడ పొడిగింపు కోసం వాడలేదు.
ఐదేళ్లకే మెడ రింగు
మెడ రింగులు ధరించే గిరిజన మహిళలు ప్రస్తుతం ప్రపంచంలో చాలా చోట్ల కన్పిస్తారు. మయన్మార్లోని కయాన్ ప్రజలు, ఆఫ్రికాలోనే ఎండబేలా తెగలు ఇప్పటికీ రింగులు ధరిస్తున్నారు. కయాన్ తెగలోని బాలికలకు 5 సంవత్సరాలు రాగానే మెడకు రింగును అలంకరిస్తారు. ప్రతి ఏడాది వాటిని మార్చి కాస్త పెద్దవి వేస్తూ పోతారు. అలా వృద్ధాప్యం వచ్చేసరికి ఒక్కో మహిళ మెడలో సుమారు 15 కేజీల బరువైన రింగులుంటాయి. వైద్య చికిత్స చేయించుకోవాల్సి వస్తే తప్ప వాటిని ఏ సందర్భంలోనూ తొలగించరు. కయాన్ ప్రజలను ‘పడాంగ్ ’అని కూడా పిలుస్తారు. 1990 ప్రాంతంలో వీరు మిలటరీ బారి నుంచి తప్పించుకోవడానికి థాయిలాండ్ సరిహద్దుకు చేరారు. అక్కడే స్థిరపడి పోవడంతో ‘పొడవైన మెడ తెగ’గా వారికి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఈ తెగను చూసేందుకు అనేక మంది పర్యాటకులు వెళ్తుంటారు. పర్యాటకుల ప్రోత్సాహం కారణంగానే ఈ తెగ మనుగడ సాగిస్తోందని అంటారు.
మూడు సిద్ధాంతాలు
కయాన్ జాతి మహిళలు మెడ రింగులు ఎందుకు ధరిస్తున్నారు? దాని వెనుక ఎలాంటి కారణాలున్నాయనే విషయంపై కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో ఒక సిద్ధాంతం ప్రకారం.. కయాన్ స్త్రీలను అంద విహీనంగా చేయడం వల్ల శత్రువులు వారిని విక్రయించడం, అపహరించడం, బానిసత్వం కోసం వినియోగించడం వంటి చర్యలను అరికట్టవచ్చని భావించారు. రెండోది పులుల దాడి నుంచి రక్షించుకోవడం. అంటే అటవీ ప్రాంతంలో నివసించే వీరిపై పులులు దాడి చేస్తే మెడకు ఉన్న రింగుతో ప్రాణాపాయం తప్పుతుందని తెలుసుకున్నారు. మూడో సిద్ధాంతం ఏమిటంటే వీరి సంస్కృతి చిహ్నం డ్రాగన్. దాన్ని పోలి ఉండేలా రింగులను ధరించడం. ప్రస్తుతం చాలా మంది కయాన్ మహిళలకు తాము ఎందుకు రింగులు ధరిస్తున్నామో తెలియనప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
గిన్నిస్ బుక్లో జిరాఫీ మహిళ..
మయన్మార్లోని కయాన్ తెగకు చెందిన ఓ మహిళను ‘జిరాఫీ మహిళ’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆమె మెడ జిరాఫీలాగే చాలా పొడవుగా ఉంటుంది. ఆమెను చూడటానికి వచ్చిన విదేశీయులు ఈ పేరు పెట్టారు. ఆ పేరే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. అందులో ఆమె మెడ పొడవును 19.7 సెంటీమీటర్లుగా పేర్కొన్నారు. ఈ రికార్డ్స్ తరువాత ఆ ప్రాంతంలో పర్యాటకం మరింత ఊపందుకుంది. పొడవైన మెడతో ఆకట్టుకుంటున్న ఈ ప్రజలు థాయ్లాండ్లో కొంత వివక్ష కూడా ఎదుర్కొంటున్నారు. వీరిని ఇంకా మయన్మార్ శరణార్థులుగానే అక్కడి ప్రభుత్వం గుర్తిస్తోంది. దాంతో వారి పిల్లలకు థాయ్ పౌరసత్వం దక్కడం లేదు. ఫలితంగా విద్య, ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు.
అనేక ఆరోగ్య సమస్యలు
పురాతన ఆచార సంప్రదాయాన్ని కొనసాగించడం వల్ల ఈ తెగ మహిళలకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. సుదీర్ఘ కాలం వాటిని వేసుకోవడం వల్ల కాలర్ బోన్కు గాయాలవుతున్నాయి. ఒక వేళ ఉన్నట్లుండి తీసి వేస్తే సొంతంగా మెడ నిలపడం కష్టమైపోతోంది. ఊపిరి అందని పరిస్థితి ఏర్పడుతోంది. గడిచిన దశాబ్దం కాలంలో ఈ ఆచారాన్ని పాటించే మహిళల సంఖ్య తగ్గిపోయింది. దాన్ని కచ్చితంగా పాటించాలని ఆ తెగ పెద్దలు కూడా బలవంతం చేయట్లేదు.
కయాన్ మహిళలను స్ఫూర్తిగా తీసుకొని సిడ్నీ స్మిత్ అనే యువతి తనను తాను ‘జిరాఫీ మహిళ’గా ప్రకటించుకొని గతంలో ఇలాంటి రింగులను ధరించింది. అనారోగ్య సమస్యలు రావడంతో ఐదేళ్ల తర్వాత వాటిని తొలగించింది. అవి ధరించడం వల్ల డ్రైవింగ్ చేయలేకపోయానని, కనీసం సొంత పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాలేదని ఆమె మీడియాకు వెల్లడించింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం