Longest neck : పొడవైన మెడలు ఈ మహిళల ప్రత్యేకత.. ఎందుకు రింగులు ధరిస్తున్నారంటే!
మయన్మార్ (Myanmar), థాయ్లాండ్లో కయాన్ తెగ స్త్రీలు మెడకు పొడవైన రింగులు ధరించడం ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. అలా వారు రింగులు ధరించడం వెనకున్న కథేంటో చదివేయండి.
మయన్మార్ (Myanmar), థాయ్లాండ్ (Thailand)లోని కయాన్ తెగకు చెందిన స్త్రీలు మెడ చుట్టూ ఇత్తడి రింగులు ధరిస్తారు. వాటిని కాయిల్స్ అని కూడా పిలుస్తారు. తమ మెడ సుందరంగా, ప్రత్యేకంగా కనిపించడానికి గత కొన్ని శతాబ్దాలుగా ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు కొన్నిసార్లు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
ఎప్పుడు మొదలైందీ ఆచారం!
ప్రపంచంలోనే అతి పొడవైన మెడలు కలిగిన మహిళలుగా కయాన్ జాతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ మాత్రమే కాకుండా వివిధ సంస్కృతుల్లోనూ ఈ తరహా రింగులను ధరిస్తారు. ఆసియాలో 11వ శతాబ్దం నుంచే మెడను పొడిగించే పద్ధతి అమల్లో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకు ముందు కూడా ఈ ఆచారం ఉండొచ్చని వారు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాలకు చెందిన సెల్టిక్ జాతి ప్రజలు కూడా మెడకు రింగులు ధరించేవారు. అయితే వారి పద్ధతి కొంచెం భిన్నంగా ఉండేది. ఈ జాతి పురుషులు తమ సంపద, అధికారం, దర్పానికి ప్రతీకగా ‘టార్క్స్’ అనే రింగులను ధరించారు. వాటిని మెడ పొడిగింపు కోసం వాడలేదు.
ఐదేళ్లకే మెడ రింగు
మెడ రింగులు ధరించే గిరిజన మహిళలు ప్రస్తుతం ప్రపంచంలో చాలా చోట్ల కన్పిస్తారు. మయన్మార్లోని కయాన్ ప్రజలు, ఆఫ్రికాలోనే ఎండబేలా తెగలు ఇప్పటికీ రింగులు ధరిస్తున్నారు. కయాన్ తెగలోని బాలికలకు 5 సంవత్సరాలు రాగానే మెడకు రింగును అలంకరిస్తారు. ప్రతి ఏడాది వాటిని మార్చి కాస్త పెద్దవి వేస్తూ పోతారు. అలా వృద్ధాప్యం వచ్చేసరికి ఒక్కో మహిళ మెడలో సుమారు 15 కేజీల బరువైన రింగులుంటాయి. వైద్య చికిత్స చేయించుకోవాల్సి వస్తే తప్ప వాటిని ఏ సందర్భంలోనూ తొలగించరు. కయాన్ ప్రజలను ‘పడాంగ్ ’అని కూడా పిలుస్తారు. 1990 ప్రాంతంలో వీరు మిలటరీ బారి నుంచి తప్పించుకోవడానికి థాయిలాండ్ సరిహద్దుకు చేరారు. అక్కడే స్థిరపడి పోవడంతో ‘పొడవైన మెడ తెగ’గా వారికి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఈ తెగను చూసేందుకు అనేక మంది పర్యాటకులు వెళ్తుంటారు. పర్యాటకుల ప్రోత్సాహం కారణంగానే ఈ తెగ మనుగడ సాగిస్తోందని అంటారు.
మూడు సిద్ధాంతాలు
కయాన్ జాతి మహిళలు మెడ రింగులు ఎందుకు ధరిస్తున్నారు? దాని వెనుక ఎలాంటి కారణాలున్నాయనే విషయంపై కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో ఒక సిద్ధాంతం ప్రకారం.. కయాన్ స్త్రీలను అంద విహీనంగా చేయడం వల్ల శత్రువులు వారిని విక్రయించడం, అపహరించడం, బానిసత్వం కోసం వినియోగించడం వంటి చర్యలను అరికట్టవచ్చని భావించారు. రెండోది పులుల దాడి నుంచి రక్షించుకోవడం. అంటే అటవీ ప్రాంతంలో నివసించే వీరిపై పులులు దాడి చేస్తే మెడకు ఉన్న రింగుతో ప్రాణాపాయం తప్పుతుందని తెలుసుకున్నారు. మూడో సిద్ధాంతం ఏమిటంటే వీరి సంస్కృతి చిహ్నం డ్రాగన్. దాన్ని పోలి ఉండేలా రింగులను ధరించడం. ప్రస్తుతం చాలా మంది కయాన్ మహిళలకు తాము ఎందుకు రింగులు ధరిస్తున్నామో తెలియనప్పటికీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
గిన్నిస్ బుక్లో జిరాఫీ మహిళ..
మయన్మార్లోని కయాన్ తెగకు చెందిన ఓ మహిళను ‘జిరాఫీ మహిళ’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆమె మెడ జిరాఫీలాగే చాలా పొడవుగా ఉంటుంది. ఆమెను చూడటానికి వచ్చిన విదేశీయులు ఈ పేరు పెట్టారు. ఆ పేరే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. అందులో ఆమె మెడ పొడవును 19.7 సెంటీమీటర్లుగా పేర్కొన్నారు. ఈ రికార్డ్స్ తరువాత ఆ ప్రాంతంలో పర్యాటకం మరింత ఊపందుకుంది. పొడవైన మెడతో ఆకట్టుకుంటున్న ఈ ప్రజలు థాయ్లాండ్లో కొంత వివక్ష కూడా ఎదుర్కొంటున్నారు. వీరిని ఇంకా మయన్మార్ శరణార్థులుగానే అక్కడి ప్రభుత్వం గుర్తిస్తోంది. దాంతో వారి పిల్లలకు థాయ్ పౌరసత్వం దక్కడం లేదు. ఫలితంగా విద్య, ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు.
అనేక ఆరోగ్య సమస్యలు
పురాతన ఆచార సంప్రదాయాన్ని కొనసాగించడం వల్ల ఈ తెగ మహిళలకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. సుదీర్ఘ కాలం వాటిని వేసుకోవడం వల్ల కాలర్ బోన్కు గాయాలవుతున్నాయి. ఒక వేళ ఉన్నట్లుండి తీసి వేస్తే సొంతంగా మెడ నిలపడం కష్టమైపోతోంది. ఊపిరి అందని పరిస్థితి ఏర్పడుతోంది. గడిచిన దశాబ్దం కాలంలో ఈ ఆచారాన్ని పాటించే మహిళల సంఖ్య తగ్గిపోయింది. దాన్ని కచ్చితంగా పాటించాలని ఆ తెగ పెద్దలు కూడా బలవంతం చేయట్లేదు.
కయాన్ మహిళలను స్ఫూర్తిగా తీసుకొని సిడ్నీ స్మిత్ అనే యువతి తనను తాను ‘జిరాఫీ మహిళ’గా ప్రకటించుకొని గతంలో ఇలాంటి రింగులను ధరించింది. అనారోగ్య సమస్యలు రావడంతో ఐదేళ్ల తర్వాత వాటిని తొలగించింది. అవి ధరించడం వల్ల డ్రైవింగ్ చేయలేకపోయానని, కనీసం సొంత పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాలేదని ఆమె మీడియాకు వెల్లడించింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ