Startups: అంకుర సంస్థల వైఫల్యాలకు ముఖ్య కారణాలు ఇవే..!
వేల సంఖ్యలో అంకుర సంస్థలు పుట్టుకొచ్చినా కొన్ని మాత్రమే విజయవంతమై, ప్రజల ఆదరణ పొందగలుగుతున్నాయి. చాలా సంస్థలు మార్కెట్లోకి వచ్చాయన్న విషయం కూడా తెలియకుండానే కనుమరుగైపోతున్నాయి. ఇలా అంకుర సంస్థలు వైఫల్యం చెందడానికి ఎనిమిది ముఖ్యమైన కారణాలున్నాయని
ఇంటర్నెట్ డెస్క్: వ్యాపార రంగం విస్తరిస్తూనే ఉంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎన్నో సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో యువత ఇలాంటి సేవలను గుర్తించి వినూత్న వ్యాపారాలను ప్రారంభిస్తోంది. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో అనేక అంకుర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. అయితే వేల సంఖ్యలో అంకుర సంస్థలు పుట్టుకొచ్చినా కొన్ని మాత్రమే విజయవంతమై, ప్రజల ఆదరణ పొందగలుగుతున్నాయి. చాలా సంస్థలు మార్కెట్లోకి వచ్చాయన్న విషయం కూడా తెలియకుండానే కనుమరుగైపోతున్నాయి. ఇలా అంకుర సంస్థలు వైఫల్యం చెందడానికి ఎనిమిది ముఖ్యమైన కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
తక్కువ డిమాండ్ ఉన్నవి ఎంచుకోవడం
మార్కెట్లో డిమాండ్ అంతగాలేని వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోవడమే అంకురసంస్థ వైఫల్యానికి మొదటి కారణం. ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే అది వీలైనంత ఎక్కువ మంది అవసరాలను తీర్చేవిధంగా ఉండాలి. వ్యాపార ఆలోచన ఎంత బాగున్నా.. అది మార్కెట్లో కొద్దిమందిని మాత్రమే ఆకర్షించేదయితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఉదాహరణకు ఆహార రంగంలో కేవలం శాకాహారం మాత్రమే అందించే సేవలను ఎంచుకున్నారనుకోండి.. అది కేవలం శాకాహారులు మాత్రమే వినియోగించే అతి తక్కువ పరిధి ఉన్న అంకుర సంస్థగా నిలిచిపోతుంది. విస్తరణకు అవకాశం ఉండదు.
నిధుల కొరత
ఏ వ్యాపారం ప్రారంభించినా.. దాని కార్యకలాపాలు సక్రమంగా కొనసాగాలంటే నిధులు అవసరం. తగినంత నిధులు సమకూరనప్పుడు సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల అంకుర సంస్థలకు చెడ్డపేరు రావొచ్చు. డబ్బులు సమకూరినా సరైన ప్రణాళిక లేని ఖర్చులు అంకుర సంస్థను దెబ్బతీసే అవకాశముంది.
ఉద్యోగుల నియామకం
ఓ సర్వే ప్రకారం 23శాతం అంకురసంస్థలు విఫలం కావడానికి వారు నియమించుకున్న ఉద్యోగులే కారణమని తేలింది. ఒక సంస్థ ఎదగాలంటే అందులో పనిచేసే ఉద్యోగులకు ఎంతో నైపుణ్యం ఉండాలి. కొత్త విషయాలను నేర్చుకుంటూ, సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసేవారు కావాలి. ముఖ్యంగా ఉద్యోగులు ఐక్యంగా పనిచేయాలి. అంకుర సంస్థ ఆలోచనలు, లక్ష్యాలను ఉద్యోగులు తమవిగా భావించగలగాలి. కానీ కొన్ని సంస్థలు సరైన నైపుణ్యం లేనివారిని నియమించుకొని స్వయంకృతాపరాధం చేస్తుంటాయి.
పోటీదారులు ఎక్కువ
పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే అంత సులువు కాదు. ఒక అంకుర సంస్థ వ్యాపార ఆలోచన మరొకరికీ వచ్చి ఉండొచ్చు. లేదా ఆ వ్యాపారం అప్పటికే మార్కెట్లో అందుబాటులోకి రావొచ్చు. దీంతో ఒకేలాంటి సేవలు అందించే సంస్థల మధ్య పోటీ పెరుగుతుంది. పోటీదారులను తట్టుకొని అంకుర సంస్థలు మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమే. ఒకవేళ ఒక కొత్తరకం సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తే వ్యాపారం బాగా జరగొచ్చు. అయితే, వెంటనే ఇలాంటి సేవలు అందించే సంస్థలు అనేకం పుట్టుకొస్తాయి. మళ్లీ పోటీ పెరుగుతుంది. దీంతో సేవలు అందించే విధానాన్ని బట్టే అంకుర సంస్థ విజయం ఆధారపడి ఉంటుంది.
సేవలకు ధర నిర్ణయం
అంకుర సంస్థను భారీ లేదా పరిమిత పెట్టుబడితో ప్రారంభించినా వినియోగదారులకు అందించే సేవలకు ధరలు నిర్ణయించడంలో ఆయా సంస్థలు తప్పటడుగులు వేస్తాయి. ఎల్లప్పుడూ అందుబాటు ధరలు, ప్రత్యేక ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ, సంస్థ పాలసీలు, ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అనుకునే దానికంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తే ఆ అంకుర సంస్థ ఎక్కువకాలం నిలబడలేదు.
వ్యాపార వ్యూహాలు
మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే అంకుర సంస్థలు వ్యూహాలు రచించాలి. పోటీగా ఉండే సంస్థలకు మించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో ఒకే విధానంలో వెళ్తానంటే సరిపోదు. వివిధ రకాలుగా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేయాలి. తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోగలగాలి. సరైన వ్యూహ రచనలు లేకే చాలా అంకుర సంస్థలు అటకెక్కేస్తున్నాయి.
మార్కెటింగ్
ఎంతో వినూత్న, విభిన్న సేవలతో వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. కానీ దాని గురించి నలుగురికి తెలియకపోతే లాభం ఏముంది? అందుకే అంకుర సంస్థలు ఏర్పాటు చేయడంపైనే కాదు.. తమ సేవలను ప్రచారం చేసుకొని, మార్కెట్ ఏర్పరచుకోవాలి. వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచార మాధ్యమాలు, ఇతర మార్గాలను బాగా ఉపయోగించుకోవాలి. దాదాపు 14శాతం అంకుర సంస్థలు సరైన మార్కెటింగ్ చేసుకోలేకే దివాళా తీస్తున్నాయని ఓ సర్వేలో వెల్లడైంది.
నాణ్యత
ఒక అంకుర సంస్థ భారీ పెట్టుబడితో ప్రారంభమై, మార్కెట్లో గుర్తింపు పొందిందనుకుందాం. కానీ, అమ్మే వస్తువు లేదా అందించే సేవల్లో నాణ్యత లేకపోతే ఆ సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. 17శాతం అంకుర సంస్థలు నాణ్యత లోపంతోనే మూతపడిపోతున్నాయట. మార్కెట్లో పోటీని తట్టుకోవడం కోసం ఆఫర్లు ప్రకటించి, తక్కువ ధరకే సేవలు అందిస్తే సరిపోదు. నాణ్యత కూడా సంస్థ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని గుర్తించాలి. ఈ అంశాలపై యాజమాన్యం దృష్టి పెట్టకపోవడం వల్లే అంకుర సంస్థలు మూతపడుతున్నాయని నిపుణులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం