Startups: అంకుర సంస్థల వైఫల్యాలకు ముఖ్య కారణాలు ఇవే..!
వేల సంఖ్యలో అంకుర సంస్థలు పుట్టుకొచ్చినా కొన్ని మాత్రమే విజయవంతమై, ప్రజల ఆదరణ పొందగలుగుతున్నాయి. చాలా సంస్థలు మార్కెట్లోకి వచ్చాయన్న విషయం కూడా తెలియకుండానే కనుమరుగైపోతున్నాయి. ఇలా అంకుర సంస్థలు వైఫల్యం చెందడానికి ఎనిమిది ముఖ్యమైన కారణాలున్నాయని
ఇంటర్నెట్ డెస్క్: వ్యాపార రంగం విస్తరిస్తూనే ఉంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎన్నో సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో యువత ఇలాంటి సేవలను గుర్తించి వినూత్న వ్యాపారాలను ప్రారంభిస్తోంది. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో అనేక అంకుర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. అయితే వేల సంఖ్యలో అంకుర సంస్థలు పుట్టుకొచ్చినా కొన్ని మాత్రమే విజయవంతమై, ప్రజల ఆదరణ పొందగలుగుతున్నాయి. చాలా సంస్థలు మార్కెట్లోకి వచ్చాయన్న విషయం కూడా తెలియకుండానే కనుమరుగైపోతున్నాయి. ఇలా అంకుర సంస్థలు వైఫల్యం చెందడానికి ఎనిమిది ముఖ్యమైన కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
తక్కువ డిమాండ్ ఉన్నవి ఎంచుకోవడం
మార్కెట్లో డిమాండ్ అంతగాలేని వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోవడమే అంకురసంస్థ వైఫల్యానికి మొదటి కారణం. ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే అది వీలైనంత ఎక్కువ మంది అవసరాలను తీర్చేవిధంగా ఉండాలి. వ్యాపార ఆలోచన ఎంత బాగున్నా.. అది మార్కెట్లో కొద్దిమందిని మాత్రమే ఆకర్షించేదయితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఉదాహరణకు ఆహార రంగంలో కేవలం శాకాహారం మాత్రమే అందించే సేవలను ఎంచుకున్నారనుకోండి.. అది కేవలం శాకాహారులు మాత్రమే వినియోగించే అతి తక్కువ పరిధి ఉన్న అంకుర సంస్థగా నిలిచిపోతుంది. విస్తరణకు అవకాశం ఉండదు.
నిధుల కొరత
ఏ వ్యాపారం ప్రారంభించినా.. దాని కార్యకలాపాలు సక్రమంగా కొనసాగాలంటే నిధులు అవసరం. తగినంత నిధులు సమకూరనప్పుడు సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల అంకుర సంస్థలకు చెడ్డపేరు రావొచ్చు. డబ్బులు సమకూరినా సరైన ప్రణాళిక లేని ఖర్చులు అంకుర సంస్థను దెబ్బతీసే అవకాశముంది.
ఉద్యోగుల నియామకం
ఓ సర్వే ప్రకారం 23శాతం అంకురసంస్థలు విఫలం కావడానికి వారు నియమించుకున్న ఉద్యోగులే కారణమని తేలింది. ఒక సంస్థ ఎదగాలంటే అందులో పనిచేసే ఉద్యోగులకు ఎంతో నైపుణ్యం ఉండాలి. కొత్త విషయాలను నేర్చుకుంటూ, సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసేవారు కావాలి. ముఖ్యంగా ఉద్యోగులు ఐక్యంగా పనిచేయాలి. అంకుర సంస్థ ఆలోచనలు, లక్ష్యాలను ఉద్యోగులు తమవిగా భావించగలగాలి. కానీ కొన్ని సంస్థలు సరైన నైపుణ్యం లేనివారిని నియమించుకొని స్వయంకృతాపరాధం చేస్తుంటాయి.
పోటీదారులు ఎక్కువ
పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే అంత సులువు కాదు. ఒక అంకుర సంస్థ వ్యాపార ఆలోచన మరొకరికీ వచ్చి ఉండొచ్చు. లేదా ఆ వ్యాపారం అప్పటికే మార్కెట్లో అందుబాటులోకి రావొచ్చు. దీంతో ఒకేలాంటి సేవలు అందించే సంస్థల మధ్య పోటీ పెరుగుతుంది. పోటీదారులను తట్టుకొని అంకుర సంస్థలు మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమే. ఒకవేళ ఒక కొత్తరకం సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తే వ్యాపారం బాగా జరగొచ్చు. అయితే, వెంటనే ఇలాంటి సేవలు అందించే సంస్థలు అనేకం పుట్టుకొస్తాయి. మళ్లీ పోటీ పెరుగుతుంది. దీంతో సేవలు అందించే విధానాన్ని బట్టే అంకుర సంస్థ విజయం ఆధారపడి ఉంటుంది.
సేవలకు ధర నిర్ణయం
అంకుర సంస్థను భారీ లేదా పరిమిత పెట్టుబడితో ప్రారంభించినా వినియోగదారులకు అందించే సేవలకు ధరలు నిర్ణయించడంలో ఆయా సంస్థలు తప్పటడుగులు వేస్తాయి. ఎల్లప్పుడూ అందుబాటు ధరలు, ప్రత్యేక ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ, సంస్థ పాలసీలు, ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అనుకునే దానికంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తే ఆ అంకుర సంస్థ ఎక్కువకాలం నిలబడలేదు.
వ్యాపార వ్యూహాలు
మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే అంకుర సంస్థలు వ్యూహాలు రచించాలి. పోటీగా ఉండే సంస్థలకు మించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో ఒకే విధానంలో వెళ్తానంటే సరిపోదు. వివిధ రకాలుగా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేయాలి. తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోగలగాలి. సరైన వ్యూహ రచనలు లేకే చాలా అంకుర సంస్థలు అటకెక్కేస్తున్నాయి.
మార్కెటింగ్
ఎంతో వినూత్న, విభిన్న సేవలతో వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. కానీ దాని గురించి నలుగురికి తెలియకపోతే లాభం ఏముంది? అందుకే అంకుర సంస్థలు ఏర్పాటు చేయడంపైనే కాదు.. తమ సేవలను ప్రచారం చేసుకొని, మార్కెట్ ఏర్పరచుకోవాలి. వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచార మాధ్యమాలు, ఇతర మార్గాలను బాగా ఉపయోగించుకోవాలి. దాదాపు 14శాతం అంకుర సంస్థలు సరైన మార్కెటింగ్ చేసుకోలేకే దివాళా తీస్తున్నాయని ఓ సర్వేలో వెల్లడైంది.
నాణ్యత
ఒక అంకుర సంస్థ భారీ పెట్టుబడితో ప్రారంభమై, మార్కెట్లో గుర్తింపు పొందిందనుకుందాం. కానీ, అమ్మే వస్తువు లేదా అందించే సేవల్లో నాణ్యత లేకపోతే ఆ సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. 17శాతం అంకుర సంస్థలు నాణ్యత లోపంతోనే మూతపడిపోతున్నాయట. మార్కెట్లో పోటీని తట్టుకోవడం కోసం ఆఫర్లు ప్రకటించి, తక్కువ ధరకే సేవలు అందిస్తే సరిపోదు. నాణ్యత కూడా సంస్థ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుందని గుర్తించాలి. ఈ అంశాలపై యాజమాన్యం దృష్టి పెట్టకపోవడం వల్లే అంకుర సంస్థలు మూతపడుతున్నాయని నిపుణులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!