Elephant Lover : మహానుభావుడు.. ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి రాసిపోయాడు!
భారతీయ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’(The elephant whisperers) చిత్రానికి ఇటీవల ఆస్కార్ అవార్డు(Oscar award) దక్కింది. ఈ చిత్రంలోని దంపతుల్లానే దిక్కులేని ఏనుగులను(Elephants) ఆదరించే వ్యక్తులు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వారిలో మహమ్మద్ అక్తర్ ఇమామ్ ఒకరు.
బిహార్(Bihar)కు చెందిన ఓ వన్యప్రాణి సంరక్షకుడు రెండు ఏనుగుల(Elephants) పేరిట ఏకంగా రూ.5కోట్ల విలువైన ఆస్తి రాశాడు. కొన్నాళ్లకు ఆయన హత్యకు గురయ్యాడు. ఇటీవల అనారోగ్యంతో ఓ ఏనుగు కూడా మరణించడంతో ‘రాణి’ అనే ఏనుగు యావదాస్తికి ఏకైక వారసురాలిగా కొనసాగుతోంది. కానీ, అనుభవించానికి వీలు కావడం లేదు. ఆ కథేంటో చదివేయండి.
ఏనుగులంటే ప్రాణం..
బిహార్(Bihar)లోని జానిపూర్కు చెందిన మహమ్మద్ అక్తర్ ఇమామ్ వన్యప్రాణి సంరక్షకుడు. చిన్నప్పటి నుంచి ఆయన రెండు ఏనుగులను పెంచుకున్నాడు. వాటికి మోతి, రాణి అని పేర్లు పెట్టాడు. కుటుంబం కంటే మిన్నగా ఏనుగులను ప్రేమించిన అక్తర్ వాటి సంరక్షణ కోసం ‘ఏసియన్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ అండ్ వైల్డ్ అనిమల్ ట్రస్ట్’(ఏఈఆర్ఏడబ్లూఏటీ)ను స్థాపించాడు. ఒక వేళ తాను చనిపోయినా వాటి మనుగడకు ఎలాంటి లోటు ఉండకూడదని భావించి తనకున్న రూ.5 కోట్ల విలువైన ఆస్తిని ఏనుగుల పేరు మీద వీలునామా రాశాడు. ఇందుకు ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఒకసారి మోతిని ఓ మావటి తీసుకొని భోజ్పుర్ జిల్లాకు వెళ్లాడు. అక్కడ దానికి జబ్బు చేసింది. దాంతో అక్తర్ అక్కడికి పయనమయ్యాడు. వెళ్లి ఏనుగుకు చికిత్స చేయించాడు. ఒక రోజు విశ్రాంతి తీసుకుంటుండగా అక్తర్ను చంపడానికి కొందరు దుండగులు యత్నించారు. ఆ సమయంలో మోతి ఘీంకరిస్తూ తనను మేల్కొల్పింది. అక్తర్ నిద్రలేచే సరికే కిటికీ గదిలో నుంచి ఓ వ్యక్తి తుపాకీ ఎక్కుపెట్టాడు. అదృష్టవశాత్తూ ఎలాగోలా తప్పించుకోగలిగాడు. ఏనుగు అలా చేయకపోతే తాను బతికే వాడిని కాదంటూ జరిగిన సంఘటనను అక్తర్ అప్పట్లో వివరించారు.
ఆస్తి కోసం దారుణ హత్య!
ఈ హత్యాయత్నం ఘటన వెనుక తన కుటుంబ సభ్యులే ఉన్నారని అక్తర్ అప్పట్లో ఆరోపించారు. తనను చంపి జంతువుల అక్రమ రవాణా ముఠాకు ఏనుగులను అప్పగించాలనే దురాలోచనతో ఈ పని చేశారని చెప్పారు. 2020లో కొవిడ్ నిబంధనలు సడలించిన తరువాత అక్తర్ రెండు ఏనుగులను రామ్నగర్ తీసుకొచ్చారు. అప్పటికే తనను ఎవరైనా హతమారుస్తారని అక్తర్కు అనుమానం ఉండేది. ఎందుకంటే భార్య, కుమారులతో అక్తర్ విడిపోయారు. ఏనుగుల పేరిట ఆస్తి రాయడం వారికి ఎంత మాత్రం నచ్చలేదు. దాంతో అక్తర్ ఊహించిందే నిజమైంది. 2021లో ఆయనను దారుణంగా హత్య చేశారు. అయితే అప్పటికే వీలునామా రాయడంతో ఆస్తి మొత్తం ఏనుగులకు దక్కింది. అక్తర్ తన జీవితకాలం మొత్తం ఏనుగు సంరక్షణ కోసం కృషి చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఏనుగుల సంరక్షణ దిశగా చర్యలు తీసుకోకపోతే వాటిని పుస్తకాల్లో బొమ్మలుగా మాత్రమే చూడాల్సి వస్తుందని బాధపడేవారు.
ఏకైక వారసురాలు రాణి
అక్తర్ మరణం తరువాత ఏనుగుల సంరక్షణ బాధ్యతలను స్థానిక అటవీ అధికారులు ఇమ్రాన్ఖాన్ అనే వ్యక్తికి అప్పగించారు. అక్తర్ ఆశయం కోసం ఇమ్రాన్ ఇప్పుడు పని చేస్తున్నారు. 35 ఏళ్ల ఏనుగు మోతి గత నెలలో అనారోగ్యంతో మృతిచెందింది. ప్రస్తుతం రాణికి 25 ఏళ్లు. అక్తర్కు ఆస్తికి ఏకైక వారసురాలిగా కొనసాగుతోంది. అయితే ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ప్రస్తుతం రాణి ఉత్తరాఖండ్లోని రామ్నగర్లో ఉంటోంది. ఆస్తి పట్నాలో ఉంది. అక్తర్ స్థాపించిన ఫౌండేషన్ నడుస్తున్నప్పటికీ దానికి సరిపడా నిధులు అందడం లేదు. పట్నాలోని రాణి పేరిట ఉన్న ఆస్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రమే అక్తర్ ఆశయం నెరవేరుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా