ఇక్కడి ప్రయాణం.. పెద్ద సాహసం
మన దేశంలో రోడ్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రహదారుల నిర్మాణం చేపట్టినా పట్టుమని...
భారత్లోని పలు ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి
మన దేశంలో రోడ్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రహదారుల నిర్మాణం చేపట్టినా పట్టుమని పదికాలాలపాటు ఉండటం లేదు. రోడ్డు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు తమ స్వలాభం కోసం మాత్రమే నిర్మాణం చేపడుతున్నట్లు ఉంది. ఎత్తైన కొండల మీద, సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తులో నిర్మించిన రోడ్లపై ప్రయాణమంటే సాహసమే. మన దేశంలో అటువంటి ప్రమాదకరమైన రోడ్లు ఎక్కడ ఉన్నాయి.. వాటి సంగతేంటో చూసేద్దామా మరి..
సముద్ర మట్టానికి 5, 600 మీటర్ల ఎత్తులో..
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లోని ఖర్దుంగ్లా రోడ్డు ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన వాహనాల రహదారి కావడం విశేషం. సముద్ర మట్టానికి 5,602 మీటర్ల (దాదాపు 18వేల అడుగులు) ఎత్తులో ఉంటుంది. శీతాకాలంలో రోడ్డు అంతా మంచుమయం అవుతుంది. ఇక్కడ వాతావారణం ఏ సమయంలో ఎలా ఉంటుందో అంచనా వేయలేం. రహదారి ఇరుకుగా ఉండి వాహనాలను నడిపేందుకు కష్టతరంగా ఉంటుంది. రోజు మొత్తం వాహనాలకు అనుమతి ఇవ్వరు. లేహ్ నుంచి ఖర్దుంగ్లాకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. అలాగే ఖర్దుంగ్లా నుంచి లేహ్కు వెళ్లేందుకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతినిస్తారు.
దాని పేరే శవాల గుట్ట..
రోహ్తంగ్.. దానికి అర్థం శవాల గుట్ట. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న రహదారిపై చినుకు పడిందంటే చాలు ప్రయాణం నరకమే. శీతాకాలంలో చూడటానికి ఎంతో అందంగా ఉండే ఈ ప్రదేశం.. వాహనాలను నడిపేటప్పుడు మాత్రం భయంకరంగా ఉంటుంది. ఎటువైపు నుంచి కొండ చరియలు విరిగిపడతాయోనని ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది. ఈ రహదారిపై ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
సన్నని వంపుదీరిన రహదారి...
పర్వతాన్ని చెక్కినట్లు ఉంటుంది. ఆడవారి జడకు పెట్టుకునే పిన్ను వంపినట్లు ఉండే జాతీయ రహదారి NH22. ఇక్కడ జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లోనూ, లోయలోకి పడిపోవడంతో, బస్సు నదిలోకి దూసుకెళ్లడమో వంటి కారణాలతో చాలా మంది తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. అతివేగంతో బస్పా నదిలోకి వాహనాలు పడిపోయి చాలామంది మృత్యువాతకు గురయ్యారు. చూసేందుకు ఎంతో అందంగా ఉండే రహదారిలో ప్రయాణించడమంటే మాత్రం డ్రైవింగ్ నైపుణ్యానికి అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు.
బైకర్స్కు ఆనందం..అయితే ప్రమాదకరం
చూసేందుకు ఎంతో అబ్బురంగా ఉండే స్పితీ వ్యాలీ.. అక్కడి రోడ్లు మాత్రం ప్రయాణించేందుకు క్లిష్టంగానే ఉంటాయి. అయితే స్పితీ వ్యాలీ సాహసాలు చేసే బైకర్స్కు నచ్చుతుంది. సట్లజ్ నదికి పక్కగా వెళ్లే ఈ రహదారిపై డ్రైవ్ చేస్తుంటే ఆ ఆనందమే వేరు. రోడ్డుకి ఇరువైపులా ఆప్రికాట్, ఆపిల్ తోటలు కనువిందు చేస్తాయి. అయితే వ్యాలీ పైకెళ్లేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే జారిపడిపోయే ప్రమాదం ఉంది. తక్కువ వేగంతో మీ వాహనానికి వేరే వాహనానికి కనీసం దూరం పాటించాలి. లేకపోతే ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఢీకొట్టుకుంటే మాత్రం ప్రాణనష్టం తప్పదు.
కడుపులో తిప్పేసినట్టే...
ఆ రోడ్డులో ప్రయాణించేటప్పుడు కడుపులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే మంచిది. జిగ్జాగ్గా ఉండే ఆ రహదారిలో ప్రయాణం రోలర్కోస్టర్ ఎక్కినట్టే. సిక్కింలోని సోంగో సరస్సుకు దగ్గరగా ఉండే నాథులా పాస్ రోడ్ పొడవు 54 కి.మీ. కొండచరియలు, పొగమంచు ఎక్కువగా కురుస్తుంటుంది. దీని వల్ల ఇక్కడ ప్రయాణం చేయాలనుకునే వారికి చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. కొత్త వారికి మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి రహదారి మీద ప్రయాణించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
జోజిలా
హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తైన పర్వత శ్రేణుల్లో రహదారి నిర్మాణం జరిగింది. సముద్ర మట్టానికి దాదాపు 3,538 మీటర్లు (11,600 అడుగులు) ఎత్తు ఉంటుంది. దాదాపు 9 కిమీ దూరం ఉండే రోడ్డుపై ప్రయాణించాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. పదునుగా ఉండే రహదారిపై వాహనం నడపడమంటే చాలా జాగ్ర్తతలు పాటించాలి. మంచుగడ్డలు పడేటప్పుడు వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి రహదారులపై డ్రైవింగ్ చేయాలంటే గుండెల్లో ధైర్యంతోపాటు క్షణంపాటు అలసత్వం వహించకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?