ఇక్కడి ప్రయాణం.. పెద్ద సాహసం
మన దేశంలో రోడ్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రహదారుల నిర్మాణం చేపట్టినా పట్టుమని...
భారత్లోని పలు ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి
మన దేశంలో రోడ్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి రహదారుల నిర్మాణం చేపట్టినా పట్టుమని పదికాలాలపాటు ఉండటం లేదు. రోడ్డు పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు తమ స్వలాభం కోసం మాత్రమే నిర్మాణం చేపడుతున్నట్లు ఉంది. ఎత్తైన కొండల మీద, సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తులో నిర్మించిన రోడ్లపై ప్రయాణమంటే సాహసమే. మన దేశంలో అటువంటి ప్రమాదకరమైన రోడ్లు ఎక్కడ ఉన్నాయి.. వాటి సంగతేంటో చూసేద్దామా మరి..
సముద్ర మట్టానికి 5, 600 మీటర్ల ఎత్తులో..
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లోని ఖర్దుంగ్లా రోడ్డు ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన వాహనాల రహదారి కావడం విశేషం. సముద్ర మట్టానికి 5,602 మీటర్ల (దాదాపు 18వేల అడుగులు) ఎత్తులో ఉంటుంది. శీతాకాలంలో రోడ్డు అంతా మంచుమయం అవుతుంది. ఇక్కడ వాతావారణం ఏ సమయంలో ఎలా ఉంటుందో అంచనా వేయలేం. రహదారి ఇరుకుగా ఉండి వాహనాలను నడిపేందుకు కష్టతరంగా ఉంటుంది. రోజు మొత్తం వాహనాలకు అనుమతి ఇవ్వరు. లేహ్ నుంచి ఖర్దుంగ్లాకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. అలాగే ఖర్దుంగ్లా నుంచి లేహ్కు వెళ్లేందుకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతినిస్తారు.
దాని పేరే శవాల గుట్ట..
రోహ్తంగ్.. దానికి అర్థం శవాల గుట్ట. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న రహదారిపై చినుకు పడిందంటే చాలు ప్రయాణం నరకమే. శీతాకాలంలో చూడటానికి ఎంతో అందంగా ఉండే ఈ ప్రదేశం.. వాహనాలను నడిపేటప్పుడు మాత్రం భయంకరంగా ఉంటుంది. ఎటువైపు నుంచి కొండ చరియలు విరిగిపడతాయోనని ఆందోళన వెంటాడుతూనే ఉంటుంది. ఈ రహదారిపై ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
సన్నని వంపుదీరిన రహదారి...
పర్వతాన్ని చెక్కినట్లు ఉంటుంది. ఆడవారి జడకు పెట్టుకునే పిన్ను వంపినట్లు ఉండే జాతీయ రహదారి NH22. ఇక్కడ జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లోనూ, లోయలోకి పడిపోవడంతో, బస్సు నదిలోకి దూసుకెళ్లడమో వంటి కారణాలతో చాలా మంది తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. అతివేగంతో బస్పా నదిలోకి వాహనాలు పడిపోయి చాలామంది మృత్యువాతకు గురయ్యారు. చూసేందుకు ఎంతో అందంగా ఉండే రహదారిలో ప్రయాణించడమంటే మాత్రం డ్రైవింగ్ నైపుణ్యానికి అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు.
బైకర్స్కు ఆనందం..అయితే ప్రమాదకరం
చూసేందుకు ఎంతో అబ్బురంగా ఉండే స్పితీ వ్యాలీ.. అక్కడి రోడ్లు మాత్రం ప్రయాణించేందుకు క్లిష్టంగానే ఉంటాయి. అయితే స్పితీ వ్యాలీ సాహసాలు చేసే బైకర్స్కు నచ్చుతుంది. సట్లజ్ నదికి పక్కగా వెళ్లే ఈ రహదారిపై డ్రైవ్ చేస్తుంటే ఆ ఆనందమే వేరు. రోడ్డుకి ఇరువైపులా ఆప్రికాట్, ఆపిల్ తోటలు కనువిందు చేస్తాయి. అయితే వ్యాలీ పైకెళ్లేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే జారిపడిపోయే ప్రమాదం ఉంది. తక్కువ వేగంతో మీ వాహనానికి వేరే వాహనానికి కనీసం దూరం పాటించాలి. లేకపోతే ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఢీకొట్టుకుంటే మాత్రం ప్రాణనష్టం తప్పదు.
కడుపులో తిప్పేసినట్టే...
ఆ రోడ్డులో ప్రయాణించేటప్పుడు కడుపులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే మంచిది. జిగ్జాగ్గా ఉండే ఆ రహదారిలో ప్రయాణం రోలర్కోస్టర్ ఎక్కినట్టే. సిక్కింలోని సోంగో సరస్సుకు దగ్గరగా ఉండే నాథులా పాస్ రోడ్ పొడవు 54 కి.మీ. కొండచరియలు, పొగమంచు ఎక్కువగా కురుస్తుంటుంది. దీని వల్ల ఇక్కడ ప్రయాణం చేయాలనుకునే వారికి చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. కొత్త వారికి మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి రహదారి మీద ప్రయాణించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
జోజిలా
హిమాలయ పర్వతాల్లో అత్యంత ఎత్తైన పర్వత శ్రేణుల్లో రహదారి నిర్మాణం జరిగింది. సముద్ర మట్టానికి దాదాపు 3,538 మీటర్లు (11,600 అడుగులు) ఎత్తు ఉంటుంది. దాదాపు 9 కిమీ దూరం ఉండే రోడ్డుపై ప్రయాణించాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. పదునుగా ఉండే రహదారిపై వాహనం నడపడమంటే చాలా జాగ్ర్తతలు పాటించాలి. మంచుగడ్డలు పడేటప్పుడు వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి రహదారులపై డ్రైవింగ్ చేయాలంటే గుండెల్లో ధైర్యంతోపాటు క్షణంపాటు అలసత్వం వహించకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ