ఆస్ట్రేలియాలో ‘మిస్టరీ ఫ్లైట్స్’!
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం కుదేలైన విషయం తెలిసిందే. లాక్డౌన్ కాలంలో ఒక్క విమానం కూడా గాల్లోకి ఎగరలేదు. కొన్ని నెలలపాటు ఎయిర్పోర్టులకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలు కొనసాగిస్తూనే
సిడ్నీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం కుదేలైన విషయం తెలిసిందే. లాక్డౌన్ కాలంలో ఒక్క విమానం కూడా గాల్లోకి ఎగరలేదు. కొన్ని నెలలపాటు ఎయిర్పోర్టులకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలు కొనసాగిస్తూనే దేశీయ ప్రయాణాలకు అనేక దేశాలు అనుమతులిచ్చాయి. అయినా ప్రయాణికులు లేక విమానయానరంగం నష్టాలను చవిచూస్తోంది. దీంతో ప్రభుత్వాల సహాయం కోరుతూనే ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు టికెట్ ధరలు తగ్గించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటస్ అనే ఎయిర్లైన్ సంస్థ ఓ భిన్నమైన పద్ధతిని ఎంచుకుంది. ప్రయాణికుల్లో విమానయానంపై ఆసక్తి పెంచేందుకు ‘మిస్టరీ ఫ్లైట్’ పద్ధతిని అమలు చేస్తోంది.
ఏంటీ మిస్టరీ ఫ్లైట్?
సాధారణంగా విమాన ప్రయాణం చేయాలంటే మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో ఆ ప్రాంతానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. కానీ, ‘మిస్టరీ ఫ్లైట్’ దేశీయ విమాన సర్వీసులో ప్రయాణికులు వారి గమ్యస్థానం ఏంటో చెప్పనక్కర్లేదు. అలాగే, విమానం కూడా ఎక్కడికి వెళ్తుందో సిబ్బంది చెప్పరు. టికెట్ కొనుగోలు చేసి విమానం ఎక్కి కూర్చుంటే.. అది ఎక్కడికి వెళ్తుందో, ఏ ఎయిర్పోర్టులో దిగుతుందో ప్రయాణికులెవరూ తెలుసుకోలేరు. ఈ ప్రయాణం వ్యవధి కనీసం రెండు గంటలు ఉంటుంది. ఈ రెండు గంటల ప్రయాణం ముగిసిన తర్వాత ఏ ఎయిర్పోర్టు దగ్గరగా ఉంటే అక్కడే విమానాన్ని ల్యాండ్ చేస్తారు. మార్గం మధ్యలో సందర్శక ప్రాంతాలు వస్తే ప్రయాణికులు చూడటానికి వీలుగా విమానాన్ని భూమికి తక్కువ ఎత్తులో తీసుకెళ్తారట. మార్చి 4 నుంచే టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా.. మార్చి 27, ఏప్రిల్ 18, మే 1 తేదీల్లో ప్రయాణాలు ఉంటాయి. బిజినెస్ క్లాస్ టికెట్ ధర 737 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉండగా.. ఎకానమీ క్లాస్ టికెట్ ధర 577 ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉంది.
గతేడాది ఇలాంటి ప్రయోగమే ‘ఫ్లైట్ టు నోవేర్’
లాక్డౌన్ను పాక్షికంగా సడలించిన తర్వాత క్వాంటస్ ఎయిర్లైన్స్ ప్రయాణికులకు విమానయానం చేసిన అనుభూతి కల్పించడం కోసం గతేడాది ‘ఫ్లైట్ టు నోవేర్’ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. విమానాలు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లే వీలు లేకపోవడంతో ప్రయాణికులను ఒక ఎయిర్పోర్టులో ఎక్కించుకొని దాదాపు ఏడు గంటలు గాల్లోనే తిప్పుతూ ఆస్ట్రేలియాలోని ప్రముఖ సందర్శక ప్రాంతాలను చూపించి తిరిగి మళ్లీ అదే ఎయిర్పోర్టులో విమానాన్ని దింపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి