American Road Trip : పందెం కట్టి కారుతో సాహస యాత్ర.. 120 ఏళ్ల కిందటి ఘనత ఇది!
ఆ అమెరికా (America) వైద్యుడికి (Doctor) ఆటోమొబైల్ (Automobile) రంగంపై విపరీతమైన నమ్మకం. అందుకే కార్ల (Cars) సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలియజేస్తానని పందెం కాశాడు. 120 ఏళ్ల కిందటే ఓ సాహస యాత్ర చేసి చరిత్ర సృష్టించాడు.
అమెరికా (America) మ్యాప్ను గమనిస్తే శాన్ఫ్రాన్సిస్కో (San Francisco) ఓ చివర.. న్యూయార్క్ (New York) మరో చివర ఉంటాయి. 120 ఏళ్ల కిందట ఓ వైద్యుడు ఈ రెండు నగరాల మధ్య కారు ప్రయాణం చేసి సంచలనం సృష్టించాడు. ఆ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోండి.
50 డాలర్ల పందెం
అమెరికాలో కార్ల విక్రయాలు అప్పుడప్పుడే ఊపందుకుంటున్నాయి. 1900వ సంవత్సరంలో 8000 కార్లు ఉంటే 1903 నాటికి ఆ సంఖ్య 32,920కి చేరింది. అప్పటికి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కార్లు తిరగడానికి అనువైన రోడ్లు ఉన్నాయి. అలాంటి సమయంలో గుర్రపు బగ్గీల కన్నా కార్లు మెరుగైనవని హరేషియో నెల్సన్ జాక్సన్ అనే వ్యక్తి వాదించాడు. తన వాదనను నిరూపించడానికి 50 డాలర్ల పందెం కాసి ఓ అరుదైన సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు.
హరేషియో నెల్సన్ జాక్సన్ ఒక వైద్యుడు. ఆయన సోదరుల్లో ఒకరు బర్లింగ్టన్ మేయర్గా, మరొకరు లెఫ్ట్నెంట్ గవర్నర్గా పని చేశారు. జాక్సన్కు మొదట్నుంచీ ఆటోమొబైల్ రంగంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ క్లబ్లో కూర్చొని సరదాగా మాట్లాడుతూ కార్ల సామర్థ్యం గురించి ఓ పందెం కాశాడు. అదేంటంటే అమెరికా మ్యాప్లో ఈ చివరన ఉన్న శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆ చివరన ఉన్న న్యూయార్క్ వరకు కారులో ప్రయాణించడం. అప్పటికి తన వద్ద కారు లేదు. సరిగా డ్రైవింగ్ రాదు. పైగా ఆ యాత్ర చేయడానికి తోడ్పడే మ్యాప్ కూడా అందుబాటులో లేదు.
కొత్త కారుతో సరికొత్త ప్రయాణం
ఈ సాహస యాత్ర విషయంలో తనకు సహాయం చేయాలని జాక్సన్.. సువెల్ కె. క్రాకర్ను సంప్రదించాడు. ఆయన ఓ మెకానిక్. పైగా తనకు డ్రైవింగ్ కూడా వచ్చు. అతడి సలహా మేరకు జాక్సన్ ‘1903 మోడల్ వింటన్’ కారు కొనుగోలు చేశాడు. రెండు సిలిండర్లు, 20 హార్స్పవర్ సామర్థ్యంతో నడిచే ఆ కారుకు ‘ది వెర్మోంట్’ అని పేరు పెట్టాడు. కొత్తగా కొన్న కారులో మే 23న వారిద్దరూ శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరారు. ఆ వాహనంలో స్లీపింగ్ బ్యాగ్స్, దుప్పట్లు, దుస్తులు, గొడ్డలి, పార, కొడాక్ కెమెరా, టెలిస్కోప్, రైఫిల్, షాట్గన్, స్పేర్ పార్ట్స్, ఇంధనం క్యాన్లు ఇలా మొత్తం సరంజామా సర్దిపెట్టారు.
అడుగడుగునా అవాంతరాలు
తొలిసారి ప్రయాణం చేస్తున్నప్పటికీ వారికి కొన్ని ప్రాంతాలపై ముందే అవగాహన ఉంది. అందుకే ఎడారి ప్రాంతాలైన నెవడా, యూటా గుండా ప్రయాణం చేయొద్దని నిశ్చయించుకున్నారు. అలాగే సియెర్రా నెవడాలోని ఎత్తయిన ప్రాంతాలు, పర్వతాలకు వెళ్లొద్దని అనుకున్నారు. అలా యాత్ర ప్రారంభమై 15 మైళ్లు దాటిందో లేదో కారు టైరు ఒకటి పాడైంది. దాంతో స్పేర్గా ఉన్న మరో టైరు తగిలించి ముందుకు సాగారు. శాక్రమెంటో నగరం చేరుకోగానే ఓ మహిళ వారిని తప్పు దోవ పట్టించింది. సుమారు 108 మైళ్లు వెళ్లిన తరువాత అది సరైన మార్గం కాదని వారు గ్రహించారు. ఇక ఒరెగాన్ మార్గంలో అనేక సార్లు టైర్లు పంక్చర్ అయ్యాయి. ఏం చేయాలో పాలుపోక చక్రాల చుట్టూ తాడు చుట్టుకొని మరీ ముందుకు సాగేవారు. కొన్ని సార్లు ఇంధనం అయిపోతే నడుచుకుంటూ లేదా సైకిల్పై వెళ్లి తెచ్చుకునేవారు. స్పేర్ పార్ట్స్ కోసం కూడా ఇదే పద్ధతిని అనుసరించారు.
మీడియా దృష్టిలో పడ్డారు!
ఐడహో వద్దకు రాగానే వారు ఒక బుల్ డాగ్ను తమ ప్రయాణంలో తోడుగా చేర్చుకున్నారు. దానికి బడ్ అని పేరు పెట్టారు. ఆ శునకం కళ్లలో దుమ్ము పడకుండా కళ్లద్దాలు పెట్టి తీసుకెళ్లేవారు. ఈ చర్య మీడియాను ఆకర్షించింది. దాంతో జాక్సన్, క్రాకర్, బడ్ సెలబ్రిటీలుగా మారిపోయారు. ఎక్కడికెళ్లినా వీరిని మీడియా, చుట్టుపక్కలి జనాలు వింతగా చూడటం ప్రారంభించారు. ఇన్ని అడ్డంకులు దాటుతున్న క్రమంలో ఓ చోట నగదు పోగొట్టుకున్నారు. అందువల్ల సుమారు 36 గంటలపాటు ఏమీ తినకుండానే ప్రయాణించాల్సి వచ్చింది. మిస్సిసిపి దాటిన తరువాత వారి కష్టాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అక్కడి నుంచి మెరుగైన రహదారులు ఉండటంతో ప్రయాణం సాఫీగా సాగిపోయింది.
అమెరికా చరిత్రలో అరుదైన రికార్డు
అలా 63 రోజులు ప్రయాణం చేసి జులై 26న వీరు న్యూయార్క్ చేరుకున్నారు. దాంతో ఇది అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ‘క్రాస్ కంట్రీ రోడ్ ట్రిప్’గా రికార్డుకెక్కింది. యాత్ర మొత్తానికి జాక్సన్కు 8వేల డాలర్లు ఖర్చయింది. మూడు వేల లీటర్ల ఇంధనం వాడారు. అయితే జాక్సన్ తాను పందెం కాసిన 50 డాలర్ల గురించి తరువాత పట్టించుకోలేదు. ఈ యాత్ర ముగిసిన తరువాత జాక్సన్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. విశిష్ట సేవలందించి కొన్ని మెడల్స్ పొందాడు. ఆ తరువాత ఒక వ్యాపార వేత్తగా ఎదిగాడు. 1944లో తన కారును స్మిత్సోనియన్ సంస్థకు విరాళంగా ఇచ్చాడు. దాన్ని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆమెరికన్ హిస్టరీలో ప్రదర్శనకు ఉంచారు. డ్రైవర్గా, మెకానిక్గా సేవలందించిన క్రాకర్ 1913లోనే మరణించాడు. అప్పటికి అతని వయసు 30 సంవత్సరాలు. తరువాతి కాలంలో వీరిని అనుసరిస్తూ అనేక మంది ఇలాంటి యాత్రలు చేయడం ప్రారంభించారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి