American Road Trip : పందెం కట్టి కారుతో సాహస యాత్ర.. 120 ఏళ్ల కిందటి ఘనత ఇది!
ఆ అమెరికా (America) వైద్యుడికి (Doctor) ఆటోమొబైల్ (Automobile) రంగంపై విపరీతమైన నమ్మకం. అందుకే కార్ల (Cars) సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలియజేస్తానని పందెం కాశాడు. 120 ఏళ్ల కిందటే ఓ సాహస యాత్ర చేసి చరిత్ర సృష్టించాడు.
అమెరికా (America) మ్యాప్ను గమనిస్తే శాన్ఫ్రాన్సిస్కో (San Francisco) ఓ చివర.. న్యూయార్క్ (New York) మరో చివర ఉంటాయి. 120 ఏళ్ల కిందట ఓ వైద్యుడు ఈ రెండు నగరాల మధ్య కారు ప్రయాణం చేసి సంచలనం సృష్టించాడు. ఆ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోండి.
50 డాలర్ల పందెం
అమెరికాలో కార్ల విక్రయాలు అప్పుడప్పుడే ఊపందుకుంటున్నాయి. 1900వ సంవత్సరంలో 8000 కార్లు ఉంటే 1903 నాటికి ఆ సంఖ్య 32,920కి చేరింది. అప్పటికి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కార్లు తిరగడానికి అనువైన రోడ్లు ఉన్నాయి. అలాంటి సమయంలో గుర్రపు బగ్గీల కన్నా కార్లు మెరుగైనవని హరేషియో నెల్సన్ జాక్సన్ అనే వ్యక్తి వాదించాడు. తన వాదనను నిరూపించడానికి 50 డాలర్ల పందెం కాసి ఓ అరుదైన సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు.
హరేషియో నెల్సన్ జాక్సన్ ఒక వైద్యుడు. ఆయన సోదరుల్లో ఒకరు బర్లింగ్టన్ మేయర్గా, మరొకరు లెఫ్ట్నెంట్ గవర్నర్గా పని చేశారు. జాక్సన్కు మొదట్నుంచీ ఆటోమొబైల్ రంగంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ క్లబ్లో కూర్చొని సరదాగా మాట్లాడుతూ కార్ల సామర్థ్యం గురించి ఓ పందెం కాశాడు. అదేంటంటే అమెరికా మ్యాప్లో ఈ చివరన ఉన్న శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆ చివరన ఉన్న న్యూయార్క్ వరకు కారులో ప్రయాణించడం. అప్పటికి తన వద్ద కారు లేదు. సరిగా డ్రైవింగ్ రాదు. పైగా ఆ యాత్ర చేయడానికి తోడ్పడే మ్యాప్ కూడా అందుబాటులో లేదు.
కొత్త కారుతో సరికొత్త ప్రయాణం
ఈ సాహస యాత్ర విషయంలో తనకు సహాయం చేయాలని జాక్సన్.. సువెల్ కె. క్రాకర్ను సంప్రదించాడు. ఆయన ఓ మెకానిక్. పైగా తనకు డ్రైవింగ్ కూడా వచ్చు. అతడి సలహా మేరకు జాక్సన్ ‘1903 మోడల్ వింటన్’ కారు కొనుగోలు చేశాడు. రెండు సిలిండర్లు, 20 హార్స్పవర్ సామర్థ్యంతో నడిచే ఆ కారుకు ‘ది వెర్మోంట్’ అని పేరు పెట్టాడు. కొత్తగా కొన్న కారులో మే 23న వారిద్దరూ శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరారు. ఆ వాహనంలో స్లీపింగ్ బ్యాగ్స్, దుప్పట్లు, దుస్తులు, గొడ్డలి, పార, కొడాక్ కెమెరా, టెలిస్కోప్, రైఫిల్, షాట్గన్, స్పేర్ పార్ట్స్, ఇంధనం క్యాన్లు ఇలా మొత్తం సరంజామా సర్దిపెట్టారు.
అడుగడుగునా అవాంతరాలు
తొలిసారి ప్రయాణం చేస్తున్నప్పటికీ వారికి కొన్ని ప్రాంతాలపై ముందే అవగాహన ఉంది. అందుకే ఎడారి ప్రాంతాలైన నెవడా, యూటా గుండా ప్రయాణం చేయొద్దని నిశ్చయించుకున్నారు. అలాగే సియెర్రా నెవడాలోని ఎత్తయిన ప్రాంతాలు, పర్వతాలకు వెళ్లొద్దని అనుకున్నారు. అలా యాత్ర ప్రారంభమై 15 మైళ్లు దాటిందో లేదో కారు టైరు ఒకటి పాడైంది. దాంతో స్పేర్గా ఉన్న మరో టైరు తగిలించి ముందుకు సాగారు. శాక్రమెంటో నగరం చేరుకోగానే ఓ మహిళ వారిని తప్పు దోవ పట్టించింది. సుమారు 108 మైళ్లు వెళ్లిన తరువాత అది సరైన మార్గం కాదని వారు గ్రహించారు. ఇక ఒరెగాన్ మార్గంలో అనేక సార్లు టైర్లు పంక్చర్ అయ్యాయి. ఏం చేయాలో పాలుపోక చక్రాల చుట్టూ తాడు చుట్టుకొని మరీ ముందుకు సాగేవారు. కొన్ని సార్లు ఇంధనం అయిపోతే నడుచుకుంటూ లేదా సైకిల్పై వెళ్లి తెచ్చుకునేవారు. స్పేర్ పార్ట్స్ కోసం కూడా ఇదే పద్ధతిని అనుసరించారు.
మీడియా దృష్టిలో పడ్డారు!
ఐడహో వద్దకు రాగానే వారు ఒక బుల్ డాగ్ను తమ ప్రయాణంలో తోడుగా చేర్చుకున్నారు. దానికి బడ్ అని పేరు పెట్టారు. ఆ శునకం కళ్లలో దుమ్ము పడకుండా కళ్లద్దాలు పెట్టి తీసుకెళ్లేవారు. ఈ చర్య మీడియాను ఆకర్షించింది. దాంతో జాక్సన్, క్రాకర్, బడ్ సెలబ్రిటీలుగా మారిపోయారు. ఎక్కడికెళ్లినా వీరిని మీడియా, చుట్టుపక్కలి జనాలు వింతగా చూడటం ప్రారంభించారు. ఇన్ని అడ్డంకులు దాటుతున్న క్రమంలో ఓ చోట నగదు పోగొట్టుకున్నారు. అందువల్ల సుమారు 36 గంటలపాటు ఏమీ తినకుండానే ప్రయాణించాల్సి వచ్చింది. మిస్సిసిపి దాటిన తరువాత వారి కష్టాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అక్కడి నుంచి మెరుగైన రహదారులు ఉండటంతో ప్రయాణం సాఫీగా సాగిపోయింది.
అమెరికా చరిత్రలో అరుదైన రికార్డు
అలా 63 రోజులు ప్రయాణం చేసి జులై 26న వీరు న్యూయార్క్ చేరుకున్నారు. దాంతో ఇది అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ‘క్రాస్ కంట్రీ రోడ్ ట్రిప్’గా రికార్డుకెక్కింది. యాత్ర మొత్తానికి జాక్సన్కు 8వేల డాలర్లు ఖర్చయింది. మూడు వేల లీటర్ల ఇంధనం వాడారు. అయితే జాక్సన్ తాను పందెం కాసిన 50 డాలర్ల గురించి తరువాత పట్టించుకోలేదు. ఈ యాత్ర ముగిసిన తరువాత జాక్సన్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. విశిష్ట సేవలందించి కొన్ని మెడల్స్ పొందాడు. ఆ తరువాత ఒక వ్యాపార వేత్తగా ఎదిగాడు. 1944లో తన కారును స్మిత్సోనియన్ సంస్థకు విరాళంగా ఇచ్చాడు. దాన్ని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆమెరికన్ హిస్టరీలో ప్రదర్శనకు ఉంచారు. డ్రైవర్గా, మెకానిక్గా సేవలందించిన క్రాకర్ 1913లోనే మరణించాడు. అప్పటికి అతని వయసు 30 సంవత్సరాలు. తరువాతి కాలంలో వీరిని అనుసరిస్తూ అనేక మంది ఇలాంటి యాత్రలు చేయడం ప్రారంభించారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్