Plane crash : అంతు చిక్కని మిస్టరీ.. ఆ విమానాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు!
లోహ విహంగాలు (Planes) గాల్లో ఎగిరిన తొలినాళ్లలో అవి ప్రమాదానికి గురయితే ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారేది. అలా ఇప్పటిదాకా జాడ లేకుండా పోయిన కొన్ని విమాన ప్రమాదాల (Plane crashes) గురించి తెలుసుకోండి.
ఇటీవల అమెజాన్ అడవుల్లో (Amazon forest) జరిగిన ఓ విమాన ప్రమాదం (Plane crash) వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రమాదం జరిగిన వెంటనే ‘ఆపరేషన్ హోప్’ పేరిట అడవిని జల్లెడ పట్టి 16 రోజుల తర్వాత విమాన శకలాలను గుర్తించారు. పైలట్, మహిళ, గైడ్ మరణించినట్లు సహాయక బృందాలు ప్రకటించాయి. అదే విమానంలో ప్రయాణించిన మరో నలుగురు చిన్నారులు బతికే ఉన్నారన్న ఆశతో అడవిని జల్లెడ పట్టారు. సుమారు 40 రోజులు తర్వాత ఎట్టకేలకు చిన్నారుల ఆచూకీ తెలిసింది. వారంతా క్షేమంగా ఉండటం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనే ఒక విమానం జాడ కనుగొనడానికి 16 రోజులు పట్టింది. మరి అవేవీ లేని కాలంలో గల్లంతైన ఆ విమానాలు ఏమైపోయాయి? అందులో ప్రయాణించిన వారి ఆచూకీ తెలిసిందా? లేదా? పరిశీలించండి.
క్యాంప్బెల్ ఎయిర్షిప్
విమానాల కంటే ముందు ఎయిర్షిప్లు గాల్లో ఎగురుతున్న కాలం అది. ఆ ఎయిర్ షిప్ పేరు క్యాంప్బెల్. ఓ గాలిబుడగ తరహాలో ఉండే ఆ విమానాన్ని 1880 ప్రాంతంలో పీటర్ క్యాంప్బెల్ అనే వ్యక్తి రూపొందించాడు. విమానంలాగే ఇదీ తొలినాళ్లలో విజయవంతంగా గాల్లో ప్రయాణించలేకపోయింది. 1889వ సంవత్సరం జులై 16న ఎడ్వర్డ్ డి. హోగన్ అనే ప్రొఫెసర్ ప్రదర్శనకు ఉంచిన ఎయిర్ షిప్ను నడుపుతూ న్యూయార్క్ నగరం నుంచి బయలుదేరాడు. ఆ ఎయిర్షిప్ చివరిసారి ఉత్తర అట్లాంటిక్ మీద ఎగురుతూ కనిపించింది. తరువాత నుంచి దాని ఆచూకీ తెలియరాలేదు. అది అట్లాంటిక్ సిటీ సమీపంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి ఎయిర్షిప్ చాలా పెద్దగా ఉంటుంది. అయినా ఇప్పటివరకు దాని జాడ గానీ, పైలట్ మృతదేహం కానీ దొరకలేదు.
సెసిల్ గ్రేస్ విమానం
1903లో రైట్ బ్రదర్స్ విమానాన్ని నిర్మించి, దాన్ని విజయవంతగా గాల్లో చక్కర్లు కొట్టించారు. ఇది జరిగిన ఏడేళ్ల తరువాత సెసిల్ గ్రేస్ అనే వైమానికుడు బారన్ డి ఫారెస్ట్ పోటీలో పాల్గొన్నాడు. ఈ పోటీలో పాల్గొనే వారు ఇంగ్లాండ్ నుంచి ఐరోపాలోని మిగిలిన ప్రాంతాలకు వీలయినంత ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. గెలుపొందిన వారికి 2వేల పౌండ్లు బహుమతిగా ఇస్తారు. ఈ ప్రయత్నం చేసి చాలా మంది వైమానికులు అప్పటికే విఫలమయ్యారు. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సెసిల్ బరిలోకి దిగాడు. 1910వ సంవత్సరం డిసెంబర్ 22న అతడు ఇంగ్లాండ్ నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లగానే బలమైన వేడిగాలులు వీచాయి. దాంతో తాను ముందుకెళ్లడం అసాధ్యమని భావించిన సెసిల్ ఫ్రాన్స్లోని ఓ తీరంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. అక్కడ భోజనం చేసి తిరిగి ఇంగ్లాండ్కు వెనుదిరిగాడు. 40 నిమిషాల తరువాత అతడి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. మొదట ఆ పైలట్ ఒక చోట ల్యాండ్ అయ్యాడని వార్తలు వినిపించాయి. కానీ, చివరకు 1911 మార్చి 14న అతడి టోపీ, కళ్లద్దాలు బెల్జియంలోని ఓస్టెండ్ తీరానికి కొట్టుకొచ్చాయి. మరికొన్ని రోజుల తరువాత సెసిల్ మృతదేహం కనుగొన్నారు. అయితే విమానం ఏమైందో, ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ తెలియరాలేదు.
ఆల్బర్ట్ జువెల్స్ విమానం
ఆల్బర్ట్ జువెల్స్ 1886లో అమెరికాలో జన్మించాడు. ఏరో క్లబ్ ఆఫ్ అమెరికా నుంచి 1913లో పైలట్ లైసెన్స్ పొందాడు. ఆ తరువాత కొన్ని నెలలకే అమెరికన్ ఏరియల్ డెర్బీ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. విమానాన్ని కనుగొని పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రేసు ఇది. మోయిసాంట్ బ్లెరియట్ మోనోప్లేన్తో అతడు రంగంలోకి దిగాడు. ఎలాగైనా రేసులో విజయం సాధించాలనే పట్టుదలతో స్టాంటన్ ఐలాండ్ నుంచి బయలుదేరాడు. కొద్ది సేపటికే విమానం సముద్రంలో మునిగిపోయింది. చివరిసారి ఆ విమానాన్ని ఓ మత్స్యకారుల నౌక కెప్టెన్ చూశాడు. ఆ తరువాత నుంచి పైలట్, విమానం ఆచూకీ లభించలేదు.
అమెలియా ఇయర్హార్ట్-లాక్హీడ్ ఎలక్ట్రా 10 ఈ
1937లో అమెలియా ఇయర్హార్ట్ తన సహాయకుడు ఫ్రెడ్ నూనన్తో కలిసి ‘లాక్హీడ్ ఎలక్ట్రా 10 ఈ’ విమానంలో ఓక్లాండ్ నుంచి బయలుదేరింది. ప్రపంచాన్ని చుట్టి రావాలనే బలమైన కోరికతో వారు ఆ ప్రయాణం మొదలుపెట్టారు. నెలలోపే ఆస్ట్రేలియా సమీపంలోని న్యూగినియా చేరుకున్నారు. అప్పటికే 22 వేల మైళ్లు సాగిన ప్రయాణం.. మరో 7 వేల మైళ్లు వెళితే ఓక్లాండ్ చేరుకుంటుంది. పసిఫిక్ మహా సముద్రంలోని ఓ దీవిలో ఇంధనం నింపుకోవడానికి వెళ్తుండగా వారి విమానం ఆచూకీ గల్లంతైంది. ఎంత గాలించినా జాడ దొరకక పోవడంతో 1939 జనవరి 5న వారిద్దరూ మరణించినట్లు ప్రకటించారు. ఇంధనం అయిపోవడంతోనే వారి విమానం సముద్రంలో కూలిపోయి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు. 1991లో దొరికిన ఓ విమాన శకలం అమెలియా ప్రయాణించిన విమానంలోని భాగమని పరిశోధకులు 2022లో గుర్తించారు. అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీ వినియోగించి దీన్ని కనుగొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉండిపోయింది.
ఫ్లైట్ 19
‘ఫ్లైట్ 19’ అనేది యునైటెడ్ స్టేట్స్ నేవీ శిక్షణ విమానం. 1945 డిసెంబరు 5న అది టార్పెడో బాంబర్ల సమూహంతో బయలుదేరింది. ఆ విమానంలో మొత్తం 14 మంది ఉన్నారు. బెర్ముడా ట్రయాంగిల్ చేరుకోగానే బేస్కు ఆ విమానం నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. దాంతో అమెరికా నేవీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. సహాయక చర్యల్లో భాగంగా ఓ మెరైనర్ ఫ్లయింగ్ బోట్ను పంపించగా.. అది కూడా కనిపించకుండాపోయింది. 1986 నుంచి 2015 వరకు అదే ప్రాంతంలో వివిధ విమాన ప్రమాదాలు జరిగాయి. వాటి శకలాలు బయటపడినా ‘ఫ్లైట్ 19’ శిథిలాలు మాత్రం దొరకలేదు. ఏదోక రోజు అవి దొరకుతాయనే ఆశతో అప్పుడప్పుడూ వెతుకులాట సాగిస్తున్నారు.
ది పాట్రీ
‘పాట్రీ’ అనేది ఫ్రెంచ్ ఎయిర్ షిప్. సైన్యం అవసరాల నిమిత్తం దీనిని తయారు చేశారు. అనేక విజయవంతమైన యాత్రలు చేసిన ఈ విమానం 1907లో ప్రమాదానికి గురైంది. ఓ చోట లంగరు వేసి నిలిపి ఉంచగా.. భారీ తుపాను ధాటికి అది కొట్టుకుపోయింది. అడ్డుకునేందుకు వందలాది మంది సైనికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అది తేలుతూనే కనిపించకుండా పోయింది. తరువాత ఇంగ్లిష్ ఛానల్లో కనిపించినట్లు కొందరు చెప్పారు. తరువాత మళ్లీ దాని ఆచూకీ దొరకలేదు. ఆ ఎయిర్షిప్ అంట్లాంటిక్ మహాసముద్రం దిగువన ఎక్కడో ఒక చోట ఉండొచ్చని భావిస్తున్నారు.
కెనడియన్ పసిఫిక్ ఎయిర్లైన్స్ డగ్లస్ డీసీ-4
ది వాంకోవర్ డగ్లస్ డీసీ-4 అనే విమానాన్ని కెనడియన్ పసిఫిక్ ఎయిర్లైన్స్ ఆపరేట్ చేస్తుండేది. 1951 జులై 21న విమానం వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం అలస్కా సమీపించగానే భారీ వర్షం, మంచు కురవడం మొదలైంది. రెండు గంటలైనా విమానం ల్యాండింగ్కు రాకపోవడంతో యూఎస్, కెనడా వైమానిక దళాలు వెతుకులాట ప్రారంభించాయి. అయినా ప్రయాణికులు, విమానం జాడ తెలియలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆ విమానం ఎక్కడో ఒక చోట కూలిపోయింటుందని నిపుణులు భావిస్తున్నారు.
గుస్తావ్ హామెల్ మోనోప్లేన్
గుస్తావ్ హామెల్ బ్రిటిష్ వైమానికుడు. 1914 మే 23న అతడు ‘మొరాన్ సాల్నియర్ మోనోప్లేన్’లో ఇంగ్లిష్ ఛానల్పై ప్రయాణిస్తున్నాడు. బలమైన ఈదురుగాలులు వీయడంతో ప్లేన్పై అతడు నియంత్రణ కోల్పోయాడు. విమానం ఆచూకీ గల్లంతైంది. సుమారు 48 గంటలు శోధించిన తరువాత పైలట్ చనిపోయాడని ప్రకటించారు. ఈ ప్రమాదంలో గుస్తావ్ మృతదేహం లభించినా.. విమానం శకలాలు దొరకలేదు.
ట్రాన్స్ టాస్మాన్ ఫ్లైట్
లెఫ్టినెంట్ జాన్ మోన్క్రీఫ్, కెప్టెన్ జార్జ్ హుడ్లు ‘ట్రాన్స్ టాస్మాన్’ ఫ్లైట్లో ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్కు ప్రయాణించి రికార్డు నెలకొల్పాలని భావించారు. 1928 జనవరి 10న వారిద్దరూ సిడ్నీలో ఉదయం 2 గంటలకు బయలుదేరారు. 12 గంటలు గడిచిన తరువాత కూడా వారి విమానం న్యూజిలాండ్ చేరుకోలేదు. అంతకుముందే ఆ విమానం నుంచి రేడియో సిగ్నల్స్ అందాయి. వెంటనే విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా అవేవీ ఫలించలేదు. విమానం, ఆ ఇద్దరి ఆచూకీ మిస్టరీగా మిగిలిపోయింది.
డ్రాగన్ ఫ్లై జడ్కే-ఏఎఫ్బీ
1962 ఫిబ్రవరి 12న పైలట్ బ్రియాన్ చాడ్విక్ నలుగురు ప్రయాణికులతో న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నుంచి మిల్ఫోర్డ్ సౌండ్ వైపు బయలుదేరాడు. వాతావరణం కాస్త అనుకూలంగా లేకపోయినప్పటికీ తాను గమ్యం చేరుకోగలననే నమ్మకంతో పైలట్ ముందుకు కదిలాడు. కానీ, అతడిని దురదృష్టం వెంటాడింది. సమయం ముగుస్తున్నా విమానం రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 34 విమానాలు 400 గంటల పాటు వెతికినా ఆ విమానం ఆచూకీ లభించలేదు. న్యూజిలాండ్ చరిత్రలోనే ఇదో సుదీర్ఘ వెతుకులాటగా నిలిచింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.