Plane crash : అంతు చిక్కని మిస్టరీ.. ఆ విమానాల ఆచూకీ ఇప్పటికీ తెలియదు!
లోహ విహంగాలు (Planes) గాల్లో ఎగిరిన తొలినాళ్లలో అవి ప్రమాదానికి గురయితే ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారేది. అలా ఇప్పటిదాకా జాడ లేకుండా పోయిన కొన్ని విమాన ప్రమాదాల (Plane crashes) గురించి తెలుసుకోండి.
ఇటీవల అమెజాన్ అడవుల్లో (Amazon forest) జరిగిన ఓ విమాన ప్రమాదం (Plane crash) వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రమాదం జరిగిన వెంటనే ‘ఆపరేషన్ హోప్’ పేరిట అడవిని జల్లెడ పట్టి 16 రోజుల తర్వాత విమాన శకలాలను గుర్తించారు. పైలట్, మహిళ, గైడ్ మరణించినట్లు సహాయక బృందాలు ప్రకటించాయి. అదే విమానంలో ప్రయాణించిన మరో నలుగురు చిన్నారులు బతికే ఉన్నారన్న ఆశతో అడవిని జల్లెడ పట్టారు. సుమారు 40 రోజులు తర్వాత ఎట్టకేలకు చిన్నారుల ఆచూకీ తెలిసింది. వారంతా క్షేమంగా ఉండటం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనే ఒక విమానం జాడ కనుగొనడానికి 16 రోజులు పట్టింది. మరి అవేవీ లేని కాలంలో గల్లంతైన ఆ విమానాలు ఏమైపోయాయి? అందులో ప్రయాణించిన వారి ఆచూకీ తెలిసిందా? లేదా? పరిశీలించండి.
క్యాంప్బెల్ ఎయిర్షిప్
విమానాల కంటే ముందు ఎయిర్షిప్లు గాల్లో ఎగురుతున్న కాలం అది. ఆ ఎయిర్ షిప్ పేరు క్యాంప్బెల్. ఓ గాలిబుడగ తరహాలో ఉండే ఆ విమానాన్ని 1880 ప్రాంతంలో పీటర్ క్యాంప్బెల్ అనే వ్యక్తి రూపొందించాడు. విమానంలాగే ఇదీ తొలినాళ్లలో విజయవంతంగా గాల్లో ప్రయాణించలేకపోయింది. 1889వ సంవత్సరం జులై 16న ఎడ్వర్డ్ డి. హోగన్ అనే ప్రొఫెసర్ ప్రదర్శనకు ఉంచిన ఎయిర్ షిప్ను నడుపుతూ న్యూయార్క్ నగరం నుంచి బయలుదేరాడు. ఆ ఎయిర్షిప్ చివరిసారి ఉత్తర అట్లాంటిక్ మీద ఎగురుతూ కనిపించింది. తరువాత నుంచి దాని ఆచూకీ తెలియరాలేదు. అది అట్లాంటిక్ సిటీ సమీపంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి ఎయిర్షిప్ చాలా పెద్దగా ఉంటుంది. అయినా ఇప్పటివరకు దాని జాడ గానీ, పైలట్ మృతదేహం కానీ దొరకలేదు.
సెసిల్ గ్రేస్ విమానం
1903లో రైట్ బ్రదర్స్ విమానాన్ని నిర్మించి, దాన్ని విజయవంతగా గాల్లో చక్కర్లు కొట్టించారు. ఇది జరిగిన ఏడేళ్ల తరువాత సెసిల్ గ్రేస్ అనే వైమానికుడు బారన్ డి ఫారెస్ట్ పోటీలో పాల్గొన్నాడు. ఈ పోటీలో పాల్గొనే వారు ఇంగ్లాండ్ నుంచి ఐరోపాలోని మిగిలిన ప్రాంతాలకు వీలయినంత ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. గెలుపొందిన వారికి 2వేల పౌండ్లు బహుమతిగా ఇస్తారు. ఈ ప్రయత్నం చేసి చాలా మంది వైమానికులు అప్పటికే విఫలమయ్యారు. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సెసిల్ బరిలోకి దిగాడు. 1910వ సంవత్సరం డిసెంబర్ 22న అతడు ఇంగ్లాండ్ నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్లగానే బలమైన వేడిగాలులు వీచాయి. దాంతో తాను ముందుకెళ్లడం అసాధ్యమని భావించిన సెసిల్ ఫ్రాన్స్లోని ఓ తీరంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. అక్కడ భోజనం చేసి తిరిగి ఇంగ్లాండ్కు వెనుదిరిగాడు. 40 నిమిషాల తరువాత అతడి నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. మొదట ఆ పైలట్ ఒక చోట ల్యాండ్ అయ్యాడని వార్తలు వినిపించాయి. కానీ, చివరకు 1911 మార్చి 14న అతడి టోపీ, కళ్లద్దాలు బెల్జియంలోని ఓస్టెండ్ తీరానికి కొట్టుకొచ్చాయి. మరికొన్ని రోజుల తరువాత సెసిల్ మృతదేహం కనుగొన్నారు. అయితే విమానం ఏమైందో, ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ తెలియరాలేదు.
ఆల్బర్ట్ జువెల్స్ విమానం
ఆల్బర్ట్ జువెల్స్ 1886లో అమెరికాలో జన్మించాడు. ఏరో క్లబ్ ఆఫ్ అమెరికా నుంచి 1913లో పైలట్ లైసెన్స్ పొందాడు. ఆ తరువాత కొన్ని నెలలకే అమెరికన్ ఏరియల్ డెర్బీ అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు. విమానాన్ని కనుగొని పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రేసు ఇది. మోయిసాంట్ బ్లెరియట్ మోనోప్లేన్తో అతడు రంగంలోకి దిగాడు. ఎలాగైనా రేసులో విజయం సాధించాలనే పట్టుదలతో స్టాంటన్ ఐలాండ్ నుంచి బయలుదేరాడు. కొద్ది సేపటికే విమానం సముద్రంలో మునిగిపోయింది. చివరిసారి ఆ విమానాన్ని ఓ మత్స్యకారుల నౌక కెప్టెన్ చూశాడు. ఆ తరువాత నుంచి పైలట్, విమానం ఆచూకీ లభించలేదు.
అమెలియా ఇయర్హార్ట్-లాక్హీడ్ ఎలక్ట్రా 10 ఈ
1937లో అమెలియా ఇయర్హార్ట్ తన సహాయకుడు ఫ్రెడ్ నూనన్తో కలిసి ‘లాక్హీడ్ ఎలక్ట్రా 10 ఈ’ విమానంలో ఓక్లాండ్ నుంచి బయలుదేరింది. ప్రపంచాన్ని చుట్టి రావాలనే బలమైన కోరికతో వారు ఆ ప్రయాణం మొదలుపెట్టారు. నెలలోపే ఆస్ట్రేలియా సమీపంలోని న్యూగినియా చేరుకున్నారు. అప్పటికే 22 వేల మైళ్లు సాగిన ప్రయాణం.. మరో 7 వేల మైళ్లు వెళితే ఓక్లాండ్ చేరుకుంటుంది. పసిఫిక్ మహా సముద్రంలోని ఓ దీవిలో ఇంధనం నింపుకోవడానికి వెళ్తుండగా వారి విమానం ఆచూకీ గల్లంతైంది. ఎంత గాలించినా జాడ దొరకక పోవడంతో 1939 జనవరి 5న వారిద్దరూ మరణించినట్లు ప్రకటించారు. ఇంధనం అయిపోవడంతోనే వారి విమానం సముద్రంలో కూలిపోయి ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు. 1991లో దొరికిన ఓ విమాన శకలం అమెలియా ప్రయాణించిన విమానంలోని భాగమని పరిశోధకులు 2022లో గుర్తించారు. అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీ వినియోగించి దీన్ని కనుగొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉండిపోయింది.
ఫ్లైట్ 19
‘ఫ్లైట్ 19’ అనేది యునైటెడ్ స్టేట్స్ నేవీ శిక్షణ విమానం. 1945 డిసెంబరు 5న అది టార్పెడో బాంబర్ల సమూహంతో బయలుదేరింది. ఆ విమానంలో మొత్తం 14 మంది ఉన్నారు. బెర్ముడా ట్రయాంగిల్ చేరుకోగానే బేస్కు ఆ విమానం నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. దాంతో అమెరికా నేవీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. సహాయక చర్యల్లో భాగంగా ఓ మెరైనర్ ఫ్లయింగ్ బోట్ను పంపించగా.. అది కూడా కనిపించకుండాపోయింది. 1986 నుంచి 2015 వరకు అదే ప్రాంతంలో వివిధ విమాన ప్రమాదాలు జరిగాయి. వాటి శకలాలు బయటపడినా ‘ఫ్లైట్ 19’ శిథిలాలు మాత్రం దొరకలేదు. ఏదోక రోజు అవి దొరకుతాయనే ఆశతో అప్పుడప్పుడూ వెతుకులాట సాగిస్తున్నారు.
ది పాట్రీ
‘పాట్రీ’ అనేది ఫ్రెంచ్ ఎయిర్ షిప్. సైన్యం అవసరాల నిమిత్తం దీనిని తయారు చేశారు. అనేక విజయవంతమైన యాత్రలు చేసిన ఈ విమానం 1907లో ప్రమాదానికి గురైంది. ఓ చోట లంగరు వేసి నిలిపి ఉంచగా.. భారీ తుపాను ధాటికి అది కొట్టుకుపోయింది. అడ్డుకునేందుకు వందలాది మంది సైనికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అది తేలుతూనే కనిపించకుండా పోయింది. తరువాత ఇంగ్లిష్ ఛానల్లో కనిపించినట్లు కొందరు చెప్పారు. తరువాత మళ్లీ దాని ఆచూకీ దొరకలేదు. ఆ ఎయిర్షిప్ అంట్లాంటిక్ మహాసముద్రం దిగువన ఎక్కడో ఒక చోట ఉండొచ్చని భావిస్తున్నారు.
కెనడియన్ పసిఫిక్ ఎయిర్లైన్స్ డగ్లస్ డీసీ-4
ది వాంకోవర్ డగ్లస్ డీసీ-4 అనే విమానాన్ని కెనడియన్ పసిఫిక్ ఎయిర్లైన్స్ ఆపరేట్ చేస్తుండేది. 1951 జులై 21న విమానం వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం అలస్కా సమీపించగానే భారీ వర్షం, మంచు కురవడం మొదలైంది. రెండు గంటలైనా విమానం ల్యాండింగ్కు రాకపోవడంతో యూఎస్, కెనడా వైమానిక దళాలు వెతుకులాట ప్రారంభించాయి. అయినా ప్రయాణికులు, విమానం జాడ తెలియలేదు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆ విమానం ఎక్కడో ఒక చోట కూలిపోయింటుందని నిపుణులు భావిస్తున్నారు.
గుస్తావ్ హామెల్ మోనోప్లేన్
గుస్తావ్ హామెల్ బ్రిటిష్ వైమానికుడు. 1914 మే 23న అతడు ‘మొరాన్ సాల్నియర్ మోనోప్లేన్’లో ఇంగ్లిష్ ఛానల్పై ప్రయాణిస్తున్నాడు. బలమైన ఈదురుగాలులు వీయడంతో ప్లేన్పై అతడు నియంత్రణ కోల్పోయాడు. విమానం ఆచూకీ గల్లంతైంది. సుమారు 48 గంటలు శోధించిన తరువాత పైలట్ చనిపోయాడని ప్రకటించారు. ఈ ప్రమాదంలో గుస్తావ్ మృతదేహం లభించినా.. విమానం శకలాలు దొరకలేదు.
ట్రాన్స్ టాస్మాన్ ఫ్లైట్
లెఫ్టినెంట్ జాన్ మోన్క్రీఫ్, కెప్టెన్ జార్జ్ హుడ్లు ‘ట్రాన్స్ టాస్మాన్’ ఫ్లైట్లో ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్కు ప్రయాణించి రికార్డు నెలకొల్పాలని భావించారు. 1928 జనవరి 10న వారిద్దరూ సిడ్నీలో ఉదయం 2 గంటలకు బయలుదేరారు. 12 గంటలు గడిచిన తరువాత కూడా వారి విమానం న్యూజిలాండ్ చేరుకోలేదు. అంతకుముందే ఆ విమానం నుంచి రేడియో సిగ్నల్స్ అందాయి. వెంటనే విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా అవేవీ ఫలించలేదు. విమానం, ఆ ఇద్దరి ఆచూకీ మిస్టరీగా మిగిలిపోయింది.
డ్రాగన్ ఫ్లై జడ్కే-ఏఎఫ్బీ
1962 ఫిబ్రవరి 12న పైలట్ బ్రియాన్ చాడ్విక్ నలుగురు ప్రయాణికులతో న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ నుంచి మిల్ఫోర్డ్ సౌండ్ వైపు బయలుదేరాడు. వాతావరణం కాస్త అనుకూలంగా లేకపోయినప్పటికీ తాను గమ్యం చేరుకోగలననే నమ్మకంతో పైలట్ ముందుకు కదిలాడు. కానీ, అతడిని దురదృష్టం వెంటాడింది. సమయం ముగుస్తున్నా విమానం రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 34 విమానాలు 400 గంటల పాటు వెతికినా ఆ విమానం ఆచూకీ లభించలేదు. న్యూజిలాండ్ చరిత్రలోనే ఇదో సుదీర్ఘ వెతుకులాటగా నిలిచింది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్