Nizam: నిజాం కాలంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉండేదో తెలుసా?
తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముందు.. నిజాం పాలించిన హైదరాబాద్ రాష్ట్రంలో పోలీస్ బాస్గా ఎవరుండేవారు? అసలు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసేది? ఎప్పుడైనా ఈ సందేహాలు కలిగాయా? అయితే.. ఆ సంగతులు చదివేయండి..
తెలంగాణ పోలీసు (TS Police) శాఖలో నియామకాలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆ శాఖకు కొత్త బాస్ వచ్చారు. ఇటీవల రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా అంజనీ కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్లో ఉంటూ పోలీసులకు దిశానిర్దేశం చేస్తూ రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడే బాధ్యత డీజీపీదే.
మరి.. తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముందు.. నిజాం పాలించిన హైదరాబాద్ రాష్ట్రంలో పోలీస్ బాస్గా ఎవరుండేవారు? అసలు పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసేది? ఎప్పుడైనా ఈ సందేహాలు కలిగాయా? అయితే.. ఆ సంగతులు చదివేయండి..
ఒకప్పుడు హైదరాబాద్ (Hyderabad) రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంతోపాటు ఇప్పటి కర్ణాటకలోని బీదర్, రాయ్చూర్, గుల్బర్గా జిల్లాలు.. మహారాష్ట్రలోని ఉస్మాన్బాద్, బీద్, నాందేడ్, లాతుర్, ఔరంగాబాద్, పర్భాని జిల్లాలు కలిసి ఉండేవి. హైదరాబాద్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన నిజాం రాజులే పోలీస్ శాఖకు చీఫ్ను నియమించేవారు.
కొత్వాలే పోలీస్ బాస్..
ప్రస్తుతం ఉన్న కమిషనరేట్ వ్యవస్థ.. 1847 నుంచే ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రజలను కాపాడేందుకు నిజాం.. పోలీస్ కమిషనర్లను నియమించేవారు. వారిని ‘కొత్వాల్-ఇ-బల్దా’ అని పిలిచేవారు. ఈ కొత్వాల్ శాంతి, భద్రతలను పరిరక్షిస్తూ.. నేరాలను అరికట్టాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన అన్ని నివేదికలను నేరుగా నిజాం రాజుకు తెలియజేయొచ్చు. కానీ, హోంశాఖతో సమన్వయం చేసుకునేవారు. రాజదర్బార్లో కొత్వాల్కి అత్యున్నత స్థానం ఉండేది. ఆయన.. తన పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుంచి ఎప్పటికప్పుడు జరిగిన నేరాలకు సంబంధించి నివేదికలు(రోజ్నమచాస్) తెప్పించుకొని పరిశీలించేవారు.
హైదరాబాద్ రాష్ట్రంలో చివరగా నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(నిజాం-VII) హయాంలో కొత్వాల్గా రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి పనిచేశారు. తన పదవీకాలంలో గద్వాల్, వనపర్తి సంస్థానాల మధ్య ఉన్న ముఖ్యమైన సమస్యలను పరిష్కరించారు.
పోలీస్ స్టేషన్ స్వరూపమిదీ..
ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్లు ఉన్నట్లే అప్పట్లో ‘అమిన్’లు ఉండేవారు. వారిని ‘సర్దార్ అమిన్’అనేవారు. ఇక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ను ‘మదద్గర్ కొత్వాల్’అని, డిప్యూటీ కమిషనర్ని ‘నయిబ్ కొత్వాల్’అని పిలిచేవారు.
పోలీస్స్టేషన్లో జనరల్ డ్యూటీలో ఉండే హెడ్ కానిస్టేబుల్ను ‘జిమేదార్’ అని, ఫిర్యాదు రాసుకునే రైటర్ హెడ్ కానిస్టేబుల్ను మోహ్రిరి అని, కానిస్టేబుల్ను ‘బార్కందాజ్’అని పిలిచేవారు. ఆ తర్వాత కానిస్టేబుల్ను ‘జవాన్’గా పిలవడం మొదలుపెట్టారు. 1902 కాలంలో ఒక కానిస్టేబుల్ జీతం 6 రూపాయాలు మాత్రమే. హైదరాబాద్ నగరం దాటి బయటకు వెళ్లాల్సి వస్తే.. భత్యం కింద రోజుకు రెండు అణాలు ఇచ్చేవారట.
ఇక ఇన్స్పెక్టర్(అమిన్) ర్యాంక్ పోలీసులంతా నయిబ్ కొత్వాల్ ఆదేశాలతో పనిచేసేవారు. 1900లో హైదరాబాద్ జనాభా సుమారు 2.5లక్షలు మాత్రమే. దీంతో పోలీసుల సంఖ్య వేలల్లోనే ఉండేది.
హైదరాబాద్లో జనాభాతోపాటు నగర పరిధి కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసు వ్యవస్థలోనూ మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ మాత్రమే ఉండేది. ఆ తర్వాత 2003లో సైబరాబాద్ కమిషనరేట్.. 2016లో రాచకొండ కమిషనరేట్ ఇలా తెలంగాణలో మొత్తం తొమ్మిది కమిషనరేట్లు ఏర్పడ్డాయి. ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. -
December 13, 2001: పార్లమెంటుపై దాడి.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
రెండు దశాబ్దాల కిందట ఇదే రోజు (డిసెంబర్ 13, 2001న) భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా